క్షేత్ర దినోత్సవంలో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించిన వ్యవసాయ అధికారులు
రామడుగు, నేటిధాత్రి:
రైతు స్థాయిలో విత్తనోత్పత్తిని ప్రోత్సహించలనే సదుద్దేశంతో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రెవెన్యూ గ్రామంలో ముగ్గురు రైతులకు, పరిశోధనా కేంద్రాల్లో అభివృద్ధి చేసిన నాణ్యమైన విత్తనాన్ని గ్రామగ్రామాన నాణ్యమైన విత్తనం (క్వాలిటీ సిడ్ ఇన్ ఎవ్రి విలేజ్-క్యూఎస్ఈవి) అనే కార్యక్రమo ద్వారా సరఫరా చేయడం జరిగింది. ఈకార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం దేశరాజుపల్లి గ్రామంలో వరి (జేజిఎల్ – 24423) పొలంలో క్షేత్ర దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఈసందర్భంగా గ్రామానికి చెందిన సత్యనారాయణరెడ్డి అనే రైతు తన అనుభవాన్ని, జేజిఎల్-24423 రకంలో విత్తనోత్పత్తి గురించి తను తీసుకున్న జాగ్రత్తలను తోటి రైతులకు వివరించారు. అనంతరం వ్యవసాయ పరిశోధన స్థానం కరీంనగర్ ప్రధాన శాస్త్రవేత్త డా.బి. రాంప్రసాద్ మాట్లాడుతూ రైతు స్థాయిలో విత్తనోత్పత్తి వల్ల కలిగే ప్రయోజనాలు మరియు వరిలో పురుగుల, తెగుళ్ళ యాజమాన్యం గురించి వివరించిన అనంతరం శాస్త్రవేత్తలు డా.జి.ఉషారాణి, ఇ.ఉమారాణిలు మాట్లాడుతూ విత్తనోత్పత్తి క్షేత్రాల్లో బెరుకుల తీసివేత గురించి తెలియజేశారు. ఈకార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి త్రివేదిక, వ్యవసాయ విస్తరణ అధికారి రమేష్, ఇతర రైతులు పాల్గొన్నారు. ఈసందర్భంగా గ్రామానికి చెందిన కొంతమంది రైతులు స్వయంగా ఉత్పత్తి చేసిన ఇదే విత్తనాన్ని రానున్న పంట కాలానికి వినియోగీస్తామని వారి సుముఖతను అధికారులకు తెలియజేశారు.
ప్రభుత్వం వెంటనే వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి బిజెపి కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు చింతకుంట సాగర్
చందుర్తి, నేటిధాత్రి:
వరి కోతలు ప్రారంభమై 20 రోజులు గడుస్తున్న ప్రభుత్వం ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడం సోచనీయం అని చందుర్తి మండల బిజెపి కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు చింతకుంట సాగర్ అన్నారు. అకాల వర్షాలు కురుస్తూ రైతులు ఇబ్బంది పడుతున్న ప్రభుత్వం మొద్దు నిద్ర వీడడం లేదని రైతుల పక్షపాతి అని చెప్పుకునే ఈ ప్రభుత్వం రైతులకు చేసిందేమీ లేదని ఇకనైనా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి తడిచిన ధన్యాన్ని సైతం ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ట్రాన్స్ఫార్మర్ పగల గొట్టి కాపర్ వైర్ దొంగిలించిన గుర్తు తెలియని వ్యక్తులు
మరిపెడ నేటిధాత్రి
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం రాంపురం లో దొంగల హల్చల్,వ్యవసాయ మోటార్లకు విద్యుత్ అవసరాల కొరకు ఏర్పాటు చేసినా ట్రాన్స్ఫార్మర్ ను పగులగొట్టి కాపర్ వైర్ దొంగిలించి ఎత్తుకెళ్లిన గుర్తుతెలియని వ్యక్తులు,
తెల్లవారుజామున గుర్తించిన స్ధానిక రైతులు విద్యుత్ అధికారులకు సమాచారం ఇవ్వడం తో హెల్పర్ రవీందర్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చూసి పోలీసులకు పిర్యాదు చేసినా విద్యుత్ అధికారులు.
– వ్యవసాయ విస్తరణ అధికారులు తప్పనిసరిగా కొనుగోలు కేంద్రాలను సందర్శించాలి
– కొనుగోళ్లు, తేమ శాతం తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించాలి
– క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు లేకుండా చూడాలి
– రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంఛార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్
సిరిసిల్ల(నేటి ధాత్రి):
కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని తేమ శాతం ఆధారంగా, నిబంధనల ప్రకారం కొనుగోలు చేయాలని, వ్యవసాయ విస్తరణ అధికారులు తప్పనిసరిగా కొనుగోలు కేంద్రాలను సందర్శించి, రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా ఇంఛార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. శనివారం సిరిసిల్ల మున్సిపల్ పరిధి పెద్దూర్ లో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె క్షేత్ర స్థాయిలో సందర్శించి, కేంద్రంలో రైతుల సౌకర్యార్థం చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. 17 శాతం తేమ రాగానే ఆలస్యం చేయకుండా కొనుగోళ్ళు ప్రారంభించాలని ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడవకుండా అవసరమైన టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని, క్షేత్ర స్థాయిలో రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని ఆమె సూచించారు. వ్యవసాయ విస్తరణ అధికారులు తమ పరిధిలోని కొనుగోలు కేంద్రాలను తప్పకుండా సందర్శించి, రైతులకు వచ్చే సందేహాలను నివృత్తి చేస్తూ, అన్ని అంశాలపై అవగాహన కల్పించాలని అన్నారు. కేంద్రంలోని రిజిస్టర్ లను పరిశీలించి, వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సూచించారు. ట్యాబ్ ఎంట్రీ లో తప్పులు దొర్లకుండా చూడాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, అధికారులు ఎవరి బాధ్యతలు వారు సక్రమంగా నిర్వహిస్తే ధాన్యం కొనుగోళ్ళ ప్రక్రియ సజావుగా పూర్తవుతుందని పేర్కొన్నారు. గ్రేడ్ – ఏ రకానికి రూ. 2,389, కామన్ రకానికి రూ. 2,369 ధర ప్రభుత్వం నిర్ణయించిందని వివరించారు. సన్న రకం ధాన్యం క్వింటాలుకు అదనంగా బోనస్ రూ.500 ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. ఆర్డీఓ లు, తహశీల్దార్లు తప్పనిసరిగా తమ పరిధిలోని కొనుగోలు కేంద్రాలను సందర్శించి, పర్యవేక్షించాలని ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే జిల్లా యంత్రాంగానికి తెలియజేయాలని ఇంచార్జి కలెక్టర్ సూచించారు. సందర్శనలో ఆర్డీఓ వెంకటేశ్వర్లు, పౌరసరఫరాలశాఖ అధికారి చంద్రప్రకాష్, తహశీల్దార్ మహేష్, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, మెప్మా ఏఓ మీర్జా ఫసాహత్ అలీ బేగ్, తదితరులు పాల్గొన్నారు.
వీణవంక మండల కేంద్రంలోని పలు గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు టీ సెర్ప్ డిఆర్డిఏ (ఐకేపీ) ఆధ్వర్యంలో శుక్రవారం వీణవంక ,కనపర్తి, బ్రాహ్మణపల్లి, ఇప్పలపల్లి గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. తహసీల్దార్ అనుపమ కనపర్తి లో,ఎంపీడీఓ వీణవంక లో,ఇప్పలపల్లి గ్రామంలో ఏపీఎం సుధాకర్,బ్రాహ్మణపల్లి లో ఎం ఎస్ సి సి పద్మ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ డైరెక్టర్ మాదాసు సునీల్ మాట్లాడుతూ… రైతులు దళారులను నమ్మి ధాన్యం అమ్మవద్దని ప్రభుత్వం మద్దతు ధరతో పాటు సన్నాలకు బోనస్ కూడా అందిస్తుందని తెలిపారు రైతులు గమనించి ధాన్యం కొనుగోళ్లను ఐకెపి సెంటర్ ద్వారా నిర్వహించాలని కోరారు. రైతులు ఐకెపి సెంటర్ కొనుగోలుదారులకు సహకరిస్తే ధాన్యం తరలింపు సులువుగా ఉంటుందన్నారు సెంటర్ నిర్వాహకులు ప్రస్తుత వర్షాలను దృష్టిలో పెట్టుకొని ధాన్యం తరలింపులో జాప్యం లేకుండా చూడాలన్నారు. రైతులకు అందుబాటులో తార్పాలిన్ కవర్లు ఉంచి రైతులకు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మాదాసు సునీల్, కామిడి శ్రీపతి రెడ్డి,ఎం డి. రషీద్ పాషా, సీసీలు ఎన్. ఆనంద్,ఎస్.తిరుపతి,వి.తిరుపతి,ఎస్.ఘన శ్యామ్ అన్ని గ్రామాల అధ్యక్షురాలు,కొనుగోలు కమిటీ మెంబర్ లు గ్రామాల వి ఓ ఏ. లు, రైతులు ,హమలీలు పాల్గొన్నారు.
నష్టపరిహారం చెల్లించాలని అధికారులకు వినతి పత్రం అందించిన రైతులు
జైపూర్,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని కొండపేట, నాగంపేట,ఏసన్వయి,ఏడగట్ట, పిన్నారం గ్రామాలలో భారీగా అడవి పందులు పత్తి పంటను నష్టం చేశాయని రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డివై ఎఫ్ఆర్ఓ లావణ్య కి వ్యవసాయ శాఖ అధికారి ఏవో సాయి రెడ్డికి శుక్రవారం వినతిపత్రం అందించారు.పలు గ్రామాల రైతులకు జరిగిన నష్టానికి అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకొని రైతులకు జరిగిన నష్టాన్ని పరిశీలించి వెంటనే తగిన నష్టపరిహారం ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ చైర్మన్ సాంబ గౌడ్,కోటపల్లి మండల సీనియర్ నాయకులు కొట్టే నారాయణ,అజ్మీర, పున్నం,అన్వర్,ఆలీ,పోచం, కొట్రాంగి మల్లేష్,దేవయ్య, రూపా నాయక్,భూమయ్య, రైతులు,బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
రైతాంగం ఆరుగాలం కష్టించి పండించిన మొక్కజొన్న వరి పంటలకు కనీస మద్దతు ధర అమలయ్యే విధంగా ముందస్తు ప్రణాళికతో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం విడ్డూరంగా ఉందని అఖిల భారత రైతు సమాఖ్య (ఏఐకెఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్ అన్నారు.తక్షణమే యాసంగి వరిధాన్యం బోనస్ డబ్బులను రైతుల ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు.నర్సంపేట పట్టణంలోని ఓంకార్ భవన్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో పెద్దారపు రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మాది రైతు ప్రభుత్వమని రైతు రాజ్యాన్ని తెస్తామని గొప్పలు చెప్తూ ఆచరణలో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నదని యాసంగి సన్నధాన్యం పండించిన రైతులకు క్వింటాకు 500 రూపాయల బోనస్ అమ్మిన వెంటనే చెల్లిస్తామని చెప్పి రాష్ట్రంలో 23 లక్షల 36 వేల టన్నుల క్వింటాల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా తీసుకొని రైతులకు ఇవ్వాల్సిన 1168 కోట్ల రూపాయల బోనసు ను నాలుగునెలలైనా జమ చేయకపోవడం ఎంతవరకు సమంజసం అన్నారు. అధిక వర్షాలతో యూరియా కొరతతో ప్రస్తుత వానాకాలం సీజన్లో రైతులు మొక్కజొన్న వరి పత్తి పంటలు వేసిన దిగుబడి తగ్గి పంటలు చేతికి వస్తున్న దశలో ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం అన్యాయం అన్నారు. రాష్ట్రంలోనే మొక్కజొన్నలు ముందుగా చేతికి అందే వరంగల్ జిల్లాలో రైతులు ఇప్పటికే నూటికి 70 శాతం మంది దళారులకు వ్యాపారులకు మద్దతు ధర కన్నా క్వింటాకు ఐదు వందల నుంచి 600 రూపాయల వరకు తక్కువకు అమ్ముకొని తీవ్రంగా దోపిడికి గురయ్యారని మొక్కజొన్నలన్నీ దళారులు కొన్న తర్వాత ఇప్పుడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు తెరవడం ఎవరి కోసమని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు వ్యవసాయ పంటల కొనుగోలు ప్రణాళిక లేకపోవడంతో రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తక్షణమే ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని మద్దతు ధర లభించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. అలాగే యాసంగి వరి ధాన్యం అమ్మిన రైతులకు తక్షణమే బోనస్ డబ్బులను విడుదల చేసి రైతుల ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు అందుకోసం ఈనెల 25న వరంగల్ చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు ఎమ్మెల్యేలు రైతులను ఆదుకునే విధంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి అందుకు అనుగుణమైన చర్యలు చేపట్టాలని లేకపోతే గత ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఏఐకేఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు కేశెట్టి సదానందం, యూపీఎన్ఎం జిల్లా కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి, కలకొట్ల యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వం పత్తి రైతుల కోసం ప్రారంభించిన కపాస్ కిసాన్ యాప్ వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు. యాప్ ను పత్తి రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉత్పత్తులను కనీస మద్దతు ధర (ఎంఎస్పి)కు సులభంగా,మధ్యవర్తుల ప్రమేయం లేకుండా అమ్ముకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.గురువారం వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలోని దేశాయిపల్లె, ముద్దునూరు,బంధంపెల్లి,గ్రామాల పత్తి రైతులకు మండల వ్యవసాయ శాఖ అధికారి మాధవి అధ్యక్షతన కిసాన్ యాప్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రైతులకు స్లాట్ బుకింగ్, పేమెంట్ ట్రాకింగ్, ఆధార్ , భూమి రికార్డుల ద్వారా సులభంగా నమోదు చేసుకోవడం వంటి సదుపాయాలున్నాయని అన్నారు.
ఆధార్ నంబర్తో స్వీయ-నమోదుతో పాటుమార్కెట్లో రద్దీని తగ్గించడానికి క్యూలను నివారించడానికి స్లాట్ బుక్ చేసుకోవచ్చని అన్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా అమ్మకాలు జరుపుకోవడంతో పాటు పేమెంట్ ట్రాకింగ్ వంటి సదుపాయాల ద్వారా లావాదేవీలలో పారదర్శకతను అందిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు.ముందుగా ప్లేస్టోర్ నుంచి కపాస్ కిసాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని యాప్లో ఆధార్, భూమి రికార్డులు (పట్టాదారు పాస్బుక్), పంట రకం, విస్తీర్ణం, ఇతర అవసరమైన వివరాలను నమోదు చేయాలన్నారు.పత్తి అమ్మాలనుకుంటున్న మార్కెట్ను ఎంచుకుని స్లాట్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు.నాణ్యమైన పత్తి కి మంచి మద్దతు ధర రూ.8110 వస్తుందని తెలియజేశారు.పత్తి ఏరడానికి కాటన్ బ్యాగ్స్, పాత చీరలు వాడాలని, ప్లాస్టిక్ సంచులు వాడరాదని సూచించారు.
ఈ సందర్భంగా అంగన్వాడీ సెంటర్స్, మరియు ప్రైమరీ స్కూల్ లను కలెక్టర్ తనిఖీ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, నర్సంపేట ఏడిఏ దామోదర్ రెడ్డి, ఏఈఓలు హనుమంతు,విజయ్, రాజేశ్ ఆయా గ్రామాల పత్తి రైతులు పాల్గొన్నారు.
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యం అమ్మి మద్దతు ధర పొందాలి
ప్రతిపక్షాల మాటలు నమ్మి రైతులు ఆందోళనకు గురి కావద్దు-ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
గంగాధర, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలం హిమ్మత్ నగర్, గట్టుభూత్కుర్, చిన్న అచంపల్లి, పెద్ద అచంపల్లి, గర్షకుర్తి, తాడిజెర్రి, రంగారావుపల్లి, ఉప్పరమల్యాల, కురిక్యాల, మల్లాపూర్, వెంకంపల్లి, మధురానగర్ గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతుల ధాన్యం అమ్మి మద్దతు ధర పొందాలని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సూచించారు. మండలంలోని వివిధ గ్రామాల్లో వ్యవసాయ సహకార సంఘం, ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈసందర్భంగా చొప్పదండి ఎమ్మెల్యే సత్యం మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యం గింజ వరకు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చే రైతులు ఇబ్బంది పడకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కేంద్రాల వద్ద తాగునీరు, విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయాలని, రైతుల కోసం నీడ ఏర్పాటు చేయాలని సూచించారు. కేంద్రాలకు రైతుల వివరాలను నమోదు చేసుకొని, తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని వెంట వెంటనే మిల్లులకు తరలించాలని సూచించారు. ప్రతిపక్షాల మాటలు నమ్మి రైతులు ఆందోళనకు గురి కావద్దని, సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని భరోసా కల్పించారు. ఈకార్యక్రమంలో సింగల్ విండో చైర్మన్ వెలిచాల తీర్మల్ రావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తోట కరుణాకర్, తహశీల్దార్ అంబటి రజిత, ఎంపిడిఓ రామ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పురుమల్ల మనోహర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దుబ్బాసి బుచ్చయ్య, రామిడి రాజిరెడ్డి, సాగి అజయ్ రావు, బుర్గు గంగన్న, రాజగోపాల్ రెడ్డి, రోమాల రమేష్, పడితపల్లి కిషన్, చక్రపాణి, శ్రీనివాస్, లక్ష్మణ్, హన్మంత రెడ్డి, మహేష్, ఆనంద్, కరుణాకర్, తదితరులు పాల్గొన్నారు.
మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని బోడ జానంపేట గ్రామ రెవెన్యూ శివారులో ఎస్.ఆర్. పి కంపెనీ తమ భూమిని ఆక్రమించారని బాధిత రైతులు ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి గురువారం తెలిపారు. ఈ సందర్భంగా బాధిత రైతులు మాట్లాడుతూ.. గ్రామ శివారులోని సర్వే నెంబర్ 87 లో 3.14 గుంటల భూమిని ఓ కంపెనీ అక్రమంగా ఆక్రమించి, తమ భూమిని ఎందుకు ఆక్రమించారని అడిగితే తమపై కేసులు నమోదు చేసి ఇబ్బందులు గురిచేస్తున్నారని ఎమ్మెల్యేకు విన్నవించారు. ఎమ్మెల్యే స్పందించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని రైతులు తెలిపారు.
శాయంపేట మండలంలోని రాజు పల్లి గ్రామంలో పాఠశాల ఆవరణలో పశువులకు స్థానిక పశువైద్యాధికారి డాక్టర్ సునిల్ మరియు ప్రజ్వాల్ సంస్థ సం యుక్తంగా గ్రామంలోని 125 తెల్లజాతి పశువులకు గాలికుం టువ్యాధి నివారణ టీకాలను వేయటం జరిగింది అనంతరం ప్రజ్వాల్ సంస్థ ప్రతినిధి షేక్ గౌస్ మాట్లాడుతూ మూగజీ వాలు వాటి బాధలను చెప్పలే వని ముందుగానే రైతులు నివారణకు టీకాలు వేసుకొని రైతులు ఆర్థికంగా నష్టపో కుండా జాగ్రత్త పడాలని వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది రమేష్ బాబు మరియు రవి, సదానందం మరియు గ్రామ రైతులు వెంకట్రావు ,గజ్జెల బుచ్చయ్య కందిరవి, కుసం సాంబయ్య చింతం బుచ్చయ్య, గజ్జెల తిరుపతి నవయుగసొసైటీ డైరెక్టర్ గడ్డం రమేష్ తదితరులు పాల్గొన్నారు.
– సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూప తిరుపతి రెడ్డి – బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సూరదేవరాజు సిరిసిల్ల (నేటి ధాత్రి):
సిరిసిల్ల పట్టణం విలీన గ్రామాలైన చంద్రంపేట, ముష్టిపెళ్లి గ్రామాల్లో బుధవారము నూతనంగా వడ్ల కొనుగోలు కేంద్రం సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూప తిరుపతి రెడ్డి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ రైతులు పండించిన వరి ధాన్యాన్ని ఆర బెట్టుకోవడానికి 4 ఎకరాలు ముష్టి పెళ్లికి, 5 ఎకరాలు చంద్రంపేటకు ప్రభుత్వం భూమి కేటాయించడం జరిగిందని అన్నారు. రైతులు పండించిన వడ్లకు గిట్టుబాటు ధరతోపాటు సన్న వడ్లకు అదనంగా 500 రూపాయలు ప్రభుత్వం ఇస్తుందని అన్నారు. దళారులకు వడ్లు అమ్మి మోసపోవద్దని తెలియజేశారు. మార్కెట్ కమిటీ చైర్మన్ కి,సిరిసిల్ల ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డికి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కి, ప్రభుత్వ అధికారులకు రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఖాదర్ పాషా, మెప్మా మేనేజర్ పసాద్, ఆలీ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర దేవరాజు, మాజీ కౌన్సిలర్లు నాగరాజు, రాజిరెడ్డి కమలాకర్ రావు, వంతడుపుల రాము, కొలనూరి రమాదేవి, గుడిసెట్టి బాలరాజు, శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు.
చౌటుప్పల్: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చౌటుప్పల ఆధ్వర్యంలోఏర్పాటుచేసినటువంటి నక్కలగూడెం వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ను సంఘ పి ఐ సి చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అకాల వర్షాలు వస్తున్నందున రైతులు తమ ధాన్యరాశులపై టార్పాలిన్లు కప్పుకోవాలని సూచించారు. రైతులు తమ పంటలను సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులను కలిసి పంట నమోదు చేయించుకోవాలని తెలిపారు. ఆధార్ కార్డులకు తమ పాన్ నెంబర్లకు లింక్ చేయించుకోవాలని తెలిపారు .కొనుగోలు ప్రారంభం అయినందున రైతులు తమ ధాన్యాన్ని ఎండబెట్టుకోవాలని తాలు పట్టుకోవాలని సూచించారు. అధికారులు సూచించిన పరిమితులు లోబడి ఉంటే ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ముత్యాల నాగరాజు, సంఘం డైరెక్టర్ కృష్ణ, ఏఈఓ సౌమ్య, రైతులు జంగయ్య, వై బుచ్చిరెడ్డి, అశోక్ రెడ్డి ,శ్రీశైలం ,కార్యదర్శి వై రమేష్ ,సిబ్బంది పాల్గొన్నారు.
మెట్ పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జువ్వాడి కృష్ణారావు పత్రిక సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మెట్పల్లి నియోజకవర్గం లో మక్కల కొనుగోలు కేంద్రము ప్రారంభం జరిగాయని వాటిని రైతులు కొనుగోలు కేంద్రంలో మక్కలు కొనుగోలు చేసి లబ్ధి పొందాలని దళారులను నమ్మవద్దని అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సన్నాలకు మద్దతు ధర 500 కోట్లు మంజూరు చేస్తుందని దానిని మంత్రివర్యులు ప్రకటించారని రైతులు సన్నధాన్యాలు పండించి బోనస్ 500 రూపాయలు లబ్ది పొందాలని అలాగే నియోజకవర్గ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ పై అవాక్కు చివాకులు మాట్లాడుతున్నారని హైదరాబాదులో ఉండి ఉదయం వచ్చి చెక్కులు ఇచ్చి మళ్లీ హైదరాబాద్ పోవడం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జెట్టి లింగం మండలాధ్యక్షులు తిప్పిరెడ్డి అంజిరెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేందర్ రెడ్డి మాజీ జెడ్పిటిసి ఆకుల లింగారెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
రైతు వేదికలో కపాస్ కిసాన్ యాప్, శనగ విత్తన పంపిణీ ప్రారంభం
జహీరాబాద్ నేటి ధాత్రి;
నూనె గింజలతోపాటు పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచాల్సి ఉందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.నూనె గింజలతోపాటు పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచాల్సి ఉందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ రోజు జరిగిన ‘రైతు నేస్తం’ కార్యక్రమంలో పప్పు దినుసుల్లో అధిక దిగుబడినిచ్చే వంగడాలపై అన్నదాతలకు అవగాహన కల్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఝరాసంగం మండల కేంద్రంలోని రైతు వేదికలో జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్, మండల వ్యవసాయ అధికారి వెంకటేశం పాల్గొన్నారు. ప్రస్తుత యాసంగిలో ఝరాసంగం మండలానికి 10 క్వింటాళ్ల కుసుమలు కేటాయించడమైనది అని తెలిపారు జిల్లా వ్యవసాయ అధికారి శివ ప్రసాద్ తెలిపారు.విత్తనాలతోపాటు ప్రదర్శనా క్షేత్రాలు, విత్తనోత్పత్తి కార్యక్రమాలను చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు. రైతులకిచ్చిన హామీ మేరకు జాతీయ నూనె గింజల మిషన్, వ్యవసాయ యాంత్రీకరణ పథకాలను చేపడుతున్నామన్న మంత్రి తుమ్మల.. ఇప్పటికే యాంత్రీకరణ లబ్ధిదారులను ఎంపిక చేశామని వెల్లడించారు. ప్రస్తుతం వానాకాలం పంట ఉత్పత్తుల సేకరణకు ప్రాధాన్యం ఇస్తూనే.. యాసంగిలో అమలు చే యాల్సిన పథకాలపై దృష్టి సారించామని చెప్పారు. సహజ వ్యవసాయానికి ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు క్లస్టర్ల గుర్తింపు, రైతుల శిక్షణ పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో విస్తరణ అధికారులు మరియు రైతులు పాల్గొన్నారు..
ప్రభుత్వ కొనుగోలు సెంటర్లు ఏర్పాటు కాక పోవడంతో రోడ్లపైనే ఆరబోత-బోయిని తిరుపతి
కరీంనగర్, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోలంపల్లి గ్రామంలో రోడ్ల పైన ఆరబోసిన వడ్లు రాత్రి కురిసిన వర్షాలకు పూర్తిగా తడిసిపోయాయి. మండల వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొందని, కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో ఇంతవరకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఐకెపి, డిసిఎంఎస్, పిఎస్సిఎస్, ఎలాంటి కొనుగోలు కేంద్రాలు ఇంతవరకు మొదలు కాకపోవడంతో రైతులు వడ్లను రోడ్లపైనే ఆరబోస్తున్నారు. ఇదే అదునుగా భావించి దళారులు ప్రభుత్వ రేటు కన్నా క్వింటాలకు మూడువందల నుండి నాలుగు వందల తక్కువ రేటుకు కొనుగోలు చేసి సొమ్ము చేసుకుంటున్నారని, ఆరుగాలం కష్టపడి పండించిన పంటను వర్షాల నుండి కాపాడుకోలేక దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుందని, ప్రభుత్వం తక్షణమే రైతాంగం పైన దృష్టి సారించి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఎలాంటి కొర్రీలు లేకుండా తడిసిన వడ్లను సైతం కొనుగోలు చేసి మిల్లర్ల మాయాజాలం నుండి రైతాంగాన్ని కాపాడవలసిందిగా సిపిఐ తిమ్మాపూర్ మండల సమితి పక్షాన ఒక ప్రకటనలో డిమాండ్ చేసిన సిపిఐ పార్టీ తిమ్మాపూర్ మండలం కార్యదర్శి బోయిని తిరుపతి.
దుగ్గొండి మండలంలోని స్వామిరావుపల్లి,నాచినపల్లి,శివాజీ నగర్ గ్రామాలలో జరుగుతున్న గాలి కుంటు టీకాల కార్యక్రమాల నేపథ్యంలో ను వరంగల్ జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ బాలకృష్ణ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.ఈ సందర్బంగా ప్రతీ రైతు పశువులకు గాలికుంటూ టీకాలు వేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో దుగ్గొండి పశువై ద్యాదికారి డాక్టర్ సోమశేఖర్, తొగర్రాయి పశువైద్యాదికారి డాక్టర్ శారద, తిమ్మంపేట పశువైద్యాదికారి డాక్టర్ బాలాజీ, పశువైద్య సిబ్బంధి, రైతులు పాల్గొన్నారు.
జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలి
కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కనీస మౌలిక సౌకర్యాలు కల్పించాలి
వరంగల్ జిల్లా ఆదనవు కలెక్టర్ సంధ్యారాణి
వరంగల్ జిల్లా ప్రతినిధి/నర్సంపేట,నేటిధాత్రి:
వరంగల్ జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి అన్నారు.శుక్రవారం హన్మకొండలోని డిసిసిబి భవన్ ఆడిటోరియంలో జెడ్పి సీఈఓ, ఇంచార్జి డిఆర్డీఓ రామిరెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కిష్టయ్య, జిల్లా మేనేజర్ సంధ్యారాణి, జిల్లా మార్కెటింగ్ అధికారి సురేఖ,జిల్లా ఉద్యానవన అధికారి శ్రీనివాసరావు, డిఎం హెచ్ ఓ డాక్టర్ సాంబశివరావు, జిల్లా సహకార అధికారి నీరజలతో కలిసి వరంగల్ డివిజన్ లో వరి ధాన్యం కొనుగోలుపై సన్నాహక,శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వానాకాలం 2025 -26 సంబంధించి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ సమర్ధవంతంగా నిర్వహించాలని,కొనుగోలు కేంద్రాలను లోతట్టు ప్రాంతాలలో ఏర్పాటు చేయకూడదని, కొనుగోలు ప్రక్రియకు అవసరమైన గన్నీ సంచులు, టార్పాలిన్లు, తేమ శాతాన్ని నిర్ధారించేయంత్రాలు సమకూర్చడం జరుగుతుందని,సన్న రకం, దొడ్డు రకం ధాన్యాన్ని వేరువేరుగా కొనుగోలు చేసి నిల్వ చేయాలని, కొనుగోలు సమయంలో ఎప్పటికప్పుడు ధాన్యం, రైతుల వివరాలను ట్యాబ్ లలో నమోదు చేయాలని, రిజిస్టర్ సక్రమంగా నిర్వహిస్తూ రైతుల వివరాలు నమోదు చేయాలని, కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా త్రాగునీరు, నీడ, వైద్య వసతి తదితర మౌలిక వసతులు కల్పించాలని, తాత్కాలిక మూత్రశాలలు ఏర్పాటు చేయాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాల నిర్వహకులు తమ సిబ్బందికి గుర్తింపు కార్డులు జారీ చేయాలని, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చి కొనుగోలుకు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే గన్ని సంచులు రైతులకు అందించాలని, వ్యవసాయ విస్తరణ అధికారులు ధ్రువీకరించిన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయాలని ,ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి లోపాలు లేకుండా పర్యవేక్షించాలని, కొనుగోలు ప్రక్రియలో భాగంగా తేమశాతం యంత్రాలు, టార్పాలిన్లు, త్రాగునీరు, నీడ తదితర విషయాలకు సంబంధించి పి.సి.ఎస్.ఎ.పి. యాప్, గన్ని సంచుల నిర్వహణ కోసం మేనేజ్మెంట్ యాప్, పట్టాదారు, బ్యాంకు పాస్ పుస్తకాలు, ఆధార్, మొబైల్ నెంబర్ నిర్వహణపై ఓ.పి.ఎం.ఎస్. యాప్ లను సక్రమంగా నిర్వహించాలని తెలిపారు.
Efficient Rice Procurement in Warangal District
ప్రభుత్వం వరి ధాన్యం కనీస మద్దతు ధర గ్రేడ్ ఏ రకానికి క్వింటాలుకు 2 వేల 389 రూపాయలు, సాధారణ రకానికి క్వింటాలుకు రూ .2 వేల 369 లుగా నిర్ణయించడం జరిగిందని, సన్న రకం వడ్ల కు మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ అందించడం జరుగుతుందని తెలిపారు. కొనుగోలు కేంద్రాల నిర్వహకులు నిబంధనల ప్రకారం నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, జిల్లాలో టాగింగ్ చేయబడిన రైస్ మిల్లులకు మాత్రమే కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించాలని, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా కొనుగోలు ప్రక్రియ నిర్వహించాలని తెలిపారు.వ్యవసాయ విస్తరణ అధికారులు నమోదు చేయబడిన రైతుల పంట సాగు డేటా ప్రకారం మాత్రమే ధాన్యం కొనుగోలు చేయాలని, హార్వెస్టర్ వినియోగ సమయంలో ఆర్ పి ఎం 18-20 ఉండేలా పర్యవేక్షించాలని, ఇలా నిర్దేశిత వేగంతో వినియోగించినట్లయితే తాలు పోయి నాణ్యమైన ధాన్యం వస్తుందని ,హార్వెస్టర్ యంత్రాల వినియోగ సమయంలో నిబంధనలను పాటించాలని, కోతకు వచ్చిన తర్వాత మాత్రమే పంట కోయాలని, బ్లోయర్ యాక్టివ్ మోడ్ లో ఉండాలని ,రైతుల వద్ద నుండి నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేసి 48 గంటలలో సంబంధిత రైతుల ఖాతాలలో నగదు జమ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
Efficient Rice Procurement in Warangal District
కొనుగోలు కేంద్రాలలో ఏర్పాటు చేసిన ప్యాడి క్లీనర్లను వినియోగించుకునేలా రైతులకు అవగాహన కల్పించాలని, వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని అదనపు కలెక్టర్ అన్నారు.ఈ కార్యక్రమంలో కొనుగోలు కేంద్రాల ఇంచార్జిలు,సీఓలు, డిఆర్డీఓ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పత్తి రైతుల రాష్ట్ర కన్వీనర్ పుచ్చకాయల కృష్ణారెడ్డి
నర్సంపేట,నేటిధాత్రి:
కేంద్ర ప్రభుత్వం సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఆ కొనుగోళ్లలో వ్యాపారుల అక్రమాలను అరికట్టాలని పత్తి రైతుల రాష్ట్ర కన్వీనర్ పుచ్చకాయల కృష్ణారెడ్డి ఆరోపించారు.పత్తి రైతుల సమావేశంలో కృష్ణారెడ్డి మాట్లాడుతూ అన్ని ఒడిదొడుకులను ఎదుర్కొని పండించి పత్తికి కనీసం మద్దతు ధర పలకపోవడంపోవడంతో రైతు నష్టపోతున్నారని వెంటనే సీసీఐ కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.క్వింటాల్ 10. వేల రూచొప్పున ధర అమలు చేయాలని కోరారు.పత్తి వ్యాపారస్తులు ధరలు తగ్గించి రైతుల వద్ద నుండి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు.గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం పత్తి దిగుబడులు చాలా తగ్గాయని వరంగల్ మార్కెట్లో 7000 ధర నిర్ణయించి తేమ పేరుతో పేరుతో 6000 కూడా కొనడంలేదని అవేదన వ్యక్తం చేశారు.రైతులు పత్తి విత్తనాలు ఎరువులు,పురుగు మందులు వ్యవసాయ కూలీ ధరలు అన్ని పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని తట్టుకొని మార్కెట్కు పత్తి తీసుకుంటే తీసుకుని వస్తే రైతులకు సరైన ధర లభించడం లేదని రైతులకు అండగా ఉండవలసిన కేంద్ర ప్రభుత్వం 7700 ధర ప్రకటించినప్పటికీ వ్యాపారస్తులు అమలు చేయడంలేదని ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవడంలేదని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కొరబోయిన కుమారస్వామి, జిల్లా నాయకులు కటుకూరి శ్రీనివాసరెడ్డి,కోడం రమేష్, కొంగర నరసింహస్వామి తదితరులు పాల్గొన్నారు.
పాడి రైతులు తమ పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకా వేయించాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. భూపాలపల్లి రూరల్ మండలం మోరంచపల్లి గ్రామంలో గ్రామపంచాయతీ ఆవరణలో శుక్రవారం పశువైద్య, పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గాలికుంటు వ్యాధి నివారణ టీకాల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యజమానులు తమ పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకా తప్పనిసరిగా వేయించాలని సూచించారు. పాడి రైతుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కార్యక్రమం నిర్వహిస్తున్నాయని చెప్పా రు. ఈ సంవత్సరం అధిక వర్షాలు కురిసినందున పశువులు వ్యాధుల బారిన పడుతున్నాయని అన్నారు. ఈ సందర్భంగా యజమానులకు పశువులకు బలాన్ని అందించే మల్టీ మిక్స్ పౌడర్ ప్యాకెట్లను అందజేశారు. అనంతరం జాతీయ పశువ్యాధుల నివారణ కార్యక్రమంకు సంబందించి గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ కుమారస్వామి సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.