రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు విద్యార్థులు ఎంపిక…

రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు విద్యార్థులు ఎంపిక

భూపాలపల్లి నేటిధాత్రి

ఈనెల 17న వరంగల్ జిల్లా ఓ సిటీ క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి సాఫ్ట్ బాల్ క్రీడా పోటీలలో టేకుమట్ల కేజీవిపి పాఠశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఎన్. శరణ్య అద్భుత ప్రతిభ కనబరచి రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించింది. .
రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలు నిర్మల్ జిల్లాలో జరగనున్నాయి. ఈ విజయంపై కేజీవిపి పాఠశాల స్పెషల్ ఆఫీసర్ స్వప్న విద్యార్థి చరణ్యను వ్యాయామ ఉపాధ్యాయురాలు అనిత ను విద్యార్థిని తల్లిదండ్రులను  అభినందించారు.

అబ్దుల్ కలాం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత అబ్దుల్ అజీజ్..

అబ్దుల్ కలాం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత అబ్దుల్ అజీజ్..

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

మాజీ ఉపరాష్ట్రపతి, భారత దేశ సైన్స్ పితామహుడు స్వర్గీయ అబ్దుల్ కలాం 94వ జయంతి సందర్భంగా హైదరాబాదులోని రవీంద్ర భారతి లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కార్యక్రమం నిర్వహించారు. అబ్దుల్ కలాం రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు రామకృష్ణాపూర్ పట్టణ తవక్కల్ విద్యాసంస్థల అధినేత అబ్దుల్ అజీజ్ ఎంపికైన నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మాజీ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. రామకృష్ణాపూర్ పట్టణంలో గత 25 సంవత్సరాల నుండి విద్యారంగంలో చేసిన నిస్వార్ధ సేవలకు గాను అబ్దుల్ కలాం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం సంతోషంగా ఉందని అవార్డు గ్రహీత అబ్దుల్ అజీజ్ తెలిపారు. అబ్దుల్ అజీజ్ కు కలాం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడంతో పట్టణంలోని ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఎంబిబిఎస్ ఫ్రీ సీట్లు సాధించిన టెమ్రీస్ విద్యార్థులు…

ఎంబిబిఎస్ ఫ్రీ సీట్లు సాధించిన టెమ్రీస్ విద్యార్థులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి: జహీరాబాద్ మండలం అల్గోల్ గ్రామంలోని మైనారిటీ బాలుర గురుకులం – టెమ్రీస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కు చెందిన ముగ్గురు ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో ఉచిత సీట్లు సాధించారు. ఎమ్.డి ఉబేద్ నాగర్ కర్నూల్ మెడికల్ కాలేజీలో, గౌతమ్ కన్న నిర్మల్ మెడికల్ కాలేజీలో, డీ.స్రుజన్ కుమార్ ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీలో సీట్లు పొందారు. సంస్థ ప్రిన్సిపాల్స్ జే.రాములు, కె.ఎస్ జమీల్ విద్యార్థులను అభినందించారు.

ఘనంగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు సన్మాన కార్యక్రమం…

ఘనంగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు సన్మాన కార్యక్రమం

* ఎమ్మెల్యే చేతుల మీదుగా ఉత్తమ అవార్డులు అందుకున్న ఉపాధ్యాయులు.

చేవెళ్ల, నేటిధాత్రి:

 

 

 

చేవెళ్ల ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులు జి. వెంకటరమణకుమార్. ఎం. సంతోషి ఉపాధ్యాయులు విద్యారంగంలో వారు చేసిన విశేష సేవలకు గుర్తింపుగా ఈ గౌరవ ఉత్తమ పురస్కారాలు అందుకున్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్బంగా జిల్లా విద్యాశాఖ
ఉత్తమ ఉపాధ్యాయులకు వారి సేవలను గుర్తించి ఉత్తమ పురస్కారాలను అందించింది.
చేవెళ్ల ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తూ సాంఘీకశాస్త్రంలో ఉత్తమ సేవలు అందించిన జీ.

 

 

 

 

వెంకటరమణకుమార్ కలెక్టరేట్ లో బుధవారం జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు. గురువారం చేవెళ్ల మున్సిపల్ పట్టనకేంద్రంలో మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చేవెళ్ల మండల ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య చేతుల మీదుగా ఉపాధ్యాయురాలు సంతోషి మండల ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు.

 

 

 

 

 

గణిత శాస్త్రంలో ఉత్తమ సేవలు అందించిననందుకు ఈ పురస్కారం దక్కింది. ఉత్తమ పురస్కారాలు అందుకున్న వెంకటరమణకుమార్, సంతోషి ఉపాధ్యాయులను, ఎంఈఓ పురందాస్, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, ఉపాధ్యాయులు నర్సింహా, సుధాకర్, శృతి, అలివేలు రజిత, అరుణ, అనిత పలువురు ఉపాధ్యాయులు మాజీ ప్రజా ప్రతినిధులు ఘనంగా సన్మానించి ప్రశంశించారు. ఈ సందర్బంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, మాట్లాడుతూ తమ పాఠశాలలో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులకు ఉత్తమ పురస్కారాలు అందుకోవటం అభినదనీయమని అన్నారు. ఒక ఉపాధ్యాయుడిగా ఆయన సాధించిన విజయాలు ఒక్క రోజులో వచ్చినవి కావు, అవి ఆయన పట్టుదల, నిరంతర కృషికి నిదర్శనం అన్నారు. కార్యక్రమంలో

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version