ప్రపంచ బాల్యవివాహాల వ్యతిరేక దినోత్సవం
కోఆర్డినేటర్ తిరుపతి శాస్త్రాలు
భూపాలపల్లి నేటి ధాత్రి
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జామా మసీద్ ప్రాంగణంలో జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్స్ సహాయ ఎన్జీవో కోఆర్డినేటర్ తిరుపతి శాస్త్రాల ఆధ్వర్యంలో బాల్యవివాహాల నిర్మూలన కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాల మత పెద్దలు మతగురువులు ప్రజల్లో అవగాహన కోసం ప్రపంచవ్యాప్తంగా 39 దేశాలలో సెప్టెంబర్ 12 నుండి 14 వరకు ప్రపంచ బాల్యవివాహాల వ్యతిరేక దినోత్సవం జరుపుతూ ఉంది అందులో వివాహాలను నిర్వహించే మత పెద్దలు గురువులను భాగస్తులను చేస్తూ బావి భారతం నిర్మాణానికి మత గురువులు చేయుటనివ్వాలంటూ నేడు జామా మసీద్ కమిటీ సభ్యుల చే బాల్యవివాహాలను అరికట్టడం కోసం బాలికల అభ్యున్నతి కోసం బలమైన భారతదేశ నిర్మాణం కోసం కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో మసీద్ అధ్యక్షులు హబీబ్ ఆఫీజ్, మాజీ కౌన్సిలర్ ఇర్ఫాన్, ఇమ్రాన్ బాబర్ ఇస్మాయిల్ ఫయాజ్ ముస్లిం సోదరులు మరియు చైల్డ్ రైట్స్ డిపార్ట్మెంట్ సహాయ ఎన్జీవో కోఆర్డినేటర్ సామల శ్రీలత, నరేష్ తదితరులు పాల్గొన్నారు