దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మితమవుతుంది..

దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మితమవుతుంది
…గురు దేవో భవ ….!
… మాజీ మున్సిపల్ చైర్మన్ మోర హన్మాండ్లు

రాయికల్, సెప్టెంబర్ 5, నేటి ధాత్రి:

 

దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మితమవుతుందని ఆ భవిష్యత్తు ఉపాధ్యాయుల మీద ఆధారపడి ఉందని మాజీ మున్సిపల్ చైర్మన్ మోర హన్మాండ్లు అన్నారు.శుక్రవారం ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని రాయికల్ పట్టణంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 10 మంది ఉపాధ్యాయులను సాలువా మెమొంటోతో ఘనంగా సన్మానించారు.భారతరత్న అవార్డు గ్రహీత,మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సేవలను వివరించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులను సమాజంలో ఉన్నత వ్యక్తులుగా తీర్చి దిద్దేది గురువులేనని అలాంటి ఉపాధ్యాయులను లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సన్మానించడం అభినందనీయమన్నారు.ఉపాధ్యాయులు తరగతి గదిలో బోధించే పాఠాలు విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేస్తాయన్నారు.తల్లిదండ్రుల కన్న ఉపాధ్యాయులు చెప్పే పాఠాలతోనే విద్యార్థులు భవిష్యత్తులో సరైన మార్గాన్ని ఎంచుకుంటారన్నారు.ఉపాధ్యాయులు గ్రామంలోని బాలబాలికలకు విద్య అందించేందుకు విశేషంగా కృషి చేస్తున్నారని ప్రశంసించారు.ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వ ఉపాధ్యాయులు పాటుపడాలని సూచించారు.ఈ కార్యక్రమంలో
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు కొత్తపెళ్లి రంజిత్,డిసి బత్తిని భూమయ్య,కోశాధికారి బెక్కెం తిరుపతి,లయన్స్ క్లబ్ సభ్యులు మచ్చ శేఖర్,దాసరి గంగాధర్,ఆడెపు రాంప్రసాద్,ఎర్ర సుమన్,జిల్లాల సూర్యం రెడ్డి,సాంబారు శ్రీనివాస్,ఉపాధ్యాయులు కుంభాల శ్రీనివాస్,రాపర్తి నర్సయ్య,కడకుంట్ల అభయ్ రాజ్,బెజ్జంకి హరికృష్ణ,ఆడెపు సుజాత,మచ్చ చంద్రకళ,ధ్యావన పెళ్లి సురేందర్, పుర్రె రమేష్ తదితరులు పాల్గొన్నారు.

మినరల్ డవలప్మెంట్ నిధులు వినియోగించుకోవాలి…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-04T171900.110.wav?_=1

 

మినరల్ డవలప్మెంట్ నిధులు వినియోగించుకోవాలి

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

జిల్లా ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం జిల్లా మినరల్ డవలప్మెంట్ నిధులు సమర్థవంతంగా వినియోగించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.
గురువారం ఐడిఓసి కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో పలు శాఖల జిల్లా స్థాయి అధికారులతో ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో డిఎంఎఫ్టి మేనేజింగ్ కమిటి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాధాన్యత కలిగిన రంగాలకు డిఎంఎఫ్టి నిధులు సమర్థవంతంగా వినియోగించాల్సిన అవసరం ఉందని అన్నారు.
పారిశ్రామికీకరణ వల్ల ప్రభావితం అవుతున్న ప్రాంతాలలో
ప్రజలకు మౌలిక సదుపాయాలైన ఆరోగ్యం, విద్య, తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్య, వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణ వంటి రంగాలను ప్రధానంగా దృష్టిలో ఉంచుకుని నిధులు వినియోగించాలని తెలిపారు. ప్రభావిత ప్రాంతాల్లో ప్రతి రూపాయి ప్రజలకు ఉపయోగపడేలా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసి, పారదర్శకతతో అమలు చేయాలని సూచించారు.
ప్రతి మూడు నెలలకు ఒకసారి డి.ఎం.ఎఫ్.టి మేనేజింగ్ కమిటి సమావేశాలు నిర్వహించాలని
అలాగే, ఇప్పటికే మంజూరైన పనుల పురోగతిని వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. చేపట్టిన పనులలో నాణ్యత ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని అధికారు లను ఆదేశించారు. నిధుల వినియోగంలో ఎలాంటి నిర్లక్ష్యం చోటు చేసుకోరాదని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి నవీన్ రెడ్డి, రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, సీపీఓ బాబూరావు, మైనింగ్, సంక్షేమ, వ్యవసాయ, విద్యా, వైద్య తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

బిట్స్ పాఠశాలలో ముందస్తు ఉపాధ్యాయ దినోత్సవం

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-1-2.wav?_=2

బిట్స్ పాఠశాలలో ముందస్తు ఉపాధ్యాయ దినోత్సవం

హాజరైన బిట్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్.రాజేంద్రప్రసాద్ రెడ్డి

పరకాల నేటిధాత్రి

పట్టణంలోని బిట్స్ పాఠశాలలో ప్రిన్సిపల్ పిండి యుగేందర్ ఆధ్వర్యంలో ముందస్తు ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి బిట్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని డాక్టర్.సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేశారు.ఈ సందర్బంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ యొక్క జీవిత సూత్రాలను అనుసరించినటువంటి పద్ధతులను అలాగే ఉత్తమ ఉపాధ్యాయులకు ఉండవలసినటువంటి లక్షణాలను తెలియజేశారు. తరువాత విద్యార్థులు వివిధ నృత్యాలతో,పాటలతో,ఉపన్యాసాలతో చూపర్లను అలరించారు.తర్వాత విద్యార్థులు ఉపాధ్యాయులను పుష్ప మాలా అలంకృతులతో సన్మానం చేశారు.తదానంతరం బిట్స్ పాఠశాల ప్రిన్సిపల్ యుగేందర్ గారు మాట్లాడుతూ సమాజ నిర్మాణానికి కావలసినటువంటి ఉపాధ్యాయుల ఆవశ్యకతను మరియు విద్యార్థిదశ నుండి పెంపొందించుకోవాల్సినటువంటి లక్షణాలను తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని,ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.

ఘనంగా ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలు

https://netidhatri.com/wp-content/uploads/2025/09/teacher.wav?_=3

ఘనంగా ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలు

మహాదేవపూర్ (నేటి ధాత్రి)

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపురం మండల కేంద్రం లోని బాలుర జిల్లా పరిషత్ పాఠశాలలో గురువారం రోజున సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి లో బాగంగా ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల లో భాగంగా పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులను పూల మాలలు మరియు శాలువాలతో సత్కరించి ఉపాధ్యాయుల గొప్పతనాన్ని కొనియాడారు. భారత దేశపు రెండవ రాష్ట్రపతి అయిన సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితం మొత్తంలో ఉపాధ్యాయుడిగా చేసిన సేవలే అత్యంత తృప్తినిచ్చాయని తన జీవిత చరిత్రలో రాసుకున్న సందర్భాన్ని ఉపాధ్యాయులు గుర్తు చేసుకున్నారు. ప్రతీ సంవత్సరం సెప్టెంబర్ 5వ తేది ఉపాధ్యాయులకు ప్రత్యేకమైన రోజని ప్రధానోపాధ్యాయులు అనిల్ కుమార్ అన్నారు. విద్యార్థులు ఉపాధ్యాయుల గురించి కవితలు, పాటలు వినిపించి కార్యక్రమాన్ని రక్తి కట్టించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, తిరుపతి రెడ్డి, రాజయ్య, దేవేందర్ రెడ్డి, రమేష్, లచ్చయ్య, అనిల్ కుమార్, సమ్మయ్య,షాజహా, అనిత, కవిత, కిరణ్ కుమార్, కోటేశ్వర్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు విద్యార్థులు పాల్గొన్నారు.

17వ బెటాలియన్ విద్యార్థులకు షూ, టై, బెల్ట్ పంపిణీ…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-04T141913.546-1.wav?_=4

 

17వ బెటాలియన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ విద్యార్థులకు షూ,టైప్,బెల్టులు పంపిణీ

సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి)

 

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని 17 వ బెటాలియన్ కి సంబంధించిన పోలీసుల అన్యువల్ రిఫ్రెషర్ కోర్సులో భాగంగా ఈరోజు సిరిసిల్ల అర్బన్ సర్దాపూర్ లోని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు సిరిసిల్ల జిల్లా 17 వ బెటాలియన్ అధికారి ఆర్.ఎస్.ఐ తిరుపతి ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు షూ, టై, బెల్ట్‌లను పంపిణీ కార్యక్రమం చేయడం జరిగినది. అంతేకాకుండా
తిరుపతి మాట్లాడు విద్యార్థుల ఉన్నత చదువులకు ప్రభుత్వం మరియు అధికారులు అన్ని విధాల కృషి చేస్తారు. అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు మరియు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.

ఎస్ఆర్కె పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-04T135338.011.wav?_=5

ఎస్ఆర్కె పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినం సందర్భంగా రామకృష్ణాపూర్ పట్టణంలోని ఎస్ఆర్కె పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ప్రధానోపాధ్యాయులు పెద్దపల్లి ఉప్పలయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.పాఠశాలలో 9, 10వ తరగతి విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి మాట్లాడారు… ఉపాధ్యాయ వృత్తి నుంచి భారతదేశానికి రెండవ రాష్ట్రపతిగా ఎదిగిన తనను మేమందరం ఆదర్శంగా తీసుకొని భారత దేశ అభ్యున్నతి కోసం పాటుపడతామని తెలిపారు.

 

ఉపాధ్యాయులుగా వ్యవహరించిన విద్యార్థులందరికీ బహుమతులు అందించారు. పాఠశాల ఉపాధ్యాయులును అందరినీ శాలువాలతో సత్కరించి, విద్యార్థుల భవిష్యత్తు కోసం హర్నిశలు కృషి చేయాలని వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ కోల శ్రీనివాస్,డోకూరి సోమశేఖర్, అంబాల రాజేందర్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం…

ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం

జైపూర్,నేటి ధాత్రి:

 

జైపూర్ మండలంలోని ఇందారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా హాకీ ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాలతో ఘనంగా నివాళులు అర్పించారు.అలాగే మండల విద్యాధికారి బి.శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరై మేజర్ ధ్యాన్ చంద్ జీవితాన్ని విద్యార్థులకు పరిచయం చేసారు.మన జాతీయ క్రీడైన హాకీ లో ఆయన అత్యున్నత స్థాయి క్రీడాకారుడుగా ఎదిగిన తీరును వివరించారు.క్రీడలు మానసిక,శారీరక ఉల్లాసం తో పాటు ఐక్యతను చాటుతాయని వివరించారు. విద్యార్థులు చిన్నతనం నుంచే క్రీడల పట్ల ఆసక్తిని పెంచుకోవాలని సూచించారు. పాఠశాల స్థాయి నుంచి నచ్చిన క్రీడలో మెలుకువలు నేర్చుకోవాలని విద్యార్థులకు తెలిపారు.ఈ కార్యక్రమంలో పి.డి. ఎన్.పద్మ, ఉపాధ్యాయులు కె.రమాదేవి, కె.రమేష్ బాబు,ఏం. విజయలక్ష్మి,ఎం.సత్తిరెడ్డి,డి. సహదేవ్,జి.సంధ్యారాణి,పి. మంజుల,గోపగాని రవీందర్, కె.కనకయ్య,శ్రావణి తదితరులు పాల్గొన్నారు.

రామాయంపేట జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ పార్టీ…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-91.wav?_=6

రామాయంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ పార్టీ సందడి..

రామాయంపేట ఆగస్టు 25 నేటి ధాత్రి (మెదక్)

రామాయంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ పార్టీని ఘనంగా నిర్వహించారు. కొత్తగా కళాశాలలో చేరిన విద్యార్థులను స్వాగతించేందుకు సీనియర్ విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో ఉత్సాహభరిత వాతావరణంగా మారింది.
కార్యక్రమానికి ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ మల్లేశం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నృత్యాలు, పాటలు, నాటికలు, వినోదాత్మక ప్రదర్శనలు విద్యార్థులను ఆకట్టుకున్నాయి. ఫ్రెషర్స్ విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించి అందరి ప్రశంసలు అందుకున్నారు.

Freshers Party at Ramayampet Junior College.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మల్లేశం మాట్లాడుతూ –
“కళాశాలలో అడుగు పెట్టిన ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో చదువుకుని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని, విద్యతో పాటు సామాజిక సేవా భావనను పెంపొందించుకోవాలని” సూచించారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు మార్గదర్శకులుగా నిలిచి ఎల్లప్పుడూ సహకారం అందిస్తారని తెలిపారు.
కార్యక్రమంలో అధ్యాపకులు మాట్లాడుతూ, ఫ్రెషర్స్ పార్టీ విద్యార్థుల మధ్య ఆత్మీయత పెంపొందించేందుకు, ప్రతిభ ప్రదర్శనకు వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులు కళాశాలలో ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్లు ఫ్రెషర్స్ విద్యార్థులకు పుస్తకాలు బహుమతులుగా అందజేశారు. అనంతరం కళాశాల ప్రాంగణంలో విద్యార్థులు ఆనందంగా నృత్యాలు చేస్తూ ఉత్సాహాన్ని పంచుకున్నారు.

మాస్ సంస్థ బిద్దు విద్యార్థికి ఆర్థిక సాయం అందించింది.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-25T151832.193-1.wav?_=7

 

దళిత బిడ్డల అభ్యున్నతికి మరియు చదువులో ఉన్నత స్థాయికి చేరుకోవాలనే లక్ష్యంతో కృషి చేస్తున్న సంస్థ మాస్…

వర్దన్నపేట (నేటిధాత్రి ):

 

వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన బరిగెల కావేరి వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాల లో బీటెక్ రెండోవ సంవత్సరం చదువుతుంది.చదువులో ఎంతో ప్రతిభ ఉన్న ఆర్ధికంగా వెనకబడి ఉన్న కుటుంభం తండ్రి లేక ఇద్దరి అమ్మాయిలను చదివిస్తున్న తల్లి.వీరి కుటుంభం నేపథ్యం తెలుసుకున్న డా”విక్రమ్ కుమార్ మహా ఆది సేవ సంస్థ సభ్యులకు తెలియజేయగా ఈ రోజు సంస్థ నుండి విద్యార్థికి కళాశాల ఫీజు మరియు పుస్తకాల అవసరానికి సంస్థ నుండి 10,000 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఈ సందర్బంగా డా’ విజయ్ కుమార్ మాట్లాడుతూ డా బి.ఆర్ అంబేద్కర్ గారి పిలుపైన “పే బ్యాక్ టు థి సొసైటీ” అనే సిద్ధాంతం మీద మాస్ గత 5 సంవత్సరాలుగా దాదాపు 205 మంది మాదిగ జాతి బిడ్డలైన పేద విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని అలువాల విజయకుమార్ తెలిపారు.ఈ కార్యక్రమంలో మాస్ సంస్థ సభ్యులు డా”విజయకుమార్,డా సీనపల్లి విక్రమ్ కుమార్,డా”శివ శంకర్,సాఫ్ట్వేర్ సీనపెల్లి హరీష్,గాయాల సుమన్,జోగుల సంపత్,వేల్పుల కార్తీక్ తదితరులు పాల్గొన్నారు…

సామాజిక న్యాయానికి మండల్ కమిషన్…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-81-1.wav?_=8

మండల్ కమిషన్ సిఫారసుల అమలుతోనే సామాజిక న్యాయం

*నేటి ధాత్రి.

కేయూ క్యాంపస్*
మండల్ కమిషన్ సిఫారసులతోనే ఇతర వెనకబడిన తరగతులకు కేంద్ర విద్యా ఉద్యోగాలలో 27 శాతం రిజర్వేషన్లు అమలులోకి వచ్చాయని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ సుంకర జ్యోతి అభిప్రాయపడినారు, డాక్టర్ తిరునహరి శేషు ఆధ్వర్యంలో యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో జరిగిన బీపీ మండల్ 107వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ప్రొఫెసర్ జ్యోతి మాట్లాడుతూ రెండవ వెనుకబడిన తరగతుల చైర్మన్ గా మండల్ కమిషన్ సిఫారసుల మేరకే ఓబీసీ లకి కేంద్ర విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు సాధ్యమైనాయని అభిప్రాయపడినారు. మండల్ కమిషన్ సిఫారసుల ప్రకారంగా కేంద్ర విద్యా ఉద్యోగాలలో 27 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి కానీ కేంద్ర విద్యా ఉద్యోగల లో ఓబీసీలకు రిజర్వేషన్లు 22 శాతానికి మించి దక్కటం లేదని అభిప్రాయపడినారు. బీసీ నాయకులు డాక్టర్ తండు నాగయ్య మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చిన ఈ ఏడు దశాబ్దాల కాలంలో కాక కలేల్కర్ కమిషన్ రిపోర్ట్ కానీ మండల్ కమిషన్ రిపోర్ట్ కానీ జస్టిస్ రోహిణి కమిషన్ రిపోర్ట్ లను అమలు చేయటానికి ప్రభుత్వాలు ముందుకు రాకపోవడం వలన ఓబీసీలకు అన్యాయం జరుగుతుందని అభిప్రాయబడినారు. మండల్ కమిషన్ నివేదికని పూర్తిస్థాయిలో అమలుపరచినప్పుడే దేశంలో సామాజిక న్యాయం సాధించబడుతుందని అభిప్రాయపడినారు. బిసి నాయకులు డాక్టర్ ఎర్రబొజ్జు రమేష్ మాట్లాడుతూ జనగణలో భాగంగా జాతి ఆధారిత కుల గణన జరగాలని కాక ఖలేల్కర్ కమిషన్ మండల్ కమిషన్లు సిఫారసు చేసినా ఆ దిశగా నిర్ణయాలు తీసుకోవటానికి ప్రభుత్వలకు ఏడు దశాబ్దాల సమయం పట్టిందంటే ఓబీసీల అభివృద్ధి సంక్షేమం పట్ల ప్రభుత్వాల వైఖరి తేటతెల్లమవుతుందని విమర్శించినారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కరుణాకర్ డాక్టర్ ఫిరోజ్ డాక్టర్ వెన్నంపల్లి విజయకుమార్ డాక్టర్ లక్ష్మీనారాయణ డాక్టర్ దాసు డాక్టర్ శ్రీలత డాక్టర్ రమేష్ డాక్టర్ స్వామి డాక్టర్ జయప్రకాశ్ డాక్టర్ తాళ్లపల్లి సంజీవ్ డాక్టర్ సదానందం డాక్టర్ కొమురయ్య, కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

పాఠశాల టాపర్లకు ఎన్ఆర్ఎ నగదు పారితోషికం…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-22T112844.936.wav?_=9

 

పాఠశాల టాపర్లకు ఎన్ఆర్ఎ నగదు పారితోషికం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

కోహీర్ మండలంలోని బిలాల్ పూర్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు గ్రామానికి చెందిన ఎన్ఆర్ఎ చర్ల వెంకట్ రెడ్డి నగదు పురస్కారాలు అందజేశారు. పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో 10 మంది విద్యార్థులకు రూ.

 

 

2వేలు వంతున రూ.20వేలు, ప్రశంసా పత్రాలను తన సోదరుడు చర్ల పాండురంగారెడ్డి, ప్రధానోపాధ్యాయుడు ఆనందం చేతుల పంపిణీ చేశారు. విద్యార్థులను చదువులో ప్రోత్సాహంచేందుకు గాను గత 12 సంవత్సరాలుగా 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉర్దూ, తెలుగు మీడియం విద్యార్థులకు తరగతిలో టాపర్లుగా నిలిచిన వారికి అందజేస్తూ వస్తున్నారు. కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ ఫాతిమా బేగం, ఉపాధ్యాయులు ప్రకాష్ రావు, ఆబేద్లీ, బషీర్అహ్మద్, ఎ.నర్సింహులు, అనీస్ ఫాతిమా పాల్గొన్నారు.

గురువుకు శిష్యుల కన్నీటి వీడ్కోలు.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-21T125253.086.wav?_=10

 

గురువుకు శిష్యుల కన్నీటి వీడ్కోలు.

ములుగు, నేటిధాత్రి.

 

 

ములుగు జిల్లా మల్లంపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఎన్నో తరాలను విద్యా ప్రస్థానంలో ఆవిష్కరించిన గురువు సుదర్శన్ చారి మరణవార్త వారి శిష్య సమాజం, సహచర ఉపాధ్యాయ వర్గానికీ తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. వృత్తిని ధర్మంగా భావించి, తప్పుదారి పట్టిన జీవితాలను క్రమశిక్షణతో సరిచేసిన క్రమశిక్షణ ప్రియుడు, రేపటి పౌరులను తీర్చిదిద్దిన శిల్పిగా ఆయన గుర్తింపు పొందారు. విద్యార్థులకు ఉన్నత లక్ష్యాలను ఎదురించి, వాటి వైపు నడిపించిన ప్రేరణాత్మక వ్యక్తిత్వం గల వారు అని ఆయన శిష్యులు స్మరించారు. “అజ్ఞానమనే నిశీధిని జ్ఞానంతో రూపుమాపి, జీవంలేని రాతిశిలలను శిల్పాలుగా మలచి, విద్యార్ధుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన ఆచార్యుడు ఇక లేరన్న వార్త శిష్యులను మ్రోయజేసింది. 2005 పదవ తరగతి బ్యాచ్ విద్యార్థులు తమ గురువును స్మరించుకుంటూ ప్రగడా సానుభూతి తెలిపారు.

కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-20T145411.748.wav?_=11

 

కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

*తొర్రూరు డివిజన్ నేటి ధాత్రి

 

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టిపిసిసి ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డిల ఆదేశాల మేరకు బుధవారం డివిజన్ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ
రాజీవ్ గాంధీ దేశంలో సాంకేతిక విప్లవ నిర్మాత అని,ఐటీ రంగ వృద్ధికి బాటలు వేశారని కొనియాడారు. దేశానికి సుస్థిర పాలన అందించి ఆదర్శంగా నిలిచాడని తెలిపారు.గ్రామీణ అభివృద్ధి, విద్య, ఆరోగ్య రంగాల్లో ఆయన అమలు చేసిన పథకాలు దేశానికే మార్గదర్శకంగా నిలుస్తున్నాయని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించిన రాజీవ్ గాంధీ గ్రామపంచాయతీ వ్యవస్థను బలపరిచారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాజీవ్ గాంధీ ఆశయాలను కొనసాగించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు పెదగాని సోమయ్య, చాపల బాపురెడ్డి, గంజి విజయపాల్ రెడ్డి,ఏఎంసీ డైరెక్టర్లు కందాడి అచ్చిరెడ్డి,కంచర్ల వెంకట చారి,యూత్ పట్టణ అధ్యక్షుడు బసనబోయిన మహేష్ యాదవ్,నాయకులు జలకం శ్రీనివాస్, సొంటి రెడ్డి భాస్కర్ రెడ్డి,కల్లూరి కుశాల్, ముద్దసాని సురేష్, జంజీరాల మనోహర్, జలీల్, వెలుగు మహేశ్వరి, పంజా కల్పన,బిజ్జాల అనిల్, జలగం వెంకన్న,యశోద, మహంకాల దుర్గేష్, జాటోత్ రమేష్ నాయక్, నడిగడ్డ మధు, నడిగడ్డ రమేష్ తదితరులు పాల్గొన్నారు. 

నేరరహిత సిరిసిల్ల లక్ష్యం – ఎస్పీ మహేష్ గితే..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-46-1.wav?_=12

సిరిసిల్ల జిల్లా ఎస్పీ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )

సిరిసిల్ల జిల్లాలోని స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో జాతీయ జెండాను ఎగురవేసిన జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐ.పీ.ఎస్.. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే సిరిసిల్ల జిల్లాను అభివృద్ధి పరంగా మరియు విద్యా,వైద్య,ఉపాధి పరంగా ముందుకు తీసుకెళ్లాలని, ప్రతి ఒక్కరు కృషి చేయాలని స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా తెలియజేశారు.

SP Mahesh Githe Independence Day

అంతేకాకుండా సిరిసిల్ల జిల్లాను శాంతి భద్రతలలో, మన వంతు కృషి ముందుండాలని, అంతేకాకుండా జిల్లాను నేరాలు లేని జిల్లాగా రూపుదిద్దడానికి మనమంతా కృషి చేయాలని పోలీసుల అధికారులకు మరియు సిబ్బందికి తెలియజేయడం జరిగినది.

SP Mahesh Githe Independence Day

ఈ కార్యక్రమంలో సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ లు,ఆర్.ఐ లు,ఎస్.ఐ లు, జిల్లా పోలీస్ కార్యాలయాల సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ప్రభుత్వం విద్యకు పెద్ద పీట వేస్తుంది..

ప్రభుత్వం విద్యకు పెద్ద పీట వేస్తుంది..

అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందిస్తాం…

కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి..

మూతపడిన ప్రభుత్వ పాఠశాల రీఓపెన్ చేసిన మంత్రి వివేక్

రామకృష్ణాపూర్, నేటిధాత్రి

రాష్ట్ర ప్రభుత్వం విద్యకు పెద్ద పీట వేస్తుంది అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు.22 సంవత్సరాల క్రితం రామకృష్ణాపూర్ పట్టణంలోని కాకతీయ కాలనీలోని మూతపడిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ను శనివారం కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి రీ ఓపెన్ చేశారు.

మూతపడిన పాఠశాలను రీఓపెన్ చేయించేందుకు కృషిచేసిన స్థానిక కాంగ్రెస్ నాయకుడు పాల రాజును మంత్రి సన్మానించారు.అనంతరం ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్య, వైద్యానికి పెద్ద పీట వేస్తుందని అందులో భాగంగానే మూతపడిన పాఠశాలలను రీ ఓపెన్ చేస్తున్నామని అన్నారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని అర్హులైన వాళ్లందరికీ జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి రేషన్ కార్డులు అందించారు.

రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతర ప్రక్రియ అని అన్నారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో ఒక్క రేషన్ కార్డు కూడా అందించలేదని, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు అందిస్తుందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అందించామని, ఇందిరమ్మ ఇండ్లు సైతం నిర్మించుకునేందుకు సొంత స్థలం కలిగిన వారు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో సతీష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు, మందమర్రి ఎంఈఓ దత్తమూర్తి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, పీసీసీ సభ్యులురఘునాథ్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ఒడ్నాల శ్రీనివాస్, గోపతి రాజయ్య ,మాజీ చైర్ పర్సన్ జంగం కళ, మాజీ వైస్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి గాండ్ల సమ్మయ్య, అబ్దుల్ అజీజ్, స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

ప్రముఖ పారిశ్రామికవేత్త విద్యా ప్రదాత కాటిపెల్లి నారాయణ రెడ్డి..

ప్రముఖ పారిశ్రామికవేత్త విద్యా ప్రదాత కాటిపెల్లి నారాయణ రెడ్డి కి అంతర్జాతీయ యోగా శిక్షణకులు మాధవరెడ్డి కి ఘన సన్మానం భగవద్గీత ల ప్రదానం…

ప్రపంచానికి యోగా, జ్ఞానాన్ని అందించింది. మన భారతదేశమే…

రాయికల్ , జూలై 31, నేటి ధాత్రి:

రాయికల్.మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇటిక్యాలలో సుమారుగా 5 లక్షల రూపాయలతో ప్రత్యేకంగా ఒక రూం నిర్మించి గ్రంథాలయం ఏర్పాటు చేసి, నిత్యం విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న ఇదే గ్రామానికి చెంది హైదరాబాద్ స్థిరపడిన కాటిపెల్లి నారాయణ రెడ్డి ని, అంతర్జాతీయ యోగా శిక్షణకులు మాధవరెడ్డి లను పాఠశాల ప్రధానోపాధ్యాయులు సీమలదారి సదాశివ్, మాజీ ఎంపిపి కాటిపెల్లి గంగారెడ్డి, తపస్ జిల్లా బాధ్యులు చెరుకు మహేశ్వర శర్మ, ఉపాధ్యాయ బృందంలు ఘనంగా శాలువాతో సత్కరించి మెమొంటో లు బహూకరించారు. రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర శాఖ సహాధ్యక్షులు వేల్పుల స్వామి యాదవ్ భగవద్గీత లను ప్రదానం చేసారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు సీమలదారి సదాశివ్ అధ్యక్షతన జరిగిన యోగాతో సంపూర్ణ ఆరోగ్యంపై జరిగిన సమావేశంలో నారాయణ రెడ్డి మాట్లాడుతూ మున్ముందు పాఠశాలకు ఎటువంటి సహాయమైన చేస్తానని, విద్యతోనే జ్ఞానం లభిస్తుందని అందరు బాగా చదివి ఉన్నత శిఖరాలలు అధిరోహించాలని అన్నారు. అంతర్జాతీయ యోగా శిక్షకులు శనివారపు మాధవరెడ్డి విద్యార్థులకు యోగా, ధ్యానం నిత్య జీవితంలో వీటి ఆవశ్యకతలపై అవగాహన కల్పించి, ఆసనాలు, యోగా, ధ్యానం నేర్పించారు. ప్రపంచానికి యోగా, ధ్యానం జ్ఞానం అందించినది మన భారత దేశమేనని, యోగాతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని‌ ప్రధానోపాధ్యాయులు అన్నారు. ఈ కార్యక్రమంలో జీయావుద్దీన్, ముజాహిద్, స్వర్ణలత, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.

విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసిన ఘనత.

విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసిన ఘనత బిఆర్ఎస్ పార్టీకె దక్కుతుంది

గణపురం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రేపాక రాజేందర్

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలో భూపాలపల్లి మాజీ శాసనసభ్యుడు గండ్ర వెంకటరమణారెడ్డి- జ్యోతి నిన్న స్కూళ్లలో విస్తృత పర్యటనలు చేసి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేయడం విడ్డూరంగా ఉంది
గడిచిన 10 సంవత్సరాలు బి ఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా అప్పుడు గుర్తుకు రాలేదా పాఠశాలల మీద వీరి ప్రేమ.
గడిచిన 10 సంవత్సరాలలో
మండల కేంద్రంలో ఒక ఎంఈఓ ను కూడా నియమించలేదు
పిల్లలకు ఎటువంటి కాస్మోటిక్ చార్జీలు, మెస్ చార్జీలు ఇవ్వలేదు.
పాఠ్య పుస్తకలు ఏక రూప దుస్తువులను ఇవ్వలేదు
వారు తినే భోజనాన్ని ఒక్కరోజు ఎలా ఉంది అని అడిగిన పాపాన పోయిన నాధుడే లేడు.
ఈరోజు మా నాయకుడు భూపాలపల్లి శాసనసభ్యులు సత్యనారాయణ రావు అభివృద్ధిని చూసి ఓర్వలేక. ఏ అంశాల మీద మాట్లాడాలో తెలవక పాఠశాలల చుట్టూ తిరుగుతూ ముసలి కన్నీరు కారుస్తున్నారు.
మీరు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు నిర్మించిన పాఠశాలను ఏ రోజైన తనిఖీ చేశారా. మీ నాయకులైన తనిఖీ చేశారా. కనీసం పాఠశాలలో ఖాళీలు ఉన్నటువంటి పోస్టులను ఏ రోజైన భర్తీ చేశారా.
హాస్టల్లో స్కావేందర్స్ పోస్ట్ లను నియమించాలని జ్ఞానం కూడా లేకుండా మీరు మీ నాయకులు మాట్లాడుతున్నారా
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యా వ్యవస్థను ప్రతిష్ట చేయాలని రేవంత్ రెడ్డి కంకణం కట్టుకొని విద్య వ్యవస్థలో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తూ విద్యార్థులను ఉన్నత స్థాయిలకు ఎదిగేలా చేయాలని దృఢ సంకల్పంతో, మా నాయకుడు కృషి చేస్తున్నాడు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రేపాక రాజేందర్. కో ఆప్షన్ సభ్యులు ఎండి చోటేమియా. మార్కెట్ కమిటీ డైరెక్టర్ కట్కూరు శ్రీనివాస్. మాజీ ఎంపీపీ వడ్లకొండ నారాయణ. వైస్ ఎంపీపీ విడుదలైన అశోక్. మాజీ సర్పంచ్ నారగని దేవేందర్ గౌడ్. గ్రామ కమిటీ అధ్యక్షుడు ఓరుగంటి కృష్ణ. మండల అధికార ప్రతినిధి మామిళ్ల మల్లికార్జున గౌడ్.వార్డ్ మెంబర్ గంధం ఓధాకర్. సీనియర్ నాయకులు బాల్య కుమార్. పూదరి రవి. ఎస్కే జానీ. దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

గుణాత్మక విద్య బాధ్యత ఉపాధ్యాయులదే..

గుణాత్మక విద్య బాధ్యత ఉపాధ్యాయులదే-

డిఇఓ. వాసంతి

శాయంపేట నేటిధాత్రి:

ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని హనుమకొండ జిల్లా విద్యాశాఖ అధికారి డి వాసంతి అన్నారు. 25-7-2025 రోజున జిల్లా పరి షత్ ఉన్నత పాఠశాల పత్తిపాక కాంప్లెక్స్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకొని వచ్చే విధం గా ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హనుమకొం డ జిల్లా సమగ్ర శిక్ష గుణాత్మక విద్య కోఆర్డినేటర్ డాక్టర్ మన్మో హన్,మండలవిద్యాశాఖ అధి కారి భిక్షపతి, ఉన్నత పాఠ శాల ఇన్చార్జి ప్రధానోపా ధ్యాయులు అనిత, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయు లు శ్రీనివాస్,ఆర్ పిలు అం జని, నారాయణ, అశోక్, మనోజ్, సురేందర్, పాఠ శాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

విద్యారంగ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి.

ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి.

ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యు ఎస్ పి సి) ఆధ్వర్యంలో మూడు దశల పోరాటం.

మొదటి దశలో భాగంగా సమస్యల పరిష్కారాన్ని కోరుతూ మండల స్థాయిలో తహసిల్దార్ కు వినతి పత్రం సమర్పణ

విద్యారంగంలో పేరుకుపోయిన 51 సమస్యలను పరిష్కరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విన్నపం.

ఏకీకృత సర్వీస్ రూల్స్ రూపొందించాలి. సిపిఎస్ ను రద్దు చేయాలి.

317 బాధితులకు సత్వర న్యాయం చేకూర్చాలి.

టి పి టీ ఎఫ్ మహబూబాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు చీకటి వెంకట్రాం నర్సయ్య, కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్, యుటిఎఫ్ అధ్యక్షులు భూక్య శ్రీను, డి టి ఎఫ్ అధ్యక్షులు కీర్తి నాగయ్యల డిమాండ్ .

కేసముద్రం/ నేటి దాత్రి

ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ప్రభుత్వం ముందుంచిన దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పిఆర్సి, డిఏ, ఏకీకృత సర్వీస్ రూల్స్ మొదలగు 51 అపరిష్కృత సమస్యలను తక్షణమే పరిష్కరించాలని టిపిటిఎఫ్ మహబూబాద్ జిల్లా శాఖ ఉపాధ్యక్షులు చీకటి వెంకట్రామ్ నర్సయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను పరిష్కరించడం లో నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వ తీరును నిరసిస్తూ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి( యు.ఎస్.పి.సి ) చేపట్టిన మూడు దశల పోరాటం లో, మొదటగా మండల కేంద్రంలో తహసిల్దార్ కు వినతి పత్రం సమర్పించాలన్న పిలుపు మేరకు గురువారం మండలంలోని యు. ఎస్. పి. సి. భాగస్వామ్య సంఘాలైన టీ.పి.టీ. ఎఫ్, డి. టీ. ఎఫ్. సంఘాల నేతృత్వంలో కేసముద్రం మండల తహసిల్దార్ కు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్, యు.టి. ఎఫ్ అధ్యక్షులు భూక్య శ్రీను, డి టి ఎఫ్ అధ్యక్షులు కీర్తి నాగయ్య లు మాట్లాడుతూ నిర్లక్ష్యంగా వ్యవహరించి ఉపాధ్యాయులకు, విద్యారంగానికి సంబంధించిన అనేక సమస్యలను పెండింగ్లో ఉంచిన గత ప్రభుత్వాన్ని గద్దె దించామని అన్నారు. కానీ ఏరి కోరి తెచ్చుకున్న ఈ ప్రజా ప్రభుత్వం కూడా ఆ సమస్యలను అలాగే కొనసాగించి ఉపాధ్యాయుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం సమంజసం కాదన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఇచ్చిన ఉచితాల హామీలను నెరవేర్చడానికి ప్రభుత్వం పరుగులు తీస్తుందని విమర్శించారు. కానీ ఉద్యోగస్తులకు మాత్రం హక్కుగా రావాల్సిన వాటిని పెండింగ్లో పెడుతుందని వాపోయారు. విద్యారంగంలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పిఆర్సి ,డి ఏ లు ప్రకటించాలని,,ఏకీకృత సర్వీసు రూల్స్ రూపొందించాలని, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం రద్దు చేయాలని, కస్తూరిబాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను రెగ్యులర్ చేయాలని, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 010 పద్దు ద్వారా జీతాలు చెల్లించాలని, గురుకుల వ్యవస్థను తొలగించి గ్రామాలలో ఉండే ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని, ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయులకు ఆ రోజె అన్ని రకాల ఆర్థిక ప్రయోజనాలు అందించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో టిపిటిఎఫ్ కేసముద్రం మండల శాఖ ప్రధాన కార్యదర్శి నన్నపురాజు నరసింహరాజు, కార్యదర్శులు వీసం నర్సయ్య, ఊట్కూరి ప్రణయ్ కు మార్, జి. శ్రీనివాస్, తండా సదానందం ,జిల్లా కౌన్సిలర్ సదయ్య, యుటిఎఫ్ ప్రధాన కార్యదర్శి లావుడ్యా భద్రాసింగ్, కార్యదర్శి భట్టు భద్రు, డి టి ఎఫ్ జిల్లా కౌన్సిలర్ గంగుల శ్రీనివాస్, కార్యదర్శి సుంకరి రవి తదితరులు పాల్గొన్నారు.

విద్యాశాఖ మంత్రిని నియమించాలి…

విద్యాశాఖ మంత్రిని నియమించాలి…

ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలలో ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలి…

ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, ఎంఈఓ,డిఈఓ పోస్టులను భర్తీ చేయాలి…

అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకులాల,వసతి గృహాల భవనాలకు సొంత భవనాల నిర్మించాలి…

పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల చేయాలి…

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న ప్రిన్సిపల్,లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలి…

విద్యార్థులకు ఆర్టీసీలో ఉచిత బస్ పాసులు ఇవ్వాలి…

వామపక్ష విద్యార్థి సంఘాల డిమాండ్…

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-75.wav?_=13

నేటి ధాత్రి -గార్ల :-

రాష్ట్రంలో పాలకులు లిక్కర్ పై చూపెడుతున్న శ్రద్ధను విద్యారంగం వైపు చూపెట్టని పరిస్థితి దాపురించిందని ఏఐ ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మాగం లోకేష్, పీడీఎస్ యు జిల్లా కోశాధికారి మునగాల మహేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి రాకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన విద్యాసంస్థల బంద్ లో భాగంగా బుధవారం గార్ల మండల వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలను బంద్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు గడుస్తున్నప్పటికీ నేటికీ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేకపోవడం సిగ్గుచేటు అని అన్నారు. రాష్ట్రంలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం విచారకరమని వారు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, ఎంఈఓ, డీఈవో, ప్రభుత్వ కళాశాలలో ప్రిన్సిపల్, లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి ఎనిమిది వేల కోట్ల పైచిలుకు స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్ మెంట్, బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ వసతి గృహాల్లో ఫుడ్ పాయిజన్ కాకుండా ఎప్పటికప్పుడు జిల్లా అధికారులు పర్యవేక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు సంతోష్, కిరణ్, ఉదయ్, పృధ్విరాజ్, చింటూ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version