కాంగ్రస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినం. ప్రజాపాలన దినోత్సవం.
చిట్యాల, నేటిధాత్రి :
చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం* మరియు ప్రజా పాలన కార్యక్రమాల్లో భాగంగా చిట్యాల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగరవేయడం జరిగింది. జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించి అనంతరం స్వీట్లు పంపిణీ చేసుకొని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తిరుపతి మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో నిజాం నిరంకుశ పరిపాలన నుంచి మొగలు సామ్రాజ్య వాదుల నుండి మన రాష్ట్రం విముక్తి చెంది ఎంతోమంది అమరుల త్యాగ ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని మొగల్ సామ్రాజ్యవాదుల చేర నుండి విముక్తి అయిన రోజు సెప్టెంబర్ 17 ,గత పది సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర సమితి టిఆర్ఎస్ ప్రభుత్వం నుండి గత పది సంవత్సరాల నిరంకుశ పాలన నుండి విముక్తి చెందిన రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలనలో సురక్షితంగా సుభిష్టంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను 6 ఆరు గ్యారెంటీలను అమలుచేసి పేదలందరికీ అనేక సంక్షేమ పథకాలను అందించి ముఖ్య మంత్రి సుపరిపాలన అందిస్తూ కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజుల్లో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ వెన్నంటి ఉండి పార్టీ అభ్యర్థులందరినీ గెలిపెంచాలని అన్నారు, ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు దొబ్బెట రమేష్ , చిట్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి సత్యనారాయణ , రాష్ట్ర నాయకులు జ్యోతి రెడ్డి ,జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దొడ్డికిష్టయ్య, చిట్యాల టౌన్ కమిటీ అధ్యక్షులు బుర్ర లక్ష్మణ్ గౌడ్ , మార్కెట్ డైరెక్టర్ మట్టికే రవీందర్, గుంటూరు పల్లి గ్రామ శాఖఅధ్యక్షులు నాగరాజు* , నాయకులు కొరిసాంబశివుడు, సరిగమల సదానందం, గుర్రపు నరసయ్య, క్యాత మార్కండేయ ,పిట్టల సాంబయ్య చిలుముల రాజమౌళి ,శనిగరపు మొగిలి ,దేవేందర్ రావు ,మేకల రాజయ్య, కట్కూరి సుమన్, మెరుగు సంపత్ తదితరులు పాల్గొన్నారు..
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు కటకం జనార్దన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిధిగా పాల్గొన్ని జాతీయ జెండా ఎగురవేసి,జాతీయ గీతాన్ని ఆలపించిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. జాతీయ సమైక్యత దినోత్సవాన్ని పురష్కరించుకుని యావత్ ప్రజానీకానికి శుభాకాంక్షలు తెలియచేస్తూ.. మనకు తెలిసిన చరిత్ర ప్రకారం 1947 ఆగష్టు 15వ తేదీన బ్రిటిష్ వారి చెర నుండి అనేక ఉద్యమాలు చేసి భారతదేశానికి స్వాతంత్య్రం సాధించుకున్నాం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికి మన ప్రాంతానికి 13 నెలల తరువాత స్వాతంత్ర్యం వచ్చింది. అఖండ భారతం కావాలనే ఉదేశ్యంతో ఆనాడు ప్రజలు నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి అసువులు బాసిన వారేందరో మన ప్రాంతం నుండి ఉన్నారు. పరకాలలో రెండవ జలియన్ వాలా బాగ్ గా పేరుగాంచిన సంఘటన జరిగింది. మరీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ ప్రాంతానికి వస్తున్న సందర్భంగా ప్రజలు తండోప తండాలుగా బయలుదేరి వస్తున్న వారిని విచక్షణా రహితంగా కాల్చి చంపడం జరిగింది. నీళ్ళు, నిధులు,నియామకాలు మనవి మనకే కావాలని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమాలు చేసి ఆంధ్రపాలకుల చేర నుండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుని 10 ఏండ్ల పరిపాలన లో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో పురోగతిని సాధించుకున్నాం. మనందరం కూడా మరొక్క ఉద్యమానికి ఈరోజు మనం పునఃరంకితం కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేసీఆర్ అంత గొప్పగా తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మాణం చేస్తే, ఈనాటి పాలకులు ఏ రకంగా వంచిస్తున్నారో చూస్తున్నాం, మరి ఆనాడు ఏ రకంగా వ్యవసాయ రంగానికి సంబంధించినట్టు వంటి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి,24 గంటల కరెంటు ఇచ్చి, రైతుబంధు ఇచ్చి,మరి ప్రతి గింజ కూడా కొనుగోలు చేసి, రుణమాఫీ చేసి గొప్పగా చేస్తే ఈనాటి ప్రభుత్వం చేసే పనులు చెప్పుకోడానికి చాలా సిగ్గు అనిపిస్తుంది. జాబ్ క్యాలెండర్ ఓపెన్ చేసి అందులో కనీసం ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా, బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలకు సర్టిఫికెట్స్ ఇచ్చి మేము ఉద్యోగాలు ఇచ్చాము అని సిగ్గులేకుండా చెప్పుకుంటున్నారు అని ఏద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు, పట్టణ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో, ఘనంగా జరుపుకున్న తెలంగాణ సమైక్యతా దినోత్సవం
జహీరాబాద్ నేటి ధాత్రి:
తెలంగాణ సమైక్యతా దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,జాతీయ జెండాను ఆవిష్కరించిన బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సంగారెడ్డి శాసనసభ్యులు చింత ప్రభాకర్ జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మానిక్ రావు & సంగారెడ్డి జిల్లా బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ఆయా గ్రామాల మండల అధ్యక్షులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు,
ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఎగురవేసిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
హాజరైన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బీ గితే
పోలిసుల గౌరవ వందనం స్వీకరించిన ప్రభుత్వ విప్
సిరిసిల్ల టౌన్:(నేటిధాత్రి)
ప్రజా పాలన దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బీ గితే హాజరయ్యారు. ముందుగా జాతీయ జెండాను ప్రభుత్వ విప్ ఎగుర వేశారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల పై వివరించారు.
ఈ సందర్బంగా విప్ మాట్లాడారు. సెప్టెంబర్ 17, 1948లో తెలంగాణ నాటి హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో ఐక్యమై 77 సంవత్సరాలు పూర్తి చేసుకుని 78వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈ రోజును తెలంగాణ ప్రజా పాలన వేడుకలను జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. 1948 సెప్టెంబర్ 17న సువిశాల భారత దేశంలో తెలంగాణ అంతర్భాగమైన రోజు స్వతంత్ర్య భారతావనిలో 60 ఏండ్ల స్వీయ అస్తిత్వం కోసం ఉద్యమించి స్వరాష్ట్రంగా అవతరించిన తెలంగాణ నేడు అభివృద్ధి పథంలో ముందంజలో ఉన్నదని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం తేదీ 09/12/2023న కొలువుదీరింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తున్నది. ఈ ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయహస్తం హామీలను ఒక్కొక్కటిగా అధికారంలోకి వచ్చిన 48 గంటల నుంచి అమలు చేయడం ప్రారంభించింది.
2047 నాటికి దేశ ముఖచిత్రాన్ని మార్చే గేమ్ ఛేంజర్ పాత్రలో తెలంగాణ కీలకంగా ఉండాలన్న సంకల్పం మాది. ఈ సంకల్పానికి దార్శనిక పత్రమే ‘తెలంగాణ రైజింగ్ 2047’. 2035 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను మార్చే మహత్తర లక్ష్యంగా తెలంగాణ రైజింగ్ – 2047 ఉంటుంది. ఇది కేవలం ప్రణాళిక కాదు, ప్రపంచ వేదికపై తెలంగాణను సగర్వంగా నిలబెట్టే సంకల్పం. ప్రజా ప్రభుత్వం ద్వారా జిల్లాలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు క్లుప్తంగా మీ ముందు ఉంచుతున్నాను. మహిళల అభ్యున్నతే ధ్యేయంగా: ఇందిరా మహిళా శక్తిలో భాగంగా డీఆర్డీఓ, మెప్మా ఆద్వర్యంలో జిల్లాలోని ఎస్ హెచ్ జీల ద్వారా 23 ఫర్టిలైజర్ షాపులు ప్రారంభించడం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 7వేల 111 లక్ష్యానికి గాను ఇప్పటిదాకా 1 వెయ్యి 586 యూనిట్లను గుర్తించి 200 కోట్ల బ్యాంక్ రుణాలు ఇవ్వడం జరిగింది. శ్రీనిధి ద్వారా రూ.68 కోట్లు లక్ష్యం కాగా, ఇప్పటిదాకా రూ. 25 కోట్ల రుణాలు ఇవ్వడం జరిగింది. 5వేల 691 యూనిట్లు లక్ష్యం కాగా, వెయ్యి 607 యూనిట్లు గ్రౌండింగ్ చేయడం జరిగింది. చేయూత పింఛన్లు జిల్లాలో లక్ష 17 వేల 370 మంది పించన్ దారులకు ప్రతి నెలా రూ.25 కోట్ల 73 లక్షలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఎస్ హెచ్ జీ మహిళలకు చీరలు: సిరిసిల్లలోని నేతన్నలకు చేతి నిండా పనితో భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్తుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 64 లక్షల 7౦ వేల మందికి పైగా ఉన్న ఎస్ హెచ్ జీ సభ్యులకు ఏడాదికి ఉచితంగా రెండు ఏకరూప చీరల కోసం 4 కోట్ల 30 లక్షల మీటర్ల వస్త్ర ఉత్పత్తి ఆర్డర్ సిరిసిల్ల మరమగ్గాలకు కేటాయించడం జరిగినది. దీని ద్వారా జిల్లాలోని మరమగ్గాల ఆసాములు, కార్మికులు, అనుబంధ కార్మికులకు 8 నుంచి 10 నెలల వరకు ఉపాధి దొరుకుతున్నది. సన్న బియ్యం పంపిణీ: పీడీఎస్ వ్యవస్థ పేదల ఆహార భద్రతకు భరోసా ఇస్తోంది. అదే స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం ఉగాది నుంచి “సన్న బియ్యం” పంపిణీని ప్రారంభించింది. రాష్ట్రంలో 13 వేల కోట్ల రూపాయల వ్యయంతో 3 కోట్ల 10 లక్షల మందికి సన్నబియ్యం అందించడం జరుగుతున్నది. లక్ష 77 వేల 851 కుటుంబాలు, 5 లక్షల 35 వేల 920 మందికి సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతున్నది.నూతన రేషన్ కార్డులు: జిల్లాలో కొత్తగా 14 వేల 75 రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరిగింది. 3౦ వేల 376 మంది కుటుంబ సభ్యుల పేర్లు ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో చేర్చడం జరిగింది. పదేళ్ల తర్వాత చేతిలో రేషన్ కార్డుతో… రేషన్ షాపుల వద్ద సందడి కనిపిస్తోంది. రైతు రుణమాఫీ: గతేడాది ఆగస్టు 15న రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టాం. రాష్ట్రంలోని 25 లక్షల 35 వేల మంది రైతులకు, రూ.20 వేల కోట్ల రుణమాఫీ చేసి.. కొత్త చరిత్ర సృష్టించడం జరిగింది. “ఇందిరమ్మ రైతు భరోసా” కింద ఎకరాకు రూ.12 వేల పెట్టుబడి సాయం ప్రకటించి, తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేయడం జరిగింది. రాష్ట్రంలోని 70 లక్షల 11 వేల 184 మంది రైతులకు, అలాగే కొత్తగా దరఖాస్తు చేసుకున్న 1.2 లక్షల మంది రైతులకు కూడా పెట్టుబడి సాయం అందించడం జరిగింది. జిల్లాలో 393 మంది రైతుల కుటుంబాలకు 18 కోట్ల రూపాయలు బీమా కింద పంపిణీ చేశాము. రైతు భరోసా కింద లక్ష 26వేల 278 మంది రైతులకు.. 149 కోట్ల 27 లక్షల రూపాయలు పంపిణీ చేశాము. 47 వేల 977 మంది రైతులకు 381 కోట్ల 45లక్షల రుణ మాఫీ చేశాము. రాష్ట్రంలో 7 వేల 178 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. సన్నాలకు క్వింటాల్ కు రూ.500 బోనస్ ఇస్తున్నామని, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ లో భాగంగా 29 లక్షల పంపు సెట్లకు ఉచిత విద్యుత్ అందించడం జరుగుతున్నది. దీని కోసం రూ.16 వేల 691 కోట్ల సబ్సిడీని విద్యుత్తు సంస్థలకు చెల్లించడం జరుగుతున్నది. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యవసాయ చరిత్రను తిరగ రాసి అన్నదాతల సంక్షేమానికి రూ. లక్ష 13 వేల కోట్ల రూపాయలను ప్రజా ప్రభుత్వం ఖర్చు చేసింది. ఇందిరమ్మ ఇండ్లు: తొలి విడతగా ప్రతి నియోజకవర్గంలో 3వేల 500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం జరిగింది. దీనికి రూ.22 వేల 500 కోట్లు వెచ్చించడం జరుగుతున్నది. జిల్లాలో 12 వేల 623 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా, 7 వేల 927 ఇండ్లు సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాలకు, మిడ్ మానేర్ ముంపు గ్రామాల ప్రజలకు 4వేల 696 ఇండ్లు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా మంజూరు చేసింది. 10వేల 234 ఇంటి నిర్మాణ మంజూరు ఉత్తర్వులు పంపిణీ చేయగా, 5 వేల 305 గృహాలకు లబ్దిదారులు ముగ్గు పోయడం జరిగింది. వివిధ దశల్లో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ. 38 కోట్లకు పైగా నేరుగా జమ చేసింది. మహాలక్ష్మీ పథకం: ద్వారా ఆడబిడ్డలకు రూ.6 వేల 790 కోట్లు ఆదా అయ్యింది. రాష్ట్రంలో ఆడబిడ్డల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రజా ప్రభుత్వం మొత్తంగా రూ. 46 వేల 689 కోట్లు సమకూర్చింది. జిల్లాలో 2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు 119 కోట్ల 50 లక్షల రూపాయల విలువైన 315 లక్షల జీరో టికెట్లపై మహిళలు ప్రయాణం చేశారు. గృహజ్యోతి పథకం: ద్వారా మార్చి 2024 నుంచి ఆగస్ట్ 2025 వరకు మొత్తం 17 లక్షల 52 వేల జీరో కరెంట్ బిల్లులు జారీ చేసి, రూ. 67 కోట్ల 70 లక్షల లబ్ది చేకూర్చాము. జెగ్గారావుపల్లి, పద్మనగర్, పాపయ్యపల్లి, గుండారం, తిప్పాపూర్ (వేములవాడ)లో 33/11 కేవీ విద్యుత్ ఉప కేంద్రాల కోసం ఎన్.పీ.డీ.సీ.ఎల్ కు ప్రతిపాదనలు పంపించడం జరిగింది. వైద్యారోగ్య శాఖ : ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో వైద్యారోగ్యంపై 16 వేల 521 కోట్ల రూపాయలు వ్యయం చేయడం జరిగింది. ఆరోగ్యశ్రీ పరిధిని రూ.5 నుండి 10 లక్షలకు పెంచగా, డిసెంబర్ 9వ తేదీ 2023 నుంచి ఆగస్ట్ 2025 వరకు 24 వేల 154 మంది రోగులు రూ. 62 కోట్ల విలువైన ఆపరేషన్లు, ఇతర వైద్య సేవలు పొందడం జరిగింది. జిల్లాలో సీఎంఆర్ఎఫ్ ద్వారా ఇప్పటిదాకా 4వేల 795 చెక్కుల ద్వారా రూ. 16కోట్ల 85 లక్షలు, అలాగే 275 ఎల్ఓసీల ద్వారా రూ. 5 కోట్ల సాయం అందజేయడం జరిగింది. మత్స్య శాఖ: ధర్తి అబా జన్ జాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ పథకంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంపిక చేసిన రుద్రంగి, వీర్నపల్లి నుంచి గిరిజన ప్రాంతాల లబ్దిదారుల నుంచి 82 మంది దరఖాస్తులు ప్రక్రియలో ఉన్నాయి. ఉద్యోగాల భర్తీ: యువతను రక్షించుకుంటేనే తెలంగాణకు భవిత. యువత ఉద్యోగ, ఉపాధికి పెద్ద పీట వేస్తున్నాం.ప్రజా ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన మరుక్షణం టీ.జీ.పీ.ఎస్సీని సంస్కరించాం. 20 నెలల కాలంలో దాదాపు 60 వేల ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది. అలాగే భూ భారతి అమలులో భాగంగా జిల్లాలో అవసరమైన గ్రామ పాలన అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నియమించడం జరిగింది. పోటీ పరీక్షల్లో రాణించేలా: జిల్లాలోని విద్యార్థులు జాతీయస్థాయిలో పోటీ పరీక్షలకు సిద్ధం చేసేలా 39 రెసిడెన్షియల్ విద్యాలయాల్లో అన్ అకాడమీ సంస్థ ద్వారా 25 లక్షల రూపాయలతో ఐఐటీ ఫౌండేషన్, ఐఐటీ-జేఈఈ, నీట్-యూజీ మెడికల్ ఆన్లైన్ కోచింగ్ తరగతులను నిర్వహిస్తూ వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడం జరుగుతున్నది. మొత్తం 13 వేల 564 మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు. పనుల జాతర: జిల్లాలోని 12 మండలాల పరిధిలోని అన్ని గ్రామాలలో పనుల జాతర కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. ఉపాధి హామీ పథకం, ఆర్ డబ్ల్యూఎస్, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్, స్వచ్ఛభారత్ వంటి విభాగాల్లో రూపాయలు 7 కోట్ల 80 లక్షల విలువ గల 258 పనులు చేపట్టడం జరుగుతున్నది.చివరి ఆయకట్టుకు నీరు అందించేలా: తెలంగాణ మాగాణాలకు చివరి ఆయకట్టు వరకు సాగునీరు ఇచ్చే ప్రణాళికలతో పెండింగ్ ప్రాజెక్టులను లక్ష్యాలు నిర్దేశించుకుని పూర్తి చేస్తున్నామని, కృష్ణా, గోదావరి జలాల్లో మన వాటాల సాధనలో రాజీపడమని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాబాయి, ఏఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సేవా పక్షం మండల కార్యశాల నిర్వహించిన భాజపా నాయకులు
రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో సేవా పక్షం మండల కన్వీనర్ పోచంపెల్లి నరేష్ ఆధ్వర్యంలో సేవాపక్షం మండల కార్యశాల నిర్వహించడం జరిగింది. ఈకార్యక్రమంలో ముఖ్య అతిథిగా మండల ఇంచార్జి జాడి బాల్ రెడ్డి హాజరై మాట్లాడుతూ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఈనెల 17న ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినం సందర్భంగా పక్షం రోజులు పార్టీ తెలిపిన సేవ కార్యక్రమలు గాంధీ జయంతి వరకు నిర్వహించాలని, తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ప్రతి బూత్ లో జాతీయ జెండా ఎగురవేయాలని తెలిపారు. మండల కేంద్రంలో బ్లడ్ డోనేషన్ క్యాంప్, శక్తి కేంద్రం ఇంచార్జి పరిధిలో స్వచ్ భారత్ కార్యక్రమాలు, జన్మదినం సందర్భంగా పండ్లు పంపిణీ వంటి కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. దీన్ దయల్ జయంతి రోజున ప్రతి బూత్ లో ఐదు మొక్కలు నాటాలని తెలిపారు. అదేవిధంగా అక్టోబర్ రెండవ తేదీన గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి వేడుకలు ప్రతి బూత్ లో నిర్వహించాలని తెలిపారు. ఈకార్యక్రమంలో మాజీ మండల శాఖ అధ్యక్షులు ఒంటెల కరుణాకర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు బండ తిరుపతి రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి పురేళ్ల శ్రీకాంత్ గౌడ్, మండల ఉపాధ్యక్షులు వేముండ్ల కుమార్,కళ్లెం శివ, జాతరగొండ ఐలయ్య, మండల కార్యదర్శిలు గుంట అశోక్, కడారి స్వామి, దళిత మోర్చా మండల అధ్యక్షుడు సంటి జితేందర్, యువ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి దయ్యాల రాజు, మండల ఉపాధ్యక్షులు బండారి శ్రీనివాస్, మండల అధికార ప్రతినిధి మాడిశెట్టి అనిల్, సీనియర్ నాయకులు కట్ట రవీందర్, బద్ధం లక్ష్మారెడ్డి, షేవెళ్ల అక్షయ్, బూత్ కమిటీ అధ్యక్షులు దయ్యాల వీరమల్లు, దైవల తిరుపతి గౌడ్, ఉత్తేం కనుకరాజు, బుర్ర శ్రీధర్, ఎగుర్ల ఎల్లయ్య, మడికంటి శేఖర్, మంద రాజశేఖర్, వెంకట్ రెడ్డి, పురంశెట్టి మల్లేశం, వడ్లూరి రాజేందర్ చారి తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో నర్సంపేట ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ గ్రఫీ దినోత్సవం పురస్కరించుకొని ఆ కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఫోటోగ్రాఫర్లు, ఫ్లెక్సీ షాపులు డిజైనింగ్ షాపులు, ఫోటోగ్రఫీ అనుబంధ రంగాలకు చెందినవారు స్వచ్ఛందంగా షాపులు బంద్ పాటించి వేడుకల్లో పాల్గొన్నారు. మండలంలోని సీనియర్ ఫోటోగ్రాఫర్ సమ్మయ్య, చిలువేరు సుదర్శన్ లకు శాలువా సన్మానించి మెమొంటోతో అందజేశారు. అధ్యక్షులు గిరగాని దుర్గేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ మండే డాగురె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.అనంతరం పతాకావిష్కరణ చేశారు. అనంతరం డాగురే పుట్టినరోజు సందర్భంగా చిత్రపటం ముందు కేక్ కట్ చేశారు.ఈ సందర్భంగా దుర్గేశ్ గౌడ్ మాట్లాడుతూ ఫోటో రంగంలో ఉన్నవారు మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకొని అభివృద్ధి చెందాలని కోరారు. ఫోటోగ్రాఫి రాష్ట్ర సంఘం ప్రవేశపెట్టిన కుటుంబ భరోసా పథకాన్ని వినియోగించుకొని మన కుటుంబాలకు భరోసాగా ఉండాలని అందరూ కుటుంబ భరోసా పథకంలో చేరాలని కోరారు.సాంప్రదాయ ఫోటో రంగం నుండి నూతన టెక్నాలజీ ఏఐ కి మారాల్సిన అవసరం ఉందని దానికి తగ్గట్టుగా ఏర్పాటు చేసేశిక్షణ తరగతులలో పాల్గొనాలని కోరారు. అనంతరం పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి దొంతి సంతోష్ గౌడ్, కోశాధికారి సోమేశ్వర్, సహాయ కార్యదర్శి ఎస్ డి జావిద్,ప్రచార కార్యదర్శి బేతి కన్నయ్య,తాటికొండ శివ,ముఖ్య సలహాదారులు కుసుమ శంకర్,బేతి విశ్వబంధు,బండారి సురేష్,అలంపల్లి నరేష్,సతీష్,రాజు, గిన్నరపూ అనిల్, అమ్మ రాజు,కక్కెర్ల రంజిత్ కుమార్ గౌడ్,దయ్యాల బాలరాజు,అంబాల బిక్షపతితో పాటు పలువురు ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా మందమర్రి ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఫోటో భవన్లో 186వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు ఘనంగా* *నిర్వహించారు*ముందుగా అధ్యక్షులు శ్రీ పసుల వెంకటస్వామి *
ఫోటోగ్రఫీ పితామహుడి*జండా ఎగురవేశారు అనంతరం సభ్యుల సమక్షంలో కేక్ కటింగ్ చేసరు తర్వాత సింగరేణి ఉన్నత పాఠశాల మనో వికాస పిల్లలకు ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు దీనిలో భాగంగా మంచిర్యాల జిల్లా సీనియర్ ఫోటోగ్రాఫర్స్. వైద్య రవి కి సోమ బాలాజీ కి. కల్లాటి *రాజు కి జయ శంకర్ కి
*శాలువాతో *ఘనంగా సన్మానించి ఆత్మీయ జ్ఞాపిక అందజేశారు *కార్యక్రమంలో రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు వడ్లకొండ కనకయ్య గౌడ్. కోశాధికారి బద్రి సతీష్ . గౌరవ సలహాదారులు * నక్క తిరుపతి*ఎం.వి సత్యనారాయణ జాడి ముకుoదo *వర్కింగ్* ప్రెసిడెంట్ వలస మణిరాజ్ ఉపాధ్యక్షులు * నక్క పవన్*లక్కిరెడ్డి అనిధర్ రెడ్డి ఆర్ సుజిత్*తాళ్లపల్లి రమేష్* కార్యదర్శులు పసుల రవి .
పగిడి రాజలింగు *ప్రచార కార్యదర్శులు.*కందుకూరి శ్రీకాంత్ బన్నీ శివ. కార్యనిర్వహ కార్యదర్శి జూపక సాది మాజీ ఉపాధ్యక్షులు కామెర గణేష్ విక్టరీ అశోక్.కామెర మహేందర్ సభ్యులు సిహెచ్ రవి మేడి అభిలాష్. ఐమాక్స్ *ప్రసాద్*బుజ్జి హరి భారత్ వరుణ్ తదితరులు పాల్గొన్నారు
ఓదెల మండలం కేంద్రంతో పాటు వివిధ గ్రామాలలో 79వ స్వతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కోర్టు ఆవరణలో పెద్దవల్లి సివిల్ జడ్జి ఎన్ మంజుల జాతీయ జెండాన ఎగురవేశారు. తహసిల్దార్ కార్యాలయం వద్ద తహసిల్దార్ ధీరజ్ కుమార్ జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో జి తిరుపతి ఎస్సారెస్పీ కార్యాలయం లో డిఈ బి భాస్కర్, పొత్కపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్సై దీకొండ రమేష్, ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం ఆవరణలో ఈవో బి సదయ్య, ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ప్రధాన వైద్యాధికారి డాక్టర్ సహబజ్ ఖాన్, మండల వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద ఏవో బి భాస్కర్, మండల విద్యా అధికారి కార్యాలయంలో ఎంఈఓ వై రమేష్ ఐకెపి కార్యాలయంలో ఏపీఎం సంపత్ ప్రెస్ క్లబ్ ఆవరణంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పని సుదర్శన్, సింగిల్ విండో కార్యాలయంలో చైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డి, ఓదెల పశువుల ఆసుపత్రి ఆవరణలో పశు వైద్యాధికారి మల్లేశం ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఆవరణలో కాలేజీ ప్రిన్సిపాల్, మోడల్స్కూల్ పాఠశాలలో ప్రిన్సిపాల్ శ్రీనివాస్, బీసీ హాస్టల్ ఆవరణలో హాస్టల్ వార్డెన్ ప్రవీణ్, కస్తూర్భా గాంధీ పాఠశాల ఆవరణలో ఎస్ఓ జ్యోతి తో పాటు వివిధ ప్రభుత్వ పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రైవేట పాఠశాలలో అలాగే వివిధ గ్రామాలలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో కార్యదర్శులు, వివిధ పార్టీల, వివిధ సంఘాల ఆధ్వర్యంలో జాతీయ జెండాలు ఎగరవేసారు. ఈ సందర్భంగా విద్యార్థు లకు నోట్ బుక్స్ పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ పంద్రా గస్టు నాడు మనకు స్వతంత్రం వచ్చిన రోజు మనం ఇంత స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉంటున్నా మంటే పూర్వం 1947కు పూర్వం ఎందరో స్వతంత్ర సమరయోధుల త్యాగాల ఫలితమే నేడు మనం ఇంత స్వేచ్ఛగా ఉంటున్నామన్నారు. రాను న్న రోజులలో ప్రపంచ దేశంలో మన భారత దేశాన్ని మరింత ముందుకు తీసుకో వెళ్ళవలసిన బాధ్యత బావి భారత పౌరులమైన మన అందరి పైన ఉందని అలాగే ఉద్యోగంలో పనిచేసేవారు మరింత చురుకుగా బాధ్యతగా పనిచేసి ప్రజలకు అందుబాటులో ఉండి మరింత సేవలు అందించా లని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ షబ్బీర్ పాష, అడ్వకేట్స్, ఏఎస్ఐ లు, సిఓ అంజి రెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు, సింగి ల్విండో డైరెక్టర్లు, పోలీస్ సిబ్బంది, వివిధ ప్రభుత్వ కార్యాలయం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
టిడిపి పార్టీ ఆధ్వర్యంలో 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
పరకాల నేటిధాత్రి
పట్టణంలోని 52వ బూత్ సగర వీధిలో టిడిపి సీనియర్ నాయకులు భూపాలపల్లి నియోజకవర్గ పరిశీలకులు పరకాల పట్టణ అధ్యక్షుడు చిదురాల రామన్న ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించి జాతీయ గీతం గీతం ఆలపించారు.ఈ సందర్భంగా రామన్న మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీలకు అతీతంగా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి సంస్కరణలు అమలు చేసి బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండి ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజల కీర్తిని వెలుగెత్తి చాటిందని అన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ ఉపాధ్యక్షులు కొత్తపల్లి శంకర్, రాజశేఖర్,నరసయ్య పి శరత్ బాబు,మహిళా నాయకురాలు కురిమిండ్ల కనక లక్ష్మీ,ఎల్లమ్మ, ఐలమ్మ తదితరులు పాల్గొన్నారు.
గణపురం మండల కేంద్రంలో 79 వ స్వతంత్ర దినోత్సవవేడుకలను శుక్రవారం ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, కార్యాలయాలు,వివిధ రాజకీయ పార్టీల నాయకులు,యువజన, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.జాతీయ జెండాలు ఎగుర వేసి, స్వీట్లు పంపిణీ చేశారు. తహసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ తహసిల్దార్ మధురకవి సత్యనారాయణ స్వామి మండల పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక అధికారి అసోద కుమారస్వామి,పోలీస్ స్టేషన్ ఆవరణలో సీఐ చెన్నమనేని కర్ణాకర్ రావు,ఆర్టీవో కార్యాలయంలో ఎం వి ఐ సందాని, కేటీపీపి లో సీఈ శ్రీప్రకాష్, మండల విద్యా వనరుల కేంద్రంలో ఎంఈఓ ఊరుగొండ ఉప్పలయ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో చైర్మన్ కిష్టయ్య, గ్రామపంచాయతీ కార్యాలయాలలో ఆయా పంచాయతీ కార్యదర్శులు, పాఠశాలలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సొసైటీ కార్యాలయంలో చైర్మన్ కన్నేబోయిన కుమార్
యాదవ్, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు రేపాక రాజేందర్, బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు మోతె కర్ణాకర్ రెడ్డి,బిజెపి పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు ఊర నవీన్ రావు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిని అనూష, పశువైద్యశాలలో వైద్యాధికారి శ్రీకాంత్ రెడ్డి, ఈ కార్యక్రమంలో ఎంపీడీవో భాస్కర్ ,ఎస్సై రేఖ అశోక్, పంచాయతీ కార్యదర్శులు ఉమ్మల్ల విజేందర్ ముక్కెర హేమంత్ ,నవీన్, రాకేష్ ,షఫీ నాగమణి,రాజకీయ పార్టీల నాయకులు కొత్త వెంకన్న, పొనగంటి మలహాల్ రావు, కటుకూరి శ్రీనివాస్,మోకిరాల తిరుపతిరావు,లింగంపల్లి వేణు రావు,విడిదినేని అశోక్,చోటే మియా, సూరినేని సంపత్ రావు,లక్కం రాములు,పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి,బైరగాని కుమారస్వామి గౌడ్,మంద మహేష్, అయితు రమేష్, తదితరులు పాల్గొన్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల కేంద్రంలో శుక్రవారం రోజున ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మండల కేంద్రంలో 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా మండలంలోని పాఠశాలల్లో జెండా ఆవిష్కరణ అనంతరం పాటలు, ఆటలు, క్విజ్ లు నిర్వహించి విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ కార్యాలయాలలో జెండా ఆవిష్కరించిన అనంతరం పలువురు అధికారులు విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది.
79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల లో చీఫ్ విప్ ఎమ్మెల్యేలు కలెక్టర్ ఎస్పీ
వనపర్తి నేటిదాత్రి . వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఐ.డి.ఓ.సి ప్రాంగణంలో ఏర్పాటు చేసినబీ79 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు రాష్ట్ర చీఫ్ విప్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ Lరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకావిష్కరణ చేశారు ఈ సందర్భంగా పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరిం చారు వనపర్తి జిల్లాలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన లక్ష్యాల పై నివేదికను చీఫ్ విప్ చదివి వినిపించారు అనంతరం స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులను శాలువాతో సన్మానించారు.జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఎస్పీ రావుల గిరిధర్ వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖిమ్యా నాయక్ అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య అధికారులు పాల్గొన్నారు పాఠశాలల విద్యార్థుల ద్వారా నిర్వహించిన సంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్టాల్సును చీఫ్ విప్ మహేందర్ రెడ్డి కలెక్టర్ ఎమ్మెల్యే లతో కలిసి పరిశీలించారు ప్రభుత్వ విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు వనపర్తి జిల్లాలోని మెప్మా మహిళా సంఘాలకు రుణాలకు సంబంధించిన రూ.10.08 కోట్ల చెక్కును అందజేశారు. ఇంటర్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆర్. రవి నాయక్ టీజీఎమ్ఎస్ పెబ్బేరు మధుగాని కళ్యాణి టీజీఎమ్ఎస్ పెబ్బేరుకే నరేష్ టీజీఎమ్ఎస్ ఘనపూర్ వి మౌనిక టీజీఎమ్ఎస్ ఘనపూర్లకు ఒక్కొక్కరికి పదివేల చెక్కును అందజేశారు స్థానిక సంస్థలలో విద్యా, ఉద్యోగాలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించే విధంగా బి సి బిల్లులను తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ లో ఆమోదించిందన్నారు వనపర్తి జిల్లాలో పకడ్బందీగా శాంతిభద్రతల పరిరక్షణ గంజాయి, డ్రగ్స్, ఇతర మపదార్ధాల వాడకంపై జిల్లాలో ప్రత్యేక పోలీస్ నిసూ టీమ్స్ బస్టాండ్లలో కళాశాలలో పోలీసులు తనిఖీలు నిర్వహినచడపై పోలీసులను అభినందించారు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అడిషనల్ ఎస్పీ వీరా రెడ్డి, డీఎస్పీలు, జిల్లా అధికారులు, వనపర్తి మార్కెట్ కమిటి చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ పెబ్బేరు మార్కెట్ కమిటి చైర్మన్ ప్రమోదిని ప్రజాప్రతినిధులు చిన్నారులు, ప్రజలు, విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు.
శ్రీ కృష్ణవేణి హైస్కూల్లో ఘనంగా 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
ముందస్తుగా కృష్ణాష్టమి వేడుకలు
నృత్యాలతో అలరించిన విద్యార్థులు
నస్పూర్(మంచిర్యాల)నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలంలోని శ్రీ కృష్ణవేణి హై స్కూల్ లో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ప్రధానోపాధ్యాయులు దేవన్న గౌడ్ ఘనంగా నిర్వహించారు.ప్రధానోపాధ్యాయులు జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు.పాఠశాల విద్యార్థులతో వివిధ రకాల వేషధారణలో విద్యార్థులను అలంకరించి,ఆటపాటలతో చిందులు వేపించారు.అలాగే పాఠశాలలో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు జరుపుకున్నారు.
Krishnaveni School
చిన్నారులు రాధాకృష్ణ వేషధారణలో నృత్యాలు చేసి అందరినీ ఆహ్లాదపరిచారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జ్ బత్తిని రాకేష్ గౌడ్, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు,విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
టూ వీలర్ మెకానిక్ వెల్ఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ
నస్పూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:
నస్పూర్ కాలనీ టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించడం నిర్వహించారు.ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షులు రంగు భాను ప్రకాష్ జెండాను ఆవిష్కరించి అనంతరం వారు మాట్లాడుతూ..స్వతంత్ర పోరాటంలో అమరులైన వీరులను స్మరిస్తూ,వారు ప్రసాదించిన స్వేచ్ఛను సమాజ శ్రేయస్సుకు ఉపయోగించాలని కోరుతూ,రోజువారి మానవ జీవన ప్రయాణంలో అత్యంత అవసరమైన మోటార్ సైకిల్ లను బాగుచేస్తూ ఎంతో మంది రోజువారి జీవితాలలో ముఖ్యపాత్ర పోషిస్తున్న మెకానిక్ సోదరులందరికీ,ఇంకో విధంగా చెప్పాలంటే మోటార్ సైకిల్ వైద్యులందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.అలాగే మెకానిక్ మిత్రులు అందరూ ఐక్యతతో ఉండాలని,వృత్తి పట్ల నిబద్ధతతో,నిజాయితీతో వ్యవహరించాలని,నమ్మి వచ్చిన కష్టమర్లకు న్యాయం చేయాలని సూచించారు.యూనియన్ కి అన్న విధాల సహాయ సహకారాలు అందించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో నస్పూర్ కాలనీ టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు రంగు భాను ప్రకాష్, ఉపాధ్యక్షులు పభాస్కర్, జనరల్ సెక్రెటరీ నేరెళ్ల నరేష్ గౌడ్,సహాయ కార్యదర్శి జడల మహేష్,ప్రచార కార్యదర్శి మహమ్మద్ అల్లావుద్దీన్, భానేష్ సభ్యులు,తోటి మెకానికులు పాల్గొన్నారు.
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకున మజీద్ మదర్స సదర్ సయ్యద్ మాజీద్
జహీరాబాద్ నేటి ధాత్రి:
79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఝరాసంగం మదర్సా జామియా హబీబా నిస్వాన్ మదర్సలో లో సదర్ సయ్యద్ మజీద్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.దేశ స్వాతంత్ర్యం కోసం త్యాగాలు చేసిన అమరవీరులను, ఉద్యమకారుల పోరాటాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.ప్రతి భారతీయుడి గుండెలోనూ దేశభక్తి నిండిపోయే రోజు ఆగస్టు 15. ఇది మనకు కేవలం ఒక సెలవు రోజు కాదు, దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన పవిత్రమైన రోజు.ఈ రోజున మనం అందరం కుల, మత, ప్రాంతీయ భేదాలు మరచిపోయి, భారతీయులమనే గర్వంతో ఏకమవుతాం. దేశమంతా ‘వందేమాతరం’, ‘భారత్ మాతా కీ జై’ నినాదాలతో ప్రతిధ్వనిస్తుంది. ఇలాంటి గొప్ప రోజున మన ప్రియమైన వారికి శుభాకాంక్షలు చెప్పడం మన సంప్రదాయం. ఈ దేశభక్తి సందేశాలు మన బంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు, దేశభక్తిని, ఐక్యతను కూడా పెంచుతాయన్నారు,ఈ కార్యక్రమంలో మస్జిద్ గురువు మూఫ్తీ ఫిర్దోస్ హఫీస్ బాబర్ ఖాదర్ అలీ రాజ్ మహమ్మద్ అమీరుద్దీన్ మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు,
జాతీయ జెండా ఆవిష్కరించిన మండల పార్టీ అధ్యక్షుడు మోతే కరుణాకర్ రెడ్డి
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో మండల బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మోతే కరుణాకర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కర్ణాకర్ రెడ్డి మాట్లాడుతూ ఆగస్టు 15 వరకు పూర్తి రుణమాఫీ చేస్తానన్న ముఖ్యమంత్రి మాటలు ఏమయ్యాయని ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి రెండవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నప్పటికీ ఇంకా రుణమాఫీ కాకపోవడం రైతులను విస్మరించడమే అని అన్నారు. ఇప్పటికైనా రైతులకు పూర్తిస్థాయి రుణమాఫీ చేసి రైతులను ఆదుకోవాలని అన్నారు కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పోలుసాని లక్ష్మీనరసింహారావు, మాజీ పిఎసిఎస్ చైర్మన్ పోరెడ్డి పూర్ణ చంద్రారెడ్డి, సీనియర్ నాయకులు బైరగాని కుమారస్వామి, పెంచల రవీందర్, మాజీ సర్పంచ్ లు కట్ల శంకర్, పల్లెబోయిన సదయ్య, నాయకులు జానయ్య, మామిండ్ల సాంబయ్య యాదవ్, రజాక్, శామ్యూల్ శ్రావణ్, లాలూ, మార్క సాయి, వాజిద్, చక్రి, హాఫీజ్, శివ,గౌతమ
ఉమ్మడి హన్మకొండ జిల్లా కోర్ట్ ఆవరణలో ఘనంగా 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు:-
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఇరు జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు:-
హన్మకొండ/వరంగల్, నేటిధాత్రి (లీగల్):-
హన్మకొండ/వరంగల్ ఉమ్మడి జిల్లా కోర్ట్ ఆవరణలో 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కోర్టు ఆవరణలో పోలీసులు గౌరవ వందనం చేయగా వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బి నిర్మలా గీతాంబ మరియు హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి డా. కె. పట్టాభి రామారావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం బార్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో వరంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు వలస సుదీర్ మరియు హన్మకొండ బార్ అసోసియేషన్ అధ్యక్షులు పులి సత్యనారాయణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఇట్టి సందర్భంగా వారు మాటాడుతూ న్యాయవాదులకు మరియు దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
ఇట్టి కార్యక్రమంలో ఇరు బార్ అసోసియేషన్ల ప్రధాన కార్యదర్శిలు డి.రమాకాంత్, కె. రవి మరియు ఇరు కమిటీ సభ్యులు, మరియు జిపిలు, ఏజిపిలు మరియు పిపి లు, ఏపిపిఓలు, మరియు సీనియర్, జూనియర్ న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు మరియు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
నెక్కొండ మండల వ్యాప్తంగా 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయంలో పాటు పల్లె నుండి పట్నం దాకా ఘనంగా నిర్వహించారు. మండలంలోని తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ వేముల రాజుకుమార్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఎగరవేసి 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నెక్కొండ డిప్యూటీ తాసిల్దార్ రవికుమార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ హంస నరేందర్, రెవెన్యూ ఇబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఎంపీడీవో కార్యాలయంలో 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు
మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ జాతీయ పతాకాన్ని ఎగరవేసి స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
నెక్కొండ మార్కెట్ ఆవరణంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు
నెక్కొండ మార్కెట్ లో 79వ స్వతంత్ర దినోత్సవం వేడుకలను అంబరాన్ని అంటే విధంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఒకరికొకరు మిఠాయిలు పంచుతూ ఆనందోత్సవాలతో జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట టిపిసిసి సభ్యుడు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి, బక్కి అశోక్, పెండ్యాల హరిప్రసాద్, రాచకొండ రఘు, ఈదునూరి సాయి కృష్ణ, బండి శివకుమార్, సింగం ప్రసాద్, మార్కెట్ కమిటీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Independence Day
నెక్కొండ ప్రాథమిక సొసైటీ ఆవరణంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు
నెక్కొండ ప్రాథమిక సొసైటీ ఆవరణలో సొసైటీ చైర్మన్ మారం రాము జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సీఈవో సురేష్, మాజీ సొసైటీ చైర్మన్ కొమ్మారెడ్డి రవీందర్ రెడ్డి, మాజీ నర్సంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొమ్ము రమేష్ యాదవ్, సొసైటీ డైరెక్టర్లు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
మండల కేంద్రంలో 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి మండల తహసిల్దార్ కార్యాలయంలో పోలీసులు గౌరవ వందనం చేయగా తహసిల్దార్ రాణి జాతీయ పతాకావిష్కరణ చేశారు,నడికూడ జిపి యందు ఎంపీడీవో గజ్జెల విమల జాతీయ జెండాను ఆవిష్కరించారు,మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్ నవీన్ కుమార్ జాతీయ పతాకావిష్కరణ చేశారు,మండల రైతు వేదిక ప్రాంగణంలో వ్యవసాయ అధికారి పోరిక జైసింగ్ జాతీయ పతాకావిష్కరణ చేశారు, జెడ్పీఎస్ఎస్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు కే. హనుమంతరావు జాతీయ జెండా ను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది,పోలీసులు,పాఠశాల ఉపాధ్యాయులు,ప్రజా ప్రతినిధులు,అంగన్వాడీ టీచర్స్,ఆశా వర్కర్లు,తదితరులు పాల్గొన్నారు.
శ్రీ కృష్ణవేణి హైస్కూల్లో ఘనంగా 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
ముందస్తుగా కృష్ణాష్టమి వేడుకలు
నృత్యాలతో అలరించిన విద్యార్థులు
నస్పూర్(మంచిర్యాల)నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలంలోని శ్రీ కృష్ణవేణి హై స్కూల్ లో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ప్రధానోపాధ్యాయులు దేవన్న గౌడ్ ఘనంగా నిర్వహించారు.ప్రధానోపాధ్యాయులు జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు.పాఠశాల విద్యార్థులతో వివిధ రకాల వేషధారణలో విద్యార్థులను అలంకరించి,ఆటపాటలతో చిందులు వేపించారు.అలాగే పాఠశాలలో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు జరుపుకున్నారు.
చిన్నారులు రాధాకృష్ణ వేషధారణలో నృత్యాలు చేసి అందరినీ ఆహ్లాదపరిచారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జ్ బత్తిని రాకేష్ గౌడ్, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు,విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.