రైతులంటే అధికారులకు చిన్న చూపా.

రైతులంటే అధికారులకు చిన్న చూపా

* ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు బెల్లంపల్లి సురేష్

మహదేవపూర్ జూలై 23 (నేటి దాత్రి)
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలోని అగ్రికల్చర్ ఆఫీసులో చేయాల్సిన ఆన్లైన్ పనులు మీ సేవ లకు అప్పజెప్పి కమిషన్లు దొబ్బుతూ రైతులను అధికారులు చిన్నచూపు చూస్తున్నారని బుధవారం రోజున ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు బెల్లంపల్లి సురేష్ ఒక ప్రకటనలో అన్నారు. మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయడం తమకేం సంబంధం లేనట్టుగా అంత ఆన్లైన్ సెంటర్లో ఆన్లైన్ చేసుకోవాలని ఏ ఈ ఓ లు వ్యవహరిస్తున్నారని, రైతులకు సంబంధించిన ఫార్మర్ రిజిస్ట్రేషన్స్ మరియు ప్రభుత్వ పథకాల సేవలను గాలికి వదిలేస్తూ దర్జాగా ఉంటున్నారనీ, మండలంలో ఉన్నటువంటి ఏవో కనీస పర్యవేక్షణ చేయకుండా చూస్తూ ఉండడం గమనార్థమని, రైతులని ఇబ్బంది పెట్టే విధంగా ఉందని మండిపడ్డారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ల కోసం రైతుల నుండి మీసేవ, ఆన్లైన్ సెంటర్ లు డబ్బులు వసూలు చేస్తూ కమిషన్ రూపం లో ఏఈవోలకు పైసలు ముట్ట చెపుతున్నారని అన్నారు. రైతులకు సమస్య వస్తె పరిష్కారం కోసం చెప్పులు అరిగేలా తిరుగాల్సిందే కానీ పరిష్కారం కాదని, రైతుల దగ్గర డబ్బులు ఉంటే గాని వ్యవసాయ శాఖ కార్యాలయానికి రాలేని పరిస్థితి నెలకొందని అన్నారు. అధికారుల నిర్లక్ష్యం తో గత్యంతరం లేక రైతులు పైసలు పెట్టి ఫార్మర్ రిజిస్ట్రేషన్ ను మీసేవ, ఆన్లైన్ సెంటర్ లలో చేసుకుంటున్నారని అన్నారు.

మామిడి రైతులకు బిగ్ రిలీఫ్..

మామిడి రైతులకు బిగ్ రిలీఫ్

ఆంధ్రా తోటపురి మామిడి రైతులకు పెద్ద ఉపశమనం లభించింది. 2025–26 సంవత్సరానికి MIS కింద ధరల లోపం చెల్లింపు (PDP)ను కేంద్రం ఆమోదించించింది. కేంద్రం నిర్ణయంతో ఏపీలో 1.62 లక్షల మెట్రిక్ టన్నుల మామిడి కొనుగోలుకు అవకాశం లభించినట్లైంది. మామిడి రైతులకు క్వింటాల్‌కు రూ.1,490.73లు చెల్లించనున్నారు.

ఆంధ్రా తోటపురి మామిడి రైతులకు పెద్ద ఉపశమనం లభించింది. 2025–26 సంవత్సరానికి MIS కింద ధరల లోపం చెల్లింపు (PDP)ను కేంద్రం ఆమోదించించింది. కేంద్రం నిర్ణయంతో ఏపీలో 1.62 లక్షల మెట్రిక్ టన్నుల మామిడి కొనుగోలుకు అవకాశం లభించినట్లైంది. మామిడి రైతులకు క్వింటాల్‌కు రూ.1,490.73లు చెల్లించనున్నారు. 50:50 నిష్పత్తితో కేంద్రం, ఏపీ ప్రభుత్వం ఈ మద్దతు ధర చెల్లించనున్నాయి. ఈ మేరకు.. ప్రధాని నరేంద్ర మోదీ, వ్యవసాయ శాఖా మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ధన్యవాదాలు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ ఈ చర్య ధరల పతనాల నుండి రైతులను కాపాడటానికి అవకాశం లభించిందన్నారు. ఈ చర్య న్యాయమైన రాబడిని నిర్ధారిచండంతో పాటూ గ్రామీణ జీవనోపాధిని బలోపేతం చేస్తుందని కేంద్ర మంత్రి పెమ్మసాని నేర్కొన్నారు.

మామిడి రైతులను ఆదుకోవడానికి సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. చంద్రబాబు చొరవతో చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో తోతాపురి మామిడి రైతులకు మద్దతుగా ట్రేడర్లు ముందుకొచ్చారు. అదేవిధంగా పలు ప్రాసెసింగ్ యూనిట్లు కూడా రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకున్నాయి. తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ కానుంది. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

వాణిజ్య పంటల వైపురైతులు మొగ్గు చూపాలి.

వాణిజ్య పంటల వైపురైతులు మొగ్గు చూపాలి.

#రాయితీ డ్రిప్, మల్చింగ్ ను రైతులు సద్వినియోగం చేసుకోవాలి.

#జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ.

నల్లబెల్లి , నేటి ధాత్రి:

మండల వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఏరువాక సాగుబడి అవగాహన సదస్సు కార్యక్రమం మండలంలోని రాంపూర్ రైతు వేదికలో శనివారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, ఏరువాక శాస్త్రవేత్త విజయభాస్కర్ , ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాసరావు హాజరై రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ వరి పంటలో సూడోమోనాస్ ట్రైకోడెర్మా ఉపయోగం గురించి రైతులకి వివరించారు అలాగే పత్తి వరి మొక్కజొన్న మిరప పంటలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎరువుల వాడకం పురుగుమందుల వాడకం నారుమడి సస్యరక్షణ గురించి వివరించారు మారిన కాలానికి అనుగుణంగా పంట మార్పిడి పద్ధతులు చేపట్టాలని పాత పద్ధతులకి అనుగుణంగా రైతులు మారాలని కూరగాయలు పండ్ల ఆయిల్ ఫామ్ పంటల వైపు మొగ్గుచూపి రైతులు ఆర్థికంగా ఎదగాలని కోరారు ఆయిల్ ఫామ్ పంట ఒకసారి నాటితే 30 ఏళ్ల వరకు దిగుబడి వస్తుందని ఎకరానికి లక్ష నుండి లక్ష యాభై వేల నికర ఆదాయం వస్తుందని చీడపీడల బాధలు ఉండవని ప్రభుత్వమే రేటు నిర్ణయిస్తుంది కాబట్టి డిమాండ్ ఉన్న పంటల వైపు రైతులు మొగ్గు చూపాలని పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ కింద డ్రిప్ సౌకర్యం 90 శాతం వరకు అలాగే మల్చింగ్ రాయితీ 50 శాతం వరకు ఉంది. హెక్టార్ కి 20,000 సబ్సిడీ ఉంది కావున రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పలువురు రైతులకు వారు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రజిత , ఉద్యానవన శాఖ అధికారి జ్యోతి ,వ్యవసాయ విస్తరణ అధికారి మహేందర్ ,రైతులు పెరుమాండ్ల బాబు, పొనుగోటి దేవన్న ,పోలేపల్లి నరసింహారెడ్డి, బచ్చు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

పొంగిన వాగులు.. మునిగిన పొలాలు….

పొంగిన వాగులు.. మునిగిన పొలాలు….

జహీరాబాద్ నేటి ధాత్రి:

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-34.wav?_=1

వరుణుడి జాడ కోసం ఎదురుచూస్తున్న అన్నదాతలకు జహీరాబాద్ నియోజకవర్గం పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పటికే చాలా చోట్ల రైతులు పత్తి, సోయాబీన్, పంటల విత్తనాలను వేశారు.రైతులు వర్షం కోసం ఎదురు చూస్తుండగా శుక్రవారం కురిసిన వర్షం ప్రాణం పోసింది.

Farmers

జహీరాబాద్:-

వారం రోజులుగా విపరీత మైన ఉష్ణోగ్రతలు నమోదైన వేళ వరుణదేవుడు కరుణించడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. మండలంలో శుక్రవారం మధ్యాహ్నం నుంచి వర్షం భారీగా కురవడంతో రైతన్నల్లో ఆనందం వెల్లువెరిసింది. ఖరీఫ్లో పంటల సాగుకు అనుకూలంగా వర్షం కురిసిందని, పొలాలను దుక్కి చేసుకోవ డానికి అవకాశం ఏర్పడిందని రైతులు పేర్కొన్నారు. ఈ వేసివిలో భూగర్భ జలాలు అడుగంటి చాలా బోరుబావుల నుంచి నీరు రావడంలేదు. ఇప్పుడు కురుస్తున్న వర్షాలతో బోరుబావులు రీచార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని రైతులు అంటున్నారు. ఏది ఏమైనా ఖరీఫ్ ప్రారంభంలో వరుణ దేవుడు కరుణించడంతో రైతుల్లో సంతోషం కనిపిస్తోంది.

ఝరాసంగం:-

ఝరాసంగం మండలంలో శుక్రవారం సాయంత్రం
ఓ మోస్తరు వర్షం కురిసింది. ఓ వైపు ఎండ కొడుతుండగానే ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. రోజంతా తీవ్రమైన ఎండ,ఉక్కపోతతో ఇబ్బందులు పడ్డ ప్రజలు సాయంత్రం చల్లని ఈదురుగాలులతో ఉపశమనం పొందారు.

కోహిర్:-

మండలంలోని ఆయా గ్రామాల్లో
మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురిసింది. పది రోజులుగా వర్షాల జాడ లేక విత్తనాలు వేసిన రైతులు ఆందోళన చెందారు. ఈ క్రమంలో వర్షం కురవడంతో విత్తనానికి, ప్రాణం పోసిందన్నారు.

న్యాల్కల్:-

మండలంలోని ఆయా గ్రామాల్లో
మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురిసింది. పది రోజులుగా వర్షాల జాడ లేక విత్తనాలు వేసిన రైతులు ఆందోళన చెందారు. ఈ క్రమంలో వర్షం కురవడంతో విత్తనానికి, మొలకలకు జీవం పోసినట్లయింది. ఆశించిన స్థాయిలో వర్షం కురవడంతో పలు గ్రామాల్లో రైతులు పత్తి విత్తనాలు మొలకలను ఇంటిల్లిపాదిగా పొలం బాట పట్టారు.

మొగుడంపల్లి:-

మండల వాసులు శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షంతో ఉపశమనం పొందారు. దాదాపు 7 గంటలకు పైగా 90 మి.మీ. వర్షం కురవడంతో ఖరీఫ్ పనులు ఊపందుకున్నాయి. వారం రోజుల నుంచి పత్తి విత్తనాలు విత్తుకున్న రైతులు ఈ వానతో ఊపిరి పీల్చుకున్నారు.

రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన..

రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన వ్యవసాయ శాఖ అధికారులు

రామడుగు, నేటిధాత్రి:

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-31.wav?_=2

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ గ్రామంలో ఎన్ఎమ్ఎన్ఎఫ్ పథకంలో భాగంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చొప్పదండి డివిజన్ ఏడిఏ ప్రియదర్శిని హాజరై రైతులకు సేంద్రియ సాగు గురించి సలహాలు సూచనలు తెలియజేశారు. ఆయిల్ ఫాం పంట సాగులో మెలకువలతో పాటు పంట సాగుకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాల గురించి హార్టికల్చర్ ఆఫీసర్ రోహిత్ రైతులకు వివరించారు. ఈకార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి త్రివేదిక, వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

రైతులందరికీ సకాలంలో యూరియా కొరత లేకుండా అందజేయాలి.

రైతులందరికీ సకాలంలో యూరియా కొరత లేకుండా అందజేయాలి

సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ

గుండాల(భద్రాద్రికొత్తగూ డెం జిల్లా),నేటిధాత్రి:

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-13.wav?_=3

రైతులందరికీ సకాలంలో యూరియా కొరత లేకుండా అందించాలని గురువారం గుండాల తహసిల్దార్ రంగు రమేష్ కు వినతి పత్రం ఇచ్చి ప్రాథమిక సహకార పరపతి సంఘం(పిఎసిఎస్)ముందు సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ (ఎంఎల్)న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు గుండాల మాజీ సర్పంచ్ కొమరం సీతారాములు మాట్లాడుతూ వేల రూపాయలు పెట్టి పంటలు వేస్తే ఆ పంటలకు మందులు వేయాలంటే యూరియా కొరత తీవ్రంగా ఉందని జిల్లా వ్యవసాయ శాఖఅధికారులు స్పందించి యూరియా కొరత లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. రోజుల తరబడి ప్రాథమిక సహకార పరపతి సంఘం (పిఎసిఎస్) ముందు క్యూలో నిలబడాల్సి వస్తుందని అయినా యూరియా దొరకడం లేదని వాపోయారు.ఉమ్మడి జిల్లాలో వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నప్పటికీ రైతులకు యూరియా అందించటంలో పూర్తిగావిఫలమయ్యారని అన్నారు.ఇప్పటికైనా జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు స్పందించి యూరియా కొరత తీర్చకుంటే త్వరలో జిల్లా కలెక్టరేట్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు.ఈకార్యక్రమంలో న్యూ డెమోక్రసీ నాయకులు యాసారపు వెంకన్న, పర్శక రవి,ఈసం కృష్ణన్న, మానాల ఉపేందర్, వాగబోయిన సుందర్ రావు, ఈసం మల్లయ్య, రైతులు పాల్గొన్నారు.

సహకార సంఘాలు రైతులకు మేలు.

సహకార సంఘాలు రైతులకు మేలు”

బాలానగర్/ నేటి ధాత్రి

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలో మండల సహకార కేంద్రంలో బుధవారం అంతర్జాతీయ సహకార దినోత్సవం -2025 ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సింగిల్ విండో డీసీఎంఎస్ చైర్మన్ పట్ల ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేద రైతులు సహకార సంఘాలలో రుణాన్ని తీసుకొని ఉజ్వల భవిష్యత్తును పెంపొందించుకున్నారని, పేదల సంక్షేమానికి సహకార సంఘాలు కృషి చేస్తున్నయన్నారు. మధ్యతరగతి కుటుంబాల అభివృద్ధికి సహకార సంఘాలు సహకరిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘాల సభ్యులు పలువురు రైతులు పాల్గొన్నారు.

రైతు బజార్ ను వినియోగించుకోవాలి

రైతు బజార్ ను వినియోగించుకోవాలి

జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం

కలెక్టర్ ఆదేశాలతో కూరగాయల వ్యాపారులకు షెడ్ల నిర్మాణం

కూరగాయలు, మాంసం, చేపల షాపులు తరలింపు

సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)

సిరిసిల్ల పట్టణంలోని బతుకమ్మ ఘాట్ రైతు బజార్ ను కూరగాయలు, మాంసం, చేపల విక్రయదారులు వినియోగించు కోవాలని బుధవారం జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం ఒక ప్రకటనలో తెలిపారు.జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కూరగాయల వ్యాపారులను బతుకమ్మ ఘాట్ రైతు బజార్ లోకి తరలించేందుకు అవసరమైన షెడ్ల నిర్మాణం చేస్తున్నామని, అదేవిధంగా ఈ రైతు బజార్ లోకి మటన్ షాపులు, మాంసం షాప్ లు, చేపల విక్రయం షాపులు సైతం తరలించాలని, ఎవరు కూడా రోడ్డు పక్కన అమ్మకూడదని అన్నారు.బతుకమ్మ ఘాట్ రైతు బజార్ ను జిల్లాలోని వినియోగదారులు, ప్రజలు ఈ విషయాన్ని గమనించి వాడుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి ఈ ప్రకటనలో పేర్కొన్నారు.

లాభాల బాటలో.. ఉద్యాన పంటలు……!

లాభాల బాటలో.. ఉద్యాన పంటలు……!

లాభాల బాటలో.. ఉద్యాన పంటలు ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు మెండుగా ప్రభుత్వ ప్రోత్సాహకాలు తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి.

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం: ఆరుగాలం కష్టపడి పంటలు పండించే రైతన్నలకు తరచుగా ఏదో ఒక రూపంలో నష్టం వస్తోంది. పంటలకు సరిపడా వర్షాలు కురవకపోయినా, పంట చేతికొచ్చే సమయంలో అధిక వర్షాలు కురిసిన రైతులు నష్ట పోతారు. ఈ పరిస్థితుల్లో, ఉద్యానవన శాఖ ఆధి కారులు ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు మల్లెల రైతులను ప్రోత్సహిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా ఝురాసంగం మండలంలోని వివిధ గ్రామాల రైతులు ఈ కొత్త మార్గాన్ని ఎంచుకుంటున్నారు.
బర్దిపూర్, ఏల్గోయ్, కుప్పా నగర్, పొట్టిపల్లి, జీర్లపల్లి, చిలేపల్లి, వసంపల్లి, ఝరాసంగం, సంగం (కే), ఏడాకులపల్లి, గుంత మర్పల్లి, బోరేగావ్, అనంతసాగర్, గినియార్ పల్లి, కృష్ణాపూర్, చిల్మేప ల్లి, మాచ్నూర్ తదితర గ్రామాల రైతులు ఉద్యానవన పంటల సాగుకు మొగ్గు చూపుతూ లాభాల బాట పడుతున్నారు. వివిధ గ్రామాల రైతులు కూరగాయలు, పండ్ల, పూల తోటలు, సుగంధ ద్రవ్యాలు, ఔషధ పంటలు పండిస్తూ లాభాల బాటలో పయని స్తున్నారు.

 

 

 

 

పూలతోటల సాగు వైపు..

బద్దిపూర్ గ్రామానికి చెందిన కోట ఆశన్న, కుమ్మరి వేణు, మహమ్మద్ షేర్, న్యాలకంటి సుధాకర్, వడ్డ సంగమేశ్వర్లు లిల్లీ, గులాబి, బంతి, పూల తోటలను సాగు చేస్తున్నారు. తక్కువ పెట్టుఐ డితో 6 నెలల లోపే పంట చేతికొచ్చి మార్కెట్ కు తరలిస్తు న్నారు. ప్రతిరోజు 2నుంచి3 వేల రూపాయల ఆదాయం వస్తుంది పువ్వులను సమీపంలోని జహీరాబాద్. మార్కెట్కు లేదా ఎక్కువ మొత్తం పూలు లేదా హైదరాబాద్ను తరలిస్తు న్నారు.

 

 

ఫామాయిల్ సాగు వైపు అడుగులు..

కుప్పా నగర్, కు చెందిన బి. చంద్రమ్మ, మల్లికార్జున్ పాటిల్, పండరినాథ్, సంగన్న లతో పాటు ఇతర గ్రామాల్లో సైతం పామాయిల్ సాగు చేస్తున్నారు. ప్రస్తుతం పంటసాగు రెండు సంవత్సరాలు కావొస్తుం ది మరో రెండు సంవత్సరాలుపంట చేతికొచ్చే అవకా శం ఉంది. వీరికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి 90శాతం సబ్సిడీ కింద మొక్కలను పంపిణీ చేస్తున్నారు. ఏటా ఎకరానికి రూ.4200 చొప్పున 4 సంవత్సరాల వరకు సాగు ప్రోత్సాహకాలు అంద జేస్తారు. నాలుగేళ్ల తర్వాత పంట 35 సంవత్సరాల వరకు 10 నుంచి 12 టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. జిల్లావ్యాప్తంగా 1225 ఎకరా లలో సాగు చేస్తున్నారు.

 

 

 

కూరగాయల సాగు వైపు రైతు..

మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు వాణిజ్య పంటలతో పాటు తక్కువగా వ్యవధిలో చేతికొచ్చే కూరగాయల పంట సాగు వైపు రైతులు అడుగులు వేస్తున్నారు. బర్దిపూర్ కు చెందిన వద్ద సంగమేశ్వర్, కుప్ప నగర్ కు చెందిన ముల్ల చాందు, గొల్ల యాదప్ప, రాములు, భీమన్న, గైబు, ఎల్లోయి, ఝరాసంగం, సంగం (కే), గుంత మరిపల్లి, ఈదులపల్లి, కక్కెర వాడ, బొప్పనపల్లి, నర్సాపూర్, మేడపల్లి తదితర టమాట, బెండ, వంకాయ, చిక్కుడుకాయ, బీర, పాలకూర తదితర కూరగాయలను సాగు చేస్తూ లాభాల బాటలో పయ నిస్తున్నారు.

యూరియా కోసం బారులు తీరిన రైతులు.

యూరియా కోసం బారులు తీరిన రైతులు.

#పూర్తిగా కాలం కాకముందే కరువైన యూరియా.

#కృత్రిమ కొరతను సృష్టిస్తున్న డీలర్లు.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

పూర్తిగా కాలం కాకముందే యూరియా బస్తాలు కరువైనాయని మండల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ఎదుట యూరియా బస్తాల కోసం రైతులు భారీ ఎత్తున బారులు తీరారు. ఆదివారం రోజున సహకార సంఘానికి 850 బస్తాల యూరియా దిగుమతి కాగా విషయము తెలుసుకున్న మండల రైతులు సోమవారం ఉదయాన్నే కార్యాలయం వద్దకు చేరుకొని యూరియా బస్తాల కోసం క్యూ లైన్ లో నిలబడ్డారు. బస్తాలు పంపిణీ చేసే సందర్భంగా ఒక్కసారిగా రైతులందరూ తోచుకుంటూ రావడంతో తొక్కిసలాట జరగగా దీంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొనగా కార్యాలయ సిబ్బంది పంపిణీ కార్యక్రమం నిలిపివేశారు దీంతో రైతులు ఆగ్రహంతో సిబ్బందితో వాగ్వాదానికి దిగగా.

 

సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో తక్షణమే పోలీస్ సిబ్బంది సెంటర్ వద్దకు చేరుకొని రైతులను సముదాయించి యూరియా బస్తాల పంపిణీ సక్రమంగా జరిగే విధంగా చూశారు. ఇదిలా ఉంటే ఒకపక్క వ్యవసాయ అధికారులు మండల రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని చెబుతున్న కూడా అది ఆచరణలో ఎక్కడ లేకుండా పోయిందని పలువురు రైతులు బాహాటంగానే అంటున్నారు. గత ప్రభుత్వంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతులకు సరిపడా యూరియా బస్తాలు ఉండేవని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత యూరియా బస్తాల కరువు మొదలైందని చిన్న తండకు చెందిన మహిళ రైతు అజ్మీర విజయ ఆవేదన వ్యక్తం చేశారు.

 

 

 

అలాగే ప్రైవేటు డీలర్లు సైతం యూరియా బస్తాలు నిలువ ఉంచుకొని లింకుల పేరుతో రైతుకు అవసరం లేని మందులను కొంటేనే యూరియా బస్తా ఇవ్వడం జరుగుతుందని కరాకండిగా డీలర్లు చెబుతున్నారని మండల రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత జిల్లా వ్యవసాయ అధికారులు తక్షణమే స్పందించి మండల రైతులకు ఖరీఫ్ సీజన్ కు సరిపడా యూరియా బస్తాలను సహకార సంఘాల , రైతు ఆగ్రోస్ ల ద్వారా పంపిణీ చేస్తేనే రైతుకు మేలు జరుగుతుందని రైతులు అన్నారు.

9 న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం.!

9 న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయండి..

*కార్మికులు, కర్షకులను కార్పొరేట్లకు బానిసలను చేసే విధానాలను వ్యతిరేకించండి..

*ఐఎఫ్ టీయు రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాయపనేని హరికృష్ణ పిలుపు..

తిరుపతి(నేటి ధాత్రి) జూలై 07:

జూలై 9న దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఐఎఫ్ టీయు రాష్ట్ర ఉపాధ్యక్షులు రాయపనేని హరికృష్ణ పిలుపునిచ్చారు. సోమవారం నారాయణపురం లోని ఐఎఫ్టీయు కార్యాలయంలో సమ్మె గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈసందర్భంగా రాయపనేని హరికృష్ణ మాట్లాడుతూ రైతు, కార్మిక వ్యతిరేఖవిధానాలతో కేంద్రంలోని బాజాపా ప్రభుత్వం అణచివేత ధోరణి అవలంభిస్తోందన్నారు. నాలుగు లేబర్ కోర్టులను రద్దు చేయాలని, నూతన వ్యవసాయమార్కెటింగ్ చట్టాన్ని ఉపసంహరించాలని,కనీస వేతనం 26వేల రూపాయలు ఇవ్వాలని తదితర డిమాండ్లతో కార్మిక, ఉద్యోగ, రైతులు చేపట్టిన సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయడం జరుగుతోందని చెప్పారు. సమ్మె ద్వారా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అఖిలభారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామిశెట్టి వెంకయ్య మాట్లాడుతూ దేశ సంపదను కార్పొరేట్, పెట్టుబడిదారులకు రైతులను, కార్మికులను బానిసలుగా చేసే దుర్మార్గపు చర్యలకు కేంద్ర పాల్పడుతోందని దీనికి వ్యతిరేకంగా జరిగే సమ్మెలో రైతులు భాగస్వామ్యం కావాలని కోరారు. ఐఎఫ్టీయు నగర కన్వీనర్ లోకేష్ మాట్లాడుతూ 9వ తేదీ ఉదయం 9.30 గంటలకు అంబెడ్కర్ విగ్రహం వద్ద నుంచి ఐ ఎఫ్
టి యూ, సి ఐటి యూ,
ఏ ఐ టి యూ
సి, ఆధ్వర్యంలో జరుగుతున్న ర్యాలీలో కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏఐకే ఎం ఎస్ జిల్లా గౌరవాధ్యక్షులు పి. వెంకటరత్నం, పీ ఓడబ్ల్యు జిల్లా కన్వినర్ అరుణ, అంగన్ వాడీ వర్కర్స్ ఫెడరేషన్ నగర అధ్యక్షురాలు సుజాత, నాయకురాలు గంగాదేవి తదితరులు పాల్గొన్నారు..

ఆకాశం వైపు.. రైతన్న చూపు

ఆకాశం వైపు.. రైతన్న చూపు

వెల్దండ /నేటి ధాత్రి

గత కొన్ని రోజులుగా వర్షాలు పడకపోవడంతో నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలో పంటలు ఎండిపోతున్నాయి. మొక్కజొన్న, పత్తి సాగు చేసిన రైతులు మొక్కలకు నీరు లేకపోవడంతో ఎండిపోతున్నాయి. గత వారం రోజులుగా వర్షం కురవకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో వర్షం ఎప్పుడు కురుస్తుందా..! అంటూ ఆకాశం వైపు రైతన్నలు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఓసారి మొక్కజొన్న సాగు చేశామని తడి లేకపోవడంతో ఎండిపోయిందని.. రెండవసారి సాగు చేశామని ఇప్పుడు కూడా వర్షాలు పడకపోతే తమకు ఆర్థిక నష్టాలతో.. కన్నీళ్లే మిగులుతాయని రాచూరు గ్రామానికి చెందిన పలువురు రైతులన్నారు. వర్షాలు కురవాలని ఆశగా ఎదురుచూస్తున్నారు.

రైతులు ఫార్మసీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

రైతులు ఫార్మసీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

జహీరాబాద్ నేటి ధాత్రి:

పట్టా పాసు పుస్తకం ఉన్న రైతులు తప్పనిసరిగా ఫార్మసీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఝరాసంగం మండల వ్యవసాయ శాఖ అధికారి వెంకటేశం శుక్రవారం తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాల కోసం 11 నెంబర్ల విశిష్ట సంఖ్య ఉన్న ఫార్మసీ రిజిస్ట్రేషన్ మండల వ్యవసాయ శాఖ అధికారుల వద్ద చేసుకోవాలని చెప్పారు. పూర్తి వివరాలకు మండల వ్యవసాయ శాఖ అధికారులు సంప్రదించాలని సూచించారు. వ్యవసాయ విత్తనాల అధికారులను సంప్రదించగలరని కోరారు.

రైతులు ఫార్మసీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

రైతులు ఫార్మసీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

జహీరాబాద్ నేటి ధాత్రి:

పట్టా పాసు పుస్తకం ఉన్న రైతులు తప్పనిసరిగా ఫార్మసీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఝరాసంగం మండల వ్యవసాయ శాఖ అధికారి వెంకటేశం శుక్రవారం తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాల కోసం 11 నెంబర్ల విశిష్ట సంఖ్య ఉన్న ఫార్మసీ రిజిస్ట్రేషన్ మండల వ్యవసాయ శాఖ అధికారుల వద్ద చేసుకోవాలని చెప్పారు. పూర్తి వివరాలకు మండల వ్యవసాయ శాఖ అధికారులు సంప్రదించాలని సూచించారు. వ్యవసాయ విత్తనాల అధికారులను సంప్రదించగలరని కోరారు.

పంటల భీమా అమలు చేసి రైతును రక్షించాలి

పంటల భీమా అమలు చేసి రైతును రక్షించాలి

ఆర్డీవో కు వినతి పత్రం అందజేసిన వరికేల కిషన్ రావు

పరకాల నేటిధాత్రి

 

 

 

రైతుల రక్షణ కొరకు పంటల బీమా అమలు చేసి వారి భద్రతకు తోడ్పడాలని తెలంగాణ రైతు రక్షణ సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వరికేల కిషన్ రావు ప్రభుత్వాన్ని కోరారు.గురువారం రోజున రైతులతో కలిసి పరకాల ఆర్డిఓ కే. నారాయణ కు వినతి పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా కిషన్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఖరీఫ్ పంటల సీజన్ ప్రారంభమైన ఇంతవరకు పంటల బీమా అమలు లేక రైతులు తీవ్ర నష్టపోతున్నారని అన్నారు.ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోతే రైతులు అప్పులు తీర్చలేక,యజమానికి కౌలు చెల్లించలేక,తదుపరి పంటలకు పెట్టుబడి లేకుండా, కుటుంబ ఖర్చులకు నానా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.ఒకసారి పంట నష్టపోయిన రైతు తిరిగి స్థిర పడటానికి మూడు నాలుగు వంటకాలాల సమయం పడుతుందని,అలాంటి పరిస్థితుల్లో పంటల బీమా రైతుకు ఒక రక్షణ కవచంగా పనిచేస్తుందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పంట రుణమాఫీ,రైతు భరోసా పథకాలతో రైతులకు మంచి సంకేతాలు పంపిందని,అదే స్ఫూర్తితో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో చేరి పంటల బీమా పథకాన్ని అమలు చేసి రైతుల ఆత్మగౌరవాన్ని కాపాడాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు చౌల రామారావు,రవీందర్,రఘు,కానూరు వీరస్వామి,రైతులు పాల్గొన్నారు.

విత్తన స్వయం సమృద్ధి లక్ష్యంగా ముందుకు

విత్తన స్వయం సమృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం :

ఎమ్మెల్యే కాలే యాదయ్య

శంకరపల్లి, నేటిధాత్రి :

 

విత్తన స్వయం సమృద్ధే లక్ష్యంగా రైతులకు నాణ్యమైన విత్తనాల పంపిణీ చేస్తున్నట్లు చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. శంకర్ పల్లి పట్టణ కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జాతీయ ఆహార భద్రతా మిషన్ పథకం కింద రైతులకు ఉచితంగా కంది విత్తనాలు (మినీ కిట్స్ – చిరు సంచులు)ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించి, స్వయం సమృద్ధి సాధించే దిశగా ప్రభుత్వ చర్యలు తీసుకుంటుందన్నారు. నకిలీ విత్తనాల అమ్మకాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు.

చిట్యాల ఎస్సై పై ఎస్పీకి ఫిర్యా దు చేసిన రైతులు.

చిట్యాల ఎస్సై పై ఎస్పీకి ఫిర్యా దు చేసిన రైతులు

భూపాలపల్లి నేటిధాత్రి:

సమస్యలను పరిష్కరించాలని చిట్యాల పోలీస్ స్టేషన్ కు వెళ్ళితే ఎస్సై తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని చిట్యాల మండలానికి చెందిన రైతులు మంగళవారం జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు చేశారు.
చిట్యాల మండలం చింతకుంట రామయ్య పల్లి కి చెందిన అబ్బెంగుల రాజయ్య ,కైలాపూర్ కు చెందిన బూదారపు మార్కండేయ ,చల్లగరిగే కు చెందిన ఇంచర్ల లక్ష్మీ అనే ముగ్గురు రైతులు చిట్యాల ఎస్సై శ్రావణ్ కుమార్ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ మంగళవారం జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే కు ఫిర్యాదు చేశారు..అనంతరం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కాకతీయ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించిన ఇంచర్ల లక్ష్మి మార్కండేయ అనే రైతులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా భూమిని వేరే వాళ్ళు దున్నుకుంటున్నారు అని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే పట్టించుకోకుండా ఎస్సై తమని నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు…ఇప్పటికైనా ఉన్నతాధికారులు పట్టించుకోని తమ సమస్యలను పరిష్కరించాలని రైతులు జిల్లా ఎస్పీని కోరారు

వ్యవసాయ బావుల వద్ద రైతులు ఎదుర్కొంటున్న.

వ్యవసాయ బావుల వద్ద రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలపై గత ఆరు నెలల నుండి పొలం బాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని డిఈ బిక్షపతి అన్నారు.

వర్దన్నపేట (నేటిధాత్రి):

 

 

 

వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో వ్యవసాయ క్షేత్రాలలోని పలు ట్రాన్స్ఫార్మర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు రైతులకు పలు సూచనలు చేశారు. విద్యుత్ సరఫరా పైన ఎలాంటి సమస్యలున్న తమ దృష్టికి తీసుకురావాలని దీంతో వెంటనే సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. స్తంభాలు కుంగిపోవడం, ట్రాన్స్ఫార్మర్ మీద లోడు ఎక్కువగా ఉండడం లాంటి సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే తెలియజేయాలన్నారు. రైతులు ఎట్టి పరిస్థితుల్లో విద్యుత్ అధికారుల ప్రమేయం లేకుండా స్టార్టర్లను, వైర్లను, ట్రాన్స్ఫార్మర్లను, ఫీజులను ముట్టుకోరాదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏడిఈ నటరాజ్, ఏఈ తరుణ్, ఎస్ ఎల్ ఐ చంద్రమోహన్ రాజు, విద్యుత్ సిబ్బంది, రైతులు ఎల్లగౌడ్, వీరన్న తదితరులు పాల్గొన్నారు.

రైతుల సమస్యలను పరిష్కరించండి .

రైతుల సమస్యలను పరిష్కరించండి

— చేనేత పద్మ సమైక్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిలివేరు శ్రీకాంత్–

వీణవంక, ( కరీంనగర్ జిల్లా):నేటి ధాత్రి :

 

 

వీణవంక మండల కేంద్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన భూభారతి కార్యక్రమంలో భాగంగా రైతులు ఇచ్చిన దరఖాస్తులను పరిశీలించి వారి సమస్యలు పరిష్కరించాలని చేనేత పద్మ సమైక్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిలివేరు శ్రీకాంత్ వీణవంక మండల తహసిల్దార్ అంబటి రజితను కోరారు. గురువారం రోజున తహసిల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ గారికి పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మండల వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను తహసిల్దార్ దృష్టికి తీసుకెళ్లగా, ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నియమ నిబంధనలు పాటిస్తూ రైతుల సమస్యలను పరిష్కరిస్తారని హామీ ఇచ్చినట్లు శ్రీకాంత్ పేర్కొన్నారు. వారి వెంట సగర సంఘం జిల్లా అధ్యక్షుడు దేవునూరు శ్రీనివాస్ ఉన్నారు.

రైతులు దళారులను నమ్మి మోసపోకండి.

రైతులు దళారులను నమ్మి మోసపోకండి.

భూభారతి దరఖాస్తులను పరిశీలించి అర్హులకు న్యాయం చేస్తాం..

తహసిల్దార్ ఇమామ్ బాబా.

చిట్యాల నేటిధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల తహసిల్దార్ ఇమామ్ బాబా షేక్ బుదవారం రోజున నేటిదాత్రి ప్రతినిధితో మాట్లాడుతూ చిట్యాల మండలంలోని 16 రెవెన్యూ గ్రామాలలో ఈనెల 3 తారీఖు నుండి 20వ తారీకు వరకు రెవిన్య సదస్సులు నిర్వహించడం జరిగిందని ఈ రెవెన్యూ గ్రామంలోని రైతులు తమ భూములకు సంబంధించిన సమస్యలను దరఖాస్తు రూపంలో వారి ఊరిలో జరిగిన రెవెన్యూ సదస్సులో రెవెన్యూ అధికారులకు ఇవ్వడం జరిగింది, వాటిని క్షుణ్ణంగా పరిశీలించి సర్వే చేసి అర్హులైన ప్రతి రైతుకు న్యాయం చేస్తామని అన్నారు, అలాగే కొందరు దళారులు భూములను పట్టా చేయిస్తామని నమ్మబలుకుతున్నారని తమ దృష్టికి వచ్చింది అని వారిని నమ్మి మోసపోవద్దని ఏదైనా భూమికి సంబంధించిన సమస్యలు ఉంటే తహసిల్దార్ కార్యాలయంలో నేరుగా నన్ను సంప్రదించి మీ సమస్యలను పరిష్కరించుకోవాలని కోరినారు, అలాగే ఇప్పటివరకు జరిగిన రెవెన్యూ సదస్సులలో 16 గ్రామాల నుండి దాదాపు 5570 దరఖాస్తులు రావడం జరిగిందని ఇప్పటివరకు దాదాపు 5వేల దరఖాస్తులను స్కాన్ చేసి ఆన్లైన్ చేశామని ఆగస్టు 15 లోపు దరఖాస్తులను గ్రామాల వారీగా పరిశీలించి అర్హులైన ప్రతి రైతుకు పట్టా చేయడం జరుగుతుందని అలాగే భూభారతి అనేది నిరంతర ప్రక్రియని అని స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో ఒక హెల్ప్ డిస్క్ ఏర్పాటు చేయడం జరిగిందని మండలంలో ఇంకా భూభారతిలో ఇవ్వని రైతులు నేరుగా తహసిల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డిస్క్ లో దరఖాస్తు లు ఇవ్వాలని తెలిపారు ,అలాగే ఇప్పటివరకు 16 రెవెన్యూ గ్రామాలలో వచ్చిన దరఖాస్తుల వివరాలు ఈ విధంగా ఉన్నవి, చైన్ పాక గ్రామ సభలో 156 హెల్ప్ డెస్క్ లో 170, చల్లగరిగె గ్రామ సభలో 126 హెల్ప్ డెస్క్ లో 153, చిట్యాల గ్రామ సభలో 126 హెల్ప్ డెస్క్ లో 195, దూత్ పల్లి గ్రామ సభలో 109 హెల్ప్ డెస్క్ లో 90, గిద్ద ముత్తారం గ్రామసభలో 99 హెల్ప్ డెస్క్ లో 79, గోపాలపూర్ గ్రామసభలో 176 హెల్ప్ డెస్క్ లో 65, జడల్ పేట గ్రామసభలో 264 హెల్ప్ డెస్క్ లో 200, జూకల్ గ్రామసభలో 269 హెల్ప్ డెస్క్ లో 147 ,కైలాపూర్ గ్రామసభలో 126 హెల్ప్ డెస్క్ ల 64, కాలువ పళ్లి గ్రామసభలో 40 హెల్ప్ డెస్క్ లో 19, ముచిని పర్తి గ్రామసభలో 250 హెల్ప్ డెస్క్ లో 86, నవాబుపేట గ్రామసభలో 350 హెల్ప్ డెస్క్ లో 182,నైన్ పాక గ్రామసభలో 787 హెల్ప్ డెస్క్ లో 159, తిరుమలపూర్ గ్రామసభలో 189 హెల్ప్ డెస్క్ లో 35, వెంచరామీ గ్రామసభలో 42 హెల్ప్ డెస్క్ లో 35, ఒడితల గ్రామసభలో 417,ఈఈ గ్రామాలలో ఇప్పటివరకు వచ్చినదరఖాస్తులు, గ్రామ సభలలో ఇచ్చిన ప్రతి దరఖాస్తుకు ఒక అప్లికేషన్ నెంబర్ ఇచ్చామని దాని ద్వారా దరఖాస్తుదారులు వారి స్టేటస్ ను పరిశీలించుకోవచ్చని తెలిపారు, అలాగే ప్రభుత్వం దరఖాస్తులను మూడు కేటగిరీలుగా విభజించి పరిశీలించి అర్హులైన వాళ్లకు పట్టాలు జారీ చేయడం జరుగుతుందని అన్నారు మొదటిది ,2014 కన్నా ముందు రైతులు భూములు కొనుగోలు చేసి 2018 లో సాదా బైనమకింద ఆన్లైన్ చేసిన రైతులకు సంబంధించిన దరఖాస్తుల పరిశీలించడం, రెండవది 2014 తర్వాత కొనుగోలు చేసిన భూములను సాదా బైనమ కింద ఆన్లైన్ చేయని దరఖాస్తులను పరిశీలించడం, మూడవది ప్రభుత్వ భూములను నిరుపేద రైతులు సాగు చేసుకుంటున్నా భూములను పరిశీలించి ప్రభుత్వం అసైన్ కమిటీలను వేసిన తర్వాత వాటి దరఖాస్తులనుకూడా పరిశీలించడం జరుగుతుందని అన్నారు, అలాగే ప్రభుత్వ భూములను అమ్మిన కొన్న నేరమని దళాల నమ్మి మోసపోవద్దని అన్నారు. అలాగే ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి రైతులకు ఒక వరం లాంటిదని కాబట్టి ఈ కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరినారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version