గ్రామీణ ఆరోగ్య వ్యవస్థ బలోపేతం

గ్రామీణ ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయాలి

డి ఎం హెచ్ ఓ అనిత

జైపూర్,నేటి ధాత్రి:

ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో,గ్రామీణ ప్రజల ప్రాణాలను కాపాడడంలో ఆశా వర్కర్లు కీలక పాత్ర పోషించాలని జిల్లా వైద్యాధికారి ఎస్.అనిత అన్నారు.మంగళవారం ఆశా డే సందర్భంగా ఆమె జైపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు.మాతా శిశు సంరక్షణ,టీకాల కార్యక్రమాలు,వ్యాధి నివారణ,ఇంటింటి ఫీవర్ సర్వే వివిధ అంశాలపై డాక్టర్ ముస్తఫా తో కలిసి ఆశా వర్కర్లకు అవగాహన కల్పించారు.100% గర్భిణీల నమోదు,టీకాలు ఇవ్వడం, మందుల నిలువలు,తదితర అంశాలను సమీక్షించారు.అనంతరం కేజిబివి పాఠశాలను సందర్శించి,విద్యార్థులు ఒత్తిడిని జయించేందుకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు.రోజువారి దినచర్యలో యోగా, మెడిటేషన్,శారీరక వ్యాయామం పాటించి శరీరాన్ని దృఢంగా మార్చుకొని ఆరోగ్యంగా ఉండాలని సూచించారు.

ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు పంపిణీ

ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు పంపిణీ

జైపూర్,నేటి ధాత్రి:

జైపూర్ మండలం టేకుమట్ల ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నోట్ బుక్స్,పెన్నులు, పెన్సిళ్లను గోనె వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా విద్యార్థిని,విద్యార్థులకు మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా గోనె వెంకటేష్ మాట్లాడుతూ విద్యార్థులతో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.అలాగే ప్రాథమిక పాఠశాలకు ఏ అవసరం ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. అదేవిధంగా టేకుమట్ల గ్రామ సర్పంచ్ బల్ల వెంకటేష్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రతిరోజు పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయులు నేర్పించే విద్యను అభ్యసించి ఉన్నత స్థాయిలో నిలిచి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు జ్యోతి, వేణుమాధవ్,గ్రామ సర్పంచ్ బల్ల వెంకటేష్,ఉప సర్పంచ్ గోనె ప్రవీణ్,వార్డ్ మెంబర్లు అశోక్,తరుణ్,కాంగ్రెస్ నాయకులు గ్రామ ప్రజలు యువకులు పాల్గొన్నారు.

ఎన్నికల నేపథ్యంలో మండల అధికారుల సమీక్ష..

ఎన్నికల నేపథ్యంలో మండల అధికారుల సమీక్ష

జైపూర్,నేటి ధాత్రి:

 

ఎన్నికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జైపూర్ మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం లో మండల అధికారులు సమన్వయ సమీక్ష నిర్వహించారు.శనివారం నిర్వహించిన ఈ సమీక్షలో మండలంలోని అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.రెండవ సాధారణ ఎన్నికలు 2025 సంవత్సరానికి గాను సర్పంచ్ వార్డు సభ్యుల పోలింగ్ ప్రక్రియను సమర్ధవంతంగా నిర్వహించేలా పంచాయతీ కార్యదర్శులను,జిపిఓ సిబ్బందిని ముందస్తు ప్రణాళిక ప్రకారం సిద్ధం చేశారు.ఈ సందర్భంగా ఎంపీడీవో గుర్రం సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ.. పల్లెల్లో స్థానిక ఎన్నికల పోరంటే ఆశామాషిగా ఉండదని అధికారులకు సూచించారు.ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా,ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు సజావుగా జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంగా విధులు నిర్వహించాలన్నారు.నామినేషన్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని,ప్రజలకు నామినేషన్ కేంద్రాల గురించి విస్తృత ప్రచారం చేయించాలని తెలిపారు.పోలింగ్ కేంద్రాల్లో తగిన సౌకర్యాలు ఉండేటట్లు చూడాలన్నారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ వనజ రెడ్డి,సీఐ నవీన్ కుమార్, ఎస్సై శ్రీధర్,ఎంపీఓ శ్రీపతి బాబురావు,డిప్యూటీ తహసిల్దార్ సంతోష్,వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

ఎస్టిపిపి బ్రాంచ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన డి.పంతులా…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-01T122024.059.wav?_=1

 

ఎస్టిపిపి బ్రాంచ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన డి.పంతులా

జైపూర్,నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్లో శుక్రవారం సిఎంఓఎఐ జనరల్ బాడి మీటింగ్,జనరల్ మేనేజర్ అధ్యక్షతన జరిపించారు.ఈ సమావేశంలో లో జనరల్ సెక్రటరీ సంతోష్ ఇదివరకు జరిగిన కార్యక్రమాలను జరగబోయే కార్యక్రమాలను గురించి వివరించారు.తదుపరి జిఎం ఎస్టిపిపి ఎం.నరసింహారావు,జీఎం(పిసిఎస్) &(ఓ&ఎం) మదన్మోహన్ ఆదేశాల మేరకు ఖాళీగా ఉన్న ప్రెసిడెంట్,వైస్ ప్రెసిడెంట్,జాయింట్ సెక్రటరీ పదవులకు నామినేషన్ కోరడమైనది.దీనికి అధికారుల సంఘం సభ్యులందరూ సిఎంఓఎఐ ఎస్టిపిపి బ్రాంచ్ ప్రెసిడెంట్ గా డి.పంతులా ని ఏకగ్రివంగా ఎన్నుకున్నారు.వైస్ ప్రెసిడెంట్ గా జనగామ శ్రీనివాస్ ని,జాయింట్ సెక్రటరీ గా శ్యామల ని ఎన్నుకోవడం జరిగింది.అనంతరం నూతనంగా ఎన్నికైన ప్రెసిడెంట్ ధారావత్ పంతులా మాట్లాడుతూ.. అధికారుల సంఘం సభ్యులకి ఎస్టిపిపి యాజమాన్యానికి ప్రత్యెక ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే కాలంలో అందరి సహాయ,సహకారాలతో సెంట్రల్ కమిటి సభ్యులతో,యాజమాన్యాన్ని సమన్వయ పరుస్తూ పెండింగ్ లో ఉన్న పనులను, ఉద్యోగులకు సంబంధించిన సమస్యలను సాధించుకోవడానికి తనవంతు కృషి చేస్తానని తెలియజేసారు.ఈ కార్యక్రమానికి ఎస్టీపీపీ ఈడి సిహెచ్.చిరంజీవి,జిఎం ఎస్టిపిపి ఎం.నరసింహారావు,జీఎం(పిసిఎస్) & (ఓ&ఎం)మదన్మోహన్,ఏజిఎం (ఫైనాన్స్)మురళీధర్,డిజిఎం (సివిల్) ఆజాజుల్లా ఖాన్,డీజీఎం(పర్సనల్),డి కిరణ్ బాబు,కార్యవర్గ సభ్యులు డి.పంతులా,సంతోష్ కుమార్,జనగామ శ్రీనివాస్,అప్పారావు,రమేష్,శ్యామల,మోబిన్ పాల్గొన్నారు.

నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి…

నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

టి ఆర్ పి జిల్లా అధ్యక్షులు మహేష్ వర్మ

మంచిర్యాల,నేటి ధాత్రి:

నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.మొంథా తుఫాన్ ప్రభావంతో కుండపోత వర్షాలు కురుస్తున్న కారణంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని తెలంగాణ రాజ్యాధికార పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు మహేష్ వర్మ సూచించారు.ముఖ్యంగా దండేపల్లి,లక్షేట్టిపేట్,చెన్నూర్, కోటపల్లి,వేమనపల్లి,భీమిని, జైపూర్ మండలాల నదీ పరివాహక ప్రాంత గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. చెట్లు,కరెంటు పోల్స్ వంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు.వీలైనంతవరకు అత్యవసరమైతే తప్ప బయటకు రాకుండా ఉండాలని కోరారు.

దాబాలపై పోలీసుల దాడులు – మద్యం స్వాధీనం…

దాబాలపై పోలీసుల దాడులు – మద్యం స్వాధీనం

జైపూర్,నేటి ధాత్రి:

దాబాలపై పోలీసుల దాడులు నిర్వహించి మద్యం స్వాధీనం చేసుకున్నారు.
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని లక్ష్మిపూర్ సరిహద్దు ప్రాంతంలో జాతీయ రహదారిపై అక్రమంగా దాబాలు ఏర్పాటు చేసి మద్యం అమ్ముతున్న వారిపై ఎస్సై రాజేందర్ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు.ఈ దాడుల్లో మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.దాబా నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజేందర్ గురువారం తెలిపారు.ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది.

అమరవీరుల త్యాగాలకు నివాళిగా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు..

అమరవీరుల త్యాగాలకు నివాళిగా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు

సామాజిక సామరస్యంలో యువత భాగ్య స్వాములు కావాలి

పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్

జైపూర్,నేటి ధాత్రి:

 

రామగుండం పోలీస్ కమీషనరేట్ మంచిర్యాల జోన్ ఇందారం లోని మహి ఫంక్షన్ హల్ లో అమరవీరుల త్యాగాలకు నివాళిగా బుధవారం జైపూర్ సబ్ డివిజన్ పోలీస్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం,ఓపెన్ హౌస్ కార్యక్రమం కు అంబర్ కిషోర్ ఝా,ముఖ్య అతిథిగా హాజరై మంచిర్యాల డీసీపీ భాస్కర్ ఐపిఎస్ తో కలిసి ఓపెన్ హౌస్,రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి రక్తదానం చేసిన వారికి ప్రశంస పత్రాలను అందజేసి అభినందించారు. విద్యార్థినీ,విద్యార్థులకు ప్రజా రక్షణ,భద్రత సంబందించిన పోలీసు చట్టాల గురించి, పోలీసు విధులపై,షీ టీమ్స్, భరోసా సెంటర్స్ గురించి, కమ్యూనికేషన్ సిస్టం గురించి ఫింగర్ ప్రింట్ డివైస్ ల వల్ల కలిగే ఉపయోగాల గురించి, బీడీ టీమ్ ఎక్విప్మెంట్,డాగ్ స్క్వాడ్,ట్రాఫిక్ ఎక్విప్మెంట్, రోడ్డు ప్రమాదాలు స్పీడ్ లేజర్ గన్, ట్రాఫిక్ రూల్స్,ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు నిబంధనలు సైబర్ నేరాల గురించి పోలీసులు ఉపయోగిస్తున్న సాంకేతికత గురించి,షీటీమ్,భరోసా, గంజాయి ఇతర మత్తు పదార్థాలకు సంబంధించిన కిట్,తదితర స్టాల్స్ ఏర్పాటు చేసి సంబంధిత అధికారులు సిబ్బంది విద్యార్థులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు.పలు ప్రైవేట్‌ ప్రభుత్వ పాఠశాలలు, కళాశాల విద్యార్ధిని, విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొని ఈకార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈసందర్భంగా సీపీ మాట్లాడుతూ…విధి నిర్వర్తనలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల త్యాగాలను సమాజం ఎప్పటికీ మరువదని,వారి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం పోలీస్ ఫ్లాగ్ డే నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. పోలీస్ చేసేటువంటి సేవా కార్యక్రమాలకు ప్రజలు, యువత సహకరించినప్పుడు పోలీస్ వారి ఉత్సాహం, విశ్వాసం రెట్టింపు అవుతుందన్నారు.ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోనీ మారుమూల ప్రాంతంలను పోలీస్ వారు సందర్శించడం,ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందించడం ఒక పోలీస్ శాఖ తోనే సాధ్యం అవుతుంది తెలిపారు. ఎంతోమంది అమరవీరుల ప్రాణ త్యాగాలను స్మరిస్తూ వారిని ఆదర్శంగా తీసుకొని దేశ రాష్ట్ర అభివృద్ధిలో, సామాజిక సామరస్యంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని,సంఘవిద్రోక శక్తులు దేశంపై గాని రాష్ట్రం పై దాడీలకు పాల్పడినప్పుడు ఐక్యమత్యంగా ఉండి రక్షించుకోవచ్చు అన్నారు. రాష్ట్ర,దేశ రక్షణ కోసం పోలీస్, ఇతర సెంట్రల్ అర్ముడ్ ఫోర్స్ లలో ఉద్యోగాలను సాధించి రాష్ట్ర దేశ రక్షణ కొరకు దోహదపడటం, సహకరించడం చేయాలనీ కోరారు.రక్తదానం ప్రాణధానంతో సమానమని ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారి జీవితాలను కాపాడడంలో రక్తదానం కీలక పాత్ర పోషిస్తుందన్నారు.పోలీసులు కేవలం శాంతి భద్రతలను పరిరక్షించడమే కాకుండా ప్రజల అత్యవసర పరిస్థితి ప్రమాద సమయంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి,తల సేమియా వ్యాధిగ్రస్తుల కోసం రక్త దాన శిబిరం లు ఓపెన్ హౌస్ లు నిర్వహించడం జరుగుతుందన్నారు.ఇలాంటి సమయంలో మనం చేసే రక్తదానం వలన అత్యవసర సమయంలో ఉన్న వారికీ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
స్నిఫర్ డాగ్స్ తమ ప్రతిభతో ఆకట్టుకోగా,విద్యార్థులు ఆసక్తిగా వీక్షించారు. విద్యార్థుల్లో చట్టపరమైన అవగాహన పెంపు,పోలీస్ వ్యవస్థపై సానుకూల దృక్పథం కలిగించే లక్ష్యంతో కమీషనరేట్ పోలీస్ చేపట్టిన ఈ ఓపెన్ హౌస్ విద్యార్థులను ఎంతగానో ఉత్సాహపరిచిందని అన్నారు.
ఈకార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్ ఐపిఎస్, మంచిర్యాల ఏసీపీ ఆర్. ప్రకాష్,శ్రీరాంపూర్ సీఐ వేణు చందర్,చెన్నూర్ ఇన్స్పెక్టర్ దేవేందర్,చెన్నూర్ రూరల్ సీఐ బన్సీలాల్,మహిళ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కె.నరేష్, జైపూర్ ఎస్సై శ్రీధర్, శ్రీరాంపూర్ ఎస్సై సంతోష్, భీమారం ఎస్సై లక్ష్మి ప్రసన్న,పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల పనులు వేగవంతం చేయాలి – కలెక్టర్

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

జైపూర్,నేటి ధాత్రి:

నిరుపేదలకు గూడు కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసే విధంగా అధికారులు పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని జైపూర్ మండలం గంగిపల్లి,షెట్ పల్లి గ్రామాలలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల పురోగతిని మండల పరిషత్ అభివృద్ధి అధికారి సత్యనారాయణ,గృహ నిర్మాణ శాఖ ఏ.ఈ. కాంసాని లతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం నిరుపేదలకు అందించిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిబంధనల ప్రకారం నిర్దేశిత విస్తీర్ణంలో ఇల్లు నిర్మించుకునేలా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని,బేస్ మెంట్,లెంటల్,స్లాబ్ స్థాయిల వారీగా పూర్తి అయిన పనులకు సంబంధించి లబ్ధిదారుల ఖాతాలలో బిల్లులు జమ చేయడం జరుగుతుందని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ప్రభుత్వం ఇసుకను ఉచితంగా అందిస్తుందని,ఈ అవకాశాన్ని వినియోగించుకుని లబ్ధిదారులు త్వరితగతిన ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోవాలని తెలిపారు. అనంతరం మండలంలోని వేలాల గ్రామంలో గల ఇసుక రీచ్ ప్రాంతాన్ని పరిశీలించారు. నిబంధనల ప్రకారం ఇసుకను తీయాలని,ఇందిరమ్మ పథకంలో ఇండ్ల నిర్మాణాలకు, జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులకు ముందుగా ప్రాధాన్యతనివ్వాలని తెలిపారు.ఇసుక అక్రమ రవాణా జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని,నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఎస్టిపిపి ఫారెస్ట్ కాంటాక్ట్ కార్మికులపై ఫారెస్ట్ మేనేజర్ చంద్రమణి వేధింపులు..

ఎస్టిపిపి ఫారెస్ట్ కాంటాక్ట్ కార్మికులపై ఫారెస్ట్ మేనేజర్ చంద్రమణి వేధింపులు

ఫారెస్ట్ అధికారిణిని వెంటనేబదిలి చేయాలని ధర్నా చేపట్టిన హెచ్ఎంఎస్ యూనియన్

జైపూర్,నేటి ధాత్రి:

జైపూర్ మండలం ఎస్టిపిపి లో పని చేస్తున్న ఫారెస్ట్ కాంట్రాక్ట్ కార్మికులు తీవ్రంగా వేధింపులకు గురవుతున్నారంటూ హెచ్‌ఎంఎస్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా చేపట్టారు.ఫారెస్ట్ మేనేజర్ చంద్రమణి కార్మికులపై అసభ్య పదజాలంతో దూషణలు చేయడం,పనిలో అనవసర ఒత్తిడులు తీసుకురావడం,వర్షాలు పడితే పని బంద్ చేసి జీతాలు ఇవ్వకపోవడం,పనికి వచ్చినా మాస్టారు ఇవ్వకపోవడం వంటి చర్యలతో కార్మికులు తీవ్రంగా మనస్తాపానికి గురైనట్లు వాపోయారు.ప్రతి రోజు 200-300 మీటర్లు పని చేయాలంటూ భారం మోపుతూ,పని చేయలేని కార్మికులకు వార్నింగ్ లెటర్లు జారీ చేస్తు వేధించడంతో విసిగిపోయిన బాధిత కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ధర్నా నిర్వహించారు.ఈ విషయానికి స్పందించిన సింగరేణి యాజమాన్యం తరఫున జిఎం నర్సింహారావు,డీజిఎం పర్సనల్ కిరణ్ బాబు,ఇతర అధికారులు ధర్నా ప్రదేశానికి వచ్చి కార్మికుల సమస్యలను పరిశీలించి,వాటిని పరిష్కరించేందుకు హామీ ఇచ్చారు.ధర్నా అనంతరం జనరల్ మేనేజర్ నరసింహారావు కి మెమోరండం అందజేశారు.ఈ కార్యక్రమంలో హెచ్‌ఎంఎస్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ విక్రమ్ కుమార్,ఉపాధ్యక్షులు సాయికృష్ణ,చిప్పకుర్తి సంపత్, నవీన్,గోగు మణికుమార్ తదితరులు పాల్గొన్నారు.

పెట్రోల్ బంకులలో తనిఖీలు చేపట్టిన తహసిల్దార్ వనజా రెడ్డి

పెట్రోల్ బంకులలో తనిఖీలు చేపట్టిన తహసిల్దార్ వనజా రెడ్డి

జైపూర్,నేటి ధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

 

జైపూర్ మండలంలోని ఇందారం, నర్వ, జైపూర్ గ్రామాలలోని పెట్రోల్ బంకులను ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు తహసీల్దార్ వనజా రెడ్డి గురువారం తనిఖీలు చేపట్టారు. పెట్రోల్ బంకులలో యజమాన్యం కల్పిస్తున్న వివిధ సౌకర్యాలు ఉచిత గాలి, త్రాగునీరు టాయిలెట్స్, ఫైర్ ఫైటింగ్ ఎంక్విమెంట్లను తనిఖీలు చేసిన అనంతరం పెట్రోల్ బంకుకు వచ్చే వినియోగదారులతో మర్యాదపూర్వకంగా ఉంటూ నిబంధనల ప్రకారం పెట్రోల్ బంకులను నిర్వహించాలని అన్నారు.వినియోగదారులతో అసభ్యకరంగా ప్రవర్తించడం లేదా వారిని కించపరచడం లాంటిది చేస్తే తగు చర్యలు తీసుకుంటామని యజమానులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ తిరుపతి, జిపిఓ నవీన్, రాజు పాల్గొన్నారు.

పంచాయతీ ఎన్నికల నిర్వహణలో తనిఖీలు చేపట్టిన అధికారులు

2వ సాధారణ పంచాయతీ ఎన్నికల నిర్వహణ భాగంగా స్వేచ్ఛాయితంగా, పారదర్శకంగా నిష్పక్షపాతంగా జరిగే విధంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం తహసిల్దార్ వనజా రెడ్డి,ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్,ఎంపీఓ శ్రీపతి బాబురావు,సిఐ వేణు చందర్,శ్రీధర్ ఇందారం గ్రామంలో గురువారం తనిఖీ కేంద్రం ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీలు చేపట్టారు

పోషణ మాసం ఆరోగ్యం రక్షణే లక్ష్యం…

పోషణ మాసం ఆరోగ్యం రక్షణే లక్ష్యం

జైపూర్,నేటి ధాత్రి:

జైపూర్ మండలం టేకుమట్ల అంగన్వాడి కేంద్రంలో లో పోషణ మాసం కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ కవిత మాట్లాడుతూ..గర్భిణీ, బాలింతలు,పిల్లలు,కిషోర బాలికలతో పాటుగా ప్రతీ ఒక్కరూ పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు.తాజా పండ్లు,కూరగాయలు,పాలు తీసుకోవాలని,రక్త హీనత బారిన పడకుండా చూసుకోవాలని తెలిపారు. పుట్టిన బిడ్డకు 6 నెలల వయసు వచ్చేవరకు కేవలం తల్లి పాలు మాత్రమే ఇవ్వాలని కోరారు.అలాగే పిల్లలకు బయటి జంక్ ఫుడ్ కొనివ్వకూడదని,వాటి వల్ల తరచూ అనారోగ్య బారిన పడి ఒబెసిటీ వచ్చే అవకాశం ఉంటుందని వివరించారు. పిల్లలు వయసుకు తగిన ఎదుగుదల ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.అనంతరం గర్భిణీ మహిళతో పోషణ మాసం ప్రతిజ్ఞ చేపించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రావణి,అంగన్వాడి టీచర్స్ వరలక్ష్మీ,సునీత,శ్రీవాణి,ఆయా పిల్లలు,గర్భిణీలు,బాలింతలు, తల్లి తండ్రులు పాల్గొన్నారు.

ఎస్.జి.ఎఫ్ ఆధ్వర్యంలో అండర్-14 బాలుర ఎంపిక పోటీలు…

ఎస్.జి.ఎఫ్ ఆధ్వర్యంలో అండర్-14 బాలుర ఎంపిక పోటీలు

జైపూర్,నేటి ధాత్రి:

 

 

మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలో ఎస్.జి.ఎఫ్ అండర్-14 బాలుర ఎంపిక పోటీలు శనివారం టీజీఎస్‌డబ్ల్యూఆర్ఎస్ ఆధ్వర్యంలో (కోటపల్లి) ఘనంగా నిర్వహించబడ్డాయి.ఈ పోటీలకు జిల్లాలోని వివిధ పాఠశాలల నుండి 200 పైగా క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు.ఈ పోటీలను సీఐ వేణుచందర్ ప్రారంభించారు.ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో పీడీలు,పీటీలు తమ విద్యార్థులతో పాల్గొని పోటీలను విజయవంతం చేశారు.ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా ప్రిన్సిపాల్ శ్రీనివాస్ వ్యవహరించగా,ముఖ్య అతిథులుగా సీఐ శ్రీరాంపూర్ వేణు చందర్,తహసిల్దార్ వనజ రెడ్డి,ఎంపీడీవో సత్యనారాయణ గౌడు,ఎస్సై శ్రీధర్,టీజీఎస్‌డబ్ల్యూఆర్ఎస్ ప్రిన్సిపాల్ శ్రీధర్,జైపూర్ హైస్కూల్ హెచ్‌.ఎం.శ్రీనివాస్, ఎస్జిఎఫ్ సెక్రటరీ యాకూబ్,ఆబ్జర్వర్ ఫణిరాజా,నిర్వాహక కార్యదర్శి సాయి (పీడీ కోటపల్లి),వ్యాయామ ఉపాధ్యాయ సంఘ బాధ్యులు సుదర్శన్,బెల్లం శ్రీను,గాజుల శ్రీను,సిరంగి గోపాల్ తో పాటు సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు రోజీ వర కుమారి,దాసరి మల్లేష్,పున్నం,వహీదా బేగం,పద్మ,బోయిని శ్రీనివాస్,సత్యనారాయణ,విద్యార్థులు,తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర జట్టుకు ఎంపికైన గురుకుల విద్యార్థి…

రాష్ట్ర జట్టుకు ఎంపికైన గురుకుల విద్యార్థి

జైపూర్,నేటి ధాత్రి:

 

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థి ఇటీవల హైదరాబాదులో జరిగిన రాష్ట్రస్థాయి బాలబాలికల 17వ మినీ హ్యాండ్ బాల్ పోటీల్లో పాల్గొని అత్యంత ప్రతిభ కనబరిచిన క్రీడాకారుడు కావేరి పార్ధు జాతీయస్థాయికి అర్హత సాధించినట్లు,వ్యాయామ ఉపాధ్యాయులు గాంధార్ల సంతోష్,పిడి.రత్నం శ్రీనివాస్,పి.ఇ.టి,తెలిపారు.సెప్టెంబర్ 26 నుండి 29 వరకు హైదరాబాదులోని నిజాం కాలేజీలో జరిగే,జాతీయ స్థాయి 17వ మినీ హ్యాండ్ బాల్ పోటీల్లో రాష్ట్ర జట్టుకు ప్రాతినిథ్యం వహించనున్నట్లు,
ప్రిన్సిపల్ కోల నాగేశ్వరరావు తెలిపారు.వీరిని పాఠశాల సీనియర్ వైస్ ప్రిన్సిపల్ స్రవంతి,జూనియర్ వైస్ ప్రిన్సిపల్ మహిపాల్, హౌస్ మాస్టర్ స్వర్ణలత,ఉపాధ్యాయ బృందం అభినందించారు.

సొంత ఖర్చులతో బోర్ వెల్ మోటార్ ఏర్పాటు చేసిన యువత…

సొంత ఖర్చులతో బోర్ వెల్ మోటార్ ఏర్పాటు చేసిన యువత

జైపూర్,నేటి ధాత్రి:

 

 

సొంత ఖర్చులతో బోర్ వెల్ మోటార్ ఏర్పాటు చేసి కొత్తగూడెం కాలనీ వాసులకు నీటి కష్టాలు తొలగించిన యువకులు.జైపూర్ మండలం ముదిగుంట గ్రామంలోని కొత్తగూడెం కాలనీలో బోర్ వెల్ మోటార్ చెడిపోయి కాలనీ వాసులు గత రెండు నెలలుగా నీటి కష్టాలు ఎదుర్కొంటున్నామని అధికారుల దృష్టికి,ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన ఎవరూ కూడా పట్టించుకోలేదు అని గ్రామస్తులు వాపోయారు.ఈ విషయం తెలుసుకున్న ముదిగుంట గ్రామానికి చెందిన యువకులు స్వచ్ఛందంగా ముందుందుకు వచ్చిన యువకులు గుండా సురేష్ గౌడ్,ఆకుల రవికుమార్,జిల్లాల శ్రీకాంత్,దూగుట రాజశేఖర్ వారి సొంత ఖర్చులతో కొత్త మోటర్ బిగించి కాలనీవాసులు ఎదుర్కొంటున్న నీటి సమస్యకు పరిష్కార మార్గం చూపారు.ఈ సందర్భంగా యువత మాట్లాడుతూ.. గ్రామంలో ఏ సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకువస్తే తమ వంతుగా కృషిచేసి సమస్య పరిష్కారం అయ్యేలా చేస్తామని అన్నారు.అలాగే కొత్తగూడెం కాలనీ వాసుల నీటి కష్టాలు తొలగిపోవడంతో యువకులకి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

నిమజ్జనానికి ముస్తాబైన మట్టి గణపతి…

నిమజ్జనానికి ముస్తాబైన మట్టి గణపతి

ఆదర్శవంతంగా నిలిచిన మల్టీ వర్కర్ గట్టయ్య

జైపూర్,నేటి ధాత్రి:

జైపూర్ మండలం టేకుమట్ల గ్రామంలో మల్టీ వర్కర్ గా విధులు నిర్వహిస్తున్న జల్లంపల్లి గట్టయ్య గణేష్ నవరాత్రి లో భాగంగా తన కుమారుడితో మూడున్నర ఫీట్ల గణపతి విగ్రహం తయారు చేపించి తొమ్మిది రోజులు మట్టి గణపతికి అంగరంగ వైభవంగా పూజలు జరిపించారు.అలాగే గణపతి వద్ద అన్నదాత కార్యక్రమం నిర్వహించారు.అనేక రకాల కెమికల్స్ కలిపి తయారు చేసిన విగ్రహాలు ఏర్పాటు చేయడం వల్ల కాలుష్యం వెదజల్లి పర్యావరణం కలుషితం అవుతుందని అన్నారు.మట్టి గణేష్ విగ్రహాన్ని తయారు చేసుకొని పూజలు చేయడం చాలా సంతోషంగా ఉందని వారు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆవు…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-23T113732.763-1.wav?_=2

 

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆవు

జైపూర్,నేటి ధాత్రి:

 

 

మండల కేంద్రంలోని ఎస్టిపిపి పవర్ ప్లాంట్ సమీపంలోని జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున గుర్తుతెలియని వాహనం ఢీకొని ఆవు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పశువుల యజమానులు వాటిని నిర్లక్ష్యంతో వదిలిపెట్టడం వల్ల రోడ్డుపైకి వచ్చి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు అన్నారు. రోడ్డుపై ప్రమాదకరంగా ఉన్న ఆవుని గ్రామపంచాయతీ సిబ్బందితో ఎలాంటి ప్రమాదాలు జరగకముందే తొలగించాలని ప్రయాణికులు అధికారులను కోరుతున్నారు

ఉపాధి హామీ పథకంలో ఇంకుడు గుంతల నిర్మాణం…

ఉపాధి హామీ పథకంలో ఇంకుడు గుంతల నిర్మాణం

ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్

జైపూర్,నేటి ధాత్రి:

 

 

జైపూర్ మండలం ముదిగుంట గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అనవేన కొమురయ్య ఇంటి వద్ద శుక్రవారం ఇంకుడు గుంత నిర్మాణం ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్ చేపట్టారు.వారు మాట్లాడుతూ..ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని ప్రజలకు తెలిపారు.ఇంకుడు గుంతలు నిర్మించుకోవడం వల్ల వర్షపు నీటిని సంగ్రహించడం ద్వారా భూగర్భ జలాలను పునర్దించడానికి సహాయపడుతుంది.గ్రామీణ ప్రాంతాల్లో జీవజల పునరుద్ధరణతో ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని అన్నారు.ఈకార్యక్రమంలో ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్,ఎంపీఓ శ్రీపతి బాబురావు,ఏపీవో వెంకటేశ్వరరావు,పంచాయతీ కార్యదర్శి సురేష్,టెక్నికల్ అసిస్టెంట్ శిరీష,ఫీల్డ్ అసిస్టెంట్ సువర్ణ,కాంగ్రెస్ నాయకులు సుమన్,నారాయణ తదితరులు పాల్గొన్నారు.

రైతుల సంక్షేమం కోరి _ కాంగ్రెస్ పార్టీ సమరభేరి…

రైతుల సంక్షేమం కోరి _ కాంగ్రెస్ పార్టీ సమరభేరి

జిల్లా ప్రధాన కార్యదర్శి: రిక్కుల శ్రీనివాస్ రెడ్డి

జైపూర్,నేటి ధాత్రి:

 

 

రైతుల సంక్షేమం కోసమే గల్లి నుంచి ఢిల్లీ దాకా వెళ్లి పోరాటం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వమని కాంగ్రెస్ పార్టీ ఎంపీలు,ఎమ్మెల్యేలు,నాయకులు రైతుల తరఫున కేంద్రంతో పోరాడుతున్నారని,బిజెపి- బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కై రైతు సమస్యలపై నోరు మెదపట్లేదనీ,చోద్యం చూస్తున్నారు అని జిల్లా ప్రధాన కార్యదర్శి రిక్కుల శ్రీనివాస్ రెడ్డి బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ధ్వజమెత్తారు.గత పది సంవత్సరాలు అధికారంలో ఉండి రైతులను ఆదుకోలేని బీఆర్‌ఎస్ నేతలే ఇప్పుడు రైతులకు అన్యాయం జరుగుతుందని ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.రాష్ట్రంలో యూరియా కొరత ఉందని చెప్పడం అవివేకం అని మండిపడ్డారు.యూరియా కేటాయింపులో కీలక పాత్ర పోషించింది కాంగ్రెస్ పార్టీ అని,మాటలు కాదు,చర్యలు ముఖ్యమని,రైతులకు ఎరువులు తెప్పించేది కాంగ్రెస్‌ పార్టీ మాత్రమేనన్నారు.బీజేపీ–బీఆర్‌ఎస్ చేతగానితనం వల్లే రైతులు ఇబ్బందులు పడుతున్నారు అని రిక్కుల శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు.ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే లక్షల కోట్లు ఖర్చు చేసిందని నేతలు వివరించారు.ప్రజా సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యంమని,బీజేపీ–బిఆర్‌ఎస్ నాయకులు అభివృద్ధిని,ప్రజల ఆదరణను జీర్ణించుకోవడం లేదనీ,అందుకే వారు నిరాధార ఆరోపణలకు తెగబడుతున్నారనీ ఎద్దేవా చేశారు.చెన్నూర్ నియోజకవర్గం కార్మిక శాఖ మంత్రి గడ్డం వెంకటస్వామి ఆధ్వర్యంలో నిరంతరం సంక్షేమ పథకాలతో,అభివృద్ధి కార్యక్రమాలతో విజయవంతంగా ముందుకు కొనసాగుతుందని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఫయాజ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు శీలం వెంకటేశం,ఆసంపల్లి శ్రీకాంత్,గద్దల అనిల్ కుమార్, సుమన్,షారుక్,మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఫయాజ్,రమేష్ తదితరులు పాల్గొన్నారు.

కార్మికుల ఆరోగ్య సంక్షేమం కోసం బిఎంఎస్ కృషి…

కార్మికుల ఆరోగ్య సంక్షేమం కోసం బిఎంఎస్ కృషి

అధ్యక్షులు యాదగిరి సత్తయ్య

జైపూర్,నేటి ధాత్రి:

 

 

జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ కార్మికుల ఆరోగ్యం సంక్షేమం కోసం ఈఎస్ఐ డిస్పెన్సరీ,హాస్పిటల్ స్థాపనకు జైపూర్ పవర్ ప్లాంట్ యాజమాన్యం భూమి కేటాయించాలని పవర్ ప్లాంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చెన్న కేశవుల చిరంజీవి కి బుధవారం మెమోరండం అందించారు.అనంతరం యాదగిరి సత్తయ్య అధ్యక్షులు మాట్లాడుతూ యూనియన్ దీర్ఘకాలిక పోరాటం ఫలితముగా జైపూర్ పవర్ ప్లాంట్ కార్మికులకు ఈఎస్ఐ వైద్య హాస్పిటల్ కేటాయించిన బిఎంఎస్ ఈఎస్ఐ బోర్డు సభ్యులు బిఎంఎస్ కృషి ఫలితమని,తక్షణమే వైద్యం అందుబాటులోకి వచ్చే విధంగా యుద్ధ ప్రాతిపదికన భూమి కేటాయించి వైద్య సేవలు అందించుటకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశామన్నారు.జైపూర్ పవర్ ప్లాంట్ సింగరేణి యాజమాన్యం స్థలం కేటాయించాలని,నిర్మాణానికి చర్యలు చేపట్టాలని బిఎంఎస్ చేసిన విజ్ఞప్తిని సానుకూలంగా స్పందించిన యాజమాన్యం తక్షణమే చర్యలు చేపట్టే విధంగా కృషి చేస్తామని తెలిపారు.వేలాది మందికి కార్మికులకు కాంట్రాక్ట్ కార్మికులకు చుట్టుపక్కల ప్రభావిత గ్రామాలకు సంబంధించిన సాగరవేణి ప్రజలకు అందుబాటులో మెరుగైన వైద్యం అందించుటకు బిఎంఎస్ కృషి చేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీధర్,జనరల్ సెక్రెటరీ దుస్సా భాస్కర్,ముఖ్య నాయకులు వెంకటేశ్వర్లు,కిషన్ రెడ్డి,సతీష్ పాల్గొనడం పాల్గొన్నారు.

మహిళా సంఘం స్థలాన్ని కాపాడాలని తహసిల్దార్ కి వినతి పత్రం

మహిళా సంఘం స్థలాన్ని కాపాడాలని తహసిల్దార్ కి వినతి పత్రం

జైపూర్,నేటి ధాత్రి:

మహిళా సంఘం భవనం నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని కాపాడాలని తహసిల్దార్ కి మహిళా సంఘం నాయకులు సోమవారం వినతిపత్రం అందజేశారు.వెన్నెల వివో మహిళ సంఘం సభ్యులకు గత ప్రభుత్వం 152 సర్వే నెంబర్ లో అప్పటి ఎమ్మెల్యే మహిళా భవనం నిర్మాణం కొరకు స్థలాన్ని తహసిల్దార్ ద్వారా కేటాయించారని తెలిపారు.కానీ ఇప్పుడు కొందరు వ్యక్తులు ఫేక్ డాక్యుమెంట్స్ తో రామస్వామి అనే వ్యక్తి గోదావరిఖని కి చెందిన వ్యక్తులతో కొనుగోలు చేశామని ఆగస్టు 14న నిర్మించిన జెండా గద్దెను ధ్వంసం చేశారని పేర్కొన్నారు. తహసిల్దార్ కార్యాలయంలోని రికార్డులను పరిశీలించి సదరు వ్యక్తులపై కట్టపరమైన చర్యలు తీసుకోవాలని వెన్నెల వివో మహిళ సంఘం సభ్యులు తహసిల్దార్ వనజ రెడ్డిని విజ్ఞప్తి చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version