కాంగ్రెస్ లో భారీగా చేరికలు

కాంగ్రెస్ లో భారీగా చేరికలు
గచ్చిబౌలి డివిజన్ కు చెందిన పలు పార్టీల నాయకులు స్వచ్ఛందంగా కాంగ్రెస్ సభ్యత్వ స్వీకరణ

శేరిలింగంపల్లి, నేటిధాత్రి 

కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై స్వయంగా పార్టీ సభ్యత్వం స్వీకరిస్తున్నారని రాష్ట్ర ఎంబిసీ చైర్మన్ జెరిపేటి జైపాల అన్నారు. శుక్రవారం కాంగ్రెస్ సీనియర్ నాయకులు సురేందర్, హనుమంత్ ల ఆధ్వర్యంలో గచ్చిబౌలి డివిజన్ కు చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జైపాల్ మాట్లాడుతూ… కాంగ్రెస్ అందిస్తున్న ప్రజాపాలనను మెచ్చి ప్రజలు స్వయంగా పార్టీలో చేరుతున్నారన్నారు. వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు భారీగా చేరడం చూస్తేనే అర్థమవుతుంది ప్రభుత్వ పని తీరు అన్నారు. భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీదే అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామచంద్ర రాజు, హనుమంతు, శ్రీనివాస్, భీమ్ రాజ్, నవీన్, విజయ్, పవన్, శివ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version