అంబేద్కర్ నేషనల్ అవార్డు మంగళపల్లి శ్రీనివాస్‌కు..

భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నేషనల్ అవార్డు అందుకున్న అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు మంగళపల్లి శ్రీనివాస్
మొగుళ్ళపల్లి నేటి దాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల కేంద్రానికి చెందిన మంగళపల్లి శ్రీనివాస్ గత 30 సంవత్సరాల నుండి అంబేద్కర్ యువజన సంఘం లో అలాగే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మరియు సమాచార హక్కు చట్టం ప్రచార సమితి, ఉచిత న్యాయ సేవ అధికారి సంస్థ ఆధ్వర్యంలో ( PLV) పారా లీగల్ వాలంటీర్ గా ఎన్నో స్వచ్ఛంద సంస్థ కార్యక్రమంలో పాల్గొని సేవా కార్యక్రమాలు చేపట్టినందుకుగాను దక్కిన గొప్ప గౌరవం
స్ఫూర్తి సర్వీసెస్ సొసైటీ ఇండియా ఎన్జీవోస్ వారు బుధవారం నాడు హైదరాబాదులో నిర్వహించిన కార్యక్రమంలో వివిధ సంఘాలలో మరియు సంస్థలలోస్వచ్ఛందంగా సేవ కార్యక్రమాలు నిర్వహించిన వారికి స్ఫూర్తి సర్వీస్ సొసైటీ ఇండియా ఎన్జీవో బుధవారం నాడు సిటీ సెంటర్ కల్చలేర్ ఆడిటోరియం ముషీరాబాద్ హైదరాబాదులో భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి అంబేద్కర్ నేషనల్ అవార్డుకు ఎంపికైన వారందరికీ ముఖ్య అతిథుల చేతుల మీదుగా నేషనల్ అవార్డు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ నేషనల్ అవార్డు అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు మంగళపల్లి శ్రీనివాస్ అవార్డును అందుకోవడం జరిగింది.
ఈ అవార్డుల కార్యక్రమంలో స్ఫూర్తి సర్వీసెస్ సొసైటీ ఇండియా ఎన్జీవోస్ చైర్మన్ లయన్ డాక్టర్ ఆకుల రమేష్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ డాక్టర్ టీవీ రామకృష్ణ ఫిలిం రెడ్డి గారు మల్ల రమేష్ వ్యవస్థాపక సభ్యులు, డాక్టర్ గూడూరు చెన్నారెడ్డి, శంషాబాద్ ఎంఈఓ డాక్టర్ ఇస్లావత్కాసన నాయక్ ల చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు అవార్డు గ్రహీత మంగళపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ నాకు ఈ అవార్డు బహుకరించిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు అలాగే ఈ అవార్డు తీసుకోవడం వల్ల నాకు మరింత బాధ్యత పెరిగిందని రానున్న రోజుల్లో బాధ్యతగా పనిచేసే ఇంక సేవా కార్యక్రమాలు చేపడతానన్నారు

అంబేద్కర్ నేషనల్ అవార్డు అందుకున్న కొమురయ్య…

అంబేద్కర్ నేషనల్ అవార్డు అందుకున్న కొమురయ్య

భూపాలపల్లి నేటిధాత్రి

 

హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులో సిటీ కల్చర్ ఆడిటోరియం ముషీరా బాద్లో స్ఫూర్తి సర్వీస్ సొసైటీ ఇండియా ఎన్జీవో వ్యవస్థాపకులు చైర్మన్ లయన్ డాక్టర్ ఆకుల రమేష్ ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో సేవలందిస్తున్న వారిని గుర్తించి వారికి అవార్డులు ప్రధాన చేయడం జరిగింది . అందులో భాగంగా అంబేద్కర్ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మారపల్లి కొమురయ్య సేవలను గుర్తించి అంబేద్కర్ నేషనల్ సేవా అవార్డు ముఖ్య అతిథులు డాక్టర్ గూడూరు చెన్నారెడ్డి డాక్టర్ టీవీ రామకృష్ణ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ ఫిలిం ప్రొడ్యూసర్ మల్ల రమేష్ శంషాబాద్ ఎంఈఓ డాక్టర్ ఇస్లావత్ కాసన నాయక్ చేతుల మీద స్ఫూర్తి సేవ సమితి ఆధ్వర్యంలో అందించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుర్తించి అవార్డు అందించిన స్ఫూర్తి సేవా సమితి వారికి పేరుపేరునా కృతజ్ఞతలు

అంబేద్కర్ నేషనల్ అవార్డుకు కిరణ్ ఎంపిక…

అంబేద్కర్ నేషనల్ అవార్డుకు కిరణ్ ఎంపిక.

చిట్యాల, నేటిదాత్రి :

 

స్పూర్తి సర్వీసెస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ ఆకుల రమేష్.

చిట్యాల మండల కేంద్రానికి చెందిన అంబేద్కర్ యువజన సంఘం మండల సీనియర్ నాయకులు గురుకుంట్ల కిరణ్ అంబేద్కర్ నేషనల్ అవార్డుకు ఎంపికైనట్లు స్ఫూర్తి సర్వీసెస్ సొసైటీ ఇండియా ఎన్జీవోస్ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డాక్టర్ ఆకుల రమేష్ తెలిపారు. చిట్యాల మండల అంబేద్కర్ యువజన సంఘంలో గత 15 సంవత్సరాలుగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిస్తూ , భావజాలాన్ని ముందుకు తీసుకెళ్ళుచూ మరియు మహనీయుల కార్యక్రమాలను నిర్వహిస్తూ మృతుల కుటుంబాలను , పరామర్శించి సహాయ సహకారాలు అందించాడని, దళితులపై, మహిళలపై జరుగుతున్న సంఘటనలను ఖండిస్తూ వారికి అండగా నిలబడ్డారని , సామాజిక సేవ కార్యక్రమాలు అనేకం చేశాడని అన్నారు . అతను చేస్తున్న సేవలను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేయడం జరిగిందని డాక్టర్ రమేష్ చెప్పారు. అంబేద్కర్ నేషనల్ అవార్డుకు ఎంపికైన గురుకుంట్ల కిరణ్ కు నవంబర్ 5న సిటీ కల్చరల్ సెంటర్ ఆడిటోరియం ఆర్టిసి క్రాస్ రోడ్ ముషీరాబాద్ వివేక నగర్ కవాడిగూడ హైదరాబాద్* లో ఈ అవార్డు అందించడం జరుగుతుందని తెలిపారు. కిరణ్ మట్లాడుతూ నాకు ఈ అవార్డు ఎంపిక చేసిన డాక్టర్ ఆకుల రమేష్ గారికి సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.

ప్రపంచ బాల్యవివాహాల వ్యతిరేక దినోత్సవం…

ప్రపంచ బాల్యవివాహాల వ్యతిరేక దినోత్సవం

కోఆర్డినేటర్ తిరుపతి శాస్త్రాలు

భూపాలపల్లి నేటి ధాత్రి

 

 

 

భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జామా మసీద్ ప్రాంగణంలో జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్స్ సహాయ ఎన్జీవో కోఆర్డినేటర్ తిరుపతి శాస్త్రాల ఆధ్వర్యంలో బాల్యవివాహాల నిర్మూలన కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాల మత పెద్దలు మతగురువులు ప్రజల్లో అవగాహన కోసం ప్రపంచవ్యాప్తంగా 39 దేశాలలో సెప్టెంబర్ 12 నుండి 14 వరకు ప్రపంచ బాల్యవివాహాల వ్యతిరేక దినోత్సవం జరుపుతూ ఉంది అందులో వివాహాలను నిర్వహించే మత పెద్దలు గురువులను భాగస్తులను చేస్తూ బావి భారతం నిర్మాణానికి మత గురువులు చేయుటనివ్వాలంటూ నేడు జామా మసీద్ కమిటీ సభ్యుల చే బాల్యవివాహాలను అరికట్టడం కోసం బాలికల అభ్యున్నతి కోసం బలమైన భారతదేశ నిర్మాణం కోసం కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో మసీద్ అధ్యక్షులు హబీబ్ ఆఫీజ్, మాజీ కౌన్సిలర్ ఇర్ఫాన్, ఇమ్రాన్ బాబర్ ఇస్మాయిల్ ఫయాజ్ ముస్లిం సోదరులు మరియు చైల్డ్ రైట్స్ డిపార్ట్మెంట్ సహాయ ఎన్జీవో కోఆర్డినేటర్ సామల శ్రీలత, నరేష్ తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version