ప్రధాని నరేంద్ర మోడి భారీ బహిరంగ సభను జయప్రదం చేయండి

ప్రధాని నరేంద్ర మోడి భారీ బహిరంగ సభను జయప్రదం చేయండి

బిజెపి జిల్లా మీడియా కన్వీనర్ ఊరటి మునెందర్

భూపాలపల్లి నేటిధాత్రి

భారత ప్రధాని నరేంద్ర మోడీ మూడోసారి గెలిచిన తరువాత తెలంగాణకు మొదటిసారిగా విచ్చేస్తున్న సందర్భంగా రేపు హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించ తలపెట్టిన భారత ప్రధాని నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభకు భూపాలపల్లి జిల్లా ప్రజలు,పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని భారతీయ జనతా పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మీడియా కన్వీనర్ ఊరటి మునేందర్ ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.
​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని దేశాభివృద్ధిలో భాగస్వామ్యం చేయడమే లక్ష్యంగా ప్రధాని మోదీ ఈ సభకు వస్తున్నారని తెలిపారు.కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు,అభివృద్ధి పనులకు ఆకర్షితులై ప్రజలు స్వచ్ఛందంగా బీజేపీ వైపు వస్తున్నారని ఆయన పేర్కొన్నారు.ఈ బహిరంగ సభ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని, జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామల నుంచి బీజేపీ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండల నాయకులు,శక్తి కేంద్ర ఇన్చార్జిలు,బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు,అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన కోరారు.

వన్య ప్రాణుల దాహార్తి కోసం నీటివసతి ఏర్పాటు-టీజీ ఎఫ్ డీసీ…

వన్య ప్రాణుల దాహార్తి కోసం నీటివసతి ఏర్పాటు-టీజీ ఎఫ్ డీసీ

జైపూర్, నేటి ధాత్రి :

 

ఎండలు మండి పోతున్న ఈ వేసవిలో అడవులు,ప్లాంటేషన్ లలో సంచరించే వన్య ప్రాణుల దాహం తీర్చ డానికి తెలంగాణా అటవీ అభివృద్ధి సంస్థ (టీజీ ఎఫ్ డీసీ ) ఆధ్వర్యంలో నీరు నిల్వ ఉండేలా వసతి సౌకర్యం ఏర్పాటు చేశారు.వివరాలు ఇలా ఉన్నాయి.మంచిర్యాల రేంజ్ పరిధిలోని జైపూర్ మండలం ముదిగుంట అటవీప్రాంతం లో టీజీ ఎఫ్ డీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్లాంటేషన్ లలో ఒక కాలువ లో ఒక చోట నీటి ఊటను ప్లాంటేషన్ వాచర్ శంకర్ గమనించారు.ఈ సమాచారం తెలిసిన వెంటనే టీజీ ఎఫ్ డీసీ మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేష్ కుమార్ దీనికి ఒక కార్య రూపం దాల్చారు.గురువారం ప్లాంటేషన్ వాచర్ శంకర్,కొంత మంది కూలీల సహాయం తో జంతువులు తాగడానికి వీలుగా నీటి ఊట నీరు వృధాగా పోకుండా కొంత మేరకు మట్టి పూడిక తీయించి అడ్డు కట్ట వేయడం తో నీరు నిల్వ గా ఆగిపోయింది.ఈ సందర్బంగా ప్లాంటేషన్ మేనేజర్ సురేష్ కుమార్ మాట్లాడుతూ మూగ జీవాలైన వన్య ప్రాణులు వేసవిలో తాగు నీరు దొరకక చాలా ఇబ్బందులు పడుతుంటాయని, వాటి దాహర్తి తీర్చడం కోసం చిరు ప్రయత్నం చేసినట్లు తెలిపారు.

అంకుశాపురం గ్రామ సర్పంచ్ క్యాతరాజు కవితకు అరుదైన గౌరవం…

అంకుశాపురం గ్రామ సర్పంచ్ క్యాతరాజు కవితకు అరుదైన గౌరవం

-హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో ఘన సన్మానం
మొగుళ్లపల్లి నేటి దాత్రి

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని అంకుశాపురం గ్రామ నూతన సర్పంచ్ క్యాతరాజు కవిత-లింగమూర్తి దంపతులకు అరుదైన గౌరవం దక్కింది. గురువారం హైదరాబాదులోని రవీంద్రభారతిలో ఆ దంపతులను శాలువాతో ఘనంగా సన్మానించారు. బీసీ టైమ్స్ అండ్ బీసీ సమాజ్ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నూతనంగా అంకుశాపురం గ్రామ సర్పంచ్ గా గెలుపొందిన బీసీల ముద్దుబిడ్డ క్యాతరాజు కవిత-లింగమూర్తి దంపతులను మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవులు, మాజీ డిజిపి పూర్ణచందర్ రావు, సమాజ్ అధినేత సూర్యరావు, తొలి వెలుగు ఎడిటర్ రఘులు ఆమెను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కవిత-లింగమూర్తి దంపతులు మాట్లాడారు. ప్రజాసేవ చేసేందుకు తాము రాజకీయ రంగ ప్రవేశం చేశామని, తమను సన్మానించి..రాజకీయంగా ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గన్‌పార్క్ అమరవీరుల స్థూపానికి నివాళులు

బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గన్‌పార్క్ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు …

జహీరాబాద్ నేటి ధాత్రి:

బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా హైదరాబాద్‌లోని గన్‌పార్క్ అమరవీరుల స్థూపానికి *బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీమంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు గారితో కలిసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాణిక్ రావు పాల్గొన్నారు
ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలని, బడ్జెట్‌లో తగిన నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్లకార్డులు ప్రదర్శించారు.

వనపర్తి ఆర్యవైశ్యలు కాశీ యాత్ర శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎంపీ రావుల బీ ఆర్ ఎస్ నేతలు..

వనపర్తి ఆర్యవైశ్యలు కాశీ యాత్ర శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎంపీ రావుల బీ ఆర్ ఎస్ నేతలు
వనపర్తి నేటిధాత్రి .

 

వనపర్తి ఆర్యవైశ్య లు బాలకృష గంధం రాజు, పూర్ణ బ్రదర్స్ కాశి యత్ర కు వెళుతూన్న హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్లో కాశీ యాత్ర కు వెళ్ళే వారికి మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి శా లు వతో సన్మానించారు
కొత్తకోట మండలం, కానాయపల్లి
మాజీ సర్పంచ్ పోతులపల్లి యాదయ్య సాగర్, నిర్విన్ మాజీ సర్పంచ్ బంటు రాములు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు నరోత్తమ రెడ్డి తదితరులు సన్మానించ చి న రిలో ఉన్నారు.కాశీ యాత్రకు వెళ్ళే భక్తులకు మాజీ ఎంపీ రావుల శుభాకాంక్షలు తెలిపారు

మానవ హక్కులను ప్రతి ఒక్కరూ పరిరక్షించాలి…

మానవ హక్కులను ప్రతి ఒక్కరూ పరిరక్షించాలి

◆-: ఐ.ఎన్.హెచ్.ఆర్.పి.సి తెలంగాణ రాష్ట్ర చైర్మన్ నవోదయ సిద్దు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

హైదరాబాద్:సమాజంలో ప్రతి వ్యక్తి గౌరవంగా జీవించే హక్కు మానవ హక్కుల మూల సూత్రమని, వాటిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఇండియన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ (ఐ.ఎన్.హెచ్.ఆర్.పి.సి) తెలంగాణ రాష్ట్ర చైర్మన్ నవోదయ సిద్దు అన్నారు.
ఆదివారం హైదరాబాద్ లోని బషీరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఇండియన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ 2026 క్యాలెండర్ ను ఆయన ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశంలో ప్రజాస్వామ్యం నిలకడగా కొనసాగాలంటే మానవ హక్కుల పరిరక్షణ అత్యంత కీలకమని పేర్కొన్నారు.ప్రతి పౌరుడికి జీవించే హక్కు, స్వేచ్ఛ, సమానత్వం, విద్య, ఆరోగ్యం, ఉపాధి, న్యాయం పొందే హక్కులు రాజ్యాంగం ద్వారా కల్పించబడ్డాయని ఆయన గుర్తు చేశారు. అయితే సమాజంలో ఇప్పటికీ పేదలు, మహిళలు, బాలలు, దళితులు, గిరిజనులు, కార్మికులు, వృద్ధులు అనేక సందర్భాల్లో హక్కుల ఉల్లంఘనలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మానవ హక్కులు కేవలం చట్టపరమైన అంశం మాత్రమే కాదని, అవి మానవత్వానికి ప్రతీకలని అన్నారు. ఇతరుల హక్కులను గౌరవించడం ద్వారా మాత్రమే నిజమైన సామాజిక న్యాయం సాధ్యమవుతుందన్నారు. మానవ హక్కులపై అవగాహన లేకపోవడం వల్లనే అనేక అన్యాయాలు జరుగుతున్నాయని, అందుకే గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు.
ఇండియన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ సంస్థ దేశవ్యాప్తంగా హక్కుల ఉల్లంఘనలపై పోరాటం చేస్తూ, బాధితులకు న్యాయం అందించేందుకు కృషి చేస్తోందని వివరించారు. పోలీస్ స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలు, న్యాయ వ్యవస్థల వద్ద బాధితులకు సహాయం అందిస్తూ, వారి సమస్యలను పరిష్కరించడమే సంస్థ ప్రధాన లక్ష్యమని తెలిపారు.ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, మీడియా, యువత అందరూ కలిసి మానవ హక్కుల పరిరక్షణకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి పౌరుడు తన హక్కులపై అవగాహన పెంచుకోవడంతో పాటు, ఇతరుల హక్కులను కూడా గౌరవించే సంస్కృతి అలవర్చుకోవాలని సూచించారు.న్యాలకల్ మండలం మల్గి గ్రామంలో ప్రజలకు నష్టం కలిగించే కంపెనీ ఏర్పాటు జరగకుండా సంస్థ తరపున గట్టి పోరాటం చేశామని , గ్రామ ప్రజల భద్రత, జీవనాధారాలను కాపాడాలనే ఉద్దేశంతో సంస్థ ఆధ్వర్యంలో ఉద్యమం చేపట్టినట్లు తెలిపారు.అలాగే సిగచి కంపెనీ ప్రమాదంలో గాయపడిన 53 మంది బాధితులకు న్యాయం చేయాలనే లక్ష్యంతో సంస్థ పోరాటం చేసిందని, ఆ క్రమంలో ప్రతి బాధిత కుటుంబానికి రూ. లక్ష చొప్పున పరిహారం అందించేలా చర్యలు తీసుకున్నామని గుర్తు చేశారు.భవిష్యత్తులో కూడా ప్రజా ప్రయోజనాలకు భంగం కలిగించే ఏ అంశమైనా ఎదురైతే సంస్థ తరపున పోరాటం కొనసాగిస్తామని, ప్రజల పక్షాన నిలబడి హక్కుల సాధన కోసం ముందుండి పోరాడతామని వారు స్పష్టం చేశారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పని చేయాలని నవోదయ సిద్దు కోరారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన రిటైర్డ్ హైకోర్టు జడ్జి జస్టిస్ చంద్ర కుమార్ మాట్లాడుతూ సమాజంలోని ప్రతి పౌరుడు చట్టాలపై అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. చట్టాలపై సరైన అవగాహన ఉంటేనే హక్కులను కాపాడుకోవడంతో పాటు బాధ్యతలను సక్రమంగా నిర్వహించగలమని తెలిపారు. ప్రత్యేకంగా ప్రజలు తమ హక్కులు, విధులు తెలుసుకొని న్యాయ వ్యవస్థను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. చట్టాలపై అవగాహన కార్యక్రమాలు గ్రామ స్థాయి వరకు విస్తరించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయవాది చీఫ్ అడ్వైజర్ పుట్ట పద్మారావు, జేఎన్జీఓయూ యూనివర్సిటీ ప్రొఫెసర్లు బిట్ల ప్రభాకర్, బి. క్రాంతి కిరణ్, ప్రొఫెసర్ ఉస్మానియా యూనివర్సిటీ చీఫ్ అడ్వైసర్ వెంకట్ దాస్, ప్రొఫెసర్ సీబీఐటి చీఫ్ అడ్వైసర్ ఎం. స్వామి దాస్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సంస్థ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ డిగ్గే బాబు, రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు వి మోహన్ రావు, రాష్ట్ర కార్యదర్శులు దత్తా రెడ్డి, ఆనంద్, రాష్ట్ర ఉపాధ్యక్షులు తలారి కుమార్, రాష్ట్ర అడ్వైజర్ ప్రశాంత్ గాంధీ, రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ ఫెరోజ్, సహాయ కార్యదర్శులు ఏ. ప్రదీప్ కుమార్, ఆందోల్ మల్లేశం, జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఓంప్రకాష్, బోరంచ సాయిలు, సంగారెడ్డి జిల్లా కార్యదర్శి ఎం.ఏ ఖైసర్ తదితరులు పాల్గొన్నారు

ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేతలు భారీగా బిఆర్ఎస్‌లో చేరిక

కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీ లోకి భారీ స్థాయిలో చేరికలు…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

చెన్నూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీలోకి భారీ ఎత్తున నాయకుల చేరికల కోసం హైదరాబాద్ కు సుమారు 300 కార్లలో బయలు దేరి వెళ్లారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ జడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి తమ అనుచర వర్గంతో కలిసి వెళ్లగా, క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మాపూర్ కు చెందిన వంశీకృష్ణరావ్ ఆధ్వర్యంలో సైతం బారాస పార్టీలో చేరేందుకు భారీ ఎత్తున తరలి వెళ్లారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆధ్వర్యంలో హైదరాబాదులోని కేటీఆర్ సమక్షంలో చేరేందుకు నేతలంతా బయలుదేరి వెళ్లినట్లు తెలియజేశారు. రానున్న మున్సిపల్ ఎన్నికలలో చెన్నూర్, క్యాతన్ పల్లి మున్సిపాలిటీ లలో గులాబీ జెండా ఎగిరేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు డాక్టర్ రాజా రమేష్, పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, సీనియర్ నాయకులు రామిడి కుమార్, మాజీ కౌన్సిలర్లు, యువ నాయకులు ,నాయకులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు.

ఎక్స్ ఎంపీపీ నారాయణ రెడ్డిని ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న మంత్రి….

ఎక్స్ ఎంపీపీ నారాయణ రెడ్డిని ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న మంత్రి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్.ఉజ్వల్ రెడ్డి గారి తండ్రి ఎక్స్ ఎంపీపీ నారాయణ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనర్సింహ పరమాశించి ఆరోగ్య పరిస్థితి డాక్టర్ లను అడిగి తెలుసుకున్నారు. త్వరగా మేలుకోని కోలుకోవాలని అన్నారు జహీరాబాద్ నియోజకవర్గ చరక్ పల్లి గ్రామ ప్రజలకు సేవలందించిన నాయకులుగా పేరు పొందిన నాయకులు నారాయణ రెడ్డి త్వరగా కోలుకోవాలని జహీరాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ నాయకులు కోరుకుంటున్నారు,

మాజి ఎంపీ రావులను హైదరాబాద్ లో పరామర్శిస్తున్న జర్నలిస్ట్ పొలిశెట్టి సురేష్..

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-24T131742.922.wav?_=1

 

మాజి ఎంపీ రావులను హైదరాబాద్ లో పరామర్శిస్తున్న జర్నలిస్ట్ పొలిశెట్టి సురేష్

వనపర్తి నేటిదాత్రి .

 

 

తెలంగాణ రాష్ట్ర మాజి ముఖ్యమంత్రి కె.సి.ఆర్ రావడంతో స్వగతం చెప్పాడానికి వెళ్లినానని కార్యకర్తల తోపులాట జేరిందని మాజీ ఎంపి రావు ల చంద్ర శేఖర్ రెడ్డి తెలిపారు ఆయన స్వల్పంగా గాయపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న వనపర్తి నేటిదాత్రి దినపత్రిక జర్నలిస్ట్ మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డిని హైదరాబాద్ హిమాయత్ నగర్ లో పరమార్శి oచారు
టి.వి లో స్క్రోలింగ్ రావడంతో ప్రజలు అభిమానులు కార్యకర్తలు ఆందోళన చెందారని స్వల్ప గాయలు అయ్యావని గాయాలు తగ్గాయని ప్రజలు అభిమానులు బీ ఆర్ ఎస్ కార్యకర్తలు ఆందోళన చెందవద్దని మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి ఒక ప్రకటన లో కోరారు

సాయి ఎక్స్పోర్ట్ కంపెనీ కార్మికుల వేతనాలు పెంచాలి..

సాయి ఎక్స్పోర్ట్ కంపెనీ కార్మికుల వేతనాలు పెంచాలి

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

హైదరాబాదు నగర నడిబొడ్డు మీద ఉన్న నాచారం పారిశ్రామిక ప్రాంతంలోని సాయి ఎక్స్పోర్ట్ కంపెనీ సుమారు 2000 మంది కార్మికులు తమ వేతనాలను పెంచాలని గత నాలుగు రోజులుగా ఆందోళన చేస్తున్నప్పటికీ యాజమాన్యం మొండిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు గురువారం నాడు కార్మికుల ధర్నా శిబిరాన్ని సందర్శించిన ఐఎఫ్టియు ప్రతినిధి బృందం తరపున ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాస్ కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. గత రెండు దశాబ్దాలుగా సాయి ఎక్స్పోర్ట్ కమిటీలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాల చట్టం అమలు జరగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 20 ఏళ్లుకాలం గడుస్తున్న కార్మికుల వేతనాలు రూ10 వేల లోపే పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 90 శాతం మహిళా కార్మికులు ఉన్నప్పటికీ వారికి కనీస రక్షణ చర్యలు లేవని ఫలితంగా తీవ్ర వివక్షకు వేధింపులకు గురవుతున్నారని ఆరోపించారు.
తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతగా ఈ సమస్యపై స్పందించాలని లేబర్ డిపార్ట్మెంట్ రంగంలోకి దిగి కార్మికుల యాజమాన్య తో చర్చించి సమస్య పరిష్కారానికి పూనుకోవాలని శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. ఎలాంటి చట్టాలు అమలు చేయకుండా కార్మికుల కనీస హక్కులను హరిస్తున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చేసి సాయి ఎక్స్పోర్ట్ కంపెనీలో చట్టాలు అమలయ్యే విధంగా తగిన చర్యలు చేపట్టాలని అందులో భాగంగానే కనీస వేతనం కింద ఒక్కో కార్మికుడికి కనీస వేతనం రూ. 26 వేలుగా నిర్ణయించి అమలు చేయాలని మహిళా కార్మికులకు పూర్తిస్థాయి రక్షణ కల్పించాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. లేనియెడల కార్మికులకు సంఘీభావంగా రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధం కావాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ ప్రతినిధి బృందంలో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అరుణ, నాయకులు కావేరి, మల్లన్న, ఇంద్రసేనారెడ్డి, శ్రీశైలం, సత్యనారాయణ తదితరులు ఉన్నారు.

లియోనల్ మెస్సీ గోట్ టూర్.. మూడు రోజుల షెడ్యూల్ ఇదే..

లియోనల్ మెస్సీ గోట్ టూర్.. మూడు రోజుల షెడ్యూల్ ఇదే..

ఫుట్‌బాల్‌ సూపర్‌ స్టార్‌ లియోనెల్‌ మెస్సీ భారత్‌ రానున్నారు. హైదరాబాద్ నగరంలో పర్యటించనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడనున్నారు. ఇండియా టూర్ ముగించే ముందు దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని మెస్సీ కలుస్తారు.ప్రపంచ ఫుట్‌బాల్‌ సూపర్‌ స్టార్‌ లియోనెల్‌ మెస్సీ మూడు రోజుల పాటు భారత్‌లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 13, 14, 15 తేదీల్లో దేశ వ్యాప్తంగా ఉన్న నాలుగు ప్రముఖ నగరాల్లో పర్యటిస్తారు. గోట్ ఇండియా టూర్‌ 2025లో భాగంగా ఆయన కోల్‌కతా, హైదరాబాద్, ముంబై, న్యూఢిల్లీలలో జరగబోయే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇండియా టూర్ ముగించే ముందు దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని మెస్సీ కలుస్తారు. మెస్సీతో పాటు లూయిస్ సూరెజ్, అర్జెంటినా మిడ్ ఫీల్డర్ రోడ్రిగో డే పాల్‌లు కూడా భారత్‌లో పర్యటించనున్నారు. మెస్సీ మూడు రోజుల భారత్ టూర్ షెడ్యూల్ ఇలా ఉంది..

 రోజూ 300 మంది.. ప్రభుత్వ ఆస్పత్రులకు క్యూ కడుతున్న బాధితులు..

 రోజూ 300 మంది.. ప్రభుత్వ ఆస్పత్రులకు క్యూ కడుతున్న బాధితులు

 

నగరంలో.. కుక్కలు స్వైరవిహరం చేస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ కుక్కలు దర్శనమిస్తున్నాయి. దీంతో వీధుల్లోకి వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఒక్క హైదరాబాద్ నగరంలోనే రోజుకూ 300 వరకు కుక్కకాటు కేసులు నమోదవుతున్నాయంటే.. ఇక పరిస్థితి ఏంటో ఇట్టే ఊహించుకోవచ్చు.

హైదరాబాద్‌ సిటీ: కుక్క కాటు కేసులు ఆస్పత్రుల్లో ఇటీవల పెరుగుతున్నాయి. ఐపీఎంకు, ఫీవర్‌ ఆస్పత్రికి బాధితులు క్యూ కడుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులకు కుక్కకాటు బాధితులు రోజుకు 300 మందికి పైగా వస్తున్నారని, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. కుక్కకాటుకు గురైన వారికి నారాయణగూడ ఐపీఎంలో టీకా సదుపాయం ఉంది. నల్లకుంట ఫీవర్‌ ఆస్పత్రిలో టీకాలు, వ్యాక్సిన్‌ వేస్తున్నారు. అన్ని ప్రభుత్వ, పట్టణ ప్రాథమిక, జిల్లా ఆస్పత్రుల్లో వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి.
ఫీవర్‌ ఆస్పత్రికి క్యూ..

ఫీవర్‌ ఆస్పత్రికి కుక్క కాటు బాధితుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఆస్పత్రిలో కుక్కకాటు వ్యాక్సిన్‌ ఇవ్వడంతో పాటు రేబిస్‌ బాధితులకు చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఫీవర్‌ ఆస్పత్రిలో 2023లో 27,172 మందికి చికిత్స అందించగా, 13 మంది రేబిస్‏తో చనిపోయారు. 2024లో 29,054 మందికి చికిత్స చేయగా, 16 మంది చనిపోయారు. ఈ ఏడాది 24,705 మందికి వైద్యం అందించారు. 34 మంది రేబి్‌సతో మృతిచెందారు.

– ఫీవర్‌ ఆస్పత్రికి రోజుకు సగటున 60 నుంచి 80 కేసులు వస్తున్నాయి. నెలలో ఒకటి, రెండు కేసులు రేబి్‌సకు సంబంధించినవి ఉంటున్నాయి. ప్రతీ ఏడాది 20 వేలమంది టీకాలు వేసుకుంటున్నారు.

నారాయణగూడ ఐపీఎంకు ఈ ఏడాది ఇప్పటి వరకు 33,765 మంది కుక్కకాటు బాధితులకు వ్యాక్సిన్‌ ఇచ్చారు. ఐపీఎంను ప్రతీనెల 2,200 నుంచి 2,600 మంది కుక్కకాటు బాధితులు ఆశ్రయిస్తున్నారు.

– హయత్‌నగర్‌ ఆస్పత్రిలో నెలకు 400 మంది చికిత్స పొందుతున్నారు. వనస్థలిపురం ఆస్పత్రికి నెలకు 275-300 మందికి కుక్కకాటు టీకాలు వేస్తున్నారు.

– రాజేంద్రనగర్‌ ఆరోగ్య కేంద్రంలో నెలకు 90-100 మంది, హయత్‌నగర్‌ నెలకు 300 మంది టీకాలు వేయించుకుంటున్నట్లు వైద్య వర్గాలు తెలిపాయి.

జర్నలిస్టుల మహాధర్నా కు తరలి వెల్లిన ఐజేయూ నాయకులు..

జర్నలిస్టుల మహాధర్నా కు తరలి వెల్లిన ఐజేయూ నాయకులు

భూపాలపల్లి నేటిధాత్రి

 

జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా టియుడబ్ల్యూజే (ఐజేయు) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాదులో నిర్వహించిన మహా ధర్నా కార్యక్రమంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా టియుడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పాల్గొన్నట్లు ఐజేయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సామంతుల శ్యామ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జర్నలిస్ట్ ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐజేయూ రాష్ట్ర ఈసీ మెంబర్ ఏటా వీరభద్రరస్వామి,చిట్యాల ఐజేయూ ఇంఛార్జి రవితేజ,గణపురం ఐజేయూ ఇంచార్జి రమేష్, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

మహా ధర్నా పోస్టర్ ఆవిష్కరణ ఐజేయు…

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-01T173751.343.wav?_=2

 

మహా ధర్నా పోస్టర్ ఆవిష్కరణ ఐజేయు
జిల్లా కమిటీ

భూపాలపల్లి నేటిధాత్రి

జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 3 వ తేదీన హైదరాబాద్ లోని మాసబ్ ట్యాంక్ వద్ద గల రాష్ట్ర సమాచార కార్యాలయం ముందు జరిగే మహా ధర్నాలో భాగంగా జిల్లా కేంద్రంలో మహా ధర్నా పోస్టర్ను ఆవిష్కరించినట్లు టి యు డబ్ల్యూ జే (ఐజేయు) జిల్లా ప్రధాన కార్యదర్శి సామంతుల శ్యామ్,రాష్ట్ర హెల్త్ సెక్రటరీ సామల శ్రీనివాస్ లు తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గత రెండు సంవత్సరాలుగా జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించడంలో విఫలం చెందిందని, జర్నలిస్టులకు హెల్త్ కార్డులు, అక్రిడేషన్లతో పాటు ఇంటి స్థలాలు ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 3 వ తేదీన టీయూడబ్ల్యూజే(ఐజేయు) యూనియన్ ఆధ్వర్యంలో జరిగే మహాధర్నా లో భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఈసీ మెంబర్ ఏట వీరభద్ర స్వామి జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

మంత్రి శ్రీధర్ బాబును కలిసిన డీసీసీ అధ్యక్షుడు కర్ణాకర్..

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-29T124508.621.wav?_=3

 

మంత్రి శ్రీధర్ బాబును కలిసిన డీసీసీ అధ్యక్షుడు కర్ణాకర్

భూపాలపల్లి నేటిధాత్రి

హైదరాబాదులో మినిస్టర్ క్వార్టర్స్ కార్యాలయంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా బట్టు కర్ణాకర్ ఎన్నికైన సందర్భంగా రాష్ట్ర ఐటీ మినిస్టర్ దుద్దిల శ్రీధర్ బాబు ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి సన్మానం చేయడం జరిగింది

రాహుల్ సిప్లిగంజ్ వివాహం

గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ వివాహం: బీజేపీ నేత శుభాకాంక్షలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ప్రముఖ గాయకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత రాహుల్ సిప్లిగంజ్ హైదరాబాద్లోని గచ్చిబౌలిలో తన ప్రియురాలు హరిణ్య రెడ్డిని వివాహం చేసుకున్నారు. ఈ వివాహ వేడుకకు సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ పట్టణ అధ్యక్షులు పూల సంతోష్ హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంఘటన రాహుల్ సిప్లిగంజ్ వ్యక్తిగత జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టాన్ని సూచిస్తుంది.

నూతన వధువరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్,ఎమ్మెల్యే మాణిక్ రావు..

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-13T122610.454.wav?_=4

 

నూతన వధువరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్,ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

హైదరాబాద్ ఆనందా కన్వెన్షన్ లో జరిగిన మాజి మంత్రివర్యులు కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ సోదరుడు గంగుల సుధాకర్ కుమారుడి వివాహ వేడుకలో పాల్గొని నూతన వధువరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన సంగారెడ్డి బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శాసనసభ్యులు చింతా ప్రభాకర్ జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు

ముదిరాజ్ మహాసభ వార్షికోత్సవ పోస్టర్ ఆవిష్కరణ…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-12T173147.099-1.wav?_=5

 

ముదిరాజ్ మహాసభ వార్షికోత్సవ పోస్టర్ ఆవిష్కరణ

కేసముద్రం/ నేటి ధాత్రి

 

ముదిరాజ్ మహాసభ వార్షికోత్సవ పోస్టర్ ను హైదరాబాదులో బుధవారం ఆవిష్కరించిన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి నీలం దుర్గేష్ మాట్లాడుతూ ఈనెల 21 ముదిరాజ్ మహాసభ 11వ వార్షికోత్సవం సందర్భంగా ప్రతి గ్రామాన సంఘం నాయకులు పతాకాలను ఆవిష్కరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు చిల్లా సహదేవ్ ముదిరాజ్, ఫిషరీస్ కార్పొరేషన్ చీఫ్ ప్రమోటర్ కొత్త రమేష్ ముదిరాజ్, జిల్లా కార్యదర్శి పిట్టల ధనుంజయ్ ముదిరాజ్, ఎదురబోయిన సూరయ్య ముదిరాజ్ పాల్గొన్నారు.

హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ 7వ వార్షిక బ్రహ్మోత్సవం..

హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్‌లో నవంబర్ 14 – 19 వరకు వైభవంగా జరగనున్న 7వ వార్షిక బ్రహ్మోత్సవాలు

హైదరాబాద్, నేటిధాత్రి:

హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్, హైదరాబాద్‌లో ఏడవ వార్షిక శ్రీ బ్రహ్మోత్సవాలు నవంబర్ 14 నుంచి 19, 2025 వరకు ఘనంగా జరగనున్నాయి.

2018లో ఆరంభమైన స్వర్ణ దేవాలయంలో స్వయంభూ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి, శ్రీ శ్రీ రాధాగోవింద ప్రధాన విగ్రహాలుగా వెలసి నిత్యం పూజలు అందుకుంటున్నారు. వీరితో పాటు పాంచజన్యేశ్వర స్వామి, జలగర్భ శాలిగ్రామ శిల, శ్రీ జప ఆంజనేయ స్వామి మరియు ఆచార్య పరంపరా ప్రతిష్ఠించబడ్డాయి.

బ్రహ్మోత్సవం అనేది ఆలయ ప్రతిష్ఠ మరియు విగ్రహాల మహా సంప్రోక్షణను చేసుకునే వార్షిక వేడుక. స్వయంగా బ్రహ్మదేవుడే శ్రీమన్నారాయణునికి మొదటగా నిర్వహించిన ఈ ఉత్సవం పేరే బ్రహ్మోత్సవం. ఆధ్యాత్మిక సంప్రదాయంగా కొనసాగుతూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆలయాలన్నింటిలోనూ ప్రతి సంవత్సరం నిర్వహించే ఆచారంగా జరపబడుతుంది. ఈ పవిత్ర సంప్రదాయాన్ని కొనసాగిస్తూ హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్ ప్రతి సంవత్సరం ఘనంగా శ్రీ బ్రహ్మోత్సవాన్ని నిర్వహిస్తోంది.

ఈ ఏడాది ఉత్సవాలు నవంబర్ 14న శ్రీ లక్ష్మీనరసింహ స్వామి మూలవరు మరియు ఉత్సవమూర్తుల అభిషేకంతో ప్రారంభమవుతాయి. నవంబర్ 17 మరియు 19 తేదీల్లో శ్రీ భూసమేత నరసింహ స్వామి కళ్యాణోత్సవం, శ్రీ శ్రీ రాధాగోవింద దేవుల 108 కలశ మహాచూర్ణాభిషేకం మరియు మహాసంప్రోక్షణ వంటి ప్రధాన కార్యక్రమాలు జరగనున్నాయి. ప్రతిరోజూ దేవతామూర్తులకు విశేషాలంకారాలు, పుష్పాలంకరణలు, నూతన వస్త్రాలు, ఆభరణాలతో అలంకరించి, హరినామ సంకీర్తనాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక ఉత్సాహంతో మార్మోగనుంది.

ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా, బ్రహ్మోత్సవ ఆహ్వాన పోస్టర్ మరియు కార్యక్రమ వివరాలను హరేకృష్ణ మూవ్ మెంట్ , హైదరాబాద్ అధ్యక్షులు శ్రీమాన్ సత్యగౌర చంద్రదాస ప్రభూజీ (ఎంటెక్, ఐఐటీ మద్రాస్) గారు విడుదల చేశారు.
ఉత్సవాలు మరియు వైభవమైన కార్యక్రమాలు.

నవంబర్ 14, శుక్రవారం
ఉదయం 5:15 – శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి మూలవర మరియు ఉత్సవర అభిషేకం
సాయంత్రం 6:30 – భూ వరాహ పూజ, వైనతేయ ప్రతిష్ఠ, అంకురార్పణ

నవంబర్ 15, శనివారం
ఉదయం 8:30 – ధ్వజారోహణం
ఉదయం 10:00 – ఉత్సవ హోమం
సాయంత్రం 5:00 – దేవత ఆవాహన
సాయంత్రం 6:00 – శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఊంజల సేవ

నవంబర్ 16, ఆదివారం
ఉదయం 9:30 – మహా సుదర్శన హోమం
సాయంత్రం 6:00 – ఉత్సవ హోమం, హనుమద్ వాహన సేవ, శ్రీ రాధా గోవింద ఝూలన్ ఉత్సవం

నవంబర్ 17, సోమవారం
ఉదయం 9:30 – శ్రీ రాధా గోవింద మూలవర ప్రతిష్ఠ , ఉత్సవ హోమం
ఉదయం 11:30 – చప్పన్ భోగ్ సేవా
సాయంత్రం 6:00 – ఉత్సవ హోమం
సాయంత్రం 6:45 – కార్తీక సోమవారం, శ్రీ భూ సమేత నరసింహ స్వామి కల్యాణోత్సవం

నవంబర్ 18, మంగళవారం
ఉదయం 9:30 – ఉత్సవ హోమం
సాయంత్రం 6:00 – ఉత్సవ హోమం, గరుడ వాహన సేవ, శ్రీ రాధా గోవింద ఝూలన్ ఉత్సవం

నవంబర్ 19, బుధవారం
ఉదయం 8:30 – ఉత్సవ హోమం
ఉదయం 9:30 – మహా పూర్ణాహుతి
ఉదయం 10:30 – ఉత్సవార అభిషేకం & చక్ర స్నానం
సాయంత్రం 6:00 – దేవత ఉద్వాసనం & శ్రీ పుష్ప యాగం
సాయంత్రం 6:45 – శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి, శ్రీ రాధా గోవింద, శ్రీ నితాయి గౌరాంగ, శ్రీల ప్రభుపాదుల వారికి మహా చూర్ణాభిషేకం
రాత్రి 9:00 – మహా సంప్రోక్షణం

ఈ సందర్భంగా ప్రభూజీ మాట్లాడుతూ, “తెలంగాణ తొలి గోల్డెన్ టెంపుల్‌లో 7వ శ్రీ బ్రహ్మోత్సవాన్ని ఆరు రోజులపాటు భక్తి భావంతో జరుపుకుంటున్నాము. ఈ ఉత్సవాలు మన సంప్రదాయాన్ని, దైవారాధనను, కీర్తనలతో, సేవలతో, అర్చనలతో స్మరింపజేస్తాయి. అందరూ ఈ పవిత్ర ఉత్సవాల్లో పాల్గొని పరమాత్ముని దివ్య కృపను పొందాలని కోరుతున్నాము” అని అన్నారు. అన్ని కార్యక్రమాలు శ్రీమాన్ సత్యగౌర చంద్రదాస ప్రభూజీ ఆధ్వర్యంలో జరుగుతాయి. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా భక్తులు, యువకులు, సంఘ సభ్యులు పాల్గొననున్నారు. భక్తుల సౌకర్యార్థం ప్రసాద పంపిణీ, వసతి, రవాణా వంటి అన్ని ఏర్పాట్లు సమగ్రంగా చేయబడ్డాయి.

ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు,
ప్రజా సంబంధాల అధికారి (PRO)
హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ – స్వయంభూ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం,
హరే కృష్ణ మూవ్‌మెంట్ – హైదరాబాద్, రోడ్ నెం. 12, బంజారాహిల్స్, హైదరాబాద్.
ఫోన్: 96400 86664 / 93964 16341 .

7th Brahmotsavam at Hare Krishna Golden Temple from Nov 14–19.

https://youtu.be/5VGpnrPf-_0?si=LbCpxN92n79tnBtb


Sri Brahmotsavam Celebrations at Hare Krishna Golden Temple from Nov 14th to Nov 19th 2025

NethiDhatri, Hyderabad:

Hare Krishna Golden Temple, Hyderabad, is all set to celebrate its 7th Annual Brahmotsavam from November 14th to 19th, 2025.

The Golden Temple, which was inaugurated in the year 2018, is presided by main Deities of an ancient Swayambhu Sri Lakshmi Narasimha Swamy and Sri Sri Radha Govinda, along with parivara devatas- Panchajanyeswara swamy, a unique Jalagarbha Saligrama shila, Sri Japa Anjaneya Swamy and other revered deities of the Acharya parampara.

Brahmotsavam is a sacred annual festival commemorating the consecration of the temple and its Deities. Originally performed by Lord Sri Brahma for the Supreme Lord Sri Narayana, this ritual has become an enduring tradition in temples worldwide, and since then, it has become a customary practice in all temples to celebrate the consecration ceremony of the temple Deities as Brahmotsavam.

In continuance of these ancient traditions, we are annually celebrating this auspicious event.
The festivities would begin on Nov 14th with Sri Lakshmi Narasimha Swamy Moolavar & Utsavar Abhishekam. On Nov 17th and Nov 19th, the most auspicious events are the sacred Sri Bhu Sametha Narasimha Swamy Kalyanotsavam, Sri Sri Radha Govinda Maha Churnabhishekam with 108 Kalashas, concluding with Maha Samprokshana.

The Celebrations on all days would witness Vishesha alankara of their Lordships, adorned with beautiful floral-decorations, Nava vastras and specially designed jewellery and ecstatic Harinama sankirtana would be conducted for the pleasure of their Lordships.

The celebrations begin on Nov 14th with the most auspicious ceremony of Abhishekam to Sri Lakshmi Narasimha Swamy Moolavar & Utsavar in the early morning hours, followed by Vainatheya Prathista and Ankurarpana in the evening. Dwaja Arohanam and other important rituals will be conducted on Nov 15th, and there shall be Sri Lakshmi Narasimha Swamy Unjala Seva in the evening. Maha Sudarshana Homa, Hanumad Vahanam, and Sri Radha Govinda Jhulan Utsav are scheduled on Nov 16th. Chappan Bhogh will be held on Nov 17th, in the morning, and the sacred Sri Bhu Sametha Narasimha Swamy Kalyanotsavam in the evening. Garuda Vahanam and Jhulan Utsav will be conducted on Nov 18th.

The most auspicious festivities of the Brahmotsavam celebrations will be conducted on Nov 19th, beginning with Maha Purnahuthi and Utsavar Abhisekam and Chakra Snanam in the morning and followed by an elaborate grand 108 Kalasha Maha Churnabhisekam to Sri Sri Radha Govinda, Sri Lakshmi Narasimha Swamy, Sri Nitai Gauranga, and Srila Prabhupada Utsavar Deities, and the festivities will conclude with a Maha Samprokshana in the evening.

At a specially convened program, Sri Satya Gaura Chandra Dasa Prabhu (M.Tech, IIT, Madras), President of the Hare Krishna Movement, Hyderabad, released the invitation poster and program details of the upcoming Brahmotsavam.

Speaking about the ceremony, Prabhuji said, “We are joyfully celebrating the 7th Sri Brahmotsavam at Telangana’s First Golden Temple, with six days of divine festivities. The celebrations continue the ancient tradition of honoring the Lord through elaborate rituals, kirtans and devotional services. He also invited each and every one to attend and actively participate in these auspicious celebrations and receive the blessings of the Supreme Lord.”

All celebrations will be presided over by His Grace Sri Satya Gaura Chandra Dasa Prabhuji, President of the Hare Krishna Movement, Hyderabad.

The event will host esteemed governing body members, temple presidents, congregation members, youth, and devotees from across the country.

Elaborate arrangements for Prasadam distribution and visitor convenience have been planned at the temple.

Thanks and Regards,
Public Relations Officer (PRO)
Hare Krishna Golden Temple Swayambhu Sri Lakshmi Narasimha Swamy Kshetram,
Hare Krishna Movement – Hyderabad, Road No. 12, Banjara Hills, Hyderabad, Phone: 96400 86664 / 93964 16341.

బంగారం ధరలకు రెక్కలు.. హైదరాబాద్‌లో పది గ్రాముల ధర ఎంతంటే..

బంగారం ధరలకు రెక్కలు.. హైదరాబాద్‌లో పది గ్రాముల ధర ఎంతంటే..

 

ఇటీవలి కాలంలో వరుసగా తగ్గుతూ వస్తున్న బంగారం ధర సోమవారం యూటర్న్ తీసుకుంది. ఈ రోజు ఉదయం 9 గంటల తర్వాత బంగారం ధర భారీగా పెరిగింది. ఇటీవల ధర బాగా తగ్గడంతో కొనుగోళ్లు పెరగడమే ఈ పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది

ఇటీవలి కాలంలో వరుసగా తగ్గుతూ వస్తున్న బంగారం ధర సోమవారం యూటర్న్ తీసుకుంది. ఈ రోజు ఉదయం 9 గంటల తర్వాత బంగారం ధర భారీగా పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1, 23, 220కి చేరింది (Gold price in Hyderabad). నిన్నటితో పోల్చుకుంటే దాదాపు రూ.1200 పెరిగింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ. 1, 11, 950కి చేరింది. నిన్నటితో పోల్చుకుంటే దాదాపు రూ.1100 పెరిగింది.
ఇటీవల ధర బాగా తగ్గడంతో కొనుగోళ్లు పెరగడమే ఈ పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది (live gold rates). ఇక, ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ. 1, 23, 370కి చేరుకోగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 1, 13, 100కి చేరుకుంది.ఇక వెండి ధరల్లో కూడా భారీ పెరుగుదల నమోదైంది. కేజీకి 2,500 రూపాయల మేర వెండి ధర పెరిగింది . హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 1, 67, 000గా ఉంది. ఇక, ఢిల్లీలో కిలో వెండి ధర రూ.1, 55, 000గా ఉంది.

 పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.

అంబేద్కర్ నేషనల్ అవార్డు అందుకున్న కొమురయ్య…

అంబేద్కర్ నేషనల్ అవార్డు అందుకున్న కొమురయ్య

భూపాలపల్లి నేటిధాత్రి

 

హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులో సిటీ కల్చర్ ఆడిటోరియం ముషీరా బాద్లో స్ఫూర్తి సర్వీస్ సొసైటీ ఇండియా ఎన్జీవో వ్యవస్థాపకులు చైర్మన్ లయన్ డాక్టర్ ఆకుల రమేష్ ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో సేవలందిస్తున్న వారిని గుర్తించి వారికి అవార్డులు ప్రధాన చేయడం జరిగింది . అందులో భాగంగా అంబేద్కర్ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మారపల్లి కొమురయ్య సేవలను గుర్తించి అంబేద్కర్ నేషనల్ సేవా అవార్డు ముఖ్య అతిథులు డాక్టర్ గూడూరు చెన్నారెడ్డి డాక్టర్ టీవీ రామకృష్ణ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ ఫిలిం ప్రొడ్యూసర్ మల్ల రమేష్ శంషాబాద్ ఎంఈఓ డాక్టర్ ఇస్లావత్ కాసన నాయక్ చేతుల మీద స్ఫూర్తి సేవ సమితి ఆధ్వర్యంలో అందించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుర్తించి అవార్డు అందించిన స్ఫూర్తి సేవా సమితి వారికి పేరుపేరునా కృతజ్ఞతలు

అంబేద్కర్ నేషనల్ సేవ అవార్డుఅందుకున్న గురుకుంట్ల కిరణ్..

అంబేద్కర్ నేషనల్ సేవ అవార్డుఅందుకున్న గురుకుంట్ల కిరణ్.

చిట్యాల, నేటిదాత్రి :

 

హైదరాబాదులో ఆర్టీసీ క్రాస్ రోడ్డులో సిటీ కల్చర్ ఆడిటోరియం లో స్ఫూర్తి సర్వీస్ సొసైటీ ఇండియా ఎన్జీవో వ్యవస్థాపకులు చైర్మన్ లయన్ డాక్టర్ ఆకుల రమేష్ ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో సేవలందిస్తున్న వారిని గుర్తించి వారికి అవార్డులు ప్రధాన చేయడం జరిగింది . అందులో డాక్టర్ ఆకుల రమేష్ మాట్లాడుతూ నిరుపేదలకు తనవంతుగా మానవతా దృక్పథంతో సహాయ సహకారాలు అందిస్తూ విద్యార్థి దశ నుండి విద్యార్థుల సమస్యల పరిష్కారం కొరకు కృషి చేయడం తో పాటు కరోనా మహమ్మారి విపత్కర సమయంలో సామాజిక ఆరోగ్య కేంద్రం ద్వారా నిస్వార్థంగా అనారోగ్యం బారిన పడినా వారికి సేవా చేయడం
లేబర్ ఇన్సూరెన్స్ కార్డులు మరియు కళ్యాణ లక్ష్మి ,రైతు బీమా ,పింఛన్ల విషయంలో సరియైన అవగాహన కల్పించి వారికి లబ్ధి చేకూరేలాగా చేయడం జరిగింది.
అంబేద్కర్ యువజన సంఘం చిట్యాల మండల సీనియర్ నాయకులు గురుకుంట్ల కిరణ్* సేవలను గుర్తించి అంబేద్కర్ నేషనల్ సేవా అవార్డు ప్రధానము చేయడం జరిగింది,ముఖ్య అతిథులు డాక్టర్ గూడూరు చెన్నారెడ్డి డాక్టర్ టీవీ రామకృష్ణ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ ఫిలిం ప్రొడ్యూసర్ మల్ల రమేష్ శంషాబాద్ ఎంఈఓ డాక్టర్ ఇస్లావత్ కాసన నాయక్ చేతుల మీద స్ఫూర్తి సేవ సమితి ఆధ్వర్యంలో అందించడం జరిగింది . అవార్డు తీసుకున్న అనంతరం తెలంగాణ రాష్ట్ర తొలి శాసనసభ పతి,ఎమ్మెల్సీ, శాసన మండలి ప్రతిపక్ష నేత గౌ” శ్రీ” సిరికొండ మధుసూదనాచారి ని కలిసి
కిరణ్ ఆశీస్సులు తీసుకోవడం జరిగింది,మా సేవలను గుర్తించి అవార్డు అందించిన స్ఫూర్తి సేవా సమితి వారికి పేరుపేరునా కిరణ్ కృతజ్ఞతలు తెలపడం జరిగింది.

డీఎస్పీలకు ట్రైనింగ్.. ప్రారంభించిన డీజీపీ…

డీఎస్పీలకు ట్రైనింగ్.. ప్రారంభించిన డీజీపీ

 

ఈ 10 నెలలు చాలా కష్టంగా ఉంటుందని.. అన్నింటినీ ఎదుర్కొని సమర్థవంతంగా నిలుస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. పోలీస్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే ప్రజల హృదయాలు గెలవగలగాలని నిర్దేశించారు.

హైదరాబాద్, నవంబర్ 6: గ్రూప్ 1లో ఎంపికైన 115 మంది డీఎస్పీలకు ట్రైనింగ్ కార్యక్రమం ప్రారంభమైంది. ఈరోజు (గురువారం) ఉదయం డీజీపీ శివధర్ రెడ్డి (Telangana DGP Shivadhar Reddy) ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. టీజీపీఏకు చేరుకున్న డీజీపీకి టీజీపీఏ డైరెక్టర్ అభిలాష బిస్త్ గౌరవ వందనంతో స్వాగతం పలికారు. రాజేంద్రనగర్‌‌లోని టీజీపీఏలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)లకు ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ.. 115 మందితో ఇదే అతిపెద్ద డీఎస్పీ బ్యాచ్ అని అన్నారు.
ఈ 10 నెలలు చాలా కష్టంగా ఉంటుందని.. అన్నింటినీ ఎదుర్కొని సమర్థవంతంగా నిలుస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. పోలీస్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే ప్రజల హృదయాలు గెలవగలగాలని నిర్దేశించారు. కొత్తగా రిక్రెట్ అయిన మహిళా డీఎస్పీలు వచ్చే తరానికి ఆదర్శంగా నిలవాలన్నారు. ట్రైనింగ్‌లో స్నేహపూర్వకంగా ఉంటూ.. ఒకరికి ఒకరు తోడ్పాటు అందించుకోవాలని సూచించారు. ఇంటెగ్రిటీ, ఎంపథీ, ప్రొఫెషనల్ ఎక్స్‌లెన్స్.. ఈ మూడు ముఖ్యంగా గుర్తించుకోవాలని అన్నారు. ఈ వంద మంది ట్రైనింగ్‌‌లోనే కాదు.. బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా కాంటాక్ట్‌లో ఉండాలని తెలిపారు. పోలీసింగ్‌కు నెట్వర్క్ చాలా ముఖ్యమని ఈ సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి పేర్కొన్నారు.

డాక్టరేట్ అందుకున్న ఎర్రోళ్ల ప్రతాప్..

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-06T115203.420.wav?_=6

 

డాక్టరేట్ అందుకున్న ఎర్రోళ్ల ప్రతాప్

జహీరాబాద్ నేటి ధాత్రి:

విద్యార్థి దశ నుండి నేటి వరకు ఎన్నో సామాజిక చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఝరాసంగం మండల్ బర్దిపూర్ గ్రామానికి చెందిన ఎర్రోళ్ల ప్రతాప్ కు ఆయన చేసిన సేవలను గుర్తించి ఆసియా వేదిక్ ఇంటర్నేషనల్ కల్చర్ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీ వారు గౌరవ డాక్టరేట్ ను రీసర్చ్ అండ్ కల్చర్ భవన్ హైదరాబాద్ నందు అందించడం జరిగింది. ఆయన చేసిన సామాజిక సేవ కార్యక్రమాలకు గుర్తింపుగా డాక్టరేట్ రావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, డాక్టరేట్ రావడంతో ఇంకా సామాజిక బాధ్యత పెరిగిందని డాక్టర్ ఎర్రోళ్ల ప్రతాప్ అన్నారు.

ఆయన విద్యార్థి దశలో విద్యార్థుల ఎన్నో సమస్యలపై అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించారు. విద్యార్థుల యొక్క విద్య సమస్యలే కాకుండా మదర్ తెరిసా ఫౌండేషన్ ద్వారా తెలంగాణలో ఎన్నో వైద్య శిబిరాలను నిర్వహించి నిరుపేదలకు మదర్ తెరిసా ఫౌండేషన్ ద్వారా వైద్యాన్ని అందిస్తున్నారు. సమాజంలో విద్యా వైద్యం రెండు సంపూర్ణంగా అందినప్పుడే నిరుపేదల జీవితాలు బాగుపడతాయని వారన్నారు. అటు విద్యార్థి సమస్యలపై ఇటు నిరుపేదల ఆరోగ్యాలను కాపాడడానికి మదర్ తెరిసా ఫౌండేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

తండ్రి బాటలో తనయుడు వారి తండ్రి ఎర్రోళ్ల జయప్ప ఎన్జీవో ద్వారా దాదాపు 45 సంవత్సరాల నుండి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేశారు. వారి తండ్రి జయప్ప స్ఫూర్తి బాటలోనే తనయుడు డాక్టర్ ఎర్రోళ్ల ప్రతాప్ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం వల్ల గౌరవ డాక్టర్ రేట్ రావడం తో ఇంకా సామాజిక బాధ్యత పెరిగిందని భవిష్యత్తులో బాధ్యత యుతంగా, భావి భారత పౌరునిగా తన వంతు బాధ్యతను కర్తవ్యాన్ని సంపూర్ణంగా నిర్వహిస్తానని వారన్నారు

మాజీ మంత్రిని పరామర్శించిన వ్యవస్థాపక టీం హరీష్ వర్మ..

మాజీ మంత్రిని పరామర్శించిన వ్యవస్థాపక టీం హరీష్ వర్మ

వీణవంక,( కరీంనగర్ జిల్లా):

నేటి ధాత్రి:మంత్రివర్యులు

 

ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు గారి తండ్రి తన్నీరు సత్యనారాయణ రావు అకాల మరణాన్ని చింతిస్తూ హైదరాబాదులోని వారి నివాసంలో సత్యనారాయణ రావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి వారి ఆత్మ శాంతి చేకూరాలని కోరిన తన్నీరు హరీష్ రావు టీం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు హరీష్ వర్మ అప్పని మరియు టీం సభ్యులు కాట్రేవుల అజయ్, శివ నాగరాజు ,సుమన్ కౌశిక్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.

బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గెలుపు కాయం…

బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గెలుపు కాయం

భూపాలపల్లి నేటిధాత్రి

 

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత కారు గుర్తు పై అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరుతూ యూసుఫ్ గూడ డివిజన్లో ఇంటింటి ప్రచారం నిర్వహించిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ
బి ఆర్ ఎస్ పార్టీ నాయకులతో కలిసి నేడు ఇంటింటి ప్రచారం చేస్తే ప్రజలు మాకు ఘనంగా స్వాగతం పలుకుతున్నారు అన్నారు
ముఖ్యమంత్రి మాట చెప్పితే ప్రజలు మాకు మంచి జరుగుతుంది అని నమ్మేవారు…
కానీ నేటి ముఖ్యమంత్రి దేవుళ్ళ మీద ఓట్లు వేసి దేవుళ్ళనే మోసం చేసిండు మనం ఎంత అంటూ తిట్ల దండకం వల్లిస్తున్నారు.
పోటీ చేయడానికి అభ్యర్థి దొరక్క మజ్లిస్ పార్టీ నుండి పార్టీలోకి తీసుకుని నేర చరిత్ర కలిగిన వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది.
ఒక్క వర్గం ఓట్ల కోసం ఒక్క చెల్లని వ్యక్తి గతంలో పోటీ చేసిన వ్యక్తికి ప్రజలు తిరస్కరించిన వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చి మేము గెలుస్తున్నాం అని చెప్పుకోవడం సిగ్గుచేటు.. అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

హైదరాబాద్‌లో డ్రగ్స్ పార్టీ… భారీగా డ్రగ్స్ స్వాధీనం…

హైదరాబాద్‌లో డ్రగ్స్ పార్టీ… భారీగా డ్రగ్స్ స్వాధీనం

 

హైదరాబాద్ యువకులకు కర్ణాటక నుంచి డ్రగ్స్ తెచ్చి అమ్ముతున్న స్మగ్లర్‌ను అరెస్ట్ చేశారు. డ్రగ్స్ సప్లై చేస్తున్న గుత్తా తేజ కృష్ణతో పాటు నైజీరియన్‌ను అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్, నవంబర్ 4: సైబరాబాద్‌లో డ్రగ్స్ పార్టీని (Drugs Party) ఎస్‌వోటీ పోలీసులు (SOT Police) భగ్నం చేశారు. గచ్చిబౌలి టీఎన్జీవో కాలనీలో ఎస్ఎం లగ్జరి గెస్ట్ రూమ్, కో లివింగ్ గెస్ట్ రూమ్‌లో జరుగుతున్న డ్రగ్ పార్టీపై పోలీసులు దాడి చేశారు. డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్న 12 మందిని ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్ చేవారు. హైదరాబాద్ యువకులకు కర్ణాటక నుంచి డ్రగ్స్ తెచ్చి అమ్ముతున్న స్మగ్లర్‌ను అరెస్ట్ చేశారు. డ్రగ్స్ సప్లై చేస్తున్న గుత్తా తేజ కృష్ణతో పాటు నైజీరియన్‌ను అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ పార్టీలో ఎండీఎంఏతో పాటు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు డ్రగ్స్ పెడ్లర్స్‌తో పాటు ఆరుగురు కన్జ్యూమర్స్‌ను ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు.

నివాళులు అర్పించిన వీరేష్ రావు

నివాళులు అర్పించిన వీరేష్ రావు

పరకాల,నేటిధాత్రి

 

సోమవారం నాడు హైద్రాబాదు లో మాజీ మంత్రి,సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు,తండ్రి తన్నీరు సత్యనారాయణ రావు ఇటీవల అనారోగ్యంతో స్వర్గస్తులు కాగా వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని పరకాల బిఆర్ఎస్ యువనాయకులు వీరేష్ రావు సత్యనారాయణ రావు చిత్రపటానికి నివాళులు అర్పించారు

హరీష్ రావు కుటుంబన్ని పరామర్శించిన మాజీ మంత్రి రెడ్యానాయక్

హరీష్ రావు కుటుంబన్ని పరామర్శించిన మాజీ మంత్రి రెడ్యానాయక్

నేటిధాత్రి డోర్నకల్ ఆర్సి.

 

హైద్రాబాదు లో మాజీ మంత్రి,సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు, తండ్రి తన్నీరు సత్యనారాయణ రావు ఇటీవల అనారోగ్యంతో స్వర్గస్తులు కాగా వారి చిత్రపటానికి నివాళులు అర్పించి వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూన్న డోర్నకల్ మాజీ ఏమ్మెల్యే, మాజీ మంత్రి,డిఎస్ రెడ్యానాయక్, ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు, అచ్యుతరావు, రవీందర్, రాంబాబు, గడ్డం వెంకన్న,సుదర్శన్ రెడ్డి, శ్రీనివాస్ రావు, రాంపల్లి రవి గౌడ్,కూరవి పిచ్చిరెడ్డి, కత్తెరశాల విద్యాసాగర్, ఆయుబ్ పాషా,గందసిరి కీృష్ణ గౌడ్,ముఖేష్,కొమ్ము నరేష్,ధర్మారాపు వేణు,పేపర్ శ్రీను, డోర్నకల్ నియోజకవర్గ, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

గీతంలో విజయవంతంగా ముగిసిన ‘గస్టో’…

గీతంలో విజయవంతంగా ముగిసిన ‘గస్టో’

విజేతలకు ట్రోఫీలు, పతకాలు, ప్రశంసా పత్రాల ప్రదానం

నేటి ధాత్రి, పఠాన్ చేరు :

 

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లోని స్పోర్ట్స్ డైరెక్టరేట్ నిర్వహించిన అంతర్-విశ్వవిద్యాలయ వార్షిక క్రీడా ఉత్సవం, 2025-26, క్రీడాతత్వం, సమష్టికృషి, అజేయమైన క్రీడా స్ఫూర్తితో విజయవంతంగా ముగిసింది. ఇది కేవలం ఒక ఆటల పోటీలుగానే కాక, ఓర్పు, ఐక్యత, అవిశ్రాంతంగా రాణించాలనే తపనల పండుగగా సాగింది. ఉత్కంఠభరితమైన ప్రారంభ మ్యాచ్ నుంచి ఉత్సాహభరితమైన చివరి క్షణాల వరకు, టోర్నమెంట్ అద్భుతమైన విన్యాసాలు, ఉత్కంఠభరితంగా ఆయా క్రీడలను ప్రదర్శించడమే గాక, ఇందులో పాల్గొన్న వారందరిపై చెరగని ముద్ర వేసింది. ఈ టోర్నమెంటులో దాదాపు 60 విశ్వవిద్యాలయాలు, కళాశాలలకు చెందిన 120కి పైగా క్రీడా జట్లు ఉత్సాహంగా పాల్గొన్నాయి.గస్రో అంటే కేవలం గెలవడం, లేదా ఓడిపోవడం కాదని, ఇది పట్టుదల, స్నేహం, క్రీడల ద్వారా జీవితంలోని గొప్ప పాఠాలను నేర్చుకోవడంగా నిర్వాహకులు అభివర్ణించారు. జీవితంలోని ప్రతి రంగంలోనూ బృంద కృషి, అంకితభావం, క్రీడా. స్పూర్తి యొక్క విలువలను ముందుకు తీసుకెళ్లాలని వారు అభిలషించారు. ఇది విజయవంతం కావదానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.
గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ. ఆతిథ్య- క్యాంపస్ లైఫ్ డైరెక్టర్ అంబికా ఫిలిప్, క్రీడల డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఎం.నారాయణరావు చౌదరి విజేతలకు క్రీడా ట్రోఫీలు, పతకాలు, ప్రశంసా పత్రాలను అందజేశారు.
కబడ్డీ: విజేత సీఎంఆర్-జెక్. రెండో స్థానం గీతం త్రోబాల్: విజేత జీఎన్ఐటీఎస్, రెండో స్థానం గీతంబ్యాడ్మింటన్:
పురుషులు-సింగిల్స్ విజేత గీతం, రెండో స్థానం కేఎల్ యూ- హైదరాబాదు
పురుషులు-డబుల్స్: విజేత కేఎల్ యూ- హైదరాబాదు. రెండో స్థానం గీతం
మహిళలు-సింగిల్స్: విజేత సీబీఐటీ, రెండో స్థానం ఐపీఈ
మహిళలు-డబుల్స్: విజేత గీతం, రెండో స్థానం సీబీఐటీ
మిక్స్ డ్ డబుల్స్ విజేత ఐపీఈ, రెండో స్థానం వోక్సన్
టేబుల్ టెన్నిస్:
పురుషులు-సింగిల్స్ విజేత వీఎస్ఆర్ వీజేఐటీ, రెండో స్థానం బిట్స్ – హైదరాబాదు
పురుషులు-డబుల్స్ విజేత బిట్స్- హైదరాబాదు, రెండో స్థానం ట్రిబుల్ ఐటీ-హైదరాబాదు
మహిళలు-సింగిల్స్: విజేత జీఎన్ఐటీఎస్, రెండో స్థానం కేఎంసీఈ మహిళలు-డబుల్స్: విజేత కేఎంసీఈ, రెండో స్థానం జీఎన్ఐటీఎస్
మిక్స్ డ్ డబుల్స్ విజేత వీఎన్ఆర్ వీజేఐటీ, రెండో స్థానం గీతం.గస్టో – 2025-26ని మరపురాని అనుభవంగా మార్చడంలో సహకరించిన ప్రతి ఒక్కడికీ నిర్వాహకులు కృతఙ్ఞతలు తెలియజేశారు. గస్రో-2027ను మరింత ఉన్నతంగా, సాటిలేని ఉత్సవంగా, క్రీడా నైపుణ్యాలను ప్రదర్శించే సిసలైన వేదికగా నిలపాలని అభిలషిస్తూ, ఈ వేడుకలను ముగించయని తెలిపారు

తంగళ్ళపల్లి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులు…

తంగళ్ళపల్లి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాదులోని ఎర్రగడ్డలోని 71వ .బూతులో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వర్గీయ ఇందిరా గాంధీకి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ఇందిరాగాంధీ ఆమె దేశానికి చేసిన సేవలు గుర్తుచేస్తూ. ఆమె చేసిన భూ సంస్కరణలు. రాజభరణాలు రద్దు. బ్యాంకుల జాతీయం. హరిత విప్లవం. ఇటువంటి ఎన్నో విప్లవత్మక నిర్ణయాలు ఇందిరా గాంధీ.ఇండియా గా పరిపాలన చేసే ప్రజల మన్ననలు పొంది. అంతర్జాతీయ స్థాయిలో అంతరిక్షంలో భారతదేశాన్ని అత్యున్నత స్థాయిలో నిలబెట్టిన ప్రధాని స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ అని. ఈ సందర్భంగా. తెలియజేస్తూ హైదరాబాదులోని ఎర్రగడ్డలోని 71వ . బూతులో. కాంగ్రెస్ పార్టీ పక్షాన నివాళులు అర్పించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ విభాగం అధ్యక్షులు. ఆకునూరి బాలరాజ్. తంగళ్ళపల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జలగం ప్రవీణ్.రాజన్నసిరిసిల్ల జిల్లా. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జి గడ్డం మధుకర్. ఏఎంసి. డైరెక్టర్ ఆరెపల్లి బాలు. పొన్నాల పరశురాములు. నరసయ్య. దాసరిబాలరాజు. గుగ్గిళ్ళ భరత్ గౌడ్. ఎడ్ల తిరుపతి. బాలసాని శ్రీనివాస్. గాదరి కిషన్. మీరాల శ్రీనివాస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 అతివేగం.. యువకుడి ప్రాణం తీసింది…

 అతివేగం.. యువకుడి ప్రాణం తీసింది

 

అతివేగం ఓ యువకుడి ప్రాణాలు బలికొంది. డ్యూటీకి వెళుతున్నానని చెప్పి బయలు దేరిన యువకుడు అరగంటలోనే మృత్యుఒడిలోకి చేరుకున్నాడు. బాలానగర్‌ సీఐ టి.నర్సింహారాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు…

వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

హైదరాబాద్ లోని అక్షయ కన్వెన్షన్ హాల్ లో జరిగిన మాజి మున్సిపల్ చైర్మన్ మంకల్ సుభాస్ మనువారాలి వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ మాజి మార్కెట్ చైర్మన్ రామకృష్ణ రెడ్డి,మాజి ఆత్మ చైర్మన్ లు విజయ్ కుమార్, పెంటా రెడ్డి జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి కోహీర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్ సీనియర్ నాయకులు కలీం,మాజి సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షులు రవికిరణ్,మొగుడంపల్లి జనరల్ సెక్రటరీ గోపాల్ దయా వాజీద్ అస్లామ్ రయిస్ తదితరులు.

సబ్సిడీ ఆటోలతో, సాగని ప్రయాణం…..

సబ్సిడీ ఆటోలతో, సాగని ప్రయాణం…..!

◆:- ఆర్థిక ఇబ్బందుల్లో లబ్ధిదారులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లాలో, నైపుణ్యం కలిగిన అర్హులైన దళితులకు, అప్పటి రాష్ట్ర ప్రభుత్వం, షెడ్యూల్డ్ కులముల సేవ, సహకార అభివృద్ధి సంఘం. ( ఎస్. స్సి. కార్పొరేషన్ ). ద్వారా, బ్యాంకు అధికారుల సహకారంతో, సబ్సిడీ ద్వారా, మహీంద్రా ఆల్ఫా డీలక్స్, బీ, యస్, 6, డీజిల్ ప్యాసింజర్, సెన్సార్లు కలిగిన, ఆటోలను, లబ్ధిదారులకు పంపిణీ చేశారు. సబ్సిడీ ద్వారా ఆటోలను తీసుకున్న కొన్ని నెలలకే, ఈ ఆటోలు చెడిపోవడంతో. ఇట్టి విషయమై ఎన్నో సార్లు, ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీని, ప్రభూత్వ అధికారులు స్పందించలేదన్నారు. ఈ వాహనంలో ఏ చిన్న లోపం తలెత్తిన, వీటిని బాగు చేయుటకు, ఇతర వాహనం సహకారంతో, హైదరాబాద్ వెళ్లవలసిందే నని, ఈ విధంగా గత మూడు సంవత్సరాల నుండి, ఎన్నోసార్లు హైదరాబాద్ వెళ్లి, తమ ఆటోను బాగు చేసుకొని వచ్చినప్పటికీని, మళ్లీ మళ్లీ చెడిపోవడంతో, లబ్ధిదారులు అప్పులపాలై, బ్యాంకులో ఆటో కొరకు తీసుకున్న అప్పును తీర్చలేక, బ్యాంకు అధికారుల, మరియు, మధ్యవర్థుల మాటలకు, మానసికంగా, బాధపడుతున్నామన్నారు. ఈ ఆటోలను, ప్రభూత్వం ద్వారా, ఎస్సీ కార్పొరేషన్ లబ్ధిదారులకు మాత్రమే విక్రయించి, ఇతరులకు విక్రయించకుండా, గత మూడు సంవత్సరాలుగా, ఈ ఆటో విక్రయాలు నిలిపివేయడానికి గల కారణం ఏమిటో, సంబంధిత అధికారులు, పత్రిక ముఖంగా తెలియజేయాలని, ఈ ఆటోలను మాత్రమే, ప్రభుత్వం ద్వారా, ఎస్సీ కార్పొరేషన్ లబ్ధిదారులకు పంపిణీ చేయడానికిగల కారణం ఏమిటో, ఇతర కంపెనీల ఆటోలను ఇవ్వలేమని, సంబంధిత అధికారులు తమకు చెప్పడంతో, గథ్యాంతరం లేక,ఈ ఆటో ను తీసుకున్నామన్నారు. ఈ ఆటోలు తీసుకొని నష్టపోయిన లబ్ధిదారులను, ప్రభూత్వమే ఆదుకోవాలని, లబ్ధిదారులు కోరుచున్నారు,

హఫీజ్ పీర్ షబ్బీర్ అహ్మద్ కుటుంబానికి తెలంగాణ ముఖ్యమంత్రి సంతాపం తెలిపారు..

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-29T131947.636.wav?_=7

 

హఫీజ్ పీర్ షబ్బీర్ అహ్మద్ కుటుంబానికి తెలంగాణ ముఖ్యమంత్రి సంతాపం తెలిపారు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రఖ్యాత మత పండితుడు మరియు జమియత్ ఉలేమా తెలంగాణ మరియు ఆంధ్ర అధ్యక్షుడు హాజీ హఫీజ్ పీర్ షబ్బీర్ అహ్మద్ (అల్లాహ్ ఆయనపై దయ చూపాలి) షాహీన్ నగర్‌లోని ఆయన నివాసానికి వెళ్లి తన తండ్రి మృతికి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా, హఫీజ్ పర్ ఖలీక్ అహ్మద్ సాబిర్ (జమియత్ ఉలేమా తెలంగాణ ప్రధాన కార్యదర్శి) ముఖ్యమంత్రిని హృదయపూర్వకంగా స్వాగతించారు మరియు ఆయన సానుభూతి మరియు సంతాపానికి ధన్యవాదాలు తెలిపారు. సంతాప సమావేశంలో, తెలంగాణ మరియు ఆంధ్రలోని వివిధ జిల్లాల అధ్యక్షులు మరియు జమియత్ యొక్క అనేక మంది అధికారులు కూడా పాల్గొన్నారు. జమియత్ ఉలేమా జిల్లా సంగారెడ్డి తరపున హజ్రత్ మౌలానా ముఫ్తీ అబ్దుల్ సబూర్ ఖాస్మి (జమియత్ ఉలేమా జిల్లా సంగారెడ్డి జనరల్ సెక్రటరీ) మరియు హఫీజ్ అక్బర్ సాహిబ్ (జమియత్ ఉలేమా జిల్లా సంగారెడ్డి ట్రెజరర్) కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా, రాష్ట్రంలోని రాజకీయ మరియు సామాజిక సమస్యలను కూడా బహిరంగంగా చర్చించారు మరియు పరస్పర సహకారం మరియు సమన్వయం ద్వారా ప్రజా సంక్షేమం మరియు స్థిరత్వం కోసం ఉమ్మడి ప్రయత్నాలపై ప్రాధాన్యత ఇవ్వబడింది. సమావేశం ఆహ్లాదకరమైన మరియు గౌరవప్రదమైన వాతావరణంలో జరిగింది, దీనిలో మరణించిన వ్యక్తి యొక్క మతపరమైన మరియు జాతీయ సేవలకు నివాళులు అర్పించారు మరియు అతని లక్ష్యాన్ని కొనసాగించాలనే దృఢ సంకల్పం కూడా వ్యక్తమైంది.

బి ఫార్మసీ పూర్తి చేసినందుకు సన్మానం చేసిన కళాశాల బృందం….

బి ఫార్మసీ పూర్తి చేసినందుకు సన్మానం చేసిన కళాశాల బృందం

వనపర్తి నేటిదాత్రి .

 

 

వనపర్తి పట్టణానికి చెందిన ఎల్ చంద్రశేఖర్ సరిత కూతురు ఎల్ సౌమ్యకు హైదరాబాద్ నారపల్లి లో కళాశాల ప్రిన్సిపల్ బృందం బి ఫార్మసీ పూర్తి చేసినందుకు సన్మామనము చేశారని అదేవిధంగా సర్టిఫికెట్ కూడా అందజేశారని చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు . ఈ మేరకు నల్ల నరసింహారెడ్డి యజమాన్యానికి కళాశాల ప్రిన్సిపల్ కృష్ణ మోహన్ కు అధ్యాపక బృందానికి ఎల్ సౌమ్య ఆమె తల్లిదండ్రులు ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు భవిష్యత్తులో ఉన్నత చదువులు చదివి మంచి ర్యాంకులు సాధించాలని ప్రిన్సిపల్ కృష్ణమోహన్ ఆకాంక్షించారు

రసాయన శాస్త్రంలో ఆర్.శ్రీనివాసరెడ్డికి పీహెచ్ డీ…

రసాయన శాస్త్రంలో ఆర్.శ్రీనివాసరెడ్డికి పీహెచ్ డీ

నేటి ధాత్రి, పఠాన్ చేరు :

 

హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థి ఆర్. శ్రీనివాసరెడ్డి డాక్టరేట్ కు అర్హత సాధించారు. ‘రిలుజోల్, 2-(4-అమినోఫెనిల్) బెంజోథియాజోల్, సీరం అల్బుమిన్, డీఎన్ఏల పరస్పర చర్యపై’పై అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధన జీవసంబంధమైన స్థూల అణువులతో బెంజోథియాజోల్ అనలాగ్ ల పరమాణు పరస్పర చర్యలను అర్థం చేసుకోవడానికి విలువైన సహకారాన్ని అందిస్తోందాని
ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ రసాయన శాస్త్ర విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ బిజయ కేతన్ సాహూ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.డాక్టర్ రెడ్డి అధ్యయనం రిలుజోల్, 2-(4-అమినోఫెనిల్) బెంజోథియాజోల్ ద్వారా డీఎన్ఏ, హ్యూమన్ సీరం అల్బుమిన్ (హెచ్ఎస్ఏ)లో ప్రేరేపించిన బైండింగ్ లక్షణాలు, థర్మోడైనమిక్ పారామితులు, నిర్మాణాత్మక మార్పులను అన్వేషించినట్టు తెలియజేశారు. మాలిక్యులర్ డాకింగ్ సిమ్యులేషన్ ల ద్వారా ప్రయోగాత్మక పరిశీలనలకు మరింత మద్దతు లభించింది. ఈ పరిశోధన ఫలితాలు హేతుబద్ధమైన ఔషధ రూపకల్పన, ఔషధ పంపిణీ వ్యవస్థలు, మెరుగైన జీవసంబంధ కార్యకలాపాలతో కొత్త హైబ్రిడ్ ఉత్పన్నాల అభివృద్ధిలో సంభావ్య అనువర్తనాలను కలిగి ఉన్నాయి.ఈ సిద్ధాంత వ్యాసం పీహెచ్.డీ. పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం హైదరాబాదు అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.రెజా, రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ గౌసియా బేగం, పలు ఇతర విభాగాధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు డాక్టర్ శ్రీనివాసరెడ్డిని అభినందించారు

గీతంలో మాలిక్యులర్ మోడలింగ్ పై కార్యశాల..

గీతంలో మాలిక్యులర్ మోడలింగ్ పై కార్యశాల

ప్రధాన శిక్షకుడిగా అడ్వెంట్ ఇన్ఫర్మేటిక్స్ సీనియర్

అప్లికేషన్ సైంటిస్ట్ డాక్టర్ షంషైర్ సింగ్ సర్దార్

పఠాన్ చేరు, నేటి ధాత్రి :

 

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ ఫార్మసీ, హైదరాబాదులోని పరిశోధనా స్కాలర్లు, బి.ఫార్మసీ చివరి ఏడాది విద్యార్థుల కోసం మాలిక్యులర్ మోడలింగ్, వర్చువల్ స్ర్కీనింగ్ అనే అంశంపై రెండు రోజుల ఆచరణాత్మక వర్క్ షాపును ప్రారంభించింది. పూణేలోని అడ్వెంట్ ఇన్ఫర్మేటిక్స్ సీనియర్ అప్లికేషన్ సైంటిస్ట్ డాక్టర్ షంషైర్ సింగ్ సర్దార్ ఈ కార్యశాలకు రిసోర్స్ పర్సన్ గా వ్యవహరించారు.మాలిక్యులర్ మోడలింగ్, ఔషధ పరిశోధన కోసం సమగ్ర వేదిక అయిన మోల్ సాఫ్ట్ ఐసీఎం గురించి ఆయన లోతైన పరిచయాన్ని అందించారు. మోల్ సాఫ్ట్ పరిణామ క్రమం, దాని ప్రపంచ, జాతీయ వినియోగాదారుల వివరాలు, ఐసీఎం ప్రో ఫంక్షనాలిటీలు, పాకెట్ డిసిప్లే (చిన్న ప్రదర్శన), ఐసీఎం-వీఎల్ఎస్, 3డి లిగాండ్ ఎడిటర్ పరిచయం, అధునాత ఏఐ-ఎంఎల్ ఆధారిత సాధానాలు వంటి కీలక అంశాలను ఆయన వివరించారు.

 

 

స్కోరింగ్ ఫంక్షన్లు, ఆర్టీసీఎన్ఎన్ స్కోర్, ప్రేరిత-ఫిట్ డాకింగ్, ఇతర అత్యాధునిక విధానాలతో సహా ఐసీఎం టెక్నాలజీ గురించి కూడా ఆయన విడమరచి చెప్పారు.త్వరలో నిర్వహించనున్న మోల్ సాఫ్ట్ ఇండియా యూజీఎం 2025లో పాల్గొనమని విద్యార్థులను డాక్టర్ సర్దార్ ఆహ్వానించారు. ఇందులో పోస్టర్ ప్రజేంటేషన్ పోటీ ఉంటుందని, విజేతలకు ఆకర్షణీయమైన నగదు బహుమతులతో పాటు పాల్గొన్న వారందరికీ ప్రశంసా పత్రాలను అందజేస్తామని డాక్టర్ సర్దార్ తెలియజేశారు. ఐసీఎం సాధనాల సాయంతో వారి పరిశోధనలను ప్రదర్శించమని ఆయన పాల్గొనేవారికి ప్రోత్సహించారు.కంప్యూటేషనల్ డ్రగ్ డిస్కవరీలో విద్యార్థుల సామర్థ్యాలను పెంపొందించడం, పరిశ్రమ-ప్రముఖ మాలిక్యులర్ మోడలింగ్ టెక్నాలజీలకు విలువైన సమాచారాన్ని అందించడం లక్ష్యంగా ఈ కార్యశాలను నిర్వహిస్తున్నారు.

అంబేద్కర్ నేషనల్ అవార్డుకు కిరణ్ ఎంపిక…

అంబేద్కర్ నేషనల్ అవార్డుకు కిరణ్ ఎంపిక.

చిట్యాల, నేటిదాత్రి :

 

స్పూర్తి సర్వీసెస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ ఆకుల రమేష్.

చిట్యాల మండల కేంద్రానికి చెందిన అంబేద్కర్ యువజన సంఘం మండల సీనియర్ నాయకులు గురుకుంట్ల కిరణ్ అంబేద్కర్ నేషనల్ అవార్డుకు ఎంపికైనట్లు స్ఫూర్తి సర్వీసెస్ సొసైటీ ఇండియా ఎన్జీవోస్ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డాక్టర్ ఆకుల రమేష్ తెలిపారు. చిట్యాల మండల అంబేద్కర్ యువజన సంఘంలో గత 15 సంవత్సరాలుగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిస్తూ , భావజాలాన్ని ముందుకు తీసుకెళ్ళుచూ మరియు మహనీయుల కార్యక్రమాలను నిర్వహిస్తూ మృతుల కుటుంబాలను , పరామర్శించి సహాయ సహకారాలు అందించాడని, దళితులపై, మహిళలపై జరుగుతున్న సంఘటనలను ఖండిస్తూ వారికి అండగా నిలబడ్డారని , సామాజిక సేవ కార్యక్రమాలు అనేకం చేశాడని అన్నారు . అతను చేస్తున్న సేవలను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేయడం జరిగిందని డాక్టర్ రమేష్ చెప్పారు. అంబేద్కర్ నేషనల్ అవార్డుకు ఎంపికైన గురుకుంట్ల కిరణ్ కు నవంబర్ 5న సిటీ కల్చరల్ సెంటర్ ఆడిటోరియం ఆర్టిసి క్రాస్ రోడ్ ముషీరాబాద్ వివేక నగర్ కవాడిగూడ హైదరాబాద్* లో ఈ అవార్డు అందించడం జరుగుతుందని తెలిపారు. కిరణ్ మట్లాడుతూ నాకు ఈ అవార్డు ఎంపిక చేసిన డాక్టర్ ఆకుల రమేష్ గారికి సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.

గీతంలో ఘనంగా సినీ వారం….

గీతంలో ఘనంగా సినీ వారం
విద్యార్థులను ఉత్సాహపరచిన దర్శకులు దేవా కట్టా, ప్రవీణ్ కాండ్రేగుల

నేటి ధాత్రి, పఠాన్ చేరు :

 

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులో ‘సినీ వారం-2025: మీడియా, చలన చిత్రోత్సవాలను’ ఈనెల 23-24 తేదీలలో ఘనంగా నిర్వహించారు. గీతం స్టూడెంట్ లైఫ్, ఎఫ్ఏబీవో సహకారంతో నిర్వహించిన ఈ వేడుకలలో పలుపోటీలు, కార్యశాలలు, ముఖాముఖి కార్యక్రమాలు సృజనాత్మకత, సినిమాటిక్ వ్యక్తీకరణ సమాహారంగా సాగాయి. ఈ ఉత్సవాలలో భాగంగా, చిన్న నిడివి గల చలన చిత్రాలు (షార్ట్ ఫిల్మ్), ఎడిటింగ్, ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ పోటీలను నిర్వహించగా, దేశవ్యాప్తంగా వర్ధమాన చిత్ర నిర్మాతలు, మీడియా విద్యార్థులతో పాటు అమెరికాలోని డల్లాస్, దుబాయ్ నుంచి కూడా ఎంట్రీలు రావడం విశేషం.
తొలిరోజు ప్రముఖ ఫోటోగ్రాఫర్ మహేష్ పమిడిమర్తి ట్రావెల్ ఫోటోగ్రఫీపై ఉపన్యసించగా, ప్రముఖ దర్శకుడు దేవా కట్టా సంభాషణలు రాయడంపై (డైలాగ్ రైటింగ్) కార్యశాలను నిర్వహించారు. చివరగా, స్ఫూర్తిదాయకమైన చలన చిత్ర ప్రదర్శనతో ముగిసిన తొలిరోజు కార్యక్రమాలలో పలువురు విద్యార్థులు ఉత్సాహభరితంగా పాల్గొన్నారు.చివరి రోజు, దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల నేతృత్వంలో చిత్ర నిర్మాణం (ఫిల్మ్ మేకింగ్), స్ర్కీన్ రైటింగ్ పై వర్క్ షాపులను నిర్వహించారు. ఆ తరువాత ఎంపిక చేసిన షార్ట్ ఫిల్ములను ప్రదర్శించారు. ఇక ఈ వేడుకలకే తలమానికంగా నిలిచిన దర్శకుడు సందీప్ రాజ్, గీతం పూర్వ విద్యార్థి, ప్రముఖ నటుడు హర్ష చెముడుతో ఆకర్షణీయమైన ప్రశ్నోత్తరాల కార్యక్రమం విద్యార్థుల ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. చిత్ర పరిశ్రమలో తమ ప్రయాణం, విద్యార్థి జీవితంలోని మధుర జ్జాపకాలను వారు విద్యార్థులతో పంచుకున్నారు. ఈ రెండు రోజుల ఉత్సవాలలో పాల్గొన్న ఔత్సాహిక విద్యార్థులు, చిత్ర నిర్మాణం, సంభాషణ రచన, స్ర్కీన్ రైటింగ్ గురించి ప్రాథమిక అవగాహనను పొందారు. సినీ నిపుణులతో సంభాషించేటప్పుడు విద్యార్థులు సినిమా పట్ల తమ అభిరుచిని తెలుసుకోవడానికి ఈ కార్యక్రమం ఓ సృజనాత్మక వేదికగా తోడ్పడింది. తమకు అభ్యాస అనుభవంతో పాటు సృజనాత్మక దృక్పథాన్ని పెంపొందించేలా అర్థవంతమైన,స్ఫూర్తిదాయకమైన సినీవారం నిర్వహించిన జీ-స్టూడియో బృందానికి విద్యార్థులు కృతజ్జతలు తెలియజేశారు.ఎంపిక చేసిన చిత్రాల ప్రదర్శనకు దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల, గీతంలోని మీడియా స్టడీస్ విభాగాధిపతి సంజీవ్ కుమార్,అధ్యాపకుడు సుబ్బు పేటేటి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. మొత్తంగా సినీ వారం విజయవంతం కావడంపై జీ-స్టూడియో బృందం హర్షాతిరేకాలను వ్యక్తపరిచింది.

అంబేద్కర్ నేషనల్ అవార్డుకు కోంరయ్య ఎంపిక

అంబేద్కర్ నేషనల్ అవార్డుకు కోంరయ్య ఎంపిక

స్పూర్తి సర్వీసెస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ ఆకుల రమేష్.

భూపాలపల్లి నేటిధాత్రి

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండల కేంద్రానికి చెందిన అంబేద్కర్ యువజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మారపెల్లి కొంరయ్య అంబేద్కర్ నేషనల్ అవార్డు కు ఎంపికైనట్లు స్ఫూర్తి సర్వీసెస్ సొసైటీ ఇండియా ఎన్జీవోస్ చైర్మన్ డాక్టర్ ఆకుల రమేష్ తెలిపారు. టేకుమట్ల మండల అంబేద్కర్ యువజన సంఘం లో మండల అధ్యక్షులుగా ఇప్పుడు జిల్లా సహాయ కార్యదర్శి గా మారపెల్లి కొంరయ్య గత 25 సంవత్సరాలుగా భారత రాజ్యాంగ రచయిత ప్రపంచ మేధావి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ , భావజాలాన్ని ముందుకు తీసుకెళ్ళుచూ మహనీయుల కార్యక్రమాలను నిర్వహిస్తూ దళితులపై జరుగుతున్న దాడులు దౌర్జన్యాలు అవమానాలను మహిళలపై జరిగే హత్యలు, అత్యాచారాలపై ఖండిస్తూ వారికి అండగా నిలబడ్డారని అన్నారు వారు చేస్తున్న సేవలను గుర్తించి ఈ అవార్డు అందించడం జరిగిందని డాక్టర్ రమేష్ చెప్పారు. అంబేద్కర్ నేషనల్ అవార్డుకు ఎంపికైన మారపెళ్లి కొంరయ్య కు నవంబర్ 5న సిటీ కల్చరల్ సెంటర్ ఆడిటోరియం ఆర్టిసి క్రాస్ రోడ్ ముషీరాబాద్ హైదరాబాద్ లో ఈ అవార్డు అందించడం జరుగుతుందని తెలిపారు. కొంరయ్య మట్లాడుతూ నాకు ఈ అవార్డు ఎంపిక చేసిన వారికి సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.

హలో బీసీ చలో ఇందిరా పార్క్ మహాధర్నాకు కదిలిన డిఎస్పి నాయకులు….

హలో బీసీ చలో ఇందిరా పార్క్ మహాధర్నాకు కదిలిన డిఎస్పి నాయకులు.

చిట్యాల, నేటిదాత్రి :

 

 

హాలో బీసీ ఛలో ఇందిరా పార్క్ (హైదరాబాద్ )
జస్టిస్ ఈశ్వరయ్య, చిరంజీవులు రిటైల్డ్ ఐ ఏ ఎస్ డా. విశారదన్ మహారాజ్ పిలుపు మేరకు 42%బీసీ రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో నేడు భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల బీసీ, ఎస్సీ, ఎస్టీ– జేఏసీ ఆధ్వర్యంలో 42% బీసీ రిజర్వేషన్ల బిల్లును 9 వ షెడ్యూల్ లో చేర్చాలి. అనే డిమాండ్ తో.* హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జరుగుతున్న మహాధర్నాన్ని విజయవంతం చేయడం కోసం ధర్మ సమాజ్ పార్టీ నాయకులు చిట్యాల మండలం నుండి బయలుదేరడం జరిగింది
ఈ కార్యక్రమంలో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ జిల్లా నాయకులు శీలపాక నాగరాజ్, మండల నాయకులు పుల్ల అశోక్, రత్న రమేష్, చిలుముల కృష్ణ, పర్లపల్లి వంశీ మరియు వంగ రాంబాబు గౌడ్ పాల్గొన్నారు.

ఎస్సీ విభాగం నేషనల్ కోఆర్డినేటర్‌గా ప్రీతీమ్‌కి శుభాకాంక్షలు…

అల్ ఇండియా కాంగ్రెస్ ఎస్సీ విభాగం నేషనల్ కోఆర్డినేటర్‌గా నగరాగారి ప్రీతీమ్ నియామకంపై శుభాకాంక్షలు తెలిపిన నరుకుడు వెంకటయ్య

హైదరాబాద్‌లో ప్రీతీమ్ గారిని కలిసిన ఎస్సీ విభాగం రాష్ట్ర నాయకులు

పుష్పగుచ్ఛం అందించి శాలువా కప్పి సన్మానం
వర్దన్నపేట (నేటిధాత్రి):

 

తెలంగాణ రాష్ట్ర ఎస్సి కార్పొరేషన్ చైర్మన్ & కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు నగరాగారి ప్రీతీమ్ గారు ఇటీవల *అల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఎస్సీ విభాగం నేషనల్ కో ఆర్డినేటర్ గా నియమితులైన శుభసందర్భంగా ఈ రోజు హైదరాబాద్ లోని వారి స్వ గృహములో కాంగ్రెస్ పార్టీ ఎస్సి విభాగం రాష్ట్ర నాయకులు & వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నరుకుడు వెంకటయ్య గారు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చమందించి శాలువాతో సన్మానించి హృదయపూర్వక హార్థిక శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమములో
వరంగల్ ఉమ్మడి జిల్లాల ఎస్సీ విభాగం ఇంచార్జి దబ్బెట రమేష్ , ఎస్సీ విభాగం రాష్ట్ర కార్యదర్శి ఆర్షం అశోక్ ,ఎస్సీ విభాగం జిల్లా నాయకులు ఆరూరి సాంబయ్య లు పాల్గొనడం జరిగింది.

నేటి బీసీ ధర్నాను విజయవంతం చేయాలి…

నేటి బీసీ ధర్నాను విజయవంతం చేయాలి

బీసీ ఆజాద్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు క్యాతం మహేందర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

బీసీల రిజర్వేషన్ కోసం 24నా జరగనున్న ఛలో ఇందిరా పార్క్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీసీ ఆజాద్ ఫెడరేషన్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు క్యాతం మహేందర్ ప్రైవేట్ వేదిక లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. అక్టోబర్ 24 వ తేదీన బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధించాలని జస్టిస్ ఈశ్వరయ్య, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవిలు, విశారదన్ మహరాజ్ తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్యక్రమంలో అధిక సంఖ్యలో బీసీ సంఘాలు, కుల సంఘాలు బీసీ కులస్తులు గ్రామస్థాయి నుంచి మండల జిల్లా స్థాయి వరకు ప్రతి ఒక్క బీసీ బిడ్డ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. గత 75 సంవత్సరాలుగా బీసీ ప్రజానీకం విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో ఎందుకు నష్టపోతున్నాం ఎలా నష్టపోతున్నాం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి తెలుసుకొని వాటిని సాధించే దిశగా ముందుకు సాగాలని అన్నారు. ఇప్పటివరకు నష్టపోయింది చాలు ఇకనుంచి అయిన వారి పిల్లల భవిష్యత్తు కోసం నిస్వార్ధంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ ఆజాది ఫెడరేషన్ జిల్లా నాయకులు కృష్ణ, రమేష్, బిక్షపతి, సలీం ,లక్ష్మణ్ కుమార్, ఉమర్ తదితరులు పాల్గొన్నారు.

ఈనెల 24న చలో ఇందిరా పార్క్ ధర్నా…

ఈనెల 24న చలో ఇందిరా పార్క్ ధర్నా

భూపాలపల్లి నేటిధాత్రి

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండల కేంద్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో అక్టోబర్ 24న హైదరాబాదులో జరగబోయే ధర్నా కార్యక్రమం గురించి బీసీ జేఏసీ కన్వీనర్ నేరెళ్ల రామకృష్ణ గౌడ్ ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు సాధించుటకు సిరికొండ మధుసూదన చారి జస్టిస్ ఈశ్వరయ్య రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవి బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ విశారదన్ మహారాజ్ బాలరాజు గౌడ్ అన్ని బీసీ సంఘాల మద్దతుతో ఇందిరా పార్కు వద్ద హైదరాబాదులో నిర్వహిస్తున్న భారీ ధర్నా కార్యక్రమానికి బీసీ లందరూ ఐక్యంగా పాల్గొని ధర్నాని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ ధర్నా కార్యక్రమంలో భవిష్యత్తు ప్రణాళిక మహా పోరాటాన్ని ప్రకటించనున్నందున బిసి, ఎస్సీ ఎస్టీ లందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో టేకుమట్ల ధర్మసమాజ్ పార్టీ మండల అధ్యక్షుడు ఆకినపల్లి శ్యామ్ , వర్తక సంఘం అధ్యక్షులు బొడ్డు సదానందం, ముదిరాజ్ మండల నాయకులు ఎలవేణి రాజేందర్ ,పద్మశాలి మండల అధ్యక్షుడు మాచర్ల మహేందర్, నాయిని బ్రహ్మ మండలం అధ్యక్షుడు మేడిపల్లి నరేష్ ,విశ్వకర్మ నాయకులు ఆపోజి దేవేందర్ నాయకులు,పద్మశాలి మండల నాయకులు బండిరాజేంద్రప్రసాద్, మైనారిటీ మండల నాయకులు ఎండి కాజా, యాదవ సంఘం నాయకులు రాజయ్య,రజక సంఘం ఉపాధ్యక్షుడు నిమ్మల స్వామి, మండల నాయకులు వారాల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

సయ్యద్ అసద్ ఆధ్వర్యంలో, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ జన్మదిన వేడుకలు….

సయ్యద్ అసద్ ఆధ్వర్యంలో, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ జన్మదిన వేడుకలు

కాశీబుగ్గ మధర్ థెరిస్సా చారిటబుల్ ట్రస్ట్ లో అన్నదానం

నేటిధాత్రి, కాశీబుగ్గ.

హైదరాబాద్ హైడ్రా కమిషనర్ ఐపీఎస్ అధికారి ఏవి రంగనాథ్ జన్మదిన వేడుకలు వరంగల్‌లో ఘనంగా నిర్వహించారు. కాశీబుగ్గకు చెందిన దివ్యాంగుడు సయ్యద్ అసద్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు 19వ డివిజన్ లోని మదర్ థెరిస్సా చారిటబుల్ ట్రస్ట్‌లో జరిగాయి. ఈ సందర్భంగా మానసిక వికలాంగుల కోసం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాల్గొన్న వారు కమిషనర్ ఏవి రంగనాథ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సయ్యద్ అసద్ మాట్లాడుతూ, రంగనాథ్ సార్ వరంగల్ పోలీస్ కమిషనర్ గా ఉన్నప్పుడు తనకు న్యాయం చేశారని తెలిపాడు. హైడ్రా సంస్థ కార్యకలాపాలు ఎంతో స్ఫూర్తిదాయకమని, ఆ సంస్థ వరంగల్ ట్రై సిటీలో కూడా విస్తరించాలని కోరారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అదే విధంగా వరంగల్ జిల్లాలో ప్రభుత్వ భూములు, భూకబ్జాలు విస్తృతంగా జరుగుతున్నాయని, వాటిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ నిర్వాహకులు, సేవా సంస్థ ప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు.

రైతు దుర్గయ్య మరణం… తోనిగండ్లలో విషాద ఛాయలు..

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-22T140655.340.wav?_=9

 

రైతు దుర్గయ్య మరణం… తోనిగండ్లలో విషాద ఛాయలు..

రామాయంపేట, అక్టోబర్ 22 నేటి ధాత్రి (మెదక్)

 

రామాయంపేట మండలం తోనిగండ్ల గ్రామానికి చెందిన రైతు పేగుడ దుర్గయ్య (68) మృతి చెందడంతో గ్రామం మొత్తానికి విషాద ఛాయలు అలుముకున్నాయి.
సుమారు 25 రోజుల క్రితం పొలం పనులు ముగించుకుని ఇంటికి వస్తుండగా ఒక్కసారిగా కళ్లుచిరుగి పొలం వద్దనే కుప్పకూలిన దుర్గయ్యను చుట్టుపక్కల రైతులు గమనించారు. వెంటనే స్పందించిన వారు 108 అంబులెన్స్‌కి సమాచారం ఇవ్వగా, అతన్ని రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
వైద్యులు పరీక్షించి ఆయనకు రక్తపోటు అత్యధికంగా పెరగడంతో కోమాలోకి వెళ్లినట్లు నిర్ధారించారు. అక్కడి నుండి హైదరాబాద్‌కు తరలించిన కుటుంబ సభ్యులు, మేడ్చల్ సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి మెరుగైన చికిత్స అందించారు. అయితే 26 రోజుల పాటు ప్రాణాలతో పోరాడిన దుర్గయ్య చివరకు బుధవారం తెల్లవారుజామున మృతి చెందారు.
రైతు దుర్గయ్య భార్య లక్ష్మి కూడా సుమారు ఏడాది క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. ముగ్గురు కూతుళ్లను విడిచి వెళ్లిపోయిన దుర్గయ్య మృతితో గ్రామంలో తీవ్ర విషాద వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యుల విలాపాలతో తోనిగండ్ల గ్రామం మునిగిపోయింది.
గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు దుర్గయ్య కుటుంబానికి సానుభూతి తెలిపారు. “ఆయన ఎంతో కష్టపడి వ్యవసాయం చేసేవారు. కుటుంబం కోసం జీవితాంతం శ్రమించారు. ఆయన లేని లోటు భర్తీ చేయలేం” అని గ్రామస్థులు కన్నీటి కణాలతో గుర్తుచేశారు.

మా “అబ్బాయి పెళ్లికి రండి”..

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-21T190916.442.wav?_=10

 

 

మా “అబ్బాయి పెళ్లికి రండి”.

“నిహాంత్” పెళ్లి వేడుకకు హజరై వదూవరులను దీవించండి.

“సిఎం రేవంత్ రెడ్డి”ని కలిసి శుభలేఖ అందజేసిన “సుభాష్ రెడ్డి”.

వివాహానికి తప్పకుండా హజరై వదూవరులను ఆశీర్వదించాలని విజ్ఞప్తి.

తన కుమారుడు “నిహాంత్” పెళ్ళి శుభలేఖ “సిఎం”కు అందజేసిన “సుబాష్ రెడ్డి”.

 

“నేటిధాత్రి”,హైదరాబాద్.
మా అబ్బాయి నిహాంత్ పెళ్లికి రండి. వచ్చి మీ అమూల్యమైన ఆశీర్వనాలు అందించి దీవించండి. ప్రముఖ పారిశ్రామిక, రియల్ వ్యాపారి, మానవతా వాది, సామాజిక వేత్త తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంగళవారం కలిశారు. నవంబర్ 7 న తేదీన సుభాష్ రెడ్డి కుమారుడు నిహంత్ పెళ్లి వేడుక జరగనున్నది.

 

CM Revanth invited to Nihant’s wedding

తన కుమారుడి పెళ్ళికి హజరై నూతన వదూవరులను ఆశీర్వదించాలని కోరుతూ పెళ్ళి శుభలేఖను సిఎం. రేవంత్ రెడ్డికి అందించి సుబాష్ రెడ్డి ఆహ్వానం పలికారు.

బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో న్యాల్ కల్ బంద్….

బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో న్యాల్ కల్ బంద్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

స్థానిక న్యాల్ కల్ మండల కేంద్రం లోని బస్టాండ్ ముందు బీసీ సంక్షేమ సంఘం న్యాల్ కల్ మండల అధ్యక్షులు భోజగొండ శివరాజ్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది విద్య సంస్థలు దుకాణాలు ఇతర వ్యాపారాలు స్వచ్చందంగా బంద్ పాటించారు ఈ సందర్బంగా బీసీ సంఘం నాయకులు మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన 42 % శాతం బీసీ రిజర్వేషన్ హామీని నిలబెట్టుకోవాలని, ఇచ్చిన హామీని అమలు చేసి వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ అమలు చేస్తానని చెప్పి రాష్ట్ర ప్రజానీకానికి మోసపూరిత మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందన్నారు. ఇచ్చిన హామీని అమలు చేయక పోవడం కారణంగానే బీసీల “బంద్” కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. బంద్ లో భాగంగా శాంతియుతంగా చేపట్టమని తెలిపారు ఈ రాష్ట్ర ప్రభుత్వనికి చిత్త శుద్ధి ఉంటే మీరు ఇచ్చిన బీసీ లకు కామారెడ్డి డిక్లరేషన్ 42% ఇస్తాను అన్న మాయమాటలు చెప్పి ప్రభుత్వన్ని ఏర్పాటు చేసుకొని ఈ రోజు బీసీలకు ముంచే ప్రయత్నం చేస్తున్నారు అని వారు అన్నారు ఈ కార్యక్రమం లో మాజీ మల్గి సర్పంచ్ బీసీ సంఘం విద్యార్థి విభాగం ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ అధ్యక్షులు జట్గొండ మారుతీ మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ శివరాజ్ మిర్జాపూర్ మాజీ సర్పంచ్ బీరప్ప చల్కి అశోక్ బీజేపీ మాజీ మండలం అధ్యక్షులు ఓంకార్ యాదవ్ బీజేపీ మండలం అధ్యక్షులు మల్లేష్ బీజేవైఎం మండలం అధ్యక్షులు విష్ణు పాటిల్ మండలం ఉపాధ్యక్షులు మధుసూదన్ రెడ్డి సతీష్ కులకర్ణి మైనారిటీ సభ్యులు అసిఫ్ నర్సప్ప లావేష్ పాటిల్ రాజు యాదవ్ పాండు తదితరులు ఉన్నారు,

పుత్తడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు….

పుత్తడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు

 

తాజాగా మరోసారి బంగారం, వెండి ధరలు మరోసారి పెరిగాయి. శుక్రవారం ఒక్క రోజులోనే తులం బంగారం రూ.3,770 పెరిగింది.అంతర్జాతీయంగా కీలక పరిణామాలు, దీపావళి పండుగ దృష్ట్యా దేశంలో బంగారం ధరలు ఆకాశాన్నంటున్నాయి. తాజాగా మరోసారి బంగారం, వెండి ధరలు పెరిగాయి. శుక్రవారం ఒక్క రోజులోనే తులం బంగారం రూ.3,770 పెరిగింది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,35,180 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,690గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1,85,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు అమలులో ఉంటాయి.

హీరోయిన్ల ఓటర్ కార్డులు ఫేక్.. తేల్చిన ఈసీ, కేసు నమోదు..

హీరోయిన్ల ఓటర్ కార్డులు ఫేక్.. తేల్చిన ఈసీ, కేసు నమోదు

టాలీవుడ్ హీరోయిన్లు తమన్నా, సమంత, రకుల్ ప్రీత్‌సింగ్ పేరుతో ఓటర్ల జాబితా సోషల్ మీడియాలో హల్చల్ అయింది. ఓటర్ల జాబితా సర్కులేషన్‌పై సిరియస్ అయిన ఎన్నికల అధికారులు.. తాజాగా ఆ ఓటరు జాబితా ఫేక్ అని తేల్చారు.

 హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రముఖ హీరోయిన్లకు ఓటు ఉందంటూ ఓటర్ కార్డులు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. టాలీవుడ్ హీరోయిన్లు తమన్నా, సమంత, రకుల్ ప్రీత్‌సింగ్ పేరుతో ఓటర్ల జాబితా సోషల్ మీడియాలో హల్చల్ అయింది. ఓటర్ల జాబితా సర్కులేషన్‌పై సిరియస్ అయిన ఎన్నికల అధికారులు.. తాజాగా ఆ ఓటరు జాబితా ఫేక్ అని తేల్చారు. ఈ మేరకు అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ సయ్యద్ యాహియా కమల్ మధుర నగర్ పోలీసులకు పిర్యాదు చేశారు. ఎన్నికల అధికారి పిర్యాదు మేరకు 336(4), 353(1)(C) BNS సెక్షన్ల కింద పోలీసులు ఎఫ్ఐఅర్ నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
గత రెండు రోజులుగా జూబ్లీహిల్స్‌లో ప్రముఖ హీరోయిన్లకు ఓటు ఉందంటూ ఫేక్ ఓటర్ కార్డులు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. టాలీవుడ్ హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, సమంత, తమన్నాల ఫోటోలతో ఫేక్ ఓటర్ ఐడీలు క్రియేట్ చేసి కేటుగాళ్లు ప్రచారం చేశారు. వేరే ఓటర్ల ఎపిక్ నంబర్ తో హీరోయిన్ల ఫోటోలు పెట్టీ ఓటర్ ఐడీ కార్డులు తయారు చేశారు. ఈ ఓటర్ ఐడీల ప్రచారంపై హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడ వీటిని ఫ్యాబ్రికేట్ చేశారు? ఎవరు ప్రచారం చేశారు? అన్న అంశాలపై ఎన్నికల సంఘం విచారణ చేపట్టింది. సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

టీఆర్పీ పార్టీ లో ప్రజా సేన పార్టీ విలనం.

టీఆర్పీ పార్టీ లో ప్రజా సేన పార్టీ విలనం.

◆:- కార్యక్రమంలో పాల్గొన్న టీఆర్పీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జ్యోతి పండాల్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

టీఆర్పీ పార్టీ లో ప్రజా సేన పార్టీ విలీన కార్యక్రమంలో పాల్గొన్న టీఆర్పీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జ్యోతి పండాల్ హైదరాబాద్ లో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ప్రజా సేన పార్టీ అధ్యక్షులు ఆవుల హన్మన్లు టీఆర్పీ పార్టీ లో విలీనం చేయడం జరిగింది.ఈ సందర్భంగా, ప్రజా సేన పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున టీఆర్పీ పార్టీ లో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీఆర్పీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజా సేన పార్టీ నాయకులు, మహిళలు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

అబ్దుల్ కలాం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత అబ్దుల్ అజీజ్..

అబ్దుల్ కలాం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత అబ్దుల్ అజీజ్..

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

మాజీ ఉపరాష్ట్రపతి, భారత దేశ సైన్స్ పితామహుడు స్వర్గీయ అబ్దుల్ కలాం 94వ జయంతి సందర్భంగా హైదరాబాదులోని రవీంద్ర భారతి లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కార్యక్రమం నిర్వహించారు. అబ్దుల్ కలాం రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు రామకృష్ణాపూర్ పట్టణ తవక్కల్ విద్యాసంస్థల అధినేత అబ్దుల్ అజీజ్ ఎంపికైన నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మాజీ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. రామకృష్ణాపూర్ పట్టణంలో గత 25 సంవత్సరాల నుండి విద్యారంగంలో చేసిన నిస్వార్ధ సేవలకు గాను అబ్దుల్ కలాం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం సంతోషంగా ఉందని అవార్డు గ్రహీత అబ్దుల్ అజీజ్ తెలిపారు. అబ్దుల్ అజీజ్ కు కలాం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడంతో పట్టణంలోని ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు.

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం…

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం

జహీరాబాద్ నేటి ధాత్రి:

హైదరాబాద్ తెలంగాణ భవన్ లో శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు రాబోయే జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు సంబంధించి బిఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు
ఈ సమావేశంలో, నాయకులు ఎన్నికల వ్యూహాలు, అట్టడుగు స్థాయిలో సంస్థను బలోపేతం చేయడం మరియు జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక కోసం పార్టీ కేడర్‌ను సమీకరించడం గురించి చర్చించారు.ఎమ్మెల్యే గారితో పాటుగా జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మాజి మున్సిపల్ చైర్మన్ తంజిం, మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్,మొహియుద్దీన్,మాజి హజ్ కమిటీ మెంబర్ యూసఫ్ ,మాజి కేతకీ సంగమేశ్వర ఆలయ చైర్మన్ నరసింహ గౌడ్ యువ నాయకులు మిథున్ రాజ్, ముర్తుజా తదితరులు పాల్గొన్నారు.

ఎంపీ వద్దిరాజు ఎమ్మెల్సీ పోచంపల్లితో కలిసి కార్యకర్తలకు దిశానిర్దేశం….

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-12T124639.405.wav?_=11

 

ఎంపీ వద్దిరాజు ఎమ్మెల్సీ పోచంపల్లితో కలిసి కార్యకర్తలకు దిశానిర్దేశం

 

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్,రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తదితర ప్రముఖులతో కలిసి ముఖ్య కార్యకర్తలతో సమావేశమై వారికి దిశానిర్దేశం చేశారు.

ఈ సమావేశానికి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆశీస్ కుమార్ యాదవ్,మంగళారపు లక్ష్మణ్,పుస్తె శ్రీకాంత్,వాసాల వెంకటేష్,పర్వతం సతీష్ తదితర ప్రముఖులు హాజరయ్యారు.

 

ఉమాకాంత్ పాటిల్‌ను పరామర్శించిన వై. నరోత్తం

ఉమాకాంత్ పాటిల్ ను పరామర్శించిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం

జహీరాబాద్ నేటి ధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

కొద్దీ రోజుల క్రితం ప్రమాద వశాత్తు కాలుకు గాయమై ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంటి వద్ద విశ్రాంతి తీసుకొంటున్న మాజీ సీడీసీ చెర్మన్ ఉమాకాంత్ పాటిల్ ను ఈ రోజు హైదరాబాద్ లోని వారి నివాసంలో కలిసి పరామర్శించిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం, పరామర్శించిన వారిలో యం.శ్రీనివాస్, యూ. మాణేన్న,టి.రాములు,టి.విఠల్,యం.శివన్న,యం.సంగ్రామ్,బి.అశోక్,కె.శ్రీశైలం,తదితరులు ఉన్నారు

హోప్ పౌండేషన్ ఆద్వర్యంలో.. 151వ వారం అన్నదాన కార్యక్రమం….

హోప్ పౌండేషన్ ఆద్వర్యంలో.. 151వ వారం అన్నదాన కార్యక్రమం….

శేరిలింగంపల్లి, నేటి ధాత్రి :-

హోప్ పౌండేషన్ చైర్మన్ కొండ విజయ్కుమార్ ఆద్వర్యంలో హుడాకాలనీలోని హోప్పాండేషన్ కార్యాలయం వద్ద ప్రతి శనివారం అన్నప్రసాదం పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. హోప్ పౌండేషన్ ఆద్వర్యంలో ప్రతి శనివారం నిర్వహించే అన్న సమారాధన కార్యక్రమంలో భాగంగా ఈ శనివారంతో 151 వారానికి చేరుకుంది.

 

ఈ సంధర్భంగా సుమారు 2500 మంది పేదప్రజలు పాల్గొని అన్నసమారాధన గావించారు. ప్రతి శనివారం ఇక్కడికి వచ్చి కడుపునిండ భోజనం చేస్తున్నామని పలువురు పేద ప్రజలు తెలిపారు. రోజంతా కష్టపడితేగాని పూటగడవదు, కాని ప్రతి వారం ఇక్కడ మాత్రం ఉచితంగా భోజనం లభిస్తుందని వారు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హోప్ ఎ ండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఐఏఎస్ కి పరామర్శ…

వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఐఏఎస్ కి పరామర్శ

#కలెక్టర్ ను పరామర్శించిన మహాజన జర్నలిస్టు ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా రమేష్ బాబు

హన్మకొండ, నేటిధాత్రి:

 

కొన్ని రోజుల కిందట అనారోగ్య కారణంగా వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా దేవి ఐఏఎస్ అత్తయ్య విజయలక్ష్మి చనిపోవడం జరిగింది. విషయం తెలుసుకున్న మహాజన జర్నలిస్ట్ ఫోరం ఎం జె ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు టీ 9 న్యూస్ ఛానల్ సీఈఓ జిల్లా రమేష్ బాబు హైదరాబాద్ లో వారి ఇంటికి వెళ్లి కలెక్టర్ ని మరియు వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. జిల్లా రమేష్ బాబు తో పాటు ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి నాయకుడు జిల్లా రాకేష్ ఉన్నారు.

రాష్ట్ర జట్టుకు ఎంపికైన గురుకుల విద్యార్థి…

రాష్ట్ర జట్టుకు ఎంపికైన గురుకుల విద్యార్థి

జైపూర్,నేటి ధాత్రి:

 

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థి ఇటీవల హైదరాబాదులో జరిగిన రాష్ట్రస్థాయి బాలబాలికల 17వ మినీ హ్యాండ్ బాల్ పోటీల్లో పాల్గొని అత్యంత ప్రతిభ కనబరిచిన క్రీడాకారుడు కావేరి పార్ధు జాతీయస్థాయికి అర్హత సాధించినట్లు,వ్యాయామ ఉపాధ్యాయులు గాంధార్ల సంతోష్,పిడి.రత్నం శ్రీనివాస్,పి.ఇ.టి,తెలిపారు.సెప్టెంబర్ 26 నుండి 29 వరకు హైదరాబాదులోని నిజాం కాలేజీలో జరిగే,జాతీయ స్థాయి 17వ మినీ హ్యాండ్ బాల్ పోటీల్లో రాష్ట్ర జట్టుకు ప్రాతినిథ్యం వహించనున్నట్లు,
ప్రిన్సిపల్ కోల నాగేశ్వరరావు తెలిపారు.వీరిని పాఠశాల సీనియర్ వైస్ ప్రిన్సిపల్ స్రవంతి,జూనియర్ వైస్ ప్రిన్సిపల్ మహిపాల్, హౌస్ మాస్టర్ స్వర్ణలత,ఉపాధ్యాయ బృందం అభినందించారు.

దారుస్సలాంలో మిలాద్ ఉన్ నబీ కార్యక్రమం.

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-16T155047.403-1.wav?_=12

 

 

 

దారుస్సలాంలో మిలాద్ ఉన్ నబీ కార్యక్రమం పాల్గొన్న జహీరాబాద్ అధ్యక్షులు అథర్ అహ్మద్

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఏఐఎంఐఎం ప్రధాన కార్యాలయం దారుస్సలాం లో సమావేశంలో, ఏఐఎంఐఎం జాతీయ అధ్యక్షుడు బారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీ, ఏఐఎంఐఎం జహీరాబాద్ అధ్యక్షుడు మహ్మద్ అథర్ అహ్మద్ కు మాట్లాడే అవకాశం ఇచ్చారు. తన ప్రసంగంలో, మజ్లిస్ జహీరాబాద్ అధ్యక్షుడు గతంలో మజ్లిస్ ప్రాతినిధ్యం వహించిన సమయంలో చేసిన పనులను సమీక్షించారు మరియు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేయాలని అసదుద్దీన్ ఒవైసీ ను అభ్యర్థించారు తన అభిప్రాయాలను వ్యక్తీకరించడానికి అవకాశం ఇచ్చినందుకు రాష్ట్ర జాతీయ అధ్యక్షుడు బారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీ కు ధన్యవాదాలు తెలిపారు.

దారుస్సలాంలో అథర్ అహ్మద్ ప్రసంగం…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-15T125516.956.wav?_=13

 

దారుస్సలాంలో మిలాద్ ఉన్ నబీ కార్యక్రమం పాల్గొన్న జహీరాబాద్ అధ్యక్షులు అథర్ అహ్మద్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఏఐఎంఐఎం ప్రధాన కార్యాలయం దారుస్సలాం లో సమావేశంలో, ఏఐఎంఐఎం జాతీయ అధ్యక్షుడు బారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీ, ఏఐఎంఐఎం జహీరాబాద్ అధ్యక్షుడు మహ్మద్ అథర్ అహ్మద్ కు మాట్లాడే అవకాశం ఇచ్చారు. తన ప్రసంగంలో, మజ్లిస్ జహీరాబాద్ అధ్యక్షుడు గతంలో మజ్లిస్ ప్రాతినిధ్యం వహించిన సమయంలో చేసిన పనులను సమీక్షించారు మరియు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేయాలని అసదుద్దీన్ ఒవైసీ ను అభ్యర్థించారు తన అభిప్రాయాలను వ్యక్తీకరించడానికి అవకాశం ఇచ్చినందుకు రాష్ట్ర జాతీయ అధ్యక్షుడు బారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీ కు ధన్యవాదాలు తెలిపారు.

నెక్కొండ బస్టాండ్ అభివృద్ధికి నిధులు కేటాయించండి..

నెక్కొండ బస్టాండ్ అభివృద్ధికి నిధులు కేటాయించండి

రవాణా శాఖ మంత్రి పొన్నంకు వినతి పత్రం అందజేసిన ఎమ్మెల్యే దొంతి

#నెక్కొండ, నేటి ధాత్రి:

నెక్కొండ మండల కేంద్రంలోని బస్టాండ్ అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని నర్సంపేట ఎమ్మెల్యే మాధవరెడ్డి హైదరాబాదులోని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ క్యాంపు కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. వెంటనే సానుకూలంగా స్పందించిన మంత్రి పోన్నం ప్రభాకర్ అతి తొందరలో బస్టాండ్ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తానని హామీ ఇవ్వడం జరిగిందని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట టిపిసిసి సభ్యుడు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు బొంపల్లి దేవేందర్ రావు, బానోత్ సింగ్ లాల్, నెక్కొండ మార్కెట్ కమిటీ డైరెక్టర్ రావుల మైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మళ్లన్న నారి శక్తి లోగో ఆవిష్కరణ…

హైదరాబాద్ లో రాష్ట్ర “నారి శక్తి” సంస్థ లోగోని లాంచ్ చేసిన ఎం ఎల్ సి తీన్మార్ మల్లన్న

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ కి చెందిన “నారి శక్తి” సంస్థ ఫౌండర్ అండ్ చైర్మన్ జ్యోతి పండాల్ గారి ఆధ్వర్యంలో హైదరబాద్ లోని బిసి పొలిటికల్ జె.ఏ సి రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ శ్రీ తీన్మార్ మల్లన్న గారిచే రాష్ట్ర “నారి శక్తి” సంస్థ లోగో ను ఆవిష్కరించి తీన్మార్ మల్లన్న జ్యోతి పండాల్ ను సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడతూ మహిళలు సాధికారత సాధించినప్పుడే దేశం,రాష్ట్రం అభివృద్ది చెందుతుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ బిసి పొలిటికల్ జె.ఏ సి కోఆర్డినేషన్ కమిటి చైర్మన్ సుదగాని హరిశంకర్ గౌడ్, జె.ఏ సి నాయకులు కొనదొడ్డి నర్సింహ్మ (జహీరాబాద్ ఇంచార్జ్), తీన్మార్ మల్లన్న టీం శ్రీకాంత్, జగన్నాథ్, నాయకులు శ్రీ బయ్య వెంకటేశ్వర్లు యాదవ్ సింగారం రవీందర్ కొట్ల వాసుదేవ్ సుతారపు రంగన్న తదితరులు పాల్గొన్నారు

నిమ్జ్ డిప్యూటీ కలెక్టర్గా విశాలాక్షి…

నిమ్జ్ డిప్యూటీ కలెక్టర్గా విశాలాక్షి

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ నిమ్జ్ డిప్యూటీ కలెక్టర్గా విశాలాక్షి విధుల్లో చేరారు. హైదరాబాద్ మహిళా శిశు సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్గా పనిచేస్తున్న విశాలాక్షిని ఇక్కడకు బదిలీ చేశారు. నూతన డిప్యూటీ కలెక్టరు కార్యాలయ సిబ్బంది ఘనంగా సన్మానించారు. విశాలాక్షి మాట్లాడుతూ.. నిమ్జ్ రైతుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు.

బీసీ రిజర్వేషన్ల బిల్లుపై గందరగోళం..

బీసీ రిజర్వేషన్ల బిల్లుపై గందరగోళం..

◆:- స్పందించిన రాజ్‌భవన్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

హైదరాబాద్: తెలంగాణ బీసీ రిజర్వేషన్ల బిల్లుపై సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన న్యూస్‌ అవాస్తవమని రాజ్‌భవన్ అధికారులు స్పష్టం చేశారు. తెలంగాణ బీసీ రిజర్వేషన్ల బిల్లు ఇంకా పెండింగ్‌లోనే ఉందని తెలిపారు. రిజర్వేషన్ల బిల్లుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. పలు గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీల్లో.. విలీనం చేస్తూ.. జారీ చేసిన మెమోతో ఈ గందరగోళం నెలకొందని వివరించారు.

అయితే.. గత కొన్ని గంటలుగా.. తెలంగాణలో 42% బీసీ రిజర్వేషన్లకు లైన్ క్లియర్ అయ్యిందని.. సోషల్ మీడియాలో, ప్రముఖ టీవీ ఛానల్స్‌లో ప్రచారం అయ్యింది. పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ చట్ట సవరణకు గవర్నర్‌ ఆమోదం తెలిపినట్లు, 50 శాతం రిజర్వేషన్ల క్యాప్‌ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంటున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ మేరకు స్పందించిన రాజ్‌భవన్ అధికారులు ఇదంతా అవాస్తవమని తేల్చి చెప్పారు..

అధికారులు ఎవరైనా ప్రశ్నిస్తే కులస్థంగాల నాయకులతోటి బెదిరింపులు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-11T142537.924.wav?_=14

 

అధికారులు ఎవరైనా ప్రశ్నిస్తే కులస్థంగాల నాయకులతోటి బెదిరింపులు

చందానగర్ టౌన్ ప్లానింగ్ ఏసిపి శిష్యుడుగా*

చందానగర్ సర్కిల్లో సామాన్యులు అధికారులను
కలవాలంటే శ్రీనివాస్ ను
కలిసిన తర్వాతనే అధికారులని
అపార్ట్మెంట్ ఇప్పిస్తాడు

గత సంవత్సరం క్రితమే సర్కిల్ పటాన్చెరు ట్రాన్స్ఫర్ అయ్యి

మళ్లీ చందానగర్ సర్కిల్ కు రావడం ఆశ్చర్యమేంటి
చందానగర్ సర్కిల్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగి చెప్పిందే వేదం గత 20 పైనే సంవత్సరాలుగా చందానగర్ సర్కిల్లో పాతుకపోయాడు బిల్లింగ్ పర్మిషన్ కావాలన్నా శ్రీనివాస్ నీ కలవాల్సిందే

అయ్యప్ప సొసైటీలో ఎలాంటి పర్మిషన్లు ఉండవు అది అలుసుగా తీసుకొని, శ్రీనివాస్ బిల్డర్స్ దగ్గర భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసి ఆఫీసర్లకు,లీడర్లకు, రిపోర్టర్స్ నేను*
చూసుకుంటానని చెబుతాడు
ఒక బిల్డర్ ఔట్సోర్సింగ్, శ్రీనివాస్ నా దగ్గర మొత్తం డబ్బులు, తీసుకొని నేను ఇస్తానని చెప్పాడు, కావలసి అంటే శ్రీనివాసు డబ్బులు తీసుకుపోయిన వీడియో, ఆడియో, నా దగ్గర ఉన్నది నేను దేనికైనా రెడీ అని బిల్డర్ చెప్తున్నాడు

*చందానగర్ సర్కిల్-21లో కింగ్ మేకర్ ఔట్ సోర్సింగ్, ఉద్యోగి, శ్రీనివాస్,

నిర్మాణాలు జరగాలంటే వీరు అడిగినంత ఇవ్వాల్సిందే

శేరిలింగంపల్లి, నేటి ధాత్రి, :-

 

 

 

చందానగర్ సర్కిల్లో ,ఔట్ సోర్సింగ్ కింగ్ మేకర్ శ్రీనివాస్ అవతారమెత్తారు. చందానగర్ లో ఆడిందే ఆట..పాడిందే పాటన్న చందనంగా మారిపోయింది. చందానగర్ సర్కిల్ లిమిట్స్ లో ప్రతీరోజు అనేక చోట్ల కొత్త భవనాలు,అదనపు బిల్డింగ్స్ నిర్మాణాలు,సెల్లార్ల కన్స్ట్రక్షన్స్ జరుగుతుంటాయి. అయితే ఎక్కడ కొత్త నిర్మాణాలు ప్రారంభమైనా చైన్ మెన్ లేకపోవడంతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు గద్దల్లా వాలిపోవడం పరిపాటిగా మారిపోయింది. భవన నిర్మాణ యాజమానులు వీరికి అడిగినంత ఇస్తే కానీ,అస్సలు ఊరుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. జీరో పర్మిషన్ కు ఎంత చెల్లించాలి,అదనపు ఫోర్స్ కన్స్ట్రక్షన్ కు ఎంత ముట్టజెప్పాలి..కొత్త భవనాల నిర్మాణాలకు ఎంత చెల్లించాలి అనే విషయాలపై వీరే ఓ ధరను నిర్ణయించేస్తున్నారు.

 

 

 

ఒకవేళ వీరు చెప్పినంత ఇవ్వకుంటే వెంటనే ఉన్నతాధికారులకు సదరు నిర్మాణ యాజమానుల వివరాలను చేరవేసి పనులను నిలిపివేయిస్తున్నారనే విమర్శలున్నాయి. ఫైర్ సెఫ్టీ,సెట్ బ్యాక్,ఇతరత్రా కారణాలు చెప్పి నిర్మాణాలు నిలుపుదల చేయిస్తున్నారు. ఈ విషయంలో ఔట్ సోర్సింగ్ శ్రీనివాస్ ఉన్నతాధికారుల నుంచి అండదండలు పుష్కలంగా అందుతున్నట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులు ఇచ్చిన సపోర్టుతోనే ఈ అవినీతి చేప పిల్లలు రెచ్చిపోతున్నట్లు సమాచారం. రోజు వారిగా బిల్డింగ్ నిర్మాణ యాజమానుల దగ్గర వసూల్ చేసుకొచ్చిన అవినీతి సోమ్మును పై అధికారులకు వారి వారి స్థాయిలను బట్టి ఎవరి ముల్లే వారికి అప్పజెబుతున్నట్లు తెలుస్తోంది. చందానగర్ సర్కిల్-21 లిమిట్స్ లో వీరి ఆగడాలకు అడ్డూ-అదుపులేని పరిస్థితి దాపురించింది. ఈ వ్యవహరాలపై పలుమార్లు పత్రికల్లో వార్తలు వచ్చినా..ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. అయితే వీరి లీలలను భరించలేని పబ్లిక్ మాత్రం మున్సిపల్ అధికారులపై దుమ్మెత్తిపోస్తున్నారు

డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ జాతీయ సాహిత్య పురస్కారం…

డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ జాతీయ సాహిత్య పురస్కారం
తొలి గ్రహీతగా డా. చిటికెన కిరణ్ కుమార్ ఎంపిక

సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి)

 

 

 

తెలుగు సాహిత్యానికి విశిష్ట సేవలు అందిస్తూ కవిగా, రచయితగా, విమర్శకుడిగా ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన సిరిసిల్ల వాస్తవ్యులైన డా. చిటికెన కిరణ్ కుమార్ డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ జాతీయ సాహిత్య పురస్కారం తొలి గ్రహీతగా అఖిల భారత పద్మశాలి సంక్షేమ సంఘం ఎంపిక చేసింది.డా. కిరణ్ కుమార్ సాహిత్య ప్రస్థానం విస్తారమైనది. చైతన్య స్ఫూర్తి వంటి ప్రథమ గ్రంథం, ఓ తండ్రి తీర్పు లఘు చిత్రకథ, వందలాది పత్రికలలో వెలువడిన అనేక కవితలు,వ్యాసాలు, సమీక్షలు, సంపాదకీయాలు—ఇవి అన్నీ తెలుగు పాఠకలోకంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన కృషి గర్వకారణంగా నిలిచింది.
ఈ అవార్డు, పద్మశాలి కుల భూషణులు, వేలాది లలితగీతాలు రచించిన సుప్రసిద్ధ సినీ గేయరచయిత, జాతీయ మహాకవి స్వర్గీయ డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ స్మారకార్థం సంస్థ స్థాపించింది. తెలుగు సాహిత్యానికే కాదు, సంగీత, సినీ ప్రపంచానికీ ఆయన అందించిన విలువైన కృషి ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలుస్తుంది.
ఈ అవార్డును మొదటిసారిగా డా. చిటికెన కిరణ్ కుమార్ అందజేయడం తమ సంఘానికి గర్వకారణమని సంఘ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిలు తుమ్మ సత్యనారాయణ, సూరేపల్లి రవికుమార్ లు ఒక ప్రకటనలో తెలియజేశారు. త్వరలోనే హైదరాబాద్‌లో జరగబోయే ప్రత్యేక కార్యక్రమంలో, ప్రముఖుల సమక్షంలో ఈ పురస్కారం ఘనంగా ప్రదానం చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇందులో భాగంగా సిరిసిల్ల జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు ఎలగొండా రవి, ప్రధాన కార్యదర్శి ఆడెపు లక్ష్మణ్, ఉపాధ్యక్షులు బూర దేవానందం, యువజన కార్యదర్శి అంకారపు రవి, కవులు,కళాకారులు, రచయితలు అభినందించారు

షేఖపూర్ దర్గాలో సర్కార్ గంధం సమర్పణ, భక్తుల కోలాహలం…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-09T115705.923.wav?_=15

 

షేఖపూర్ దర్గాలో సర్కార్ గంధం సమర్పణ, భక్తుల కోలాహలం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ మండలం శేఖపూర్ గ్రామంలోని షేక్ షాబుద్దీన్ దర్గా వద్ద సోమవారం రాత్రి సర్కార్ గంధం సమర్పించారు. పోలీస్ పటేల్ వారి ఇంటి నుండి డప్పు చప్పులతో ఒంటపై గంధాన్ని దర్గాలో సమర్పించారు. మంగళవారం వరకు ఖవ్వాలి పోటీలు జరుగుతాయని గ్రామస్తులు తెలిపారు.

 

 

 

ఈ జాతరకు కర్ణాటక, మహారాష్ట్ర, హైదరాబాద్ నుంచి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని దర్గాను చందర్ పూలమాలలు సమర్పించి వచ్చిన భక్తులు మొక్కులు చెలించుకొని ఫేతెహ మిఠాయి సమర్పించి జహీరాబాద్ నియోజకవర్గ ప్రజలందరు సుఖసంతోషాలతో ఉండాలని ప్రర్తించారు,

వినాయక నిమజ్జన విధుల్లో అపశృతి.. ఏం జరిగిందంటే..

వినాయక నిమజ్జన విధుల్లో అపశృతి.. ఏం జరిగిందంటే..

 

 

 

వినాయక నిమజ్జన విధుల్లో అపశృతి చోటుచేసుకుంది. టస్కర్ వాహనం కిందపడి జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలు మృతిచెందారు. గత 15 ఏళ్లుగా జీహెచ్ఎంసీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా గుడిమల్కాపూర్‌కు చెందిన రేణుక పని చేస్తున్నారు.

వినాయక నిమజ్జన విధుల్లో (Ganesh immersion Duties) అపశృతి చోటుచేసుకుంది. టస్కర్ వాహనం కిందపడి జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలు మృతిచెందారు. గత 15 ఏళ్లుగా జీహెచ్ఎంసీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పని చేస్తున్నారు గుడిమల్కాపూర్‌కు చెందిన రేణుక. ఇవాళ(ఆదివారం) ఉదయం బషీర్ బాగ్ నుంచి లిబర్టీ వెళ్లే మార్గంలో విధులు నిర్వహిస్తున్నారు రేణుక.

ఈ క్రమంలో రోడ్డును దాటేందుకు యత్నించారు మృతురాలు. అదే సమయంలో రేణుకను బలంగా ఢీ కొట్టింది బషీర్ బాగ్ నుంచి వస్తున్న వినాయకుడు ఉన్న టస్కర్ వాహనం. దీంతో ఆమె తలకు బలమైన గాయం కావడంతో హుటాహుటిన ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే రేణుక మృతి చెందినట్లు తెలిపారు వైద్యులు.

టస్కర్ వాహనం డ్రైవర్ గజానంద్‌ను సైఫాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ గజానంద్‌‌పై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. రేణుక మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. రేణుక మృతి పట్ల జీహెచ్ఎంసీ అధికారులు, కార్మికులు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలని కార్మికులు కోరారు.

వినాయక నిమజ్జన విధుల్లో అపశృతి.. ఏం జరిగిందంటే..

వినాయక నిమజ్జన విధుల్లో అపశృతి.. ఏం జరిగిందంటే..

 

 

 

వినాయక నిమజ్జన విధుల్లో అపశృతి చోటుచేసుకుంది. టస్కర్ వాహనం కిందపడి పారిశుద్ధ్య కార్మికురాలు మృతిచెందారు. గత 15 ఏళ్లుగా జీహెచ్ఎంసీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా గుడిమల్కాపూర్‌కు చెందిన రేణుక పని చేస్తున్నారు.

వినాయక నిమజ్జన విధుల్లో (Ganesh immersion Duties) అపశృతి చోటుచేసుకుంది. టస్కర్ వాహనం కిందపడి పారిశుద్ధ్య కార్మికురాలు మృతిచెందారు. గత 15 ఏళ్లుగా జీహెచ్ఎంసీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పని చేస్తున్నారు గుడిమల్కాపూర్‌కు చెందిన రేణుక. ఇవాళ(ఆదివారం) ఉదయం బషీర్ బాగ్ నుంచి లిబర్టీ వెళ్లే మార్గంలో విధులు నిర్వహిస్తున్నారు రేణుక.

ఈ క్రమంలో రోడ్డును దాటేందుకు యత్నించారు మృతురాలు. అదే సమయంలో రేణుకను బలంగా ఢీ కొట్టింది బషీర్ బాగ్ నుంచి వస్తున్న వినాయకుడు ఉన్న టస్కర్ వాహనం. దీంతో ఆమె తలకు బలమైన గాయం కావడంతో హుటాహుటిన ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిపారు వైద్యులు. టస్కర్ వాహనం డ్రైవర్ గజానంద్‌ను అదుపులోకి తీసుకున్నారు సైఫాబాద్ పోలీసులు. పోలీసులు కేసు నమోదు చేసి మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. రేణుక మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

 

తెలంగాణలో శాంతియుతంగా వినాయక నిమజ్జనాలు…

తెలంగాణలో శాంతియుతంగా వినాయక నిమజ్జనాలు.. సీఎం రేవంత్ హర్షం

హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా వినాయక నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగియడంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం కార్యాలయ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.

 హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా వినాయక నిమజ్జనోత్సవాలు (Vinayaka immersion) ప్రశాంతంగా ముగియడంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం కార్యాలయ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. తొమ్మిది రోజులపాటు భక్తులు గణనాథుడికి భక్తిశ్రద్ధలతో పూజలు చేసి ఘన వీడ్కోలు పలికారని పేర్కొన్నారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.

తొమ్మిది రోజులపాటు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా, అత్యంత భక్తి శ్రద్ధలతో శోభాయాత్ర ప్రశాంతంగా సాగడంలో అహర్నిశలు పనిచేసిన పోలీసు, మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్, రవాణా, పంచాయతీ రాజ్ ఇతర శాఖల అధికారులు, సిబ్బందికి, ఉత్సవ కమిటీల సభ్యులు, మండపాల నిర్వాహకులు, క్రేన్ ఆపరేటర్లు, భక్తులు అందరికీ అభినందనలు తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. హైదరాబాద్ నగరంలో లక్షలాది విగ్రహాలు క్రమపద్ధతిలో నిర్దేశిత సమయానికి ట్యాంక్‌బండ్‌తో సహా మిగతా అన్ని ప్రాంతాల్లో నిమజ్జన కార్యక్రమం సాఫీగా, ప్రశాంతంగా సాగడానికి సహకరించిన ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు.

రేపటి నిమజ్జనానికి ఏర్పాట్లు చేయాలని కాంగ్రెస్ నాయకులని డిమాండ్..

రేపటి నిమజ్జనానికి ఏర్పాట్లు చేయాలని కాంగ్రెస్ నాయకులని డిమాండ్

◆:- బిజెపి సీనియర్ నాయకురాలు జ్యోతి పండాల్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

తెలంగాణ అంతట కూడా నిమజ్జనం రేపు ఉండడం జరుగుతుంది. అలాగే మన జహీరాబాద్ నియోజకవర్గంలో కూడా నిమజ్జనం రేపు ఉండడంతో, కాంగ్రెస్ నాయకులు రేపటి నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేయాలని జ్యోతి పండాల్ కాంగ్రెస్ నాయకులను డిమాండ్ చేయడం జరిగింది. అలాగే మున్సిపల్ కమిషనర్ గారు వారి ఆఫీసులో నిద్రపోకుండా ఏర్పాట్లని దగ్గరుండి సమకూర్చాలని పర్యవేక్షించాలని జ్యోతి పండాల్ సూచించడం జరిగింది.

అలాగే మహిళల భద్రత కోసం షీ టీమ్స్ ని, మహిళా కానిస్టేబుల్స్ ని, మహిళా ఆఫీసర్స్ ని కూడా డిప్లాయ్ చేయాలని పోలీస్ శాఖ వారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది.

ఈ సారి ఖైరతాబాద్ వినాయకుడి దర్శనం కోసం వచ్చిన అమ్మాయిలని పోకిరీలు, ఆకతాయిలు వేధిస్తున్నందుకు, 7 రోజుల వ్యవధిలో 930 మందిని మఫ్టీలో షీ టీం వాళ్ళు పట్టుకోవడం జరిగింది. ఈ 930 మందిలో మైనర్లు, 20 సంవత్సరాలు ఉన్న అబ్బాయిలు మరియు 50 సంవత్సరాలు వయసు ఉన్న మగవాళ్ళు వేధించడం జరుగుతుందని షీ టీమ్స్ ఇన్చార్జ్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. 50 సంవత్సరాలు వయసు ఉన్న మగవారు కూడా అమ్మాయిలని ఏడిపిస్తున్నారంటే కామంతో కళ్ళు మూసుకుపోయి ప్రవర్తిస్తున్న వాళ్లు రోజురోజుకీ పెరుగుతిన్నారని మహిళలు గమనించాలి మరియు జాగ్రత్త వహించాలి.

జ్యోతి పండాల్ తప్పు లేకుండా ఎవరిపైన నిరాధారంగా ఆధారాలు లేకుండా విమర్శించదు అన్న విషయం, జహీరాబాద్ లో ఉన్న నాయకులు గాని కాంగ్రెస్ నాయకులు గానీ తెలుసుకోవాలి. వాస్తవాలు మాట్లాడుతుంటే ఇక్కడున్న లీడర్లకి ఎందుకు బాధ అవుతుందో నాకు అర్థం అవడం లేదు. నిన్న అమ్మాయిల భద్రత కోసం మాట్లాడినందుకు లీడర్లకు జీర్ణం అవడం లేదు కానీ ఖైరతాబాద్ లో జరుగుతున్న ఈవిటీజింగ్ కేసులను చూస్తే మీకు అర్థమవుతుందని జ్యోతి పండాల్ అన్నారు.

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు…

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను విజయవంతం చేయండి

* సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కే రామస్వామి

చేవెళ్ల, నేటిధాత్రి:

 

ఈనెల 11 నుండి 17 వరకు జరిగే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను విజయవంతం చేయాలని సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కే రామస్వామి పిలుపునిచ్చారు. శుక్రవారం చేవెళ్ల మండల కేంద్రంలో సిపిఐ మండల కార్యదర్శి సత్తిరెడ్డి అధ్యక్షతన సిపిఐ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కే రామస్వామి హాజరై మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటం 1946 నుండి 1951 వరకు కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో 7వ నిజాం మీర్ ఉస్మాన్ ఆలీ ఖాన్ కు వ్యతిరేకంగా జరిగిన సాయిధ రైతాంగం తిరుగుబాటు చేశారని అన్నారు. ఈ పోరాటంలో దాదాపు 4500 మంది తెలంగాణ రైతులు, ప్రజలు ప్రాణాలు కోల్పోయారని ఈ పోరాటం ప్రధానంగా హైదరాబాద్ రాష్ట్రంలోని భూస్వామ్య వ్యవస్థకు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిందని తెలిపారు. నిజాం పాలనను అంతం చేసి హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనం కావడానికి ఈ పోరాటం దారితీసిందని, భూస్వాముల దోపిడీని నిలిపి రైతుల హక్కుల పరిరక్షణకు ఈ పోరాటం ఎంతో స్ఫూర్తినిచ్చిందనిఅన్నారు. ఈ స్ఫూర్తితోనే ఈనెల 11 నుండి 17 వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటవారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 17వ తేదీన హైదరాబాదులోని రావి నారాయణరెడ్డి ఆడిటోరియంలో ముగింపు సభ ఉంటుందని ఈ సభకు పార్టీ శ్రేణులు గ్రామ కార్యదర్శులు ప్రజాసంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ వారోత్సవాలను విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం ప్రభు లింగం, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు వడ్ల సత్యనారాయణ, ఇన్సాబ్ జిల్లా అధ్యక్షుడు ఎండి మక్బుల్, ఎన్ ఎఫ్ ఐ డబ్లు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్ల మంజుల తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా ఫ్రొ.కోదండరాం జన్మదిన వేడుకలు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-05T151427.923.wav?_=16

ఘనంగా ఫ్రొ.కోదండరాం జన్మదిన వేడుకలు

అభినందనలు తెలిపిన పాలమూరు ఉమ్మడి జిల్లా ప్రధానకార్యదర్శి చల్లా కిరణ్ కుమార్ రెడ్డి

హైదారాబాద్,నేటిధాత్రి:

 

తెలంగాణ జన సమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు,ప్రజా ఉద్యమనేత ఫ్రొపెసర్ కోదండరాం జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా ఆ పార్టీ
పాలమూరు ఉమ్మడి జిల్లా ప్రధానకార్యదర్శి చల్లా కిరణ్ కుమార్ రెడ్డి హైదారాబాద్ లోని ఫ్రొపెసర్ కోదండరాం నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమాన్ని శాంతియుతంగా నడిపిన రథసారధి ఫ్రొపెసర్ కోదండరాం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచారని అభివర్ణించారు.

ఏకశీల ప్రిన్సిపాల్ ఎం.డి బాబాకు “గురుబ్రహ్మ” అవార్డు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-04T141033.408.wav?_=17

ఏకశీల ప్రిన్సిపాల్ ఎం.డి బాబాకు “గురుబ్రహ్మ” అవార్డు

నేటిధాత్రి ఐనవోలు :-

ఎస్ఆర్ఎఫ్ (శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్) గురుబ్రహ్మ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఏకశీల ఈ టెక్నో పాఠశాల ప్రిన్సిపల్ యం.డి.బాబా ఎంపికయ్యారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో బుధవారం రాత్రి ఎస్ఆర్ఎఫ్ గురుబ్రహ్మ అవార్డుల ప్రధానోత్సవాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రిటైర్డ్ ఐఏఎస్ డా|| జయప్రకాష్ నారాయణ చేతుల మీదుగా ప్రిన్సిపల్ యండి. బాబా గురుబ్రహ్మ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఏకశిలా విద్యా సంస్థల చైర్మన్ గౌరు తిరుపతిరెడ్డి బాబాను అభినందించారు.

సతీష్ యాదవ్ కు సిటిజన్ ఫోరం సన్మానం..

డాక్టరేట్ సతీష్ యాదవ్ కు హైదరాబాదులో సిటిజన్ ఫోరం, సన్మానం
వనపర్తి నేటిదాత్రి .

హైదరాబాద్ లో మహబూబ్నగర్ జిల్లా మాజీ రిజిస్టర్ నర్సిరెడ్డి, బుద్ధారం మారం మహేందర్ ఆధ్వర్యంల డాక్టరేట్ పొందిన అఖిలపక్ష అధ్యక్షుడు, మాజీ కౌన్సిలర్ సతీష్ యాదవ్ ను సన్మానం చేశారు
ఈ కార్యక్రమంలో పెద్దలు మాజీ జిల్లా రిజిస్టర్ నర్సిరెడ్డి విశ్వనాథం, నాగభూషణం, మారం మహేందర్, శ్రీనివాసరావు, మురళి శర్మ, సుధాకర్, పద్మా విశ్వనాథం, విజయ్ దంపతులు, నాగరాజు, లక్ష్మణ్, కమ్యూనిటీ పెద్దలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

“షేఖాపూర్ 675వ ఉర్స్ వేడుకలు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-01T125827.812.wav?_=18

షేఖాపూర్‌లో హజ్రత్ షేక్ షాబుద్దీన్ షహీద్ తుర్కీ యొక్క మూడు రోజుల ఉర్సు ఉత్సవాలు

◆:- 675వ వార్షిక ఉర్సు వేడుకలు సెప్టెంబర్ 8న ప్రారంభమవుతాయి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

“Shekhapur 675th Urs Celebrations”

 

జహీరాబాద్ హజ్రత్ షేక్ షాబుద్దీన్ షహీద్ తుర్కీ యొక్క మూడు రోజుల 675వ వార్షిక ఉర్స్ వేడుకలు సెప్టెంబర్ 8, సోమవారం నుండి జహీరాబాద్‌లోని షేఖాపూర్‌లో ప్రముఖ సామాజిక కార్యకర్త మరియు సీనియర్ బిఆర్ఎస్ పార్టీ నాయకుడు ఖిజర్ యాఫీ పర్యవేక్షణలో జరుగుతున్నాయి. సెప్టెంబర్ 10, సోమవారం, మంగళవారం, బుధవారం, సెప్టెంబర్ 8, 2025, 17.16.15 రబీ-ఉల్-అవ్వల్ 1447 AHకి అనుగుణంగా, ఈ సంవత్సరం కూడా, ప్రతి సంవత్సరం మాదిరిగానే, గొప్ప వైభవం మరియు ప్రదర్శనతో జరుపుకుంటున్నట్లు ఆయన అన్నారు. ఉరుసుk సందర్భంగా, సీరత్ ఔలియా సమావేశం నిర్వహిస్తున్నామని, దీనిలో హైదరాబాద్ పండితులు, స్థానిక పండితులు, ప్రత్యేక అతిథులు, ముఖ్యంగా మౌలానా సయ్యద్ అఫ్సర్ పాషా ఖాద్రీ, అధ్యక్షుడు అహ్లే సున్నత్ జమాత్ సంగారెడ్డి, అఖిల భారత సమాజ సంస్కరణ సంస్థ అధ్యక్షుడు మరియు సమాజ్ సిద్ధర్ వార్తాపత్రిక చీఫ్ ఎడిటర్ మౌలానా అబ్దుల్ హమీద్ రెహమానీ మరియు మౌలానా ముహమ్మద్ యూసుఫ్ సూఫీ ఖాద్రీ ప్రత్యేక ప్రసంగాలు ఇస్తారని ఆయన అన్నారు. సెప్టెంబర్ 9 సోమవారం మరియు సెప్టెంబర్ 8 మంగళవారం రెండు రోజుల గ్రాండ్ ఖవ్వాలి పోటీలు జరుగుతున్నాయని, ఇందులో మొదటి రోజు ఇషా ప్రార్థనల తర్వాత, మురాద్ అతిష్ కవ్వల్ కర్నా తక్ రాజస్థాన్‌కు చెందిన దిల్షాద్ అర్షద్‌తో పోటీ పడతారని, రెండవ రోజు అషర్ ప్రార్థనల తర్వాత, అనీస్ సబ్రి కవ్వల్ ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్‌కు చెందిన జునైద్ సల్మానీతో పోటీ పడుతుందని ఆయన అన్నారు. సెప్టెంబర్ 8 సోమవారం, అధికారిక చెప్పులు పోలీస్ పటేల్ మరియు మాలి పటేల్ ఇంటి నుండి బయలుదేరి షేక్‌పూర్‌లోని వివిధ మార్గాల ద్వారా దర్గా షరీఫ్‌కు చేరుకుంటాయని, దర్గా మోట్‌లో చెప్పుల మాలి ఆచారం జరుగుతుందని ఆయన చెప్పారు. సెప్టెంబర్ 10 మంగళవారం, అర్థరాత్రి దర్గాలో చందన మాలి ఆచారం నిర్వహించిన తర్వాత, వివిధ ప్రైవేట్ చెప్పుల వేడుకలు జరుగుతాయని ఆయన చెప్పారు. సెప్టెంబర్ 10 బుధవారం, ఫజ్ర్ ప్రార్థనల తర్వాత, దర్గా సందర్శన జరుగుతుంది, ఫతేహా ​​పారాయణం చేయడానికి మరియు ఆశీర్వాదం కోసం ప్రార్థించడానికి ఒక సమావేశం ఉంటుంది మరియు దర్గా ప్రాంగణంలోని లంగర్ ఖానా ద్వారా ఉర్స్ యాత్రికులకు ప్రత్యేక మరియు బహిరంగ భోజనం ఏర్పాటు చేయబడుతుంది. దీనితో, మూడు రోజుల ఉర్స్ వేడుకలు ముగుస్తాయి. నవా జవావాన్ షేఖాపూర్, ముఖ్యంగా ఉర్స్ ఎంటెజామి యామిని, మతం లేదా జాతీయతతో సంబంధం లేకుండా ప్రజలు ఉర్స్ వేడుకల్లో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని అభ్యర్థించారు.

సింగరేణి హై స్కూల్ గ్రౌండ్ లో మినీ హ్యాండ్ బాల్ బాల బాలికల పోటీలు…

సింగరేణి హై స్కూల్ గ్రౌండ్ లో మినీ హ్యాండ్ బాల్ బాల బాలికల పోటీలు

మందమర్రి నేటి ధాత్రి

 

 

ఓటమి గెలుపుకు నాంది అని ఓటమెరుగని జీవితంలో కిక్ ఉండదని గెలుపుతో గర్వం పెరుగే అవకాశం ఉందని ఓటమితో వచ్చినటువంటి క్రమశిక్షణ పట్టుదల గెలుపు చిరకాలంగా ఉంటుందని కాబట్టి ఓటమితో కుంగిపోకుండా గెలుపు అనే గమ్యస్థానం చేరుకోవడానికి అహర్నిశలు కృషి చేయాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కనపర్తి రమేష్ అన్నారు.
నేడు మందమర్రి సింగరేణి హై స్కూల్ గ్రౌండ్ నందు జరిగిన మినీ హ్యాండ్ బాల్ బాల బాలికల ఉమ్మడి అదిలాబాద్ జిల్లా జట్టు ఎంపిక పోటీల్లో పాల్గొని ఆయన మాట్లాడుతూ గెలుపు కోసం సరైన క్రమశిక్షణతో కూడిన సాధన అవసరమని ఆయన అన్నారు.
ఇక్కడ ఎంపిక కాబడ్డ మినీ అండర్ 12 ఇయర్స్ బాల బాలికలు రేపు అనగా 31 /8/ 2025 న హైదరాబాదు లోని మీదని మైదానమందు జరిగేటటువంటి రాష్ట్ర హ్యాండ్ బాల్ సెలక్షన్స్ లో జిల్లా తరపున పాల్గొంటారని ఆయన వివరించారు.
ఈ కార్యక్రమం లో హ్యాండ్ బాల్ కోచ్ సునార్కర్ అరవింద్, పీడీ సంతోష్, పి ఈ టి. రాధారాణి,
సీనియర్ క్రీడాకారులు ప్రవీణ్, సంజయ్,రఘు, వర్మ, అమూల్య లు పాల్గొన్నారు.

జాతీయ స్థాయి కరాటే పోటీలలో నితన్య సిరి ప్రతిభ..

జాతీయ స్థాయి కరాటే పోటీలలో నితన్య సిరి ప్రతిభ..

అభినందించిన జిల్లా ఎస్పీ శ్రీ డి.వి. శ్రీనివాస రావు, ఐపీఎస్..

రామాయంపేట ఆగస్టు 30 నేటి ధాత్రి (మెదక్)

 

మెదక్ పోలీస్ విభాగానికి చెందిన హోం గార్డ్ నామ కృష్ణ కుమార్తె నితన్య సిరి జాతీయ స్థాయి కరాటే పోటీలలో అద్భుత విజయాలు సాధించి రాష్ట్రానికి, జిల్లాకు గర్వకారణంగా నిలిచింది.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ డి.వి. శ్రీనివాస రావు, ఐపీఎస్ గారు శనివారం తన ఛాంబరులో నితన్య సిరిని సర్టిఫికెట్, మెమెంటో మరియు ఛాంపియన్షిప్ ట్రోఫీతో ఘనంగా సత్కరించారు.

హైదరాబాద్ బోడుప్పల్‌లో ఇటీవల నిర్వహించిన ఆర్ఎస్ఎస్ కాయ్ జాతీయ స్థాయి కరాటే పోటీలలో నితన్య సిరి సీనియర్ బ్లాక్ బెల్ట్‌గా గర్ల్స్ విభాగంలో కటా, వెపన్స్ విభాగాల్లో గోల్డ్ మెడల్స్ సాధించింది. అదేవిధంగా గ్రాండ్ ఛాంపియన్షిప్ ట్రోఫీని కైవసం చేసుకోవడంతో పాటు ఉత్తమ రెఫరీగా సేవలందించడం విశేషం అని ఎస్పీ గారు అభినందించారు.

 

 

ఇప్పటి వరకు నితన్య సిరి 11 బంగారు పతకాలు, రెండు అంతర్జాతీయ స్థాయి బంగారు పతకాలు, రెండు ఛాంపియన్షిప్ టైటిల్స్ సాధించడం ద్వారా తన క్రీడా ప్రతిభను నిరూపించిందని ఎస్పీ గారు తెలిపారు. చిన్న వయస్సులోనే క్రీడా రంగంలో ఇంతటి విజయాలు సాధించడం ఇతర విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తుందని ఆయన అన్నారు.

జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ – నితన్య సిరి విజయాలు కుటుంబానికే కాకుండా మొత్తం మెదక్ పోలీస్ విభాగానికీ గర్వకారణం అని,ఇలాంటి ప్రతిభావంతులైన ఆడపిల్లలు సమాజానికి ఆదర్శం. భవిష్యత్తులో కూడా పోలీస్ శాఖ తరపున అవసరమైన సహాయం అందిస్తాం అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా అదనపు ఎస్పీ శ్రీ ఎస్. మహేందర్ గారు, ఆర్‌ఐ శైలేందర్ గారు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు, ఎస్ఐ నరేష్ గారు, మాస్టర్ రవీంద్ర కుమార్, స్థానిక కరాటే మాస్టర్ నగేష్ మల్లూరి, తల్లిదండ్రులు నామ కృష్ణ–కీర్తినేత తదితరులు పాల్గొన్నారు.

సుధాకర్ రెడ్డి సంస్మరణ సభ హైదరాబాద్‌లో…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-99-1.wav?_=19

సిపిఐ మాజీ ప్రధాన కార్యదర్శి,పార్లమెంట్ మాజీ సభ్యులు కామ్రేడ్ సంస్మరణ సభ

జహీరాబాద్ నేటి ధాత్రి:

సిపిఐ మాజీ ప్రధాన కార్యదర్శి, పార్లమెంట్ మాజీ సభ్యులు కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభ 2025 ఆగస్టు 30వ తేదీన హైదరాబాద్లోని, రవీంద్రభారతి యందు ఉదయం 11.00 గంటలకు జరగనున్నది. ఈ సంస్మరణ సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ‘. డి.రాజా, సిపిఐ జాతీయ కార్యదర్శులు డాక్టర్ కె.నారాయణ, కామ్రేడ్ సయ్యద్ అజీజ్ పాషా ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నారు.ఈ సంస్మరణ సభకు ప్రతి జిల్లా నుంచి 50 మందికి తక్కువ కాకుండా కోట ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే మన సంగారెడ్డి జిల్లాకు 50 మంది కోట ఇవ్వడం జరిగింది ఆగస్టు 30వ తేదీన ఉదయం 11.00 గంటలకు హైదరాబాద్ లోని రవీంద్రభారతికి సకాలంలో హాజరు కావాల్సిందిగా కోరుతున్నాను. ఈ సంస్మరణ సభలో పాల్గొనే వారందరూ పురుషులు ఎర్ర చొక్కాలు, స్త్రీలు ఎర్ర చీరలను ధరించి రావాల్సిందిగా కోరుతున్నామన్నారు,

ఘనంగా వి హెచ్ పిఎస్ 18వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు…

ఘనంగా వి హెచ్ పిఎస్ 18వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

మడి పెళ్లి శ్యాంబాబు మాదిగ జిల్లా ఇన్చార్జి

అంబాల చంద్రమౌళి మాదిగ ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి జిల్లా ఇన్చార్జి

భూపాలపల్లి నేటిధాత్రి

 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలక్షన్ ప్రచారంలో వికలాంగులకు చేయూత పెన్షన్ దారులకు ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్ పెంచాలి లేకుంటే ముఖ్యమంత్రి పదవి నుండి తప్పుకోవాలని ఎమ్మార్పీఎస్ భూపాలపల్లి జిల్లా ఇన్చార్జ్ మడిపల్లి శ్యాంబాబు మాదిగ ఎమ్మార్పీ ఎస్ ఎంఎస్పి రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు మాచర్ల వంశీకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో విహెచ్పిఎస్ 18వ ఆవిర్భావ దినోత్సవం వంశీకృష్ణ గౌడ్ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఇంచార్జ్ మడిపల్లి శ్యాంబాబు మాదిగ ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి రాష్ట్ర నాయకులు అంబాల చంద్రమౌళి మాదిగ లు జెండా ఆవిష్కరణ చేసి అనంతరం మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఎలక్షన్ ప్రచారంలో వికలాంగులు చేయూత పెన్షన్ దారులతో మాట్లాడుతూ ఈ నెల పెన్షన్ తీసుకుంటే మీకు వికలాంగులకు 4016 లు చేయూత పెన్షన్ దారులకు 2016 లు వస్తున్నాయి కానీ నన్ను నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి మాకు అధికారం ఇస్తే వచ్చే నెల నుంచి వికలాంగులకు 4016 లు ఉన్న పెన్షన్ 6000 చేయూత పెన్షన్ దారులకు 4000 ఇస్తామని నమ్మించి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చి నేటికీ 20 నెలలు గడుస్తున్న కానీ పెన్షన్ పెంచకుండా మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అక్కడి కూటమి ప్రభుత్వం వికలాంగులకు 6000 భరోసా పెన్షన్ దారులకు 4000 ఇస్తుందని మరియు మంద కృష్ణ మాదిగ విజ్ఞప్తి మేరకు కండరాల క్షీణత ఉన్న వికలాంగులకు 15000 రూపాయలు ఇస్తుందని తెలిపారు. లోటు బడ్జెట్ లో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ లో పెన్షన్ పెంచి ఇస్తుంటే మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణలో పెన్షన్ పెంచకుండా ఎమ్మెల్యేల జీతాలు మాత్రమే పెంచుకుంటూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్ దారులను మోసం చేస్తోందని అన్నారు. భూపాలపల్లి జిల్లాలో ఉన్న వికలాంగులు చేయూత పెన్షన్ దారులు మంద కృష్ణ మాదిగ నాయకత్వంలో పెన్షన్ పెంచడం కోసం జరుగుతున్న పోరాటంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని మరియు సెప్టెంబర్ 9న పరేడ్ గ్రౌండ్ హైదరాబాదులో జరుగు వికలాంగుల చేయుట పెన్షన్ దారుల మహా గర్జనను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో
ఎమ్మెస్పీ సీనియర్ నాయకులు
నోముల శ్రీనివాస్ మాదిగ
ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు దోర్నాల రాజేందర్ మాదిగ అంతడుపుల సురేష్ మాదిగ యువసేన జిల్లా అధ్యక్షులు మంద తిరుపతి మాదిగ ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు మిరపట్టి అశోక్ మాదిగ జిల్లా నాయకులు మంద కిరణ్ మాదిగ ఎమ్మార్పీఎస్ టౌన్ అధ్యక్షులు దోర్నాల భరత్ మాదిగ ఎమ్మార్పీఎస్ టౌన్ ప్రధాన కార్యదర్శి ఒంటెరి రాజేష్ మాదిగ ఎంఎస్పి టౌన్ ప్రధాన కార్యదర్శి మంచినీళ్ల వైకుంఠం మాదిగ ఒంటెరి సమ్మయ్య మాదిగ దోర్నాల నరేష్ మాదిగ ఒంటేరు నాగరాజు మాదిగ తదితరులు పాల్గొన్నారు.

డ్రాగన్‌ లేటెస్ట్‌ షెడ్యూల్‌ ఎప్పట్నుంచి అంటే..

డ్రాగన్‌ లేటెస్ట్‌ షెడ్యూల్‌ ఎప్పట్నుంచి అంటే..

 

 

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్‌ నీల్‌ (Prasanth Neel) సినిమా షూటింగ్‌ కోసం సిద్ధమవుతున్నారు. 

ఓటీటీ సినిమాలు

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌(NTR) ‘వార్‌-2’ చిత్రంతో ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చారు. బాలీవుడ్‌ నటుడు హృతిక్‌ రోషన్‌తో కలిసి నటించిన సినిమా ఇది. అలాగే తారక్‌ బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన సినిమా కూడా. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం అభిమానులకు నిరాశే మిగిల్చింది. ఎన్టీఆర్‌ కూడా ఈ సినిమాపై ఎంతో నమ్మకంతో సూపర్‌హిట్‌ అవుతుందని కాలర్‌ ఎగరేసి మరీ సవాల్‌ విసిరారు తారక్‌. అయితే అంచనాలు తారుమారు అయ్యాయి. ప్రస్తుతం ఆయన ప్రశాంత్‌ నీల్‌ (Prasanth Neel) సినిమా షూటింగ్‌ కోసం సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కీలక షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే నెల మొదటి వారంలో కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించుకోనందని తెలిసింది.

ఓటీటీ సినిమాలు

హైదరాబాద్‌లో నెలకు పైగా సాగనున్న ఈ సుదీర్ఘ షెడ్యూల్‌లో తారక్‌పై భారీ పోరాట ఘట్టాన్ని చిత్రీకరించనున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఈ షెడ్యూల్‌ కోసం సన్నాహాలు మొదలుపెట్టారు నీల్‌. పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామా రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది జూన్‌ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఎన్టీఆర్‌ సరసన రుక్మిణి వసంత్‌ నటించనుంది. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘డ్రాగన్‌’ (Dragon) టైటిల్‌ ఖరారు చేసినట్లు తెలిసింది. అయితే అధికారికంగా ప్రకటించలేదు.

చిరంజీవి పుట్టినరోజు కోసం కరీంనగర్ నుంచి మెగా అభిమానుల ర్యాలీ..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-43-2.wav?_=20

వేల్పుల వెంకటేష్ ఆధ్వర్యంలో తరలి వెళ్తున్న మెగా అభిమానుల ర్యాలీని ప్రారంభించిన వెలిచాల

కరీంనగర్, నేటిధాత్రి:

సుదీర్ఘ కాలం పాటు వెండితెరపై విలక్షణమైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో మెగాస్టార్ చిరంజీవి చెరగని ముద్ర వేసుకున్నారని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి మరిన్ని మంచి సినిమాలు తీస్తూ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలన్నారు. మెగాస్టార్ కు మరింత మంచి పేరు వస్తుందని తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి డెబ్బైవ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం హైదరాబాదులో జరిగే వేడుకలకు కరీంనగర్ జిల్లా నుంచి చిరంజీవి యువత తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వేల్పుల వెంకటేశ్ ఆధ్వర్యంలో నాలుగు వందల మంది మెగా అభిమానులు తరలి వెళ్లారు. హైదరాబాద్ తరలి వెళ్లే వాహనాల ర్యాలీని కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలంలో దేవక్కపల్లిలో వెలిచాల రాజేందర్ రావు జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా రాజేందర్ రావు మాట్లాడుతూ తనకు చిరంజీవి అంటే ప్రత్యేక అభిమానం అని పేర్కొన్నారు. ఆయనతో ప్రత్యేక ఆత్మీయత అనుబంధం ఉందన్నారు. మాకుటుంబానికి అత్యంత ఆప్తుడని, గతంలో తమ ఇంట్లో కరీంనగర్లో ఐదు రోజులపాటు ఉన్నారని గుర్తు చేశారు. చిరంజీవితో అనుబంధం ఉండడం అదృష్టం అన్నారు. చిరంజీవి విలక్షణమైన నటనతో ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించు కున్నారని తెలిపారు. చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకొని మెగా అభిమానులు చిరంజీవి యువత ప్రతినిధులు సామాజిక సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని సూచించారు. యువత చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. చిరంజీవి యువత రాష్ట్ర అధ్యక్షులు వేల్పుల వెంకటేష్ ఆధ్వర్యంలో వందలాది మంది చిరంజీవి పుట్టినరోజు వేడుకలకు తరలి వెళ్లడం అభినందనీయమన్నారు. ఈసందర్భంగా వేల్పుల వెంకటేష్ ను వెలిచాల రాజేందర్ అభినందించారు. ఈకార్యక్రమంలో చిరంజీవి రాష్ట్ర యువత అధ్యక్షులు వేల్పుల వెంకటేష్, ఆకుల నర్సన్న, ఆకుల ఉదయ్, బట్టు వర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

విశ్వభారత్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడుగా శివ వుల్క్ందకార్…

విశ్వభారత్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడుగా శివ వుల్క్ందకార్.

హైదారాబాద్,నేటిధాత్రి:

 

 

విశ్వభారత్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడుగా శివ వుల్క్ందకార్ ఎన్నికయ్యారు. బాధ్యతలు చేపట్టిన శివ వుల్క్ందకార్ సోమవారం రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ వ్యవస్థాపకురాలు యస్.రమాదేవి సమక్షంలో పార్టీ జాతీయ స్థాయి నేతలు రాష్ట్ర స్థాయి నాయకుల సమావేశం నిర్వహించారు.ఈ నేపథ్యంలో పార్టీ వ్యవస్థాపకురాలు యస్.రమాదేవి చేతుల మీదగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా శివ వుల్క్ందకార్ కు నియామక పత్రాన్ని అందజేశారు.తదనంతరం ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ తెలంగాణలో ప్రజా సమస్యల పరిష్కారం,కార్మిక,కర్షక,ఉద్యోగ,విద్యార్థి,యువత,మహిళా నిరుద్యోగుల సమస్యలపై శాంతియుత ఉద్యమాలు,పోరాటాలు చేస్తూ ప్రజలకు అండగా ఉండాలని సూచించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజ సేవకుల ఎన్నిక ఏప్పుడు,ఏక్కడ ఎలాంటి అవకాశం వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా వుండాలని కోరారు.నూతంగా ఎన్నికైన రాష్ట్ర అద్యక్షుడు శివ వుల్క్ందకార్ మాట్లాడుతూ రాష్ట్రంలో పార్టీని క్షేత్రాస్తాయి నుండి పటిష్టమైన నాయకత్వం నిర్మాణం కోసం నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ప్రజలు పార్టీని హక్కున చేర్చుకునే విధంగా కార్యక్రమాలు చేపడుతానని అన్నారు. రాష్ట్ర ప్రజల ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమాలు చేస్తానన్నారు.ప్రజ సేవా చేయడానికి పార్టీ ఇచ్చిన గొప్ప అవకాశమని, పార్టీ వ్యవస్థాపకురాలు,జాతీయ అధ్యక్షురాలు యస్. రమాదేవి, జాతీయ,రాష్ట్ర నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు.

హైదరాబాద్‌లో వరుస దుర్ఘటన

హైదరాబాద్‌లో వరుస దుర్ఘటన
`వినాయక విగ్రహం తరలిస్తుండగా విద్యుత్‌ షాక్‌
`హైటెన్షన్‌ వైర్‌ తగలడంతో ఇద్దరు యువకుల దుర్మరణం
హైదరాబాద్‌,నేటిధాత్రి:

హైదరాబాద్‌ రామంతాపూర్‌లో శ్రీకృష్ణాష్టమి వేడుకుల్లో విషాదం మరువకముందే బండ్లగూడలో మరో ఘటన చోటుచేసుకున్నది. వినాయక విగ్రహాన్ని తీసుకెళ్తుండగా విద్యుత్‌ షాక్‌తో ఇద్దరు యువకులు మృతిచెందారు. కొందరు యువకులు భారీ వినాయక విగ్రహాన్ని తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో బండ్లగూడ వద్ద లంబోదరుడి విగ్రహానికి హై టెన్షన్‌ వైరు తరగలడంతో ట్రాక్టర్‌కు విద్యుత్‌ షాక్‌ తగిలింది. దీంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిని అఖిల్‌ అనే యువకుడిని దవాఖానకు తరలించారు. మృతులను టోని (21), వికాస్‌ (20)గా గుర్తించారు. కరెంటు షాక్‌తో ట్రాక్టర్‌ టైర్లు పూర్తిగా కాలిపోయాయి. దీంతో క్రేన్‌ సహాయంతో వినాయక విగ్రహాన్ని అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. రామంతాపూర్‌లోని గోఖలేనగర్‌లో శ్రీకృష్ణాష్టమి వేడుకల సందర్భంగా రథంపై శ్రీకృష్ణుడి ఉరేగింపు కోసం ప్రత్యేక రథాన్ని తయారు చేశారు. ఆదివారం రాత్రి స్థానిక వీధుల్లో యాదవ సంఘం భవనం నుంచి శ్రీకృష్ణుడి ఉరేగింపు చేపట్టారు. ఓవైపు వర్షం పడుతుండగా మరోవైపు భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణుడి రథయాత్ర కొనసాగింది. ఉరేగింపు దాదాపు పూర్తయి తిరిగి రథాన్ని యాదవ సంఘ భవనం వద్ద పెట్టేందుకు వెళ్తుండగా రథాన్ని ముందుకు లాగుతున్న జీపు ఆగిపోయింది. మరో వంద అడుగుల దూరం ఉండటంతో చేతులతో తోస్తూ వెళ్లారు. మరో 50 అడుగుల దూరం ఉండగానే ఆకస్మాత్తుగా రథాన్ని లాగుతున్న వాళ్లు గట్టిగా అరుస్తూ కిందపడి పోయారు. అప్పటికే రథంపై ఉన్న వాళ్లు ఏం జరిగిందో అర్థం కాక పరుగులు పెట్టారు. వేలాడుతున్న విద్యుత్తు తీగ రథానికి తగిలి షాక్‌ కొట్టింది. దీంతో వెనుక నుంచి తోస్తున్న వాళ్లు 9 మంది అపస్మార స్థితిలో పడిపోయారు. వారిని రక్షించేందుకు స్థానికులు కొందరికి సీపీఆర్‌ కూడా చేసినా ఫలితం లేకుండాపోయింది. ఐదుగురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మరో నలుగురిని చికిత్స కోసం వివిధ దవాఖానాలకు తరలించారు.

‘‘ఒక ఘటన మరువక ముందే మరోఘటన’’

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-19T131456.880-1.wav?_=21

అయ్యో దేవుడా
‘‘ఒక ఘటన మరువక ముందే మరోఘటన’’
వినాయక విగ్రహాన్ని తరలిస్తుండగా కరెంట్‌ షాక్‌.. ఇద్దరు యువకులు దుర్మరణం

హైదరాబాద్‌ ,నేటిధాత్రి:

 

 

హైదరాబాద్‌ రామంతాపూర్‌లో శ్రీకృష్ణాష్టమి వేడుకుల్లో విషాదం మరువకముందే బండ్లగూడలో మరో ఘటన చోటుచేసుకున్నది. వినాయక విగ్రహాన్ని తీసుకెళ్తుండగా విద్యుత్‌ షాక్‌తో ఇద్దరు యువకులు మృతిచెందారు. కొందరు యువకులు భారీ వినాయక విగ్రహాన్ని తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో బండ్లగూడ వద్ద లంబోదరుడి విగ్రహానికి హై టెన్షన్‌ వైరు తరగలడంతో ట్రాక్టర్‌కు విద్యుత్‌ షాక్‌ తగిలింది. దీంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిని అఖిల్‌ అనే యువకుడిని దవాఖానకు తరలించారు. మృతులను టోని (21), వికాస్‌ (20)గా గుర్తించారు. కరెంటు షాక్‌తో ట్రాక్టర్‌ టైర్లు పూర్తిగా కాలిపోయాయి. దీంతో క్రేన్‌ సహాయంతో వినాయక విగ్రహాన్ని అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఇంటిపై ఐటీ సోదాలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-57-1.wav?_=22

మరోసారి ఐటీ దూకుడు
మాజీ ఎంపీ రంజిత్‌ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు.. డీఎస్‌ఆర్‌ గ్రూప్‌ సంస్థల్లో కూడా..సోదాలు

హైదరాబాద్‌ ,నేటిధాత్రి:
చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్‌ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయన నివాసంతోపాటు కార్యాలయాల్లో కూడా గాలిస్తున్నారు. మరోవైపు డీఎస్‌ఆర్‌ గ్రూప్‌ కన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీలో కూడా అధికారులు సోదాలు చేస్తున్నారు. కంపెనీ టాక్స్‌ చెల్లింపులలో భారీగా అవకతవకలు జరిగినట్లు సమాచారం రావడంతో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు అధికారలు తెలిపారు.
డీఎస్‌ఆర్‌ గ్రూప్‌ కన్‌స్ట్రక్షన్స్‌తోపాటు డీఎస్‌ఆర్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, డీఎస్‌ఆర్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీల్లో మంగళవారం ఉదయం నుంచి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కంపెనీ ఎంపీ సుధాకర్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ప్రభాకర్‌ ఇండ్లలో తనిఖీలు చేస్తున్నారు. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఎస్‌ఆర్‌ నగర్‌, సురారంతోపాటు ఏకకాలంలో 10 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గడిచిన ఐదేండ్ల పన్నుల చెల్లింపులపై కంపెనీ యాజమాన్యాన్ని అధికారులు ఆరా తీస్తున్నారు. మాజీ ఎంపీ రంజిత్‌ రెడ్డి డీఎస్‌ఆర్‌ గ్రూప్‌లో భాగస్వామిగా ఉన్నారు.

“సంగారెడ్డి, మెదక్‌లో భారీ వర్షాలు”……

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-8-6.wav?_=23

సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రాకపోకలు తీవ్రంగా అంతరాయానికి గురయ్యాయి.

మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఇస్లాంపూర్‌లో అత్యధికంగా 17.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కౌడిపల్లి 17.2, పెద్ద శంకరంపేట 16.4, దామరంచ 15.8, మాసాయిపేట 14.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సంగారెడ్డి జిల్లా కంగ్టిలో 17 సెంటీమీటర్లు, కల్హేర్ 11.9, కడ్పాల్ 10.6, అన్నసాగర్ 10.3 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది.

ఇక నిన్న సిద్దిపేట జిల్లాలోని గౌరారం అత్యధికంగా 23.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు చేసింది. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసి రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదైంది.

హైదరాబాద్‌లోనూ రాత్రి నుంచి ఉదయం వరకు వర్షం కురిసి పలు ప్రాంతాలు నీటమునిగాయి. హైదర్‌నగర్ 4.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు చేసింది. మల్కాజిగిరి, కూకట్‌పల్లి, కాప్రా, శేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్, అల్వాల్ వంటి ప్రాంతాల్లో 4 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది. అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

“రామంతపూర్ విషాదం: కేటీఆర్, కవిత ఆవేదన”

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-6-9.wav?_=24

“రామంతపూర్ విషాదం: కేటీఆర్, కవిత ఆవేదన”

హైదరాబాద్‌ ఉప్పల్‌ రామంతపూర్‌ గోకులే నగర్లో శ్రీకృష్ణ జన్మాష్టమి శోభాయాత్ర సందర్భంగా విషాదం చోటుచేసుకుంది. ఊరేగింపులో రథానికి విద్యుత్‌ తీగలు తగలడంతో ఐదుగురు భక్తులు అక్కడికక్కడే మృతిచెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వారు సూచించారు.

సెట్విన్ ప్రధాన కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-15T144541.678.wav?_=25

 

సెట్విన్ ప్రధాన కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన

◆:- తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్‌రెడ్డి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం 79వ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో సెట్విన్ ఎండి.వేణుగోపాల్‌రావు, సెట్విన్ కార్పొరేషన్ అధికారులు,కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

బంజారాహిల్స్ పెద్దమ్మ గుడి కూల్చివేతపై హైకోర్టు కీలక ఆదేశాలు..!!

బంజారాహిల్స్ పెద్దమ్మ గుడి కూల్చివేతపై హైకోర్టు కీలక ఆదేశాలు..!!

హైదరాబాద్, నేటిధాత్రి :
బంజారాహిల్స్ పెద్దమ్మ గుడి కూల్చివేతపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రోడ్ నెం. 12 పెద్దమ్మ గుడి కూల్చివేతపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది.

ఈ విచారణ సందర్భంగా పెద్దమ్మ తల్లి విగ్రహాన్ని జాగ్రత్తగా భద్రపర్చాలని అధికారులకు హైకోర్టు ఆదేశించింది. పెద్దమ్మ తల్లి విగ్రహం కూల్చివేతపై పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈరోజు నెల 18కు వాయిదా వేసింది.

కొన్ని రోజుల క్రితం అధికారులు బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లో ఉన్న పెద్దమ్మ తల్లి ఆలయాన్ని కూల్చి వేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై ఇక్కడి స్థానికులు, హిందూ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేశాయి. దీనిలో భాగంగానే ఇటీవల కుంకుమార్చాన పూజకు పిలుపునివ్వడంతో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో ముందే అప్రమత్తమైన పోలీసులు.. ముందు జాగ్రత్తగా పెద్దమ్మ తల్లి ఆలయం దగ్గరగా భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. గతంలో ఈ అంశంపై బండి సంజయ్ సైతం స్పందించారు. తెలంగాణలో బోనాల పండుగ సందర్భంగా బంజారాహిల్స్‌లోని

సాంకేతికదన్నుగా….దోమలపై జీహెచ్‌ఎంసీ….

సాంకేతికదన్నుగా….దోమలపై జీహెచ్‌ఎంసీ యంత్రాంగం సమరభేరి
– ముమ్మరంగా యాంటి లార్వా ఆపరేషన్లు
– మానవ జోక్యం లేని ప్రదేశాలలోనూ డ్రోన్‌ లతో స్ప్రేయింగ్‌

హైదరాబాద్‌, నేటిధాత్రి:
సాంకేతికతదన్నుగా దోమల నివారణకు జీహెచ్‌ఎంసీ జీహెచ్‌ఎంసీ ముమ్మర ప్రయత్నాలు చేస్తుంది. తద్వారా గ్రేటర్‌ హైదరాబాద్‌ లో డెంగ్యూ, మలేరియా, చికెన్‌ గున్యా వంటి కేసులను తగ్గించేందుకు,వ్యాధుల వ్యాప్తిని అరికట్టేందుకు కృషి చేస్తుంది.
కమిషనర్‌ ఆదేశాల మేరకు జీహెచ్‌ఎంసీ ఎంటమాలజీ విభాగం అన్ని జోన్లు, సర్కిల్‌ ల పరిధిలో యాంటి లార్వా , యాంటి అడల్ట్‌ మాస్కిటో కార్యక్రమాలు అమలు చేస్తుంది.
గ్రేటర్‌ హైదరాబాద్‌ వ్యాప్తంగా గుర్తించిన 4846 కాలనీల్లో నీటి నిల్వ ప్రదేశాలు, చెరువులు, బాబులు, కుంటల్లో గాంబుసియా చేపలు, ఆయిల్‌ బాల్స్‌ విడుదల చేస్తూ దోమల వృద్ధి జరగకుండా చూస్తున్నారు.

ఒక్కొక్క వార్డుకు ఒక ఎంటమాలజీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ నియామకం కాగా, ఏఎల్‌ఓ ఆపరేషన్లు, ఫాగింగ్‌, ఐఈసీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.
లోతట్టు ప్రాంతాలు , సెల్లార్లు, నిర్మాణ క్షేత్రాల్లో ప్రత్యేక దృష్టి సారిస్తూ ఇండోర్‌ పైరిథ్రమ్‌ స్పేస్‌ స్ప్రే, లార్వల్‌ సర్వేలు చేపడుతున్నారు. ఒక్కో జోన్‌ కు ఒక్కో ఫ్లోట్‌ ట్రాష్‌ కలెక్టర్ల ద్వారా గుర్రపు డెక్కలను, కుళ్ళిన మొక్కల వ్యర్థాలను తొలగిస్తూ దోమలు వృద్ధి చెందకుండా చూస్తుంది. మానవ జోక్యం లేని ప్రదేశాలలోనూ డ్రోన్‌ లతో స్ప్రేయింగ్‌ దోమలను అరికట్టేందుకు జీహెచ్‌ఎంసీ అధునాతన సాంకేతికతను ఉపయోగించుకుంటుంది. డ్రోన్‌లను ఉపయోగించి స్ప్రేయింగ్‌ను నీటి ట్యాంకుల్లోనే కాకుండా, మానవ జోక్యం లేని ప్రదేశాలలో చేపడుతూ… దోమల బెడద లేకుండా చేస్తుంది.
ప్రతి మంగళవారం, శుక్రవారం, శనివారం క్రమం తప్పకుండా నగర పరిధిలో అన్ని పాఠశాలలు, కళాశాలల్లో చేపడుతూ విద్యార్థులను చైతన్యం చేస్తుంది. అలాగే ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రై డే పేరిట కాలనీల లో ఐ ఈ సి కార్యకలాపాలను చేపడుతుంది. అలాగే జీహెచ్‌ఎంసీ యాప్‌, ఈ-మెయిల్స్‌, ట్విట్టర్‌ ద్వారా పౌరుల ఫిర్యాదులను పరిష్కరిస్తున్నారు. నగర ప్రజలు తమ ఇంటితో పాటు పరిసరాలలో నీరు నిల్వకుండా చూడడం ద్వారా డెంగ్యూ , మలేరియా , చికెన్‌ గున్యా నివారణకు ప్రజలు సహకారం అందించాలని కోరుతున్నారు.

ఆన్లైన్‌ విజ్ఞప్తుల ఆధారంగా ఫాగింగ్‌

జీహెచ్‌ఎంసీ, తమ యాప్‌ ద్వారా ఫాగింగ్‌ కోసం అభ్యర్థనలను స్వీకరిస్తోంది. ప్రజలు తమ ప్రాంతాల్లో ఫాగింగ్‌ అవసరమని భావిస్తే, %వీవ Gనవీజ% యాప్‌ ద్వారా విజ్ఞప్తి చేసుకున్న వెంటనే ఫాగింగ్‌ చేపడుతూ దోమలను అరికడుతుంది.

టెక్నాలజీ దన్నుగా లార్వా ఆపరేషన్ల పర్యవేక్షణ

లార్వా వ్యతిరేక కార్యకలాపాలను జియో-ట్యాగ్‌ చేయబడిన ట్రాకింగ్‌ ద్వారా ప్రభావవంతంగా చేపడుతున్నారు.
జియో-ట్యాగ్‌ చేయబడిన ఫోటోల ఆధారంగా మానిటరింగ్‌ చేస్తున్నారు.
ఫలితంగా క్షేత్ర సిబ్బంది లో జవాబుదారీతనం పెంచుతుంది.

ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యం, ప్రజల సహకారంతో గ్రేటర్‌ హైదరాబాద్‌ లో చేపడుతున్న కార్యక్రమాలు చాలా వరకూ ప్రజలు డెంగ్యూ,మలేరియా, చికెన్‌ గున్యా బారిన పడకుండా చూస్తున్నాయి.

2,లక్షల రూపాయల ఎల్ఓసి ని అందజేసిన ఎమ్మెల్యే మాణిక్ రావు

2,లక్షల రూపాయల ఎల్ఓసి ని అందజేసిన ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మొగుడంపల్లి గ్రామానికి చెందిన చాకలి అంజమ్మ గారికి అత్యవసర చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 2,00,000/-( 2 లక్ష రూపాయల) ఎల్ఓసి మంజూరు చేయించి వారి కుటుంబ సభ్యులకు అందజేసిన జహీరాబాద్ శాసన సభ్యులు కొనింటి మాణిక్ రావు మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి ఈ సంధర్బంగా లబ్దిదారుని కుటుంబసభ్యులు ఎమ్మెల్యే గారికి ,మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి గారికి , ధన్యవాదాలు తెలిపారు

ఏఐఎంఐఎం నాయకులు సమస్యలపై మెమోరాండం అందించిన…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-11T131810.969-2.wav?_=26

దారుస్సలాంలో అసదుద్దీన్ ఓవైసీ కౌసర్ మొహియుద్దీన్‌ కు జహీరాబాద్ ఏఐఎంఐఎం నాయకులు సమస్యలపై మెమోరాండం అందించిన

◆:- జహీరాబాద్ పట్టణ కార్యదర్శి షేక్ రఫీ,

◆:- దగ్వాల్ అధ్యక్షుడు ముహమ్మద్ వాజిద్,

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్, ఏఐఎంఐఎం క్రియాశీల నాయకుడు, జహీరాబాద్ పట్టణ కార్యదర్శి షేక్ రఫీ మరియు దగ్వాల్ అధ్యక్షుడు ముహమ్మద్ వాజిద్, హైదరాబాద్‌లోని దారుస్సలాంలో అధ్యక్షుడు మజ్లిస్-ఇ-వర్కర్ పార్లమెంట్ బారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీ మరియు అసెంబ్లీ సభ్యుడు మరియు మెదక్ మరియు సంగారెడ్డి జిల్లాల ఇంచార్జ్ కౌసర్ మొహియుద్దీన్ తో ప్రత్యేక సమావేశం నిర్వహించడంతో జహీరాబాద్ రాజకీయ వాతావరణంలో కొత్త కదలిక వచ్చింది.
ఈ సెషన్ కేవలం పరిచయ కార్యక్రమం కాదు. జహీరాబాద్‌లోని వివిధ మున్సిపల్ వార్డుల పరిస్థితి, ప్రజా సమస్యలు మరియు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాన్ని చర్చించాల్సి ఉంది, అది జహీరాబాద్ అయినా లేదా కోహిర్ అయినా. వాజిద్ చర్చను లోతుగా చేస్తూ, ఎంపీటీసీ, జడ్పిటిసి గ్రామ పంచాయతీ మరియు వార్డు సభ్యుల పనితీరుపై వెలుగునింపారు మరియు షేఖాపూర్, మాడ్గి, దగ్వాల్ మరియు ఝరాసంగం యొక్క సర్పంచ్‌లు మరియు ఎన్నికైన ప్రతినిధులు ఈ ప్రాంత అభివృద్ధి మరియు అభివృద్ధిలో అందించిన గత సేవలను గుర్తు చేశారు. ఈ సందర్భంగా, బారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీ మరియు కౌసర్ మొహియుద్దీన్ జమాత్ ఈ అంశాలను తీవ్రంగా పరిశీలిస్తుందని హామీ ఇచ్చారు. గత ఎన్నికలలో జమాత్ ప్రతినిధులకు ప్రజలు అద్భుతమైన విజయాన్ని అందించినట్లే, ఈసారి కూడా వ్యవస్థీకృత మరియు ఉత్సాహభరితమైన ప్రచారంతో రంగంలోకి దిగాల్సిన అవసరం ఉందని వారు తమ ప్రసంగంలో చెప్పారు. రాబోయే రోజుల్లో జహీరాబాద్ మరియు కోహిర్ ఝరాసంగం లలో ఏఐఎంఐఎం రాజకీయ కార్యకలాపాలు మరింత ముమ్మరం అవుతాయనే వాస్తవానికి ఈ సమావేశం ఒక ముందడుగుగా అభివర్ణిస్తున్నారు.

 

ఠాగూర్ స్టేడియంలో ఆత్యా పాత్య సెలక్షన్స్ పోటీలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-06T154043.752.wav?_=27

ఠాగూర్ స్టేడియంలో ఆత్యా పాత్య సెలక్షన్స్ పోటీలు…

పోటీలు ప్రారంభించిన జిల్లా అధ్యక్షులు గాండ్ల సమ్మయ్య

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

మంచిర్యాల జిల్లా స్థాయి అండర్ 15 అమ్మాయిల, అబ్బాయిల ఆత్యా పాత్యా పోటీల సెలక్షన్స్ రామకృష్ణాపూర్ పట్టణంలోని సింగరేణి ఠాగూర్ స్టేడియంలో బుదవారం జరిగాయి. సెలక్షన్స్ పోటీలను జిల్లా అధ్యక్షులు గాండ్ల సమ్మయ్య, ఉపాధ్యక్షులు దేవేందర్, సంతోష్ ,జిల్లా సెక్రటరీ పెద్దపల్లి ఉప్పలయ్య,ట్రెసరర్ దొంతుల వర్ష, నేషనల్ రెఫరీ విశాల, జాతీయ స్థాయి క్రీడాకారులు పాగే రాము, శ్రీ వల్లి, పీ,డీ మల్లిక, పి,ఈ,టి లు సానియా, రఘు లు ప్రారంభించారు.

 

ఈ సందర్భంగా వారు మాట్లాడారు. జిల్లాలోని జైపూర్ సోషల్ వెల్ఫేర్ పాఠశాల బాయ్స్, మందమర్రి కస్తూరిబా పాఠశాల అమ్మాయిలు, మంచిర్యాల స్ప్రింగ్ ఫీల్డ్ స్కూల్ అబ్బాయిలు, రామకృష్ణాపూర్ గురుకుల విద్యార్థినులు పోటీలలో పాల్గొన్నారని తెలిపారు. పోటీల్లో పాల్గొన్న ఐదుగురు అమ్మాయిలు, ఐదుగురు అబ్బాయిలను సెలక్షన్ చేస్తామని అన్నారు. ఇక్కడ ఎంపికైన వారు ఈనెల 10న హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల సెలక్షన్స్ లో పాల్గొంటారని తెలిపారు.

హైదరాబాద్ మెట్రో దశ 2…

హైదరాబాద్ మెట్రో సేవల విస్తరణ కొనసాగుతోంది. ఇప్పుడు ఫేజ్ 2 ద్వారా నగరానికి మరింత మెరుగైన రవాణా సౌకర్యం లభించనుంది. భారీ మెగా ప్రాజెక్టులు ప్రారంభమవుతున్నాయి.

నేటి ధాత్రి

ముఖ్యాంశం – ఫేజ్ 2 పూర్తి వివరాలు, పనుల స్థితి, ప్రయోజనాలు.

MetroPhase2

1️⃣ ఫేజ్ 2-A: ప్రాథమిక విస్తరణ (76.4 కిమీ)

ఐదు కారిడార్లు:

  • నాగోల్ – శంషాబాద్ (RGIA)

  • రైడుర్గ్ – కోకాపేట్

  • MGBS – చంద్రాయణగుట్ట

  • మియాపూర్ – పటాన్‌చేరు

  • LB నగర్ – హయత్ నగర్

మొత్తం పొడవు: 76.4 కిమీ
కొత్త స్టేషన్లు (LB నగర్ – హయత్ నగర్ – 7.1 కిమీ):
చింతలకుంట, వనస్థలిపురం, ఆటోనగర్, లెక్చరర్స్ కాలనీ, RTC కాలనీ, హయత్ నగర్

పనుల ప్రారంభం: జనవరి 2025లో భూమి అందజేత కోసం ఇప్పటికే 500కి పైగా ఎస్‌ఖావేషన్ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి.

2️⃣ ఫేజ్ 2-B: నూతన కారిడార్లు (86.1 కిమీ)

  • JBS – మెడ్చల్ (24.5 కిమీ, 18 స్టేషన్లు)

  • JBS – శామిర్‌పేట (22 కిమీ, 14 స్టేషన్లు)

  • RGIA – ఫ్యూచర్ సిటీ (Skill University) (39.6 కిమీ, ఇందులో 1.5 కిమీ అండర్‌గ్రౌండ్)

మొత్తం ప్రాజెక్టు విలువ: ₹19,579 కోట్లు

3️⃣ పథకాల సమగ్ర స్థితి & వ్యయ నిర్వహణ

ఫేజ్ 2-A మొత్తం వ్యయం: ₹24,269 కోట్లు

  • రాష్ట్ర ప్రభుత్వం: ₹7,313 కోట్లు (30%)

  • కేంద్ర ప్రభుత్వం: ₹4,230 కోట్లు (18%)

  • JICA/ADB/NDB రుణాలు: ₹11,693 కోట్లు (48%)

  • PPP మోడల్ ద్వారా: ₹1,033 కోట్లు (4%)

ప్రతి కిలోమీటరుకి ఖర్చు: సుమారుగా ₹318 కోట్లు — ఇది ఇతర నగరాల్లోని అండర్‌గ్రౌండ్ నిర్మాణాల కంటే తక్కువ స్థాయిలోనే ఉంది.

ప్రయాణదారుల అంచనా: రోజుకు 8 లక్షల మంది ప్రయాణిస్తారని అంచనా

4️⃣ ప్రాజెక్ట్ టైమ్‌లైన్ & ప్రస్తుత స్థితి

  • ఫేజ్ 2-A పనులు: 4 సంవత్సరాల్లో పూర్తి చేయాలనే లక్ష్యం

  • ఫేజ్ 2-B: DPRs పూర్తయ్యాయి, ప్రభుత్వ సమీక్షకు పంపబడ్డాయి

  • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: కేంద్ర శాఖలతో చర్చలు జరిపి ప్రాజెక్టును వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు

5️⃣ ఫేజ్ 2 ప్రయోజనాలు

  • నగర అంతటా రవాణా వేగం పెరుగుతుంది

  • ట్రాఫిక్ రద్దీ నుంచి ఉపశమనం

  • కార్బన్ ఉద్గారాల్లో తగ్గింపు

  • RGIA, JBS, మెడ్చల్, శామిర్‌పేట, ఫ్యూచర్ సిటీ వంటి ప్రధాన కేంద్రాలకు మెట్రో కనెక్టివిటీ

  • ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులకు మరింత మెరుగైన ప్రయాణ సౌలభ్యం

MetroPhase2


Outro (4:30–5:00)

“మీ అభిప్రాయమేమిటి? హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2లో ఏ కారిడార్‌కి ముందుగా ప్రాధాన్యం ఇవ్వాలి అనిపిస్తోంది? కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి – నెటిధాత్రిలోనే అన్ని తాజా వార్తలు!”

హ్యాష్‌ట్యాగ్స్:

#HyderabadMetroPhase2 #NetidhathriNews #MetroExpansion #TelanganaMetro #HyderabadTransport

ఆస్ట్రా మైక్రోవేవ్‌కు రూ 2000 కోట్ల ఆర్డర్‌

 

ఆస్ట్రా మైక్రోవేవ్‌కు రూ 2000 కోట్ల ఆర్డర్‌

 

హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న ఆస్ట్రా మైక్రోవేవ్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌ (ఏఎంపీఎల్‌)కు రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి మరో భారీ ఆర్డర్‌ లభించే సూచనలు కనిపిస్తున్నాయి…

హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న ఆస్ట్రా మైక్రోవేవ్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌ (ఏఎంపీఎల్‌)కు రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి మరో భారీ ఆర్డర్‌ లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ఆర్డర్‌ విలువ రూ.1,800 కోట్ల నుంచి రూ.2,000 కోట్ల వరకు ఉండే అవకాశం ఉందని కంపెనీ డైరెక్టర్‌ అతిమ్‌ కాబ్రా సూచనప్రాయంగా వెల్లడించారు. ఆత్మ నిర్బర్‌ భారత్‌లో భాగంగా భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్‌) చెందిన 230 సుఖోయ్‌-30 యుద్ధ విమానాల ఆధునీకరణతో పాటు పెద్దఎత్తున క్విక్‌ రియాక్షన్‌ సర్ఫేస్‌ టు ఎయిర్‌ మిస్సైల్స్‌ (క్యూఆర్‌ఎ్‌సఏఎం) అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇటీవల రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షతన సమావేశమైన డిఫెన్స్‌ అక్విజిషన్‌ కౌన్సిల్‌ (డీఏసీ) ఇందుకు ఆమోదం తెలిపింది. ఈ రెండు ప్రాజెక్టులకు అవసరమైన కీలక ఎలకా్ట్రనిక్‌ ఉపకరణాల సరఫరా కాంట్రాక్టు తమకు దక్కే అవకాశం ఉందని కాబ్రా తెలిపారు. కాగా కంపెనీ ఇప్పటికే విరూపాక్ష రాడార్‌ కార్యక్రమంలో కీలకంగా ఉంది.

మళ్లీ పెరిగిన బంగారం ధరలు..

మళ్లీ పెరిగిన బంగారం ధరలు..

 

 నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 90,600 రూపాయల దగ్గర..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 98,840 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 74,130 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది.

 

బంగారానికి మహిళలకు కొన్ని వేల ఏళ్ల నుంచి అవినాభావ సంబంధం ఉంది. ఆడవాళ్లు తమ దగ్గర ఎంత బంగారం ఉన్నా.. ఇంకా కావాలంటారే తప్ప వద్దు అనరు. శుభకార్యాల్లో బంగారం విషయాలే ప్రధాన టాపిక్ అవుతాయి. భారతీయ సంస్కృతిలో ఓ భాగం అయిన బంగారం ధరలు పేద, మధ్య తరగతి వాళ్లకు షాక్ ఇస్తున్నాయి. రోజు రోజుకు పెరుగుతూ పోతున్నాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 99వేల దగ్గర ట్రేడ్ అవుతోంది. రానున్న రోజుల్లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.

 

హైదరాబాద్‌లో నేటి బంగారం ధరలు ఇలా..

హైదరాబాద్ మహా నగరంలో నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 90,600 రూపాయల దగ్గర..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 98,840 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 74,130 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. నిన్నటితో పోల్చుకుంటే పది గ్రాముల బంగారంపై.. గ్రాముకు ఒక రూపాయి చొప్పున 10 రూపాయలు పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 98,850 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 90,610 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర .. 74,140 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది.

 

 

 

 

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు

  • విజయవాడ 9,513
  • చెన్నై 9,885
  • ముంబై 9,885
  • విశాఖపట్నం 9,885

 

చలో హైదరాబాద్ కు తరలి వెళ్ళిన..

చలో హైదరాబాద్ కు
తరలి వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు

కొత్తగూడ, నేటిధాత్రి:

గ్రామ కమిటీ అధ్యక్షుల మరియు క్రియాశీల కార్యకర్తల సమ్మేళనానికి హైదరాబాద్ ఎల్బీ స్టేడియం కు విచ్చేసిన
ఏఐసీసీ అధ్యక్షుడు గౌరవ శ్రీ మల్లిఖార్జున ఖర్గే గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ…
ములుగు నియోజకవర్గ
మహబూబాబాద్ జిల్లా
కొత్తగూడ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ అనసూయ సీతక్క ఆదేశాల మేరకు నియోజకవర్గ ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ పటేల్ సూచనల మేరకు… కొత్తగూడ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వజ్జ సారయ్య నేతృత్వంలో ర్యాలీ నిర్వహించి జేజేలు పలుకుతూ… కార్యకర్తలను చలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియం కు తరలించారు
ఈ కార్యక్రమంలో
కొత్తగూడ మండల అన్ని గ్రామాల పార్టీ అధ్యక్షులు , మండల నాయకులు ముఖ్య కార్యకర్తలు సోషల్ మీడియా విభాగం యువజన నాయకులు తరలి వెళ్లారు.

చలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియం కు .

చలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియం కు తరలి వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డా౹౹ఎ.చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ గ్రామ అధ్యక్షుల సమ్మేళన బహిరంగ సభకు బయలుదేరిన,జహీరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు మరియు నాయకులు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు హన్మంత్ రావ్ పటేల్ గారు,శ్రీనివాస్ రెడ్డి, రామలింగారెడ్డి,మాక్సూద్ అహ్మద్,పట్టణ అధ్యక్షులు కండేం.నర్సింలు గారు మరియు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, గ్రామ అధ్యక్షులు పాల్గొని సభకు బయలుదేరడం జరిగింది.

వివాహ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే .

వివాహ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

హైదరాబాద్ వారాహి బ్యాంకేట్ హాల్ లో జరిగిన మాజి ఆత్మ చైర్మన్ పెంటా రెడ్డి గారి మనుమడి జన్మదిన వేడుకలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించిన జహీరాబాద్ శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు ,జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ,మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి,సీనియర్ నాయకులు నామ రవికిరణ్,మాజి సర్పంచ్ ఈశ్వర్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

కేబినెట్‌ మీటింగ్‌కు వచ్చిన పవన్..

కేబినెట్‌ మీటింగ్‌కు వచ్చిన పవన్.. వెంటనే హైదరాబాద్‌కు పయనం

 

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హుటాహుటిన హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు. ఏపీ కేబినెట్‌ సమావేశానికి వచ్చిన ఆయన వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారు.

 

 

 

 

అమరావతి, జూన్ 24: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) హైదరాబాద్‌కు పయనమయ్యారు. పవన్ తల్లి అంజనా దేవి (Anjana Devi) స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్నారు. విషయం తెలిసిన వెంటనే పవన్ హుటాహుటిన హైదరాబాద్‌కు బయలుదేరారు. ఈరోజు (సోమవారం) ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి ఉపముఖ్యమంత్రి కూడా వచ్చారు. కేబినెట్ సమావేశం మొదలవగానే తల్లికి అనారోగ్యంగా ఉందని సమాచారం అందింది. దీంతో కేబినెట్ అనుమతి తీసుకుని మరీ పవన్ హైదరాబాద్‌కు వెళ్లారు. కేబినెట్‌కు వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబుకు (CM Chandrababu Naidu) చెప్పి పవన్ కళ్యాణ్ గన్నవరం ఎయిర్‌పోర్టుకు బయలుదేరి వెళ్లారు.

మరోవైపు.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. అమరావతికి వివిధ కంపెనీల రాకకు సంబంధించి ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. ఏడవ ఎస్‌ఐపీబీ సమావేశంలో ఆమోదం తెలిపిన 19 ప్రాజెక్టులకు సంబంధించి రూ.28,546 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది.

అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ పరిధిలో 1450 ఎకరాల్లో మౌలికవసతుల కల్పనకు టెండర్ పిలవడానికి ఈ సమావేశంలో మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. విశాఖలో దిగ్గజ ఐటి సంస్థ కాగ్నిజెంట్‌కు 22.19 ఎకరాల భూమిని ఎకరా 99 పైసలకు కేటాయించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. 49వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం నిర్ణయాలకు కూడా ఆమోదం తెలుపనుంది కేబినెట్. పురపాలక శాఖలో 40 బిల్డింగ్ ఇన్‌స్ట్రక్టర్ల పోస్టులను అప్‌గ్రేడ్‌ చేసేందుకు కేబినెట్ అంగీకారం తెలుపనుంది. కొత్తగా మరో 7 అన్నాక్యాంటీన్లు ఏర్పాటుకు కూడా కేబినెట్ ఆమోదం తెలుపనుంది.

ఈనెల 19న చలో హైదరాబాద్ విజయవంతం చెయ్యాలి.

ఈనెల 19న చలో హైదరాబాద్ విజయవంతం చెయ్యాలి

అంబాల చంద్రమౌళి మాదిగ ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి జిల్లా సీనియర్ నాయకులు

భూపాలపల్లి నేటిధాత్రి:

ఈనెల 19న హైదరాబాద్ నాగోల్ లోని శుభం కన్వెన్షన్ హాల్ లో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ సన్మాన సభ నిర్వహించడం జరుగుతుందని ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి జిల్లా సీనియర్ నాయకుడు అంబాల చంద్రమౌళి మాదిగ తెలిపారు జిల్లాలోని ఎమ్మార్పీఎస్ ఎంఎస్సీ అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని అంబాల చంద్రమౌళి మాదిగ పిలుపునిచ్చారు సోమవారం జిల్లా కేంద్రంలోని కాకతీయ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం పొందిన సందర్భంగా ఈనెల 19న విహెచ్ పిఎస్ సంఘo ఆధ్వర్యంలో వికలాంగులు పెద్ద ఎత్తున సన్మానం చేయబోతున్నారని తమకు సమాజంలో ప్రత్యేక గుర్తింపును తీసుకొని వచ్చి అనేక హక్కులను సాధించి పెట్టిన పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పట్ల కృతజ్ఞత భావంతో వికలాంగులు ఈ సన్మాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని వారికి చేయూతనందించాల్సిన బాధ్యత ఎమ్మార్పీఎస్ అన్ని అనుబంధ సంఘాల నాయకుల మీద ఉంది కనుక మనలో జిల్లా మండల స్థాయిలో ఎదిగిన నాయకులు నాయకురాలు తక్షణమే తమ సొంత గ్రామాలలోని వికలాంగులను సమన్వయం చేసి వాహనం ఏర్పాటు చేసి వారిని పెద్ద ఎత్తున జాగ్రత్తగా హైదరాబాద్ కు తరలించాలని వివిధ మండలాలలో ఇన్చార్జులుగా కొనసాగుతున్న వారు ఫోన్లో ద్వారా తమ సొంత గ్రామాలలోని వికలాంగులను మాట్లాడి హైదరాబాద్కు తరలించే విధంగా అన్ని రకాల బాధ్యతలు తీసుకోవాలని మన అధినేత మంద కృష్ణ మాదిగ మీద ఎంతో అభిమానంతో వికలాంగులు చేస్తున్న సన్మాన సభను విజయవంతం చేయాలని చంద్రమౌళి మాదిగ పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమంలో
ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు దోర్నాల రాజేందర్ మాదిగ
నియోజకవర్గ ఇన్చార్జి అంతడుపుల సురేష్ మాదిగ
బట్టువిజయకుమార్
మేకల రమేష్ మాదిగ
ఎంవైఎస్ జిల్లా అధ్యక్షులు
మంద తిరుపతి
ఎర్ర భద్రయ్య మాదిగ
సిరిపంగ చంటి మాదిగ
ఓనపకల కుమార్ మాదిగ
అంతడుపుల చందర్ మాదిగ తదితరులు పాల్గొన్నారు

24న హైదరాబాద్ లో ఆర్టీసీ బీసీ ఉద్యోగుల మహాసభ.

24న హైదరాబాద్ లో ఆర్టీసీ బీసీ ఉద్యోగుల మహాసభ

మహాసభను జయప్రదం చేయాలి

వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు గొలనకొండ వేణు పిలుపు

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

 

ఈనెల 24 న రోజున హైదరాబాద్ లో జరుగు ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం 8వ రాష్ట్ర మహాసభను విజయవంతం చేయాలని ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు గొలనకొండ వేణు శుక్రవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనున్న అధిక సంఖ్యలో ఉన్న ఆర్టీసీ బీసీ ఉద్యోగులు దైనందిక ఉద్యోగ జీవితంలో, విధి నిర్వహణలో నిరంతరం ఎన్నో ఆటు పోట్లను ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. 78 ఏళ్ళ స్వాతంత్ర భారతదేశంలో ఆర్టీసీ బీసీ ఉద్యోగుల స్థానం రోజు రోజుకు బలోపేతం కావలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంక్షేమమే ప్రధాన ఎజెండగా ముందుకు సాగాలన్నారు. మహిళా, పురుష ఉద్యోగుల ప్రమోషన్ విషయంలో ఎదుర్కొంటున్న సమస్యలను సత్వరమే పరిష్కరించి దారి చూపాలన్నారు. ప్రతి నెల న్యాయబద్ధంగా ఆర్ఎం స్థాయి అధికారితో జరుగవలసిన జాయింట్ మీటింగ్ లో బీసీ ఉద్యోగుల వ్యక్తిగత, తదితర సమస్యలను పరిష్కరించవలసిందిగా ఆయన కోరారు.

 

Congress

 

 

ప్రతి రెండు సంవత్సరాలకొక సారి జరిగే ఈ రాష్ట్ర స్థాయి మహాసభను ఈనెల జూన్ 24న, బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర అధ్యక్షులు తిరుపతయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిరంజన్ ఆధ్వర్యంలో జరుగుతుందని అన్నారు. ఈ రాష్ట్ర మహాసభకు ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమశాఖ మాత్యులు, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పాల్గొని ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించెదరు. ఆయనతో పాటు ప్రభుత్వ విప్, రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఇలాయ్యా, ముషీరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొంటారని ఆయన వివరించారు. ఆర్టీసీ బీసీ ఉద్యోగుల న్యాయమైన హక్కుల సాధన కోసం, భవిష్యత్తు కార్యచరణ కొరకై వరంగల్ ఉమ్మడి జిల్లాలోని 9 డిపోలు వరంగల్ -1, వరంగల్ -2, హనుమకొండ, జనగాం, పరకాల, భూపాలపల్లి, తొర్రూర్, నర్సంపేట, మహబూబాబాద్ డిపోలకు చెందిన బీసీ ఉద్యోగులు డ్రైవర్లు, కండక్టర్లు, సూపర్వైజర్లు, మెకానిక్ లు, మహిళా ఉద్యోగులు,వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని రాష్ట్ర మహాసభను జయప్రదం చేయవలసిందిగా వేణు పిలుపునిచ్చారు.

24న హైదరాబాద్ లో ఆర్టీసీ బీసీ ఉద్యోగుల మహాసభ.

24న హైదరాబాద్ లో ఆర్టీసీ బీసీ ఉద్యోగుల మహాసభ

మహాసభను జయప్రదం చేయాలి

వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు గొలనకొండ వేణు పిలుపు

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

 

 

ఈనెల 24 న రోజున హైదరాబాద్ లో జరుగు ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం 8వ రాష్ట్ర మహాసభను విజయవంతం చేయాలని ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు గొలనకొండ వేణు శుక్రవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనున్న అధిక సంఖ్యలో ఉన్న ఆర్టీసీ బీసీ ఉద్యోగులు దైనందిక ఉద్యోగ జీవితంలో, విధి నిర్వహణలో నిరంతరం ఎన్నో ఆటు పోట్లను ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. 78 ఏళ్ళ స్వాతంత్ర భారతదేశంలో ఆర్టీసీ బీసీ ఉద్యోగుల స్థానం రోజు రోజుకు బలోపేతం కావలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంక్షేమమే ప్రధాన ఎజెండగా ముందుకు సాగాలన్నారు. మహిళా, పురుష ఉద్యోగుల ప్రమోషన్ విషయంలో ఎదుర్కొంటున్న సమస్యలను సత్వరమే పరిష్కరించి దారి చూపాలన్నారు. ప్రతి నెల న్యాయబద్ధంగా ఆర్ఎం స్థాయి అధికారితో జరుగవలసిన జాయింట్ మీటింగ్ లో బీసీ ఉద్యోగుల వ్యక్తిగత, తదితర సమస్యలను పరిష్కరించవలసిందిగా ఆయన కోరారు.

 

Congress

 

 

ప్రతి రెండు సంవత్సరాలకొక సారి జరిగే ఈ రాష్ట్ర స్థాయి మహాసభను ఈనెల జూన్ 24న, బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర అధ్యక్షులు తిరుపతయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిరంజన్ ఆధ్వర్యంలో జరుగుతుందని అన్నారు. ఈ రాష్ట్ర మహాసభకు ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమశాఖ మాత్యులు, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పాల్గొని ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించెదరు. ఆయనతో పాటు ప్రభుత్వ విప్, రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఇలాయ్యా, ముషీరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొంటారని ఆయన వివరించారు. ఆర్టీసీ బీసీ ఉద్యోగుల న్యాయమైన హక్కుల సాధన కోసం, భవిష్యత్తు కార్యచరణ కొరకై వరంగల్ ఉమ్మడి జిల్లాలోని 9 డిపోలు వరంగల్ -1, వరంగల్ -2, హనుమకొండ, జనగాం, పరకాల, భూపాలపల్లి, తొర్రూర్, నర్సంపేట, మహబూబాబాద్ డిపోలకు చెందిన బీసీ ఉద్యోగులు డ్రైవర్లు, కండక్టర్లు, సూపర్వైజర్లు, మెకానిక్ లు, మహిళా ఉద్యోగులు,వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని రాష్ట్ర మహాసభను జయప్రదం చేయవలసిందిగా వేణు పిలుపునిచ్చారు

మిషన్ ఫర్ ద పూర్ చారి టేబుల్ ట్రస్ట్.!

మిషన్ ఫర్ ద పూర్ చారి టేబుల్ ట్రస్ట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి )

సిరిసిల్ల పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో ఈరోజు మిషన్ ఫర్ ద పూర్ చారి టేబుల్ ట్రస్ట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో సిరిసిల్ల కమిటీ మెంబర్స్ పద్మశాలీల ఉద్యోగ శిక్షణ కార్యక్రమం ప్రకటన ప్రెస్ క్లబ్ లో వెల్లడించడం జరిగినది. అనంతరం కమిటీ మెంబర్స్ గుంటుక మహేష్ మాట్లాడుతూ 10వ తరగతి పాస్ మరియు ఫెయిల్ అయిన విద్యార్థులు,24 నెలలు మరియు ఇంటర్మీడియట్ పాస్, ఫెయిల్ అయినటువంటి విద్యార్థులకు18 నెలలు ఉచిత భోజన,వసతి మరియు శిక్షణ పని కాలంలో స్టాయిపాయండ్ కూడా , ఇస్తుంది అని మిషన్ ఫర్ ద పూర్ చారి టేబుల్ ట్రస్ట్ కమిటీ సిరిసిల్ల మెంబర్స్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మిషన్ ఫర్ ద పూర్ చారి టేబుల్ ట్రస్ట్ కమిటీ మెంబర్స్ గుంటుక మహేష్, గోనే ఎల్లప్ప, కోడం ఆంజనేయులు, చిమ్మని ప్రకాష్, గంట్యాల సురేష్, కొండ ప్రతాప్, తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన దాడి.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన దాడిని ఖండిస్తూ భూమి అమ్మకాన్ని వెంటనే నిలిపివేయాలి లేకుంటే ప్రజా తిరుగుబాటు తప్పదు- తిరుపతి నాయక్

కరీంనగర్, నేటిధాత్రి:

లంబాడా జేఏసీ చైర్మన్ భూక్య తిరుపతి నాయక్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి మీరు వేలం వేస్తున్నది హెచ్సియూ భూములను కాదు, హైదరాబాద్ ఊపిరితిత్తులను. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్సియూకి 2300 ఎకరాల భూమిని ఇస్తే, నేడు అదే పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆభూములను అమ్మడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. పాలన చేతకాక, పన్నులు రాబట్టక, భూములను అమ్మి జీతాలు ఇవ్వాలని చూస్తున్న రేవంత్ రెడ్డి, ఇలాంటి చేతగాని ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి “ప్రభుత్వ భూమి ఒక గుంట కూడా అమ్మకుండా చూస్తాం” అని చెప్పి, నేడు యూనివర్సిటీ భూములు ఎలా అమ్ముతున్నాడు. ఉద్యోగాలు భర్తీ చేయడం, పథకాలు ప్రజలకు అందించడం చేతగాక, ఈరోజు భూములను కాపాడాలని నిరసన తెలియజేసిన విద్యార్థులను ఎక్కడికక్కడ అరెస్టు చేసి రాష్ట్రంలో ఒక నిర్బంధకాండ కొనసాగిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. నాడు యూనివర్సిటీలో రోహిత్ వేముల చనిపోతే రెండుసార్లు వచ్చిన రాహుల్ గాంధీ, ఈరోజు విద్యార్థులపై దాడి జరుగుతుంటే కనీసం స్పందించడం లేదేందుకో ప్రజాస్వామ్య వాదులారా, పర్యావరణ రక్షకులారా ఈరోజు యూనివర్సిటీ భూములను కాపాడడానికి ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. భూముల వేలం ప్రక్రియను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని, విద్యార్థుల మీద పెట్టిన కేసులను తక్షణమే ఎత్తివేయాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిరసన ధర్నాలు, రాస్తారోకోలు చేపడతామని బంజారా జేఏసీ చైర్మన్ భూక్యా తిరుపతి నాయక్ ఒక ప్రకటనలో హెచ్చరించారు.

ఐకెపి వివోఎలు ఛలో హైదరాబాద్

ఐకెపి వివోఎలు ఛలో హైదరాబాద్ కార్యక్రమం విజయవంతం చేయండి.

జహీరాబాద్. నేటి ధాత్రి 

న్యాల్కల్ మండల కేంద్రములోని ఇందిరా క్రాంతి పథకం ఆఫిస్ లో వివోఏల అధ్యక్షుడు నాగేందర్ ఆధ్వర్యంలో ఐకెపి వివోఎల సమావేశం శనివారం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో అధ్యక్షుడు నాగేందర్ మాట్లాడుతూ ఐకెపి వివోఏల సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చేయాలని, ఐకెపి వివోఎలందరు కదిలి వచ్చి రాష్ట్ర కమిటీ తల పెట్టిన ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

సోలార్ విద్యుత్ తో ఆదా…

ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు

తిరుప‌తి(నేటి ధాత్రి) ఫిబ్రవరి 08:

ప్ర‌ధాన‌మంత్రి సూర్య ఘ‌ర్ యోజ‌న ప‌థ‌కాన్ని ప్ర‌జ‌లు వినియోగించుకోవాల‌ని ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు కోరారు. సూర్య‌ఘ‌ర్ ప‌థ‌కంపై అవ‌గాహాన‌కు ఏపి ఎస్పీడీసిఎల్ సోలార్ కంపెనీల‌తో ఏర్పాటు చేసిన ఎగ్జిబిష‌న్ ను ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు ప్రారంభించారు. ఆదివారం వ‌ర‌కు ఈ ఎగ్జిబిష‌న్ జ‌ర‌గ‌నుంది.సోలార్ కంపెనీలు ఏర్పాటు చేసిన సోలార్ ప్యాన‌ల్స్ ను అధికారుల‌తో క‌లిసి ఎమ్మెల్యే ప‌రిశీలించారు. 2024లో కేంద్ర ప్ర‌భుత్వం సూర్య ఘ‌ర్ యోజ‌న ప‌థ‌కం తీసుకొచ్చింద‌ని ఈ ప‌థ‌కం కింద సోలార్ రూప్ టాప్ ఏర్పాటు చేసుకునే వారికి యాభై శాతం స‌బ్సీడి ప్ర‌భుత్వం అందిస్తుంద‌ని ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు తెలిపారు.2027 నాటికి కోటి ఇళ్ళ‌కు సౌర విద్యుత్ అందించాల‌ని కేంద్ర‌ప్ర‌భుత్వం నిర్ణ‌యించింద‌ని ఆయ‌న చెప్పారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోది ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ లు సోలార్ విద్యుత్ వినియోగాన్ని పోత్రాహిస్తున్నార‌ని ఆయ‌న తెలిపారు. సోలార్ రూప్ టాప్ ఏర్పాటుతో నాలుగేళ్ళ‌కు పెట్టిన ఖ‌ర్చు తీరిపోను 26 ఏళ్ళ పాటు సౌర విద్యుత్ పొంద‌వ‌చ్చ‌ని ఆయ‌న వివ‌రించారు. బ్యాంకులు సైతం ఈ ప‌థ‌కానికి త‌క్కువ వ‌డ్డీతో లోన్లు ఇస్తాయ‌ని ఆయ‌న చెప్పారు. ఈ కార్య‌క్రమంలో సీజీఏం లు రమణ దేవి,డి ఎస్ వరకుమార్,ఎస్ ఈ సురేంద్ర నాయుడు,ఈఈ చంద్రశేఖర్ రావు, డీఈ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

ఆరు గ్యారెంటీల అమలుకై చలో హైదరాబాద్

సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కారేపల్లి మండల కార్యదర్శి వై ప్రకాష్

కారేపల్లి నేటి ధాత్రి

కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను 420 హామీలను నెరవేర్చాలని ఈనెల 20 తారీఖున చలో హైదరాబాద్ మహా ప్రదర్శన సభను జయప్రదం చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు కారేపల్లి మండలం వేరుపల్లి జవాన్ల పెళ్లి గ్రామాలలో ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వై ప్రకాష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు కావస్తున్న వివిధ రకాల సర్వేలకే పరిమితమైందని ఎన్నికలకు ముందు ప్రజలను అన్ని విధాలుగా ఆదుకుంటామని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను 420 హామీలను ఇంతవరకు ఏ ఒక్కటి కూడా సంపూర్ణంగా అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని రైతులకు రెండు లక్షల రుణమాఫీ రైతు భరోసా ఇండ్లు లేని పేదలకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు రేషన్ కార్డులు పోడు భూములకు పట్టాలు కౌలు రైతులకు రైతులందరికీ ఎకరానికి 15 వేల రూపాయలు వ్యవసాయ కూలీలకు ఏటా 12 వేల రూపాయలు కింటాకు 500 రూపాయల బోనస్ చేయూత పథకం కింద నెలకు 4000 రూపాయల పెన్షన్ వివిధ రకాల పింఛన్లు కనీస వేతనం చట్టం అమలు చేయడంలో వంటలకు గిట్టుబాటు ధర ఇవ్వడంలో యువతకు ఏటా రెండు లక్షల ఉద్యోగాలు విద్య వైద్యం వివిధ రకాల వాగ్దానాలను హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దీని మూలంగా అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని దీనిని ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో ఖండించాలని దీని అమలుకై ఈనెల 20 తారీకున హైదరాబాదులో జరుగు మహా ప్రదర్శనను సభను అన్ని వర్గాల ప్రజలు వేలాదిగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ మండల నాయకులు కంచర్ల శ్రీనివాస్ రెడ్డి అలెం చంద్రయ్య బుర్ర కోటమ్మ సుగుణ పద్మ లక్ష్మి సరోజ తదితరులు పాల్గొన్నారు.

దిల్ రాజు” ఇంట్లో “ఐటి తనిఖీలు”

నేటిధాత్రి: హైదరాబాద్‌

(Hyderabad)లో ఐటీ దాడులు (IT Raids) కలకలం సృష్టిస్తున్నాయి. నగర వ్యాప్తంగా మొత్తం 8 చోట్ల ఏక కాలంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు (Income Tax Officers) సోదాలు చేడుతున్నారు. ఏకంగా 55 బృందాలు రంగంలోకి దిగి ప్రముఖ నిర్మాత “దిల్ రాజు” (Producer Dil Raju) నివాసంతో పాటు ఆఫీసులో మంగళవారం తెల్లవారుజాము నుంచి సోదాలు చేపడుతున్నారు. బంజారాహిల్స్‌ (Banjara Hills), జూబ్లీహిల్స్‌ (Jubilee Hills), కొండాపూర్‌ (Kondapur), గచ్చిబౌలి (Gachibowli)తో సహా పలు ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా దిల్ రాజు సోదరుడు, కుమార్తె, బంధువుల ఇళ్లలో కూడా అధికారులు జల్లెడ పడుతున్నారు. ఈ ఐటీ రెయిడ్స్‌పై మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

కాగా, ఇటీవలే నిర్మాత “దిల్ రాజు” (Dil Raju) భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’ (Game Changer), ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankrantiki Vasthunnam) మూవీలను నిర్మించారు. ఆ రెండు మూవీలు కూడా ఇటీవల సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలై సూపర్ హిట్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఐటీ అధికారులు ఆయన నివాసం, ఆఫీసు, బంధువుల ఇళ్లపై దాడులు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

హైదరాబాద్: గణేష్ చతుర్థి ఉత్సవాలకు మున్సిపల్ అధికారులు అన్ని ఏర్పాట్లను చేపట్టాయి.

హైదరాబాద్‌లో గణేష్ చతుర్థి ఉత్సవాలు మరియు నిమజ్జన ఊరేగింపును విజయవంతంగా నిర్వహించేందుకు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC), HMDA మరియు HMWS&SB సహా ఇతర మునిసిపల్ విభాగాలు అన్ని ఏర్పాట్లను చేపట్టాయి.

బుధవారం జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, వాటర్‌ బోర్డు, హెల్త్‌ వింగ్‌, అగ్నిమాపక శాఖ, ఆర్‌అండ్‌బీ, విద్యుత్తు శాఖలు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యుల మధ్య జరిగిన సమన్వయ సమావేశంలో గద్వాల మేయర్, గద్వాల మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రతి విషయంలోనూ రాజీ, చర్యలు తప్పవన్నారు. గణేష్ చతుర్థి మరియు నిమజ్జన వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు స్థాయి తీసుకోబడుతుంది.

ఈ ప్రయత్నాల్లో భాగంగా 74 ఇమ్మర్షన్ పాయింట్లు, 24 పోర్టబుల్ ఇమ్మర్షన్ బేబీ పాండ్‌లు, 27 బేబీ పాండ్‌లు, దాదాపు కోటి మట్టి గణేష్ విగ్రహాల పంపిణీ, ట్యాంక్ బండ్ చుట్టూ 36 నిమజ్జన వేదికల ఏర్పాటును పలు శాఖలు చేపట్టాయి. గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేసే దాదాపు 33 సరస్సులలో డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ (DRF) నుండి మొత్తం 453 మంది సిబ్బంది మరియు మరో 100 మంది ప్రొఫెషనల్ డైవర్లు/ఈతగాళ్లు అందుబాటులో ఉంటారు. నిమజ్జన విగ్రహాల తొలగింపునకు 10,500 మంది జీహెచ్‌ఎంసీ పారిశుధ్య కార్మికులను నియమించనున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version