రాష్ట్రవ్యాప్త బీసీ బందులో పాల్గొన్న మోకుదెబ్బ నాయకులు…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-18T135916.842.wav?_=1

 

రాష్ట్రవ్యాప్త బీసీ బందులో పాల్గొన్న మోకుదెబ్బ నాయకులు.

దుగ్గొండి,నేటిధాత్రి:

 

42 శాతం బీసీ రిజర్వేషన్ అమలు పట్ల బీసీ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన రాష్ట్ర బంద్ కార్యక్రమం దుగ్గొండి మండలం గిర్నిబావి గ్రామంలో గల ప్రధాన రహదారిపై నిరసన,ధర్నా కార్యక్రమం చేపట్టగా గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ మండల అధ్యక్షుడు తడుక కొమురయ్య గౌడ్ అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిథిగా నర్సంపేట డివిజన్ అధ్యక్షుడు కందుల శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు.విద్య, ఉపాధి తోపాటు అన్ని విధాల బీసీ కులస్తులకు న్యాయం జరగాలంటే 42 శాతం రిజర్వేషన్ ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు గుండెబోయిన రమేష్ గౌడ్, జిల్లా నాయకులు మోడెం విద్యాసాగర్ గౌడ్, మహేష్ గౌడ్, కాసగాని చందూగౌడ్, సుధీర్ గౌడ్, తడుక కాంత్రి కుమార్ గౌడ్ వివిధ గ్రామాల గౌడ కులస్తులు పాల్గొన్నారు.

బీసీ బంద్ విజయవంతం కావాలి

బీసీ రాష్ట్ర బంద్ జయప్రదం చేయాలి

నర్సంపేట,నేటిధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

బీసీ రిజర్వేషన్ పట్ల రాష్ట్ర బిసి బంద్ ను విజయవంతం చేయాలని కోరుతూ నర్సంపేట సిపిఎం ఆఫీసులో సిపిఎం మండల కార్యదర్శి కోరబోయిన కుమార స్వామి అధ్యక్షతన సిపిఎం, సీపీఐ,కాంగ్రెస్, బీసీ సంఘాల ఉమ్మడి సమావేశం జరిగింది.ఈ సమావేశంలో పాల్గొన్న సీపీఐ రాష్ర్ట నాయకులు పంజాల రమేష్ మాట్లాడుతూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వము విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో బీసీ లకు తీసుకువచ్చిన 42 శాతం రిజర్వేషన్ చట్టాన్ని రాష్ట్రపతి ఆమోదించకుండా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అడ్డుపడుతూ బీసీలకు రావాల్సిన న్యాయమైన వాటలకు అన్యాయం చేస్తుందని పేర్కొన్నారు.ఈ బంద్ ద్వారా బిజెపికి బుద్ధి చెప్పాలని అన్నారు. ఈ సమావేశంలో బీసీ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు డ్యాగల శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నర్సంపేట మండల అధ్యక్షులు కత్తి కిరణ్ కుమార్ గౌడ్, బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర నాయకులు చింతకింది కుమార స్వామి, సీపీఎం పట్టణ కార్యదర్శి హన్మకొండ శ్రీధర్, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గజ్జి రాజు,సిపిఎం నాయకులు గడ్డమీదీ బాలకృష్ణ, పాత్కల సుధాకర్, జినుకల సుదర్శన్, నరసింహారాములు తదితరులు పాల్గొన్నారు.

42% రిజర్వేషన్ల కోసం బీసీ బంద్‌కు సగర సంఘం మద్దతు

బిసి బంద్ కు సగర సంఘం మద్దతు

42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా ఎన్నికలకు పోతే సహించేది లేదు

సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శేఖర్ సగర

శేరిలింగంపల్లి, నేటి ధాత్రి :-

Vaibhavalaxmi Shopping Mall

తెలంగాణ రాష్ట్రంలో బిసి లకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 18 వ తేదీన తెలంగాణ బిసి జేఏసీ ఇచ్చిన బంద్ కు తమ సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నామని తెలంగాణ సగర సంఘం రాష్ట్ర కమిటీ స్పష్టం చేసింది. గురువారం గచ్చిబౌలి లోని సగర సంఘం కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర నాయకులు మాట్లాడారు. రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న ఈ బంద్ ద్వారా బిసి ల చైతన్యం ప్రదర్శించాలని పిలునిచ్చారు. 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే సహించేది లేదని అన్నారు. రాజ్యాంగ సవరణ చేసి చట్ట పరంగా నే రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ, విద్య, ఉద్యోగాలలో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సగరులు బంద్ లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సగర సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మోడల ఆంజనేయులు సగర, చిలుక శ్రీనివాస్ సగర, దిండి శేఖర్ సగర, సంయుక్త కార్యదర్శి సంగిశెట్టి గంగాధర్ సగర, కార్యనిర్వాక కార్యదర్శి బంగారి ఆంజనేయులు సగర, మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మోడల ఆంజనేయులు సగర, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు మోడల రవి సగర, సగర సంఘం నాయకులు కేపీ వెంకటేష్ సగర, ఖాజా సగర, రాజు సగర, కృష్ణ సగర తదితరులు పాల్గొన్నారు.

ఉల్లాస్ పుస్తకాల పంపిణి చేసిన ఎంఈఓ…

ఉల్లాస్ పుస్తకాల పంపిణి చేసిన ఎంఈఓ

చిట్యాల,నేటి ధాత్రి :

 

సమాజంలోని ప్రతి ఒక్కరు చదువుతూ తన యొక్క వ్యక్తిగత జీవన విధానమును మార్చుకోవాలని మానవ వనరుల కేంద్రం చిట్యాల నందు వాలంటరీ టీచర్స్ నకు ఉల్లాస్ పుస్తకాల పంపిణీ మండల విద్యాశాఖాధికారి కోడెపాక రఘుపతి పంపిణీ చేసినారు.
మండల విద్యాశాఖాధికారి రఘుపతి మాట్లాడుతూ చదువు అనేది సమాజంలో మంచి గుర్తింపు ఇస్తుందని ముఖ్యంగా మహిళల అక్షరాస్యతను పెంచవలసిన అవసరము ఎంతైనా ఉన్నదని చదువుకున్న మహిళ తన ఇంటిని పిల్లలను సక్రమమైన మార్గంలో పయనింప చేయడానికి కృషి చేస్తుందని అందుకే ఇంటికి దీపం ఇల్లాలు అని అన్నారని అదేవిధంగా అందరూ చదువుతూ అందరూ ఎదగాలని వారు కోరారు .చిట్యాల మండలంలో వాలంటరీ టీచర్స్ 279. లర్నర్స్ 2790 మందిని గుర్తించామని వాలంటరీ టీచర్స్ అందరూ కూడా లర్నర్స్ ను చదువు వైపునకు మళ్ళించాలని చదువు యొక్క ప్రాముఖ్యతను తెలియజేయవలసిన అవసరం ఎంతైనా ఉందని ఉల్లాస్ కార్యక్రమమును దిగ్వి జయం చేయుటకు ప్రతి ఒక్కరు దీనినీ యజ్ఞములా భావించి పాల్గొనాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఏపీయం గుర్రపు రాజేందర్ ఉల్లాస్ కార్యక్రమ ఇన్చార్జ్ బోనగిరి తిరుపతి వాలంటరీ టీచర్స్  పాల్గొన్నారు.

అబ్దుల్ కలాం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత అబ్దుల్ అజీజ్..

అబ్దుల్ కలాం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత అబ్దుల్ అజీజ్..

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

మాజీ ఉపరాష్ట్రపతి, భారత దేశ సైన్స్ పితామహుడు స్వర్గీయ అబ్దుల్ కలాం 94వ జయంతి సందర్భంగా హైదరాబాదులోని రవీంద్ర భారతి లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కార్యక్రమం నిర్వహించారు. అబ్దుల్ కలాం రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు రామకృష్ణాపూర్ పట్టణ తవక్కల్ విద్యాసంస్థల అధినేత అబ్దుల్ అజీజ్ ఎంపికైన నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మాజీ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. రామకృష్ణాపూర్ పట్టణంలో గత 25 సంవత్సరాల నుండి విద్యారంగంలో చేసిన నిస్వార్ధ సేవలకు గాను అబ్దుల్ కలాం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం సంతోషంగా ఉందని అవార్డు గ్రహీత అబ్దుల్ అజీజ్ తెలిపారు. అబ్దుల్ అజీజ్ కు కలాం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడంతో పట్టణంలోని ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఘనంగా అబ్దుల్ కలాం జయంతి వేడుకలు…

ఘనంగా అబ్దుల్ కలాం జయంతి వేడుకలు

కేసముద్రం/ నేటి ధాత్రి

 

కేసముద్రం మండల కేంద్రంలోని శ్రీ వివేకవర్ధిని హైస్కూల్‌లో బుధవారం భారత మాజీ రాష్ట్రపతి, “మిసైల్ మాన్ ఆఫ్ ఇండియా”గా పేరుపొందిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతిని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా పాఠశాల రెస్పాండెంట్ చిర్ర యాకాంతం గౌడ్ కలాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ –
“డాక్టర్ అబ్దుల్ కలాం జీవితమే ఓ ప్రేరణ. సాధారణ కుటుంబంలో పుట్టి, కఠిన శ్రమతో దేశానికి శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా సేవలు అందించారు. విద్యార్థులు ఆయనలా పెద్ద కలలు కనాలి, వాటిని నెరవేర్చే దిశగా కృషి చేయాలి. కలాం చెప్పిన ‘ కలలు కనండి వాటిని సాకారం చేసుకునేందుకు కృషి చేయండి’ అనే వాక్యాన్ని జీవితమంతా మంత్రంలా మార్చుకోవాలి” అని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

విద్యార్థుల ఆహర పదార్థాల నాణ్యతను రెగ్యులర్ చెక్ చేయాలి…

విద్యార్థుల ఆహర పదార్థాల నాణ్యతను రెగ్యులర్ చెక్ చేయాలి

నర్సంపేట బిసి బాలుర వసతి గృహాన్ని ఆకస్మికంగా సందర్శన

వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

నర్సంపేట,నేటిధాత్రి:

 

ప్రభుత్వ వసతి గృహాలో చదువుకునే విద్యార్థులకు అందించే ఆహర పదార్థాల నాణ్యతను రెగ్యులర్ గా చెక్ చేసుకోవాని నర్సంపేట బిసి బాలుర వసతి గృహం అధికారిని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశించారు. నర్సంపేట పట్టణంలోని బిసి బాలుర వసతి గృహాన్ని మంగళవారం సాయంత్రం ఆకస్మికంగా సందర్శించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తనిఖీ చేశారు.వసతి గృహానికి సంబంధించిన విద్యార్థులు, స్టాఫ్ వివరాలను పలు రికార్డులు, వంటగది, మరుగుదొడ్లను, పరిసర ప్రాంతాలను పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వసతి గృహం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కామన్ డైట్ మెనూను పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పిల్లలకు అందించే ఆహర పదార్థాల నాణ్యతను రెగ్యులర్ గా చెక్ చేసుకోవాలని, విద్యార్థులకు మెనూపకారంగా రుచికరమైన నాణ్యమైన వేడి భోజనం అందించాలని అన్నారు. భోజన నాణ్యతను పరిశీలించి విద్యార్థులతో కలిసి కలెక్టర్ రాత్రి భోజనం చేశారు.విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉంటే ఏర్పాటుచేసిన కంప్లైంట్ బాక్స్ లో రాసి వేయాలని అన్నారు. విద్యార్థులు హాస్టల్ కు వచ్చి వెళ్ళేటప్పుడు బాధ్యత గా కేర్ టేకర్ వెంట ఉండాలని తెలిపారు.చదువులో వెనుకబడ్డ విద్యార్థులపై వసతి గృహ సంక్షేమ అధికారి ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ ఆదేశించారు.ఈ సంవత్సరం ప్రభుత్వ బిసి వసతి గృహంలో మెరుగైన ఫలితాలు రావాలని అందుకు విద్యార్థులు కూడా కృషి పట్టుదలతో చదివి జిల్లాలోనే వసతి గృహా విద్యార్థులు ముందంజలో ఉంచి 100 శాతం మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు.చదువులో విద్యార్థుల సామర్థ్యం తెలుసుకునేందుకు పలు ప్రశ్నలు వేసిన కలెక్టర్ పలు సమాధానాలు రాబట్టారు.పదవ తరగతి విద్యార్థులను సబ్జెక్టు వారిగా ప్రశ్నలు అడిగారు. విద్యార్థులు విషయ పరిజ్ఞానంలో ముందుండాలని సూచించారు. చదువులో వెనుకబడ్డ ప్రతి విద్యార్థిపై వసతి గృహ సంక్షేమ అధికారులు తన సొంత బిడ్డల వల్లే భావించి ప్రత్యేక శ్రద్ధ వహించి మెరుగైన ఫలితాలు వచ్చేందుకు కృషి చేయాలని అన్నారు. వసతి గృహ ఆవరణ పరిసరాలు ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని వసతి గృహ సిబ్బంది సమయపాలన పాటిస్తూ విధులు నిర్వహించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన సంక్షేమ అధికారి పుష్పలత, వసతి గృహ సంక్షేమ అధికారి, నాలుగో తరగతి సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

బెస్ట్ అవైలబుల్ స్కీం బకాయిలు తక్షణమే విడుదల చేయాలి…

బెస్ట్ అవైలబుల్ స్కీం బకాయిలు తక్షణమే విడుదల చేయాలి

పరకాల మండల మడికొండ ప్రశాంత్ అధ్యక్షుడు

పరకాల నేటిధాత్రి

 

బెస్ట్ అవైలబుల్ స్కీం బకాయిలు ప్రభుత్వం తక్షణమే బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ పరకాలమండల అధ్యక్షత మడికొండ ప్రశాంత్ అన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బెస్ట్ అవైలబుల్ పాఠశాలకు మూడేళ్లగా బకాయిలు చెల్లించకపోవడం వల్ల విద్యార్థి తల్లిదండ్రులకు పాఠశాలలు లేఖలు రాశారని దీనివల్ల పాఠశాలలో చదువుతున్న 23 వేల మంది దళిత విద్యార్థులు,7వేల మంది గిరిజన విద్యార్థులు చదువు దూరమయ్యే పరిస్థితి ఉందని 154 కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలన్నారు.గత ఆరు నెలలుగా విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.లేదంటే రాబోయే రోజుల్లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తల్లిదండ్రులతో మరియు విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని అన్నారు.

జ్ఞానోదయ కళాశాలలో నూతన విద్యార్థుల స్వాగతోత్సవ….

మెట్ పల్లి అక్టోబర్ 14 నేటి ధాత్రి

 

జ్ఞానోదయ డిగ్రీ పిజీ కళాశాలలో ఘనంగా స్వాగతోత్సవ వేడుకలు.
మెట్ పల్లి పట్టణం లోని మనోహర్ గార్డెన్ లో మంగళవారం జ్ఞానోదయ డిగ్రీ పిజీ కళాశాల నూతన విద్యార్థుల స్వాగతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెట్ పల్లి రెవెన్యూ డివిజన్ అధికారి నక్క శ్రీనివాస్ ముఖ్య అతిధి గా విచ్చేసారు.ఆయన మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యాలను ఏర్పరచుకొని. లక్ష్య సాధన దిశగా పని చేయాలనీ సూచించారు.అనంతరం కరస్పాండంట్ ఇల్లేందుల శ్రీనివాస్ మాట్లాడుతూ సమయం పాలనతో చదివి సమాజంలో శక్తులుగా మారాలని ఉన్నత స్థానాల్లో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంకు మెట్ పల్లి ఎస్ ఐ 3 గంగాధర్ అతిధిగా పాల్గొని మాట్లాడారు. సీనియర్లు జూనియర్లకు ఆదర్శం గా ఉండేట్టు చూడాలని కోరారు. ఈ కార్యక్రమం లో కళాశాల కరస్పాండెంట్ ఇల్లెందుల శ్రీనివాస్ ప్రిన్సిపాల్ వెంకట్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ రాజ్ మరియు అధ్యాపకులు పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎన్నికైన విద్యార్థికి స్వర్ణకార చేతివృత్తుల సంఘం ఘనసన్మానం.

రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎన్నికైన విద్యార్థికి స్వర్ణకార చేతివృత్తుల సంఘం ఘనసన్మానం.
మల్లాపూర్ అక్టోబర్ 14 నేటి ధాత్రి

 

మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన సార రుత్విక్ జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికైనందున మల్లాపూర్ స్వర్ణకార చేతివృత్తుల సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం చేయడం జరిగినది. ఇట్టి కార్యక్రమంలో స్వర్ణకార సంఘం అధ్యక్షుడు బెజ్జారపు గంగాధర్ మాట్లాడుతూ భవిష్యత్తులో రిత్విక్ అనేక విజయాలు సాధించాలని, అలాగే ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, అలాగే నేటి విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించాలని సూచిస్తూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపినారు. ఇట్టి కార్యక్రమంలో జగిత్యాల జిల్లా స్వర్ణకార సంఘం ఉపాధ్యక్షులు ఎగ్యారపు శ్రీనివాస్, జిల్లా సంయుక్త కార్యదర్శులు తిప్పర్తి కిషన్, సింహరాజు నరేష్, అలాగే సంఘ సభ్యులు తుమ్మనపల్లి శ్రీనివాస్, బెజ్జారపు తిరుపతి, బెజ్జారపు శ్రీనివాస్, కట్ట వీరేంద్ర చారి, గన్నరపు రమేష్, ఎగ్యారపు వెంకటరమణ, ద్రుశెట్టి రాజేష్, దురిశెట్టి శ్రీనివాస్, ఆకోజి వెంకటరమణ అలాగే విద్యార్థి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా విద్యార్థులకు ఆన్‌లైన్ వ్యాసరచన పోటీలు…

పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా విద్యార్థులకు ఆన్‌లైన్ వ్యాసరచన పోటీలు

పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

పోలీస్ అమరవీరుల ప్రాణ త్యాగాల స్మరణలో భాగంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం,పోలీస్ ఫ్లాగ్ డే సందర్బంగా దేశం కోసం ప్రాణాలు అర్పించిన ధైర్యవంతులైన పోలీసు సిబ్బందిని స్మరించుకుంటూ తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆన్‌లైన్ వ్యాసరచన పోటీ నిర్వహించడం జరుగుతుందని రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు.ఈ పోటీలు మూడు భాషల్లో తెలుగు,ఇంగ్లీష్,ఉర్దూ భాషల్లో 6వ తరగతి నుండి పీజీ వరకు ఉన్న విద్యార్థులు పాల్గొనవచ్చునని అన్నారు. డ్రగ్స్ నివారణలో పోలీసుల పాత్ర,విద్యార్థులు డ్రగ్స్ నుండి ఎలా దూరంగా ఉండగలరు అనే అంశం మీద వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.విద్యార్థులు తమ వ్యాసాలను అక్టోబర్ 28 వ తేదీ లోగా సమర్పించాలని,ఉత్తమ ప్రతిభ కనబరిచిన ముగ్గురు విద్యార్థులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేయడం జరుగుతుందని,అంతే కాకుండా రామగుండం పోలీస్ కమీషనరేట్ స్థాయిలో 1వ, 2వ,3వ స్థానాల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేయబడుతాయి అన్నారు.విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జిల్లా,రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచి బహుమతులు పొందాలని సీపీ సూచించారు.పోటీలో పాల్గొనే విధానం కింద ఇవ్వబడిన లింక్‌పై క్లిక్ చేసి పాల్గొనండి
https://forms.gle/jaWLdt2yhNrMpe3eA
మీ పేరు,విద్యార్హత ఇతర వివరాలు నమోదు చేయండి.వ్యాసాన్ని పేపర్‌ పై రాసి,దానిని చిత్రం (ఇమేజ్) లేదా పిడిఎఫ్ ఫార్మాట్‌ లో 500 పదాలు మించకుండా అప్‌ లోడ్ చేసి సబ్మిట్ చేయాలని తెలిపారు.

విద్యార్థులకు తల్లిదండ్రుల ప్రేమతో పాటు క్రమశిక్షణ అవసరం…

విద్యార్థులకు తల్లిదండ్రుల ప్రేమతో పాటు క్రమశిక్షణ అవసరం

భూపాలపల్లి నేటి ధాత్రి

https://youtu.be/rTUfmQNMqwg?si=xOj8JynoqGJa6sua

 

సింగరేణి హై స్కూల్‌లో తల్లిదండ్రుల సమావేశం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపాల్ సి హెచ్ జాన్సీ రాణి అధ్యక్షత వహించారు. సమావేశంలో పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు పాల్గొన్నారు.ప్రిన్సిపాల్ జాన్సీ రాణి మాట్లాడుతూ తల్లిదండ్రులకు విద్యార్థుల ప్రవర్తన, చదువు పట్ల ఆసక్తి క్రమశిక్షణపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని వివరించారు.
“పిల్లలు పాఠశాలలో నేర్చుకున్న విషయాలను ఇంట్లో కూడా పునరావృతం చేసేలా ప్రోత్సహించలన్నారు . మొబైల్ ఫోన్ వినియోగాన్ని పరిమితం చేసి, టెలివిజన్ సోషల్ మీడియా వినియోగంపై తగిన నియంత్రణ వహించాలన్నారు . పిల్లలతో రోజూ కొంతసేపు మాట్లాడి, వారి సమస్యలు, అభిరుచులు తెలుసుకోవాల్న్నరు . తల్లిదండ్రుల ప్రేమతో పాటు క్రమశిక్షణ కూడా అవసరం, అని తెలిపారు. అలాగే విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రత, సమయపాలన పాఠశాల హాజరు విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు.

డిగ్రీ ఫస్ట్ ఇయర్ విద్యార్థులపై ఫీజుల భారాన్ని తగ్గించాలి…

డిగ్రీ ఫస్ట్ ఇయర్ విద్యార్థులపై ఫీజుల భారాన్ని తగ్గించాలి

ఫీజులు తగ్గించకపోతే ఆందోళన చేపడుతాం

పిడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.శ్రీకాంత్

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

కేయూ పరిధిలో డిగ్రీ కోర్సుల మొదటి సెమిస్టర్ విద్యార్థులకు భారీగా పెంచిన వివిధ రకాల ఫీజులను తగ్గించాలని పి డి ఎస్ యు రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.శ్రీకాంత్ శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్,ఖమ్మం,ఆదిలాబాద్ జిల్లాలలో డిగ్రీ కోర్సులు 2025-26 ప్రవేశాలు పొందిన ఫస్ట్ ఇయర్ మొదటి సెమిస్టర్ విద్యార్థులకు వివిధ రకాల ఫీజులను ప్రభుత్వం భారీగా పెంచి పేద విద్యార్థులపై భారాన్ని మోపింది అని అన్నారు.ఒక్కో విద్యార్థికి రిజిస్ట్రేషన్ ఫీజు గతంలో 80 ఉండగా ఇప్పుడు 1200 రూపాయలకు పెంచారు. రికగ్నేషన్ ఫీజు గతంలో 400 ఉండగా ఇప్పుడు 800 కు
ఐ యు డి ఎఫ్ ఫీజు గతంలో 60 ఉండగా ఇప్పుడు 300 కు ఎస్ డబ్ల్యూ ఎఫ్ ఫీజు గతంలో 50 ఉండగా ఇప్పుడు 200 కు పెంపుదల చేసి విద్యార్థులపై తీవ్ర భారాన్ని మోపారు.ఒక్క పరీక్ష ఫీజు మాత్రమే 750 గతంలో మాదిరిగానే యధావిదంగా కొనసాగిస్తున్నారు.గతంలో ఒక్కొక్క విద్యార్థి ఆయా అన్ని రకాల ఫీజుల కింద 1340 చెల్లించేవారు.ఇప్పుడు ఏకంగా ఆ ఫీజులు అన్ని కలిపి 3,250 కి పెంపుదల చేశారు.గతం కంటే ఒకేసారి ఒక్కో విద్యార్థిపై 1910 రూపాయలు ఫీజు భారం పడుతుంది.ఒకేసారి ఇంత భారీ మొత్తంలో పెంచిన ఫీజులతో విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని, పేద విద్యార్థులు ఏమాత్రం కట్టలేనటువంటి ఫీజుల భారాన్ని విద్యార్థులపై ప్రభుత్వం మోపడం సరికాదని తక్షణమే ప్రభుత్వం పున:ర ఆలోచించి ఫీజుల భారం తగ్గించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో వంశీ,మనోహర్ పాల్గొన్నారు.

గిరిజన విద్యార్దుల ఉన్నతిలో బాగస్వాములవడం అభినందనీయం…

గిరిజన విద్యార్దుల ఉన్నతిలో బాగస్వాములవడం అభినందనీయం

సేవాగుణం చాటుకున్న ఇర్ప వసంత్

వనవాసీ గౌరవ సలహాదారులు బివిఎస్ఎల్ఎన్

నేటిదాత్రి చర్ల

 

జాతీయ గిరిజన సేవా సంస్దకు తనవంతు సహకారమందించి విద్యార్దుల ఉన్నతిలో బాగస్వాములయిన జిపి పల్లి గ్రామానికి చెందిన గిరిజన రైతు ఇర్ప వసంత్ తనలోని సేవాభావం చాటుకున్నారని వనవాసీ కళ్యాణ పరిషత్ కొమరం భీం విద్యార్ది నిలయం గౌరవ సలహాదారులు బివిఎస్ఎల్ నర్సింహారావు అన్నారు చర్లలోని వనవాసీ వసతి గృహంలోని ఇన్వర్టర్ బ్యాటరీ మరమ్మత్తుకు గురికావడంతో ఇర్ప వసంత్ 13వేలతో నూతన ఎమరాన్ ఇన్వర్టర్ బ్యాటరీను వితరణగా అందచేసారు ఈ సందర్భంగా శుక్రవారం విద్యార్ది నిలయంలో జరిగిన కార్యక్రమంలో బివిఎస్ఎల్ఎన్ మాట్లాడారు ఆదివాసీ రైతు తమ తోటి ఆదివాసీ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకొని వితరణ అందచేయడం సంతోషకరమని పేర్కొన్నారు ఇటువంటి ప్రోత్సాహకాలను మరిన్ని అందించి విద్యార్దుల జీవితంలో వెలుగులు నింపాల్సిన అవసరం ఉందన్నారు ఇటువంటి సేవాభావం కలిగి ఉన్న వారని స్పూర్తిగా తీసుకుని పేద విద్యార్దుల చదువులకు వెన్నుదన్నుగా నిలవాలని పిలుపునిచ్చారు విద్యార్ది నిలయ కమిటీ అద్యక్షుడు తాటి పాపారావు మాట్లాడుతూ వసంత్ అందించిన సహకారానికి తోటి ఆదివాసీగా గర్విస్తున్నానని పేర్కొన్నారు విద్య ఉంటే భవిష్యత్ ఉంటుందని తాము కష్టపడి చదవడం వలనే నేడు ఉన్నత స్దితికి చేరుకున్నామని వెల్లడించారు తమ లాంటి వారిని ఆదర్శంగా తీసుకొని క్రమ శిక్షణతో చదివి ఉన్నత స్దితికి చేరుకోవాలని విజ్ఞప్తి చేసారు ప్రతి విద్యార్ది భవిష్యత్ కొరకు తల్లిదండ్రులు తమ రక్తాన్ని దారపోసి సంపాదించి చదివిస్తున్న విషయం గమనించాలని వారి శ్రమను వృదా చేయకుండా ఇష్టపడి చదివి ఉన్నత స్దితికి చేరుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కొమరం భీం విద్యార్ది నిలయ కమిటీ కార్యదర్శి జవ్వాది మురళీకృష్ణ ఉపాద్యక్షులు గోగికార్ రాంలక్ష్మణ్ కోశాదికారి వేములపల్లి ప్రవీణ్ బాబు కమిటి సభ్యులు శివరాజు కిషోర్ లవన్ కుమార్ రెడ్డి బుర్రా సత్యనారాయణ మూర్తి యాదాల సందీప్ నిలయ ప్రముఖ్ గొంది ప్రసన్నకుమారి పాల్గొన్నారు

స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లను అడ్డుకోకండి…

స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లను అడ్డుకోకండి

కేయూ క్యాంపస్

 

స్థానిక సంస్థలలో బీసీలకు కల్పించే 42 శాతం రిజర్వేషన్ల ప్రయత్నాలను అడ్డుకోవద్దని కాకతీయ యూనివర్సిటీ బీసీ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ గడ్డం కృష్ణయ్య విజ్ఞప్తి చేసినారు.యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో జీవో నెంబర్ 9 పై తెలంగాణ హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో ప్రధాన కార్యదర్శి డాక్టర్ శ్రీలత ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ కృష్ణయ్య మాట్లాడుతూ స్థానిక సంస్థలలో బీసీల రిజర్వేషన్లను అడ్డుకోటానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి రిజర్వేషన్లను సాధించటానికి బీసీలు కూడా ఆ అడ్డుకునే ప్రయత్నాలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. 2013 లో, 2019లో, 2025 లో కూడా ఒకే వర్గానికి చెందిన వారు చట్టాలలో ఉన్న లోపాలను అడ్డం పెట్టుకుని బీసీ రిజర్వేషన్లను అడ్డుకునే ప్రయత్నం చేస్తూ బీసీలకు అన్యాయం చేస్తున్నారని అభిప్రాయపడినారు. వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ తండు నాగయ్య మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధనకి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకి కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించి రిజర్వేషన్ల సాధనకు సహాయ పడాలని విజ్ఞప్తి చేసినారు.ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎర్ర బొజ్జు రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ల సాధనకి బిల్లు పెట్టినా సవరణ బిల్లు పెట్టినా జీవో జారీచేసినా రిజర్వేషన్లు సాధించలేకపోయింది కాబట్టి ప్రభుత్వం పార్లమెంటరీ ప్రక్రియ ద్వారా రిజర్వేషన్లు సాధించే ప్రయత్నాలు చేయాలని అభిప్రాయపడినారు.ఉపాధ్యక్షులు డాక్టర్ బ్రహ్మయ్య మాట్లాడుతూ రిజర్వేషన్ల సాధనకి కాకతీయ యూనివర్సిటీ బీసీ టీచర్స్ పక్షాన భవిష్యత్తులో అనేక కార్యక్రమాలు చేపడతామని తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో బిసి టీచర్స్ అసోసియేషన్ కి చెందిన డాక్టర్ తిరునహరి శేషు, డాక్టర్ సుధీర్, డాక్టర్ వీరస్వామి డాక్టర్ సతీష్ డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ చింతం ప్రవీణ్, డాక్టర్ రాజు, డాక్టర్ కళ్యాణి, డాక్టర్ సునీత, డాక్టర్ విజయకుమార్, డాక్టర్ సునీత ,డాక్టర్ జోత్స్న, డాక్టర్ శ్రీధర్, డాక్టర్ గిరి, డాక్టర్ కిరణ్, డాక్టర్ కవిత, డాక్టర్ రాజేంద్రప్రసాద్, డాక్టర్ కుమార్ ,డాక్టర్ రమేష్, డాక్టర్ సదానందం, డాక్టర్ జె పి, డాక్టర్ నరేష్ తదితరులు పాల్గొన్నారు.

కష్టపడి చదివితేనే.. ఉన్నత శిఖరాలకు…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-10T134240.033.wav?_=2

 

— కష్టపడి చదివితేనే.. ఉన్నత శిఖరాలకు
• చదువుతోపాటు క్రీడలు అవసరమే..
సీఐ వెంకట రాజ గౌడ్

నిజాంపేట: నేటి ధాత్రి

 

విద్యార్థులు కష్టపడి చదివితే.. ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని రామాయంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్ రాజ గౌడ్ అన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతూనే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని ఆయన పేర్కొన్నారు. విద్యార్థికి చదువు ఎంత ముఖ్యమో.. క్రీడలు కూడా అంతే ముఖ్యమని క్రీడల ద్వారా మానసికంగా శారీకంగా దృఢంగా ఉంటామని అని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి యాదగిరి, ఎస్సై రాజేష్, కమిటీ సభ్యులు తిరుపతి, జిపి స్వామి, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.

మేము ప్రజలకు బాకీ ఉన్నమాట వాస్తవమే..

మేము ప్రజలకు బాకీ ఉన్నమాట వాస్తవమే..

#మమ్మల్ని గెలిపించి,అభివృద్ధిలో భాగస్వామ్యం చేసిన ప్రజలకు ఎప్పడు రుణపడి ఉంటాం..

#మిగులు రాష్ట్రాన్ని అప్పులు పాలు చెందింది మీరే కదా..

#మీ రాజకీయ లబ్ధికోసం ప్రజలను ఎన్నికల ముందు తప్పుదోవ పట్టిస్తున్నారు…

#బి ఆర్ ఎస్ కా డోఖా కార్డ్ విడుదల చేసిన డీసీసీ అధ్యక్షులు,ఎమ్మెల్యేలు,ఎంపీ

హన్మకొండ, నేటిధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

పదేళ్ల పరిపాలనలో మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పులు చేసి ఆర్ధిక భారాన్ని మోపిన బి ఆర్ ఎస్ నేతలు బాకీ కార్డ్ పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి మండిపడ్డారు.సోమవారం రోజున హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వరంగల్ పార్లమెంట్ సభ్యులు శ్రీమతి కడియం కావ్య,వర్ధన్నపేట శాసన సభ్యులు శ్రీ కే ఆర్ నాగరాజు,వరంగల్ జిల్లా అధ్యక్షులు శ్రీమతి కడియం కావ్య తో కలిసి పాల్గొన్నారు.

పదేళ్ల గత బి అర్ ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన హామీలను విస్మరించిన హామీలపై బిఆర్ఎస్ కా డోఖా కార్డ్ పేరుతో కార్డులను విడుదల చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఈ కార్డులను ప్రజల్లోకి తీసుకెళ్లలను పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ ప్రజలిచ్చిన అధికారాన్ని పూర్తిగా స్వప్రయోజనాలకు వాడుకున్నారని,రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా ప్రజలను నట్టేట ముంచారని మండిపడ్డారు.ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా,సంక్షేమ పథకాల అమలులో నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. ప్రజలు మర్చిపోలేదు దశాబ్దం పాటు అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి, ఏవీ పూర్తి చేయకుండా మధ్యలో వదిలేసింది.

కాంగ్రెస్ మాట మీద నమ్మకం ఉన్న పార్టీ మేము ఇచ్చిన హామీలను దశల వారీగా, ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తున్నాం.
బిఆర్‌ఎస్ పార్టీకి ఇప్పుడు ఉన్న ఏకైక పని తప్పులను కప్పిపుచ్చుకోవడం, ప్రజల దృష్టి మళ్లించడం మాత్రమే.
బిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతి పేద కుటుంబానికి డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు ఇస్తామని పెద్దగా ప్రచారం చేసింది.
వేలాది కుటుంబాలు నేడు షీట్ ఇళ్ళ్లో, అద్దె ఇళ్ళ్లో ఉంటున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్‌లో ఉన్న ఇళ్లను పూర్తి చేయడానికి ఫండ్‌లు విడుదల చేసింది.
టీఆర్‌ఎస్ “రైతు బంధు, రైతు బీమా” అని గొప్పగా చెప్పుకున్నా, వాస్తవానికి రైతులకు రుణాలు మాఫీ కాలేదు.
పంట కొనుగోలు కేంద్రాల్లో బిల్లులు నెలల తరబడి పెండింగ్‌లో ఉంచారు.

ఎరువుల కొరత, విత్తనాల కొరత రైతు దైనందిన కష్టాలు బిఆర్‌ఎస్ పాలనలో పెరిగాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మొదటి బడ్జెట్‌లోనే రైతులకు పంటల బీమా పునరుద్ధరణ, సమయానుసారం ఎరువుల సరఫరా చర్యలు తీసుకుంది.

మార్కెట్‌లో కనీస మద్దతు ధర (ఎమ్మెస్పి) హామీగా ఇచ్చి అమలు చేయడం మొదలుపెట్టింది.
టీఆర్‌ఎస్ 2018లో ఇచ్చిన హామీ: “ప్రతి నిరుద్యోగ యువకుడికి ₹3,016 భృతి.”
పదేళ్లపాటు అధికారంలో ఉన్నా, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.
పరీక్షల వాయిదాలు, పేపర్ లీక్‌లు, అవినీతి యువత భవిష్యత్తుతో చెలగాటమాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రిక్రూట్‌మెంట్ ప్రక్రియలను వేగవంతం చేసింది.
టీఆర్‌ఎస్ పాలనలో పాఠశాలలు మూతపడ్డాయి, హాస్టళ్లు మూసివేశారు.
విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు కోట్లలో పెండింగ్‌లో ఉన్నాయి.
డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలు కొత్తగా ఎక్కడా ప్రారంభం కాలేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా రంగానికి మళ్లీ జీవం పోస్తోంది.
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు క్లియర్ చేయడం మొదలుపెట్టింది.
ప్రభుత్వ కళాశాలలకు ఫ్యాకల్టీ నియామకాలు జరుగుతున్నాయి.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం వరంగల్‌కు స్మార్ట్ సిటీ హామీ ఇచ్చినా, దాని అమలు వద్ద ఆగిపోయింది.
మీరు చేస్తున్న బాకీ ప్రచారంలో మేము ప్రజలకు బాకీ ఉన్నమాట నిజమే అని ఓటు వేసి గెలిపించిన ప్రజలకు బాకీ ఉండటంలో తప్పు లేదని దుయ్యబట్టారు.
రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బి ఆర్ ఎస్ బాగోతాలను ప్రజలకు చేరువ అయ్యేలా “బిఆర్ఎస్ కా దోఖా “ను ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రావు,పీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాస్ రావు,మున్సిపల్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు,కార్పొరేటర్లు జక్కుల రవీందర్ యాదవ్,విజయశ్రీ జిల్లా కిసాన్ సెల్ చైర్మన్ వెంకట్ రెడ్డి,మహిళా అధ్యక్షురాలు బంక సరళ మరియు ప్రజా ప్రతినిధులు,బ్లాక్ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

దసరా శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర నాయకులు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి…

దసరా శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర నాయకులు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ ప్రజలకు రాష్ట్ర నాయకులు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. దుర్గామాత అనుగ్రహం కోసం.. నవరాత్రుల్లో 9 రోజులపాటు భక్తిశ్రద్ధలతో దుర్గామాతను పూజించి, చెడుపై.. మంచి, దుష్ట శక్తులపై.. దైవ శక్తుల విజయానికి ప్రతీకగా జరుపుకునే పండుగే విజయదశమి అన్నారు. దసరా పండుగ ధనిక పేద తేడా లేకుండా ప్రతి ఒక్కరి మధ్య స్నేహభావాన్ని పెంపొందించి సమాజం ఐక్యమత్యంతో ఉండేలా చేస్తుందని పేర్కొన్నారు. జహీరాబాద్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ముఖ్యంగా విద్య వైద్యం ప్రతి ఒక్కరికి చేరాలని తలంపుతో ప్రజా ప్రభుత్వం పనిచేస్తూ విద్యా వైద్యానికి పెద్దపీట వేస్తుందని తెలిపారు. పేదింటి బిడ్డలకు అత్యుత్తమ విద్య అందించాలని తలంపుతో ప్రారంభించరు ఈ సందర్భంగా ఉదాహరించారు. జహీరాబాద్ నియోజకవర్గ ప్రజలంతా సుఖ సంతోషాలతో దసరా ఉత్సవాలను జరుపుకోవాలని, ఆ జగన్మాత ఆశీస్సులతో ప్రజలంతా సుఖ శాంతులతో, సిరి సంపదలతో తులతూగాలని ఆ కనకదుర్గమ్మ అమ్మవారి దీవెనలు, ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

దసరా శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర నాయకులు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-01T141238.110.wav?_=3

 

దసరా శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర నాయకులు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ ప్రజలకు రాష్ట్ర నాయకులు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. దుర్గామాత అనుగ్రహం కోసం.. నవరాత్రుల్లో 9 రోజులపాటు భక్తిశ్రద్ధలతో దుర్గామాతను పూజించి, చెడుపై.. మంచి, దుష్ట శక్తులపై.. దైవ శక్తుల విజయానికి ప్రతీకగా జరుపుకునే పండుగే విజయదశమి అన్నారు. దసరా పండుగ ధనిక పేద తేడా లేకుండా ప్రతి ఒక్కరి మధ్య స్నేహభావాన్ని పెంపొందించి సమాజం ఐక్యమత్యంతో ఉండేలా చేస్తుందని పేర్కొన్నారు. జహీరాబాద్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ముఖ్యంగా విద్య వైద్యం ప్రతి ఒక్కరికి చేరాలని తలంపుతో ప్రజా ప్రభుత్వం పనిచేస్తూ విద్యా వైద్యానికి పెద్దపీట వేస్తుందని తెలిపారు. పేదింటి బిడ్డలకు అత్యుత్తమ విద్య అందించాలని తలంపుతో ప్రారంభించరు ఈ సందర్భంగా ఉదాహరించారు. జహీరాబాద్ నియోజకవర్గ ప్రజలంతా సుఖ సంతోషాలతో దసరా ఉత్సవాలను జరుపుకోవాలని, ఆ జగన్మాత ఆశీస్సులతో ప్రజలంతా సుఖ శాంతులతో, సిరి సంపదలతో తులతూగాలని ఆ కనకదుర్గమ్మ అమ్మవారి దీవెనలు, ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

నియోజకవర్గ మాలాల సమావేశం…

నియోజకవర్గ మాలాల సమావేశం
మల్లాపూర్, ఇబ్రహింపట్నం మెట్పల్లి మండలాల సమావేశం
మెట్ పల్లి సెప్టెంబర్ 27 నేటి దాత్రి
సెప్టెంబర్ 27 నేటి దాత్రి

వర్ధమాన రాజకీయాలకు రిజర్వేషన్ లలో మాలాలకు జరుగుతున్న అన్యాయాల మీద మల్లాపూర్ మాల సేన, ఇబ్రహీంపట్నం మాల సేన మెట్పల్లి టౌన్ మాల సేన మూడు మండలాల మాల సేన కమిటీలు సమావేశం జరిగింది.విద్య ఉద్యోగాల్లో జరుగుతున్న అన్యాయాల పైన తీవ్ర చర్చ జరిగింది, రాష్ట్ర మంత్రులను కలవాలని నిర్ణయించడం జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథి గా జాతీయ మాల మహానాడు ఉపాధ్యక్షులు, జైభీమ్ సేవాదళ్ కన్వీనర్ ఆసాది పురుషోత్తం పాల్గొన్న ముఖ్యులు మల్లాపూర్ కమిటీ అధ్యక్షులు పులేరి రాము ఇబ్రహీంపట్నం అధ్యక్షులు కారం ఇంద్రయ్య మెట్పల్లి అద్యక్షులు దాసరి బాబు ,నిర్మల్ జిల్లా కమిటీ సభ్యులు ఇతర నాయకులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version