కేరళలో పాట చిత్రీకరణ…

కేరళలో పాట చిత్రీకరణ

మెగాస్టార్‌ చిరంజీవి, నయనతార జంటగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం (‘మెగా157-వర్కింగ్‌ టైటిల్‌)’ షూటింగ్‌ కేరళలో శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం…

మెగాస్టార్‌ చిరంజీవి, నయనతార జంటగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం (‘మెగా157-వర్కింగ్‌ టైటిల్‌)’ షూటింగ్‌ కేరళలో శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం కేరళలోని అందమైన లోకేషన్లలో చిరంజీవి, నయనతారపై పెళ్లి నేపథ్యంలో ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ‘కొన్ని కీలకమైన ఘట్టాలను కూడా ఈ షెడ్యూల్‌లో షూట్‌ చేస్తున్నాం, ఈనెల 23 నాటికి ఈ షెడ్యూల్‌ పూర్తవుతుంద’ని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

సత్యలోకం చూపించబోతున్నాం

 

సత్యలోకం చూపించబోతున్నాం

చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం విశ్వంభర కథ గురించి దర్శకుడు..

చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘విశ్వంభర’ కథ గురించి దర్శకుడు వశిష్ఠ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ‘మన పురాణాల ప్రకారం మొత్తం 14 లోకాలుంటాయి. యమలోకం, పాతాళం, స్వర్గం.. ఇలా ఇప్పటివరకూ పలు చిత్రాల్లో ఈ లోకాలను ఎవరికి వారు తమకు తోచినట్లు చూపించారు. ‘విశ్వంభర’లో మేం వీటిని దాటి ఇంకా పైకి వెళ్లాం. ఈ 14 లోకాలకు మూలమైన సత్యలోకాన్ని ఇందులో చూపించబోతున్నాం. కథానాయకుడు ఆ లోకానికి ఎలా వెళ్తాడు, కథానాయికను భూమిపైకి ఎలా తీసుకొస్తాడు అనే పాయింట్‌ చుట్టూ అల్లుకున్న కథ ఇది’ అని చెప్పారు. ఈ సినిమా కోసం భారీ ఖర్చుతో అద్భుతమైన సెట్స్‌ వేసి అందులో చిత్రీకరణ జరుపుతున్నారు. చిరంజీవికి జోడీగా త్రిష, ఆషికా రంగనాథ్‌ నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

మెగాస్టార్‌తో డ్యూయెట్‌

మెగాస్టార్‌తో డ్యూయెట్‌

shine junior college
చిరంజీవి కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం (మెగా 157-వర్కింగ్‌ టైటిల్‌) షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా…
చిరంజీవి కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం (మెగా 157-వర్కింగ్‌ టైటిల్‌) షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా నయనతార నటిస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే ఉత్తరాఖండ్‌లోని మసూరీలో రెండో షెడ్యూల్‌ మొదలైంది. ఇందులో చిరంజీవి సహా ప్రధాన తారాగణం అంతా పాల్గొంటోంది. మంగళవారం నయనతార సెట్స్‌లోకి అడుగుపెట్టారు. ఈ షెడ్యూల్‌లో చిరంజీవి, నయనతారపై కీలక సన్నివేశాలతో పాటు ఓ పాటను చిత్రీకరించనున్నారు. దర్శకుడిగా వరుస విజయాలను అందుకుంటున్న అనిల్‌ రావిపూడి ప్రేమ, కుటుంబ విలువలతో హృద్యంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో చిరంజీవి పాత్ర చిత్రణ నవ్యపంథాలో ఉంటుంది, ప్రేక్షకులు ఆశించే అంశాలతో ఆసక్తికరంగా సాగుతుంది అని యూనిట్‌ తెలిపింది. షైన్‌స్ర్కీన్స్‌, గోల్డ్‌బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బేనర్‌పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో, సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి

నాని సమర్పణలో చిరు మూవీ

మెగాస్టార్ చిరంజీవి తాజా తన ఫ్యాన్స్​కు ఓ స్పెషల్ సర్​ప్రైజ్ ఇచ్చారు. ఓ యంగ్ డైరెక్టర్ కథకు ఆయన రీసెంట్​గా ఓకే చెప్పారు. గతంలో ఈ రూమర్స్ తెగ ట్రెండ్ అవ్వగా, ఇప్పుడు వాటిని నిజం చేస్తూ ఓ అధికారిక అనౌన్స్​మెంట్ వచ్చింది. అయితే ఇందులో ఆసక్తికర అంశం ఏంటంటే ఈ చిత్రానికి సమర్పకుడిగా నేచురల్ స్టార్ నాని వ్యవహరిస్తున్నారు. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో కాదు ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల. తాజాగా ఈ విషయాన్ని తెలియజేస్తూ నాని సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.

ఇక చేతులకు రక్తం కారుతున్న ఓ పోస్టర్‌ను షేర్‌ చేసి “హింసలోనే అతడు తన శాంతిని వెతుక్కున్నాడు” అంటూ ఓ పవర్​ఫుల్ క్యాప్షన్​ను జోడించారు. అనానిమస్‌ ప్రొడక్షన్స్‌, ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌ బ్యానర్​పై ఈ మూవీ తెరకెక్కనుంది. ప్రస్తుతం శ్రీకాంత్‌ ఓదెల, నాని కాంబోలో ‘ది ప్యారడైజ్‌’ అనే సినిమా రూపొందుతోంది. దీని తర్వాత చిరు ప్రాజెక్ట్​ సెట్స్​పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాదే ఈ సినిమా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని సినీ వర్గాల మాట.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version