స్వచ్చత పరిశుభ్రత హరిత పాఠశాల కార్యక్రమంలో భాగంగా 2025 సంవత్సరానికి గాను నిజాంపేట మండలం నగరం ప్రభుత్వ పాఠశాల మొదటి స్థానాన్ని దక్కించుకుందని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉమారాణి అన్నారు. ఆమె మాట్లాడుతూ.. పాఠశాల పరిశుభ్రత విషయం లో 61 అంశాల్లో పాఠశాల పురోగతిని పరిశీలించి రేటింగ్స్ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ రేటింగ్స్ లో మండలంలోని నగరం తండా గ్రామంలో గల పాఠశాల ఫైవ్ స్టార్ రేటింగ్ తో మొదటి స్థానం లో నిలిచిందని ఆనందం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు వెంకటేష్, కల్పన ఉన్నారు.
న్యాల్కల్ మండల్ జడ్పిటిసి బిఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని బిఆర్ఎస్వి న్యాల్కల్ మండల్ మాజీ అధ్యక్షులు జట్గొండ మారుతి అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ లో క్రియాశీల కార్యకర్తగా ఉంటూ గత ఎన్నికల్లో మల్గి గ్రామ సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన అని అన్నారు అలాగే ఇప్పుడు న్యాల్కల్ మండల్ జడ్పిటిసి స్థానం బీసీ జనరల్ కేటాయించడంతో అధిష్టానం నాకు టికెట్ ఇస్తే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు,
మండలంలో మద్యం బెల్ట్ షాపుల దందాలు రోజురోజుకు పుట్టగొడుగుల పెరిగిపోతున్నాయి వెనకటికి ఒక సామెత ఉండేది బ్రతకలేక ఏదో పంతులయ్యాడని దానికి విరుద్ధంగా ఈరోజు తక్కువ సమయంలో నాలుగు రాళ్లు వెనకేసుకోవాలంటే కష్టపడి చెమటోడ్చాల్సిన అవసరం లేకుండా నాలుగు మద్యం సీసాలు అమ్ముకుంటే డబ్బే డబ్బు ఈరోజు అధికంగా లాభాలు కురిపించేదంటే ఒక మద్యం అమ్మకాల మీదే మూడు ఫుల్ బాటిల్ ఆరు కాయలుగా కాసులు కురిపించేది బెల్టు షాప్ దందా అన్నట్టుగా పల్లె పల్లెల్లో పుట్టగొడుగుల్లా కిరాణం షాప్ మాటున బెల్ట్ షాపుల దందాలు కలకలలాడుతూ రోజుకు వేళల్లో సొమ్ము చేసుకుంటున్నారని గ్రామాలలో ప్రజలు అంటున్నారు.
బెల్ట్ షాప్ నిర్వహించుకోవాలంటే ఎవరి పర్మిషన్ అక్కరలేదు వైన్ షాప్ వారికి క్వాటర్ సీసాల పైన అదనంగా రూపాయలు చెల్లిస్తే ఎవరి పర్మిషన్ లేకుండానే బెల్టుషాప్ దందా నిర్వహించుకోవచ్చు అని బెల్టు షాప్ యజమానులే చెప్తున్నారు. పల్లెల్లోని ప్రజలు బెల్ట్ షాప్ అందుబాటులో ఉండడంతో మద్యం కొనుగోలు చేయాలనుకుంటే క్వార్టర్ సీసా మీద 50 నుంచి 70 రూపాయలు అధికంగా వసూలు చేస్తున్నారని సమాచారం. ఇక బీర్ సీసా మీద వంద నుంచి 150 వరకు ముక్కు పిండి వసూలు చేస్తున్నారని గ్రామాల్లోని మద్యంప్రియల జేబులు గుల్ల చేస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం వైన్ షాప్ యజమానులు వైన్ షాపులలోనే మద్యం అమ్మకాలు జరగాలని ప్రభుత్వ నియమాలు ఉన్నప్పటికీ అవేమీ పట్టనట్టు వైన్ షాప్ యజమానులు ఒక సిండికేట్ గా మారి బెల్టు షాపులను ప్రోత్సహిస్తున్నట్టుగా ప్రభుత్వ విధించిన ధరలకంటే ఎక్కువ ధరకు బెల్ట్ షాపులకు విక్రయిస్తున్నారని ప్రజలు
బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. వినియోగదారుడు వైన్ షాప్ తనకిష్టమైన బ్రాండ్ మద్యం అడిగితే లేదు అనే సమాధానమే ఎదురవుతుందని పలువురు మద్యం ప్రియులు అంటున్నారు. అదే బ్రాండ్ మాత్రం బెల్ట్ షాపులలో దర్శనమిస్తాయని బెల్ట్ షాపులలో మద్యం కొనుగోలు చేయాలంటే ఒక ఫుల్ బాటిల్ మీద 100 నుంచి 150 వరకు చెల్లిస్తేనే మనకు నచ్చిన బ్రాండ్ మద్యం దొరుకుతుందని బెల్టు షాపులలో లేని మద్యం అంటూ ఉండదని మద్యం ప్రియులే చెప్తున్నారు.
వైన్ షాప్ బంద్ రోజులలో బెల్ట్ షాపులు కలకల
ముఖ్యంగా ప్రభుత్వం మద్యం షాపులకు సెలవు రోజులలో వైన్ షాపులకు ప్రభుత్వ సంబంధిత అధికారులు వైన్ షాపులకు తాళాలు వేసి సీల్ వేసి పక్క పకడ్బందీగా అమలు చేస్తారని ప్రజలందరికీ తెలిసిందే కానీ ప్రభుత్వ నియమాలు వైన్ షాపులకే కానీ మా బెల్ట్ షాపులకు కాదు అన్నట్టుగా ఇష్ట రాజ్యాంగ ఇదే అదునుగా భావించి బెల్ట్ షాప్ నిర్వాహకులు మాత్రం 24 గంటలు తలుపులు తెరుచుకొని పగలు రాత్రి అని తేడా లేకుండా ఉంటాయని, ఆరోజు మద్యం ధర బెల్ట్ షాప్ నిర్వాహకుల నిర్ణయిస్తారని వారు ఎంత చెప్తే అంతే ధర చెల్లిస్తేనే మద్యం సీసా దక్కుతోందని గ్రామాల్లో బహిరంగ చర్చలు వినబడుతున్నాయి. శుక్రవారం గణేష్ నిమజ్జన సందర్భంగా ప్రభుత్వం వైన్ షాపులకు సెలవు ప్రకటించి వైన్ షాపులు మూసుకున్నాయి, ఆరోజు మాత్రం బెల్ట్ షాపులు కలకలలాడుతూ జోరుగా మద్యం అమ్మకాలు సాగినట్టు సమాచారం. ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా పవిత్రమైన బంద్ రోజులలో మధ్య విగ్రహాలు జరుగుతున్నాయంటే వీళ్లు గాంధీ జయంతి రోజున కూడా మధ్య విక్రయాలు జరుపుతారేమోనని ప్రజలు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల పర్యవేక్షణ ఎక్కడ…?
మండలంలో రోజురోజుకు మద్యం బెల్ట్ షాపులు పుట్టగొడుగుల పుట్టుకొస్తున్నాయని ముందు కిరాణం షాప్ వెనక బెల్టు షాప్ లు వెలుస్తున్నాయని మండలంలో కోడై కూస్తుంటే సంబంధిత అధికారులకు మాత్రం ఈ అక్రమ బెల్టు షాపుల దందాల వ్యవహారం కనిపించట్లేదా అని ప్రజలు అధికారుల తీరు పట్ల ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. రాబోయే రోజులలో బెల్టు షాపుల దందాలు సంఖ్య పెరిగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుందని పల్లెల్లో మద్యం ఏరులై పారుతోందని చదువుకునే యువకులు మధ్యానికి అలవాటు పడి బానిసలుగా మారతారని గ్రామాల్లోని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చాలా కుటుంబాల్లో మద్యం చిచ్చు చల్లారట్లేదని అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయని వాళ్ల పిల్లల్ని ఉన్నతమైన విద్యను అందించలేక మద్యానికి బానిసైన కుటుంబాలు విలవిలలాడుతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు గ్రామాల్లోని అక్రమ బెల్ట్ షాపులను నియంత్రించేలా రోజువారి మద్యం ప్రియులకు జేబులకు చిల్లు పడకుండా మద్యాన్ని ఒక ప్రభుత్వ అనుమతులు పొందిన వైన్ షాపులలో విక్రయాలు జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని పలు గ్రామాల ప్రజలు కోరుకుంటున్నారు.
శాయంపేట మండలంలోని మాందారిపేటకూడలి వద్ద బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే శాసనసభ్యులుగండ్ర వెంకట రమణారెడ్డి నాయ కత్వంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇది కెసిఆర్ పైన చేస్తున్న కుట్ర మాత్రమే కాదు కాలేశ్వరాన్ని ఎండబెట్టే ప్రయ త్నంలో భాగంగానే ఇది జరుగు తున్నది.సిబిఐకి కాలే శ్వరం అప్పజెప్పడం అంటే పూర్తిగా ప్రాజెక్టును మూసేయడమే.
BRS Holds Protest
నిన్నటిదాకా సిబిఐ పైన వ్యతి రేకంగా మాట్లాడిన రేవం త్ రెడ్డి ఒక్కరోజులోనే మాట ఎందుకు మార్చాడు.తె లంగా ణా ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజె క్టును సీబీఐ కి అప్పజెప్పడం వెంటనే ఉపసంహరించుకోవా లి. లేదంటే మున్ముందు ధర్నా కార్యక్రమాలు ఇంకా ఉదృతం చేస్తామని, బెదిరింపులు కేసు లు మా పార్టీకి కొత్త కాదని అన్నారు.ఒక వైపు రైతులు పంటలకు యూరియా లేక అల్లాడిపోతుంటే వారి గురించి పట్టించుకునే వారే కరువ య్యారని అన్నారు. రోడ్డుపై బఠాయించి ధర్నాచేసి నిరసన తెలిపారు ఎరువుల కొరతకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం మే కారణం అంటూ నినాదాలు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వంవచ్చి న తర్వాత రైతులు ఆరిగోస పడుతు న్నారన్నారు సకాలం లో రైతు బంధు అందక ఎరు వులు లేక అష్ట కష్టాలు పడు తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అబద్దాల మాటలు తప్పుడు ప్రచారాలు చేస్తూ పబ్బం గడుపుతున్నా రని మండి పడ్డారు రైతులకు యూరియా కష్టాలు తీర్చాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్ర మంలో మండల కేంద్రంలోని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు అధిక మొత్తంలో పాల్గొన్నారు.
BRS Holds Protest
అల్లాడుతున్న అన్నదా తలు గంటల తరబడి నిరీక్షణ
వేసినపంట అదను దాటి పోవడంతో యూరియా రైతులు అల్లాడిపోతున్న పనులన్నీ మానుకొని ఎరువుల దుకాణం వద్ద పడికా పులు కాస్తున్నాం అన్నదాతలు ఎరువుల కేంద్రం వద్ద క్యూ కట్టారు యూరియా బస్తాలు తక్కువ రావడంతో ఉన్నవారికి ఒక్కొక్కడిగా ఇవ్వడం జరుగుతుంది. మండల కేంద్రంలో పంపిణీ చేస్తున్న యూరియా బస్తాలను రైతులను అడిగి తెలుసుకు న్నారు. మండల వ్యవసాయ అధికారికి రైతుల గురించి చెప్పడం జరిగింది. ప్రతి రైతుకు సంపూర్ణంగా అందే టట్లు చూడాలని మాట్లాడడం జరిగింది.రైతులకు అండగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుం దని మాజీ ఎమ్మెల్యే అన్నారు
ఘనంగా వి ఎచ్ పి యస్ ఆవిర్భవ దినోత్సవం సెప్టెంబర్ 9 లోపే వికలాంగుల సమస్యలు పరిష్కరించాలి వికలాంగులకు 6000 వితంతువులు ఒంటరి మహిళలకు 4000 మహాదేవపూర్ఆగష్టు28 నేటి ధాత్రి
ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు బెల్లంపల్లి సురేష్ మాదిగ మహాదేవపూర్ మండల కేంద్రంలో ఘనంగా వి ఎచ్ పి యస్ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఎమ్మార్పీఎస్ మరియు అనుబంధ సంఘమైన వి హెచ్ పి ఎస్ ఆవిర్భవించి 18 సంవత్సరాలు పురస్కరించుకొని వి ఎచ్ పి యస్ మండల అధ్యక్షులు వీరగంటి సమ్మయ్య జెండా అప్పుడే ఆవిష్కరణ చేశారు. వీరగంటి సమయం మాట్లాడుతూ వికలాంగుల హక్కుల కోసం వారికి సమాజంలో జరుగుతున్న అసమానతల కోసం ఎమ్మార్పీఎస్ వికలాంగుల సంఘం ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు చేసి వికలాంగులకు గుర్తింపు తీసుకురావడం అంటే ఎంతో గొప్ప విశేషమని దీనికి కారణమైన .మందకృష్ణ మాదిగ వికలాంగుల కోసం నిరంతరం పోరాటం చేయడం ద్వారానే వారికి సమాజంలో విలువైన జీవనం తగ్గిందన్నారు మండల అధ్యక్షుడు బెల్లంపల్లి సురేష్ మాటే మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ చొరవతోనే ఎన్నో విజయాలు సాధించిమని వికలాంగుల సమాజం మాన్యశ్రీ గౌరవ మందకృష్ణ మాదిగా కే రుణపడి ఉంటుందని ఈ గౌరవం దక్కుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు బెల్లంపల్లి సురేష్ వికలాంగుల మండల అధ్యక్షులు వీరగంటి సమ్మయ్య టౌన్ ప్రెసిడెంట్ ముస్తాక్ మండల ప్రధాన కార్యదర్శి కన్నబోయిన కొమురక్క కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అక్బర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ పీఏసీఏస్ చైర్మన్ వామన్ రావు బిజెపి మండల నాయకులు కన్నెబోయిన ఐలయ్య ఎమ్మార్పీఎస్ టౌన్ అధ్యక్షులు చింతకుంట సదానందం తదితరులు పాల్గొన్నారు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రానికి చెందిన బల్ల శ్రావణ్ కుమార్, లింగపెల్లి వంశీదర్ రావు లను శనివారం రోజున బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కర్రె సంజీవరెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షులు చంద్రుపట్ల సునిల్ రెడ్డీ, రాష్ట్ర నాయకులు చల్ల నారాయణ రెడ్డీ ల ఆధ్వర్యం లో మహాదేవపూర్ మండల బిజెపి ప్రధాన కార్యదర్శులుగా నియమించడం జరిగింది. మండల నూతన కార్యదర్శుల నియామక అనంతరం వారు మాట్లాడుతూ పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు పార్టీని మండలంలో విస్తరీంపచేస్తామని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలోకి తీసుకెళ్లి, పార్టీ బలోపేతనికి కృషి చేస్తామని, రానున్న స్థానిక ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా పని చేసి బీజేపీ సత్తాచాటుతామణి, అలాగె మా నియామకానికి కృషి చేసిన పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కర్రె సంజీవ రెడ్డీ కి, మాజీ జిల్లా అధ్యక్షులు చంద్రుపట్ల సునిల్ రెడ్డీ కి, రాష్ట్ర నాయకులు చల్ల నారాయణ రెడ్డీ కి మాహదేవపూర్ మండల అధ్యక్షులు రాంశేట్టి మనోజ్ కి, మండల నాయకులకు,బూత్ అధ్యక్షులకు, కార్యకర్తలకు ధన్యవాదలు తెలిపారు.
మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా పసరగొండ రవి శనివారం బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు గతంలో విధులు నిర్వహించిన నరసింహమూర్తి ఇటీవల పదవి విరమణ పొందడంతో ఆయన స్థానంలో ఎంపీ ఓ గా బాధ్యతలు నిర్వహిస్తున్న రవికి ఎంపీడీవో గా బాధ్యతలు నిర్వహించేందుకు అధికారులు ఆదేశాలు జారీ చేయగా. బాధ్యతలు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు ఈ సందర్భంగా కార్యాలయ సూపర్డెంట్ ఎండి అబిద్ అలీ, సీనియర్ అసిస్టెంట్ శారదామని, నూతన బాధ్యతలు చేపట్టిన రవికి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ శైలజ, పరంజ్యోతి, టైపిస్ట్ గంగాధర్, ఈ పంచాయతీ ఆపరేటర్ రఘువరన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిఎం కిసాన్ పథకంలో భాగంగా శనివారం రోజున వారణాసిలో ప్రధాని విడుదల చేసిన పీఎం కిసాన్ నిధులు రైతుల ఖాతాలో జమ అయ్యాయని నిజాంపేట మండల వ్యవసాయ అధికారి సోమ లింగారెడ్డి అన్నారు ఈ మేరకు నిజాంపేటలో మాట్లాడుతూ మండల వ్యాప్తంగా 6091 మంది లబ్ధిదారులకు నిధులు జమ అయ్యాయని పేర్కొన్నారు మరో 300 మంది రైతులు ఈ కేవైసీ చేయించుకోవాలన్నారు
తంగళ్ళపల్లి మండలంలో పలు గ్రామాలలో విద్యార్థులకు సైకిళ్ళ పంపిణీ….
తంగళ్ళపల్లి నేటి దాత్రి…
తంగళ్ళపల్లి మండలం పలు గ్రామాల్లో. మొదట పది గంటల 30 నిమిషాలకు నేరెళ్ల.గ్రామంలో. తరువాత 12 గంటలకు సమయానికి జిల్లెల్ల. గ్రామంలో. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో మండపల్లి లో . గ్రామంలోఈరోజు బండి సంజయ్ అన్న పుట్టినరోజు సందర్భంగా మోడీ కానుక ద్వారా తంగళ్ళపల్లి మండలంలో పలు గ్రామాల్లో సైకిళ్ల పంపిణీ ప్రోగ్రామ్ జరిగింది.. ఇందులో నేరెళ్ల జిల్లెల్ల మండపల్లి గ్రామాలలో సైకిల్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇట్టి కార్యక్రమానికి బిజెపి జిల్లా అధ్యక్షులు రెడ్డి బోయిని గోపి హాజరై మాట్లాడుతూ ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన బండి సంజయ్ ఎన్నో కష్టనష్టాలు ఓర్చుకుంటూ అంచలంచలుగా.ఎదుగుతూ కేంద్ర మంత్రిగా హోదాగా.పనిచేస్తూ పదవ తరగతి విద్యార్థులకు సైకిల్ పంపిణీ చేయాలని కృతనిశ్చయం.మోడీ గారి ఆశయాలతో ముందుకు వచ్చి ప్రతి గ్రామంలో తన పార్లమెంట్ నియోజకవర్గంలో తను ఉన్నన్నిరోజులు ప్రతి సంవత్సరం పిల్లలందరికీ సైకిల్ పంపిణీ చేయడం జరుగుతుందని అందులో భాగంగా సైకిలు కొనుగోలు చేయడం ఎంత తల్లిదండ్రులకు తెలుసునని దాని గురించిఈరోజు విద్యార్థిని విద్యార్థులకు సైకిల్ పంపిణీ చేయడం జరిగిందని అటువంటిది కొందరి నాయకులు తమలబ్దికోసం పోరారడం.తప్ప ప్రజల బాగోబాగులు ఎప్పుడు పట్టించుకునే పాపాన పోలేదని అందులో భాగంగా ఎప్పుడు వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఎదుటివారిని కించపరిచే విధంగా మాట్లాడదు తప్ప చేసే మంచి పనులు గుర్తుచేయరని ఇకనుండి అయినా విద్యార్థుల పట్ల ఆలోచన విధానం మార్చుకోవాలని అలాగే ప్రతి సంవత్సరం వారికి సంబంధించి పుస్తకాలు గానీ పెన్సిల్ గాని బాటిల్స్ గాని మోడీ సహకారంతో కేంద్ర మంత్రి సహకారంతో అందించడానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఉన్నన్నిరోజులు ప్రతి సంవత్సరం పంపిణీ.చేస్తారని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమము మండల బీజేవైఎం అధ్యక్షులు రాజిరెడ్డి.మండల బిజెపి అధ్యక్షులు వెన్నమనేని శ్రీధర్ రావు ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు ఇట్టి కార్యక్రమానికి బిజెపి నాయకులు కార్యకర్తలు విద్యార్థులు వారి తల్లిదండ్రులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఓదెల మండలం లో అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ గా పనిచేస్తున్న మెండి లతామంగేశ్వరి 8 సంవత్సరాలుగా ఓదెల ఏపిఎం గా బాధ్యతలు చేపట్టి ఈ రోజు బదిలీపై రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం ఏపీఏంగా బదిలీపై వెళ్లడం జరుగుతుంది. ఈ సందర్భంగా మండలంలోని గ్రామ సమైక్యల అధ్యక్షులు గ్రామ సంఘం అసిస్టెంట్లు మరియు సిబ్బంది అందరూ ఏపియం ని శాలువాలతో సన్మానించి వీడ్కోలు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ సురేంద్ర, రాము, సీసీలు మారెళ్ళ శ్రీనివాస్, మల్లయ్య, కొమురయ్య, విజయ రాజకుమారి, స్త్రీనిధి మేనేజర్ ప్రభాకర్ ,పవన్, భవాని, రమేష్, రాము మండల సమైక్య పాలకవర్గ సభ్యులు ఆలేటి స్వప్న రెడ్డి , పి.అనూష, జెఅనూష మరియు విఓ అధ్యక్షురాల్లు, వివోఏ లు పాల్గొనడం జరిగింది.
బిఆర్ఎస్ నిజాంపేట్ మండల యూత్ అధ్యక్షులు మావురం రాజు జన్మదిన వేడుక
నిజాంపేట, నేటి ధాత్రి
మండల బిఆర్ఎస్ యూత్ అధ్యక్షులు మావురం రాజు జన్మదిన వేడుకను మెదక్ నియోజకవర్గ బిఆర్ఎస్ ఇన్చార్జి కంటారెడ్డి తిరుపతిరెడ్డి సమక్షంలో వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కాంటారెడ్డి తిరుపతిరెడ్డి మాట్లాడుతూ బిఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షులు మావురం రాజు ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుడు ఆయురారోగ్యాలతో చల్లగా చూడాలని భగవంతుని కోరుకుంటున్నాను అన్నారు. మావు రం రాజు మాట్లాడుతూ నాపై ప్రేమాభిమానాలు చూపి నాకు దీవెనలు అందించిన తిరుపతి రెడ్డి అన్నకు ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు. ఈ కార్యక్రమంలో కల్వకుంట పిఎసిఎస్ చైర్మన్ అందే కొండల్ రెడ్డి, బిఆర్ఎస్వి రాష్ట ఉపాధ్యక్షుడు పడాల సతీష్,ఏడుపాయల మాజీ చైర్మన్ బాలగౌడ్.కూర్తివాడ మాజీ సర్పంచ్ శ్రీను.బిఆర్ఎస్వి మెదక్ జిల్లా నాయకులు గంజి నవీన్.గోపీని సాయి. పంపరి నగేష్, సంగు స్వామి, మల్లేశం , వంశీ ,శివ, మహేష్ తదితరులు నాయకులు పాల్గొన్నారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను ఆకస్మికంగా సందర్శించిన ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అప్పల ప్రసాద్
జైపూర్,నేటి ధాత్రి:
జైపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను మంగళవారం ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అప్పల ప్రసాద్ సందర్శించారు.జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజు ఆదేశాల మేరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సందర్శించిన ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అప్పల రాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు,వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి సమయపాలన పాటించాలన్నారు. అదేవిధంగా ఉప కేంద్రాల పరిధిలో ఆశ,ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికి తిరిగి ప్రజలకు వైద్య సేవలు అందించాలన్నారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఎలాంటి డెంగ్యూ కేసులు గాని మలేరియా కేసులు గాని నమోదు కాకుండా చూడాలని తెలిపారు.రోగులతో సమన్వయంగా ఉంటూ మందులను ముందస్తుగా నిలువ చేసుకోవాలని ఉపకేంద్ర సిబ్బందితో రోజు మాట్లాడాలని,ప్రభావిత గ్రామాలలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి పాముకాటు, కుక్కకాటు మందులను అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. అలాగే పంచాయతీల కార్యదర్శులు,ఆరోగ్య కార్యకర్తలు సహజంగా ఉంటూ గ్రామాలలో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని, ఆశ,అంగన్వాడి,ఆరోగ్య కార్యకర్తలు,మహిళా గ్రూపు సంఘాలు,యూత్ అంతా కలసి ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో బుక్క వెంకటేశ్వర్లు జిల్లా మాస్ మీడియా అధికారి, ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్,డాక్టర్ అశోక్,డాక్టర్ స్పందన, సీనియర్ అసిస్టెంట్ సంపత్ పాల్గొన్నారు.
గణపురం మండలంలో భూపాలపల్లి జిల్లా అదనపు కలెక్టర్ పి. అశోక్ కుమార్ గణపురం మండలాన్ని సందర్శించి యూరియా లభ్యత పంపిణీని తనిఖీ చేశారు. వారి తో పాటు జిల్లా వ్యవసాయ అధికారి బాబు రావు జిల్లా సహకార అధికారి ఎం. వాల్య నాయక్ మండల వ్యవసాయ అధికారి డి. ఇలయ్య ఏ సి ఎస్ గణపురం సీఈఓ ఉన్నారు.
గోదాముల తనిఖీలో యూరియా నిల్వలు సరిపడుగా ఉన్నాయని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 405 బస్తాల యూరియా అందుబాటులో ఉంది. పంపిణీ పి ఓ ఎస్ యంత్రం మరియు ఆధార్ ధృవీకరణతో పారదర్శకంగా జరుగుతోంది.రైతులు ఆందోళన చెందకండి, విధి ప్రకారం యూరియా పొందాలని అధికారులు సూచించారు. పంట సీజన్ కోసం సరైన సమయంలో ఎరువులు అందించేందుకు యంత్రాంగం కట్టుబడి ఉంది. సొసైటీ స్టాప్ రైతులు బాబురావు మూల సదయ్య రైతులు పాల్గొన్నారు
కథలాపూర్ బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో సోమవారం రోజున ప్రధాన రహదారి నుండి మాడల్ స్కూల్ వరకు మంజూరు అయిన రహదారి నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని కథలాపూర్ ఎంపీడీఓ కు వినతిపత్రాన్ని అందించారు. ఈ రహదారి కోసం ప్రభుత్వం రూ. 1.30 కోట్లు మంజూరు. చేసిందని, భూమి పూజ చేసి 8 నెలలు గడిచినా పనులు ప్రారంభించలేదన్నారు. మోడల్ స్కూల్,కస్తూరిభా స్కూల్, జూనియర్ కళాశాల కు ఈ. దారిలో వెళ్లే విద్యార్థులకు వర్షం కురిసినప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పనులు వెంటనే ప్రారంబించకపోతే బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతామని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షుడు మల్యాల మారుతి,గాంధారి శ్రీనివాస్,ఎగ్యారపు జలందర్, గడ్డం జీవన్ రెడ్డి,ప్రసాద్,కాసోజి ప్రతాప్ బీజేపీ నాయకులుపాల్గొన్నారు.
జహీరాబాద్ నియోజకవర్గం కోహీర్ మండల్ కు నూతనంగా ఎస్ ఐ గ బాధ్యతలు తీసుకున్న నరేష్ కు పైడిగుమ్మల్ యువ నాయకులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు శాలువా పూల మాలలతో ఘనంగా సన్మానించారు కోహీర్ మండల్ లోకి స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో పైడిగుమ్మల్, మాజీ ఎంపీటీసీ జ్ఞనారత్నం నాయకులు దావీదు యేసయ్య రామయ్య లక్ష్మయ్య బాలయ్య నర్సిములు ఆనందం కాంగ్రెస్ యువ నాయకులు మధు శాంసన్ అశోక్ సంపత్ సుమన్ మహేందర్ ప్రేమ్ యూత్ కాంగ్రెస్ నాయకులు బన్నీ రాకేష్ భాస్కర్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.
27 న భూపాలపల్లి బి ఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని విజయవంతం చేద్దాం
గణపురం బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మోతే కర్ణాకర్ రెడ్డి
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఈ నెల 27న ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయంలో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి , జిల్లా పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి నేతృత్వంలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరుగుతుందని, ఇట్టి సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మాజీ మంత్రి, బిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షులు తారకరామరావు హాజరవుతారని ఈ సమావేశానికి మండల పరిధిలోని అన్ని గ్రామాల బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు , పార్టీ కుటుంబ సభ్యులు, అభిమానులు, అనుబంధ సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గణపురం మండల బి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మోతే కర్ణాకర్ రెడ్డి తెలిపారు
మట్టిపాట పోస్టర్ ఆవిష్కరించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు.
చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం లోని తిర్మలాపూర్ గ్రామానికి చెందిన వర్ధమాన గేయ దసరాకు నరేష్ రచించిన మట్టిపాట పోస్టర్ ను చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గూట్ల తిరుపతి ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గూట్ల తిరుపతి విచ్చేసి మాట్లాడుతూ అమ్మ తనం ఎంత విలువైనదొ మట్టి పరిమళం కూడా అంతే విలువైనదని చెప్పడం జరిగింది అదేవిధంగా అమ్మ నవమాసాలు కడుపులో మోస్తే మనిషిని జీవితాంతం కాపాడేది మట్టి తల్లి అని పేర్కొన్నారు నేటి సమాజంలో నేల తల్లికి లేని స్వార్థం మనుషులలో నేడు పేరిగిపోయిందని చుట్టూ ఉన్న సహజ వనరులను కాపాడుకోవాలని ప్రకృతి మన దైవమని పేర్కొన్నారు అదే విధంగా ఈ పాటను రచించిన దాసారపు నరేష్ ను పాట లో నటించిన జన్నే యుగేందర్, పాట పాడిన జూపాక శివను, సంగీతం కిట్టు కిస్ ను పాటలో పాల్గొన్న బృందాన్ని అభినందించారు కార్యక్రమంలో దొడ్డి కిష్టయ్య, గడ్డం కొమురయ్య, పుల్ల మల్లయ్య, అల్లకొండ కుమార్, గుమ్మడి సత్యం, పుల్ల సతీష్, శనిగరపు మొగిలి కటుకూరి మొగిలి, గోల్కొండ సతీష్ తదితరులు పాల్గొన్నారు
మొగడంపల్లీ మండలం మోతిమాత అమ్మ వారి ఆలయ కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం మంజూరు
◆:- హర్షవ్యక్తం చేసిన కాంగ్రెస్ నాయకులు*
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్: పట్టణంలోని ఉజ్వల్ రెడ్డి గారి నివాసంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పత్రిక సమావేశం నిర్వహించారు.ఈసమావేశంలో డిసిసి ప్రధాన కార్యదర్శి ధనసిరి.మల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలో మొదటి సారిగా ఉప్పర్ పల్లీ తండా గ్రామంలో మోతిమాత అమ్మ వారి ఆలయ కేంద్రానికి వచ్చారు.స్థానిక కాంగ్రెస్ నాయకులు ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం మంజూరుకి కృషి చేయ్యాలని మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడంతో వారు సానుకూలంగా స్పందించి మంజూరు కి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు మంజూరు చేశారు అని వారు తెలిపారు.మొగడంపల్లీ మండలంలోని ఉప్పర్ పల్లీ తండా గ్రామంలో మోతిమాత అమ్మ వారి ఆలయ కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం మంజూరుకి కృషి చేసిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు దామోదర రాజనర్సింహ గారికి,ఎం.పి.సురేష్ శెట్కార్,సెట్విన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి,రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి హర్షవ్యక్తం చేస్తూ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈకార్యక్రమంలో మాజీ యం.పి.పి.ప్రియాంక గుండా రెడ్డి,జహీరాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింహారెడ్డి,SC సెల్ అధ్యక్షుడు గోపాల్,ST సెల్ అధ్యక్షుడు చందర్,గోవర్ధన్ రెడ్డి,రూప్ సింగ్,రాజు పవార్, కన్నా నాయక్ మరియు మండల కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
తంగళ్ళపల్లి మండలంలో పలు గ్రామాల్లో బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి.కేటీ రామారావు జన్మదిన వేడుకల సందర్భంగా. మండలంలో పలు గ్రామాలలో. దేవాలయాలలో ప్రత్యేక పూజలు చేసి. స్వామి వారి ఆశీస్సులు తీసుకొని. కేటీ రామారావు నిండు నూరేళ్లు పిల్లాపాపలతో సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని పలుదేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే మండలంలో. బద్దెనపల్లి గ్రామంలో కేటీ రామారావు జన్మదిన రోజు సందర్భంగా పలువురు మహిళలకు కెసిఆర్ కిట్లు అందజేశారు ఇట్టి కార్యక్రమంలో కెసిఆర్ కిట్లు తీసుకున్న వారిలో చాలామంది మహిళలు పాల్గొన్నారు. అనంతరం ప్రతి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో. బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. తంగళ్ళపల్లి మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో లక్ష్మి నరసింహ స్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఇట్టి కార్యక్రమంలో. బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గజ భీంకర్.రాజన్న. మాజీ జెడ్పిటిసి కోడి అంతయ్య. మాజీ సర్పంచ్ రవి.పాక్స్. వైస్ చైర్మన్ ఎగుమామిడి వెంకట రమణారెడ్డి. మహిళ నాయకురాలు. సిలువేరి చిరంజీవి.టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం 2025_ 26 విద్యా సంవత్సరంప్రారంభమై రెండు నెలలుగడుస్తున్నా ప్రభుత్వపాఠశాలలో పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నప్పటికీ ఇప్పటివరకు అన్ని పాఠశాలలో విద్యార్థిని, విద్యార్థులకు కనీస మౌలిక వసతులు కల్పించడం లేదని ఎస్ఎఫ్ఐ (స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) మంగపేట మండల అధ్యక్షుడు చెట్టు పల్లి . చందు ప్రభుత్వాన్ని ఖండించడం జరిగింది…. మండల కేంద్రంలో చందు మాట్లాడుతూ.. ఈ రెండు నెలల్లో మండలంలో ఉన్న ప్రతి ప్రాథమిక , ప్రాథమికోన్నత, ఉన్నత, ఆశ్రమ పాఠశాలలో సందర్శించడం జరిగింది.. ఇందులో భాగంగా ప్రతిపాఠశాలలో ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు సరిపడే విధంగా ఉన్నందున అడ్మిషన్లు సంఖ్య పెరిగింది… కానీ ప్రతి పాఠశాలలో బాల, బాలికలకు కనీస టాయిలెట్స్ లేవు. ముఖ్యంగా బాలికలు టాయిలెట్ చాలా ఇబ్బందులు గురవుతున్నారు ప్రతి విద్యార్థిని విద్యార్థులకు రెండు యూనిఫామ్ ఇవ్వకుండా ఓకే యూనిఫామ్ ఇచ్చారు.. టెక్స్ట్, నోట్ బుక్స్ కూడా అన్ని టైటిల్స్ పంపిణీ రాలేదు సీఎం బ్రేక్ఫాస్ట్ నిలుపుదల చేశారు, మధ్యాహ్న భోజనంలో అనేక లోపాలు ఉన్నాయి ఏజెన్సీ వాళ్ళని అడిగితే మాకు డబ్బులు గత ఆరు నెలల నుండి రావడం లేదు అంటున్నారు ప్రతి పాఠశాలలో మెనూ ప్రకారం భోజనం అందించడం లేదు… కావున పై విషయాన్ని పూర్తిగా పరిశీలింప చేసి ప్రభుత్వం కామా ప్రభుత్వాధికారులు ఇప్పటికైనా పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు సరైన విద్యను అందించి మన జిల్లాను అభివృద్ధిలో ముందు ఉంచాలని ఎస్ఎఫ్ఐ మండల శాఖ ప్రభుత్వాన్ని కోరారు…. ఇందులో భాగంగా విద్యార్థి సంఘాల నాయకులు….
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.