కారేపల్లి నూతన తహసిల్దార్ ను సన్మానించిన మాణిక్యారం సర్పంచ్ పద్మ.

కారేపల్లి నూతన తహసిల్దార్ ను సన్మానించిన మాణిక్యారం సర్పంచ్ పద్మ.

కారేపల్లి నేటిధాత్రి

సింగరేణి మండల నూతన తహసీల్దారుగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఓరుగంటి వెంకటేశ్వర్లు ను మాణిక్యారం సర్పంచ్ భూక్యా పద్మ సోమవారం పుష్పగుచ్చం అందించి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా సర్పంచ్ పద్మ మాట్లాడుతూ మండలంలోని వివిదగ్రామాల్లో పెండింగ్ లో ఉన్న రెవెన్యూ సమస్యలను వేంటనే పరిష్కరించి న్యాయంచెయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ నాయకులు ఖమ్మం డిసిసి బ్యాంక్ మాజీ డైరెక్టర్ ధారావత్ బద్దులాల్ తదితరులు పాల్గొన్నారు.

వన్య ప్రాణుల దాహార్తి కోసం నీటివసతి ఏర్పాటు-టీజీ ఎఫ్ డీసీ…

వన్య ప్రాణుల దాహార్తి కోసం నీటివసతి ఏర్పాటు-టీజీ ఎఫ్ డీసీ

జైపూర్, నేటి ధాత్రి :

 

ఎండలు మండి పోతున్న ఈ వేసవిలో అడవులు,ప్లాంటేషన్ లలో సంచరించే వన్య ప్రాణుల దాహం తీర్చ డానికి తెలంగాణా అటవీ అభివృద్ధి సంస్థ (టీజీ ఎఫ్ డీసీ ) ఆధ్వర్యంలో నీరు నిల్వ ఉండేలా వసతి సౌకర్యం ఏర్పాటు చేశారు.వివరాలు ఇలా ఉన్నాయి.మంచిర్యాల రేంజ్ పరిధిలోని జైపూర్ మండలం ముదిగుంట అటవీప్రాంతం లో టీజీ ఎఫ్ డీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్లాంటేషన్ లలో ఒక కాలువ లో ఒక చోట నీటి ఊటను ప్లాంటేషన్ వాచర్ శంకర్ గమనించారు.ఈ సమాచారం తెలిసిన వెంటనే టీజీ ఎఫ్ డీసీ మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేష్ కుమార్ దీనికి ఒక కార్య రూపం దాల్చారు.గురువారం ప్లాంటేషన్ వాచర్ శంకర్,కొంత మంది కూలీల సహాయం తో జంతువులు తాగడానికి వీలుగా నీటి ఊట నీరు వృధాగా పోకుండా కొంత మేరకు మట్టి పూడిక తీయించి అడ్డు కట్ట వేయడం తో నీరు నిల్వ గా ఆగిపోయింది.ఈ సందర్బంగా ప్లాంటేషన్ మేనేజర్ సురేష్ కుమార్ మాట్లాడుతూ మూగ జీవాలైన వన్య ప్రాణులు వేసవిలో తాగు నీరు దొరకక చాలా ఇబ్బందులు పడుతుంటాయని, వాటి దాహర్తి తీర్చడం కోసం చిరు ప్రయత్నం చేసినట్లు తెలిపారు.

అంకుశాపురం గ్రామ సర్పంచ్ క్యాతరాజు కవితకు అరుదైన గౌరవం…

అంకుశాపురం గ్రామ సర్పంచ్ క్యాతరాజు కవితకు అరుదైన గౌరవం

-హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో ఘన సన్మానం
మొగుళ్లపల్లి నేటి దాత్రి

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని అంకుశాపురం గ్రామ నూతన సర్పంచ్ క్యాతరాజు కవిత-లింగమూర్తి దంపతులకు అరుదైన గౌరవం దక్కింది. గురువారం హైదరాబాదులోని రవీంద్రభారతిలో ఆ దంపతులను శాలువాతో ఘనంగా సన్మానించారు. బీసీ టైమ్స్ అండ్ బీసీ సమాజ్ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నూతనంగా అంకుశాపురం గ్రామ సర్పంచ్ గా గెలుపొందిన బీసీల ముద్దుబిడ్డ క్యాతరాజు కవిత-లింగమూర్తి దంపతులను మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవులు, మాజీ డిజిపి పూర్ణచందర్ రావు, సమాజ్ అధినేత సూర్యరావు, తొలి వెలుగు ఎడిటర్ రఘులు ఆమెను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కవిత-లింగమూర్తి దంపతులు మాట్లాడారు. ప్రజాసేవ చేసేందుకు తాము రాజకీయ రంగ ప్రవేశం చేశామని, తమను సన్మానించి..రాజకీయంగా ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.

బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులుగా గుడికందుల శివ…

బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులుగా గుడికందుల శివ

నడికూడ,నేటిధాత్రి:

 

మండలంలోని కంఠాత్మకూరు గ్రామ బిఆర్ఎస్ నూతన అధ్యక్షులుగా యువ నాయకులు గుడికందుల శివను నియమిస్తున్నట్లు నడికూడ బిఆర్ఎస్ మండల కమిటీ తెలిపారు.తన నియామకానికి సహకరించిన మాజీ అధ్యక్షులు రాయిడి నాదంరెడ్డి మరియు గ్రామ బిఆర్ఎస్ కుటుంబ సభ్యులకు శివ కృతజ్ఞతలు తెలియచేసారు.రాబోయే రోజుల్లో గ్రామంలో మీ అందరి సహకారంతో పార్టీని మరింత బలోపేతం చేయడానికి శక్తివంచన లేకుండా కృషిచేస్తానని తెలిపారు.

పంచాయతీ ఎన్నికల్లో బీసీల జోష్

జనరల్లో జోష్……….!

◆:- పంచాయతీ పోరులో బీసీల హవా..

◆:- జనరల్లో భారీగా నామినేషన్లు

◆:- దొరలు, రెడ్లు హుకుంకు తలొగ్గేదెలా..

◆:- బీసీలలో పెరిగిన రాజకీయ చైతన్యం

◆:- ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తున్న శ్రామిక కులాలు

◆:- బీసీలకు అండదండగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ

◆:- రాజ్యాధికారం దిశగా నయా ట్రెండ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

తెలంగాణ నేషన్ల పర్వం మొదలైంది. ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మ లైన గ్రామాల్లో ఎన్నికల సందడి జోరందుకుంటుంది. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 12,735 గ్రామ పంచా యతీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో బీసీలకు కేవలం 2,176 సీట్లు మాత్రమే రిజర్వేషన్లో కేటా యించారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ పోను మిగిలిన 50% జనరల్ స్థానాలుగా నిర్ణయించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ పెంచుతామనే డ్రామా ముగిసింది. దీంతో బీసీలు తమకు జరిగిన అన్యాయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో తమ సత్తా చాటడం ద్వారా తగిన సమాధానం చెప్పాలని బీసీ సమాజం భావిస్తోంది.

పంచాయతీ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లోనూ నయా జోష్ కనిపిస్తోంది. జనరల్ బీసీలు భారీగా నామినేషన్లు వేస్తున్నారు. ఈసారి పంచాయతీ పోరులో బీసీల హవా. స్పష్టంగా కనిపిస్తోంది. గ్రామ స్థాయిలోని బీసీ నేతలు దూకుడు పెంచారు. జనరల్ స్థానాలన్నింటిలో పోటీ చేయాలనే సంకల్పంతో ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి, ఊరించి మోసం చేసిన కాంగ్రెస్పై, బీసీల హక్కుల విషయంపై మౌనరాగం పాటిస్తున్న బీజేపీ, బీఆర్ఎస్ పట్ల వారు ఆగ్రహంతో ఉన్నారు. అందుకు ఎన్నికల బరిలోనే తగిన సమాధానం చెప్పాలని బీసీ సమాజం నిశ్చయంతో ఉంది.

గతంలో గ్రామస్థాయిలో వెలమ దొరలు, రెడ్లు ఇతర అగ్రవర్ణాలు చెప్పిందే వేదంగా నడిచేది. తమకు ఎదురుగా తిరిగే అణగారిన వర్గాలపై ఆర్థిక బలంతో, అధికారం అండతో అణిచివేసే వారు. కాలం మారింది. రెడ్లు, వెలమలు, అగ్రకుల పెత్తందారులు హుకుంకు కాలం చెల్లిందని బీసీ యువత అంటున్నది. వారి పెత్తనా లకు తలొగ్గేదేలేదని తెగేసి చెబుతున్నది.

నగరాలు, పట్టణాల నుండి గ్రామస్థాయి వరకు బీసీలలో ఎప్పుడూ లేనంత రాజకీయ చైతన్యం పెరిగింది. జనాభాలో 60 శాతం పైగా ఉన్న మాకు అన్ని రంగాలలో అన్యాయం జరుగుతుందని వారు తెలుసుకుంటున్నారు. జనాభా దామాషా ప్రకారం తమకు రావాల్సిన హక్కుల గురించి ప్రశ్నిస్తు న్నారు. మేమెంతో మాకు అంత వాటా దక్కాల్సిందేనని బరిగీసి నిలుస్తు న్నారు. మా ఓట్లు మాకే, మీ ఓట్లు మీకు అనే నినాదం గ్రామ స్థాయికి చేరింది. అందుకే ఆధిపత్య కులాల పెత్తనానికి ఎదురు నిలచి జనరల్ స్థానాల్లో తమ శక్తి నిరూపించాలని భావిస్తున్నారు.

బీసీలలో ఈ రాజకీయ స్పృహ పెరగటంలో సుదీర్ఘ కృషి ఉంది. బీసీలకు రాజ్యాధికారం దక్కటం ద్వారానే వారి సమస్యలకు పరిష్కారం లభిస్తుం దనే చైతన్యం పెంపొందడం వెనక బీసీల నాయకుడు మల్లన్న, ఆయన మీడియా ప్రముఖ పాత్ర వహించింది అనడంలో అతిశయోక్తి లేదు. ప్రతి రంగంలోనూ బీసీలు ఎలా అన్యాయానికి గురవుతున్నారో, అగ్రవర్ణాలు ఎలా ఆధిపత్యం చలాయిస్తున్నాయో లెక్కలతో సహా తెలియచెప్పటం బాగా పనిచేసింది. తెలంగాణ రాజకీయాల్లో చోటు చేసుకున్న నూతన పరిణామం ఏమిటంటే బీసీల ఎజెండాతో, వారికి అండదండగా తెలంగాణ రాజ్యాధికారం పార్టీ ఏర్పడటం అని చెప్పవచ్చు. తమ ఆకాంక్ష లకు అనుగుణంగా ఒక రాజకీయ పార్టీ ఏర్పడడంతో శ్రామిక కులాలు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామ స్థాయిలో పట్టు బిగించడమే బీసీల రాజ్యాధికారానికి మొదటి మెట్టు అని బీసీ మేధావులు చెప్తున్నారు. అందుకు పంచాయతీ ఎన్నికలు నేడు ఒక అవకాశంగా మారాయి. రాజ్యాధికారం సాధించే దిశల్లో గ్రామస్థాయిలో గెలుపు ద్వారా నయా ట్రెండ్ సృష్టించటానికి యావత్ బీసీ సమాజం సిద్ధ మవుతోంది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version