సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంగం మండలంలో తుమ్మనపల్లి గ్రామ, బిఆర్ఎస్ పార్టీ యువనేత షేక్ సోహెల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. గ్రామాభివృద్ధి కోసం యువత తమ చదువు, విజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలని, స్వార్థపరుల పాలనలో గ్రామాలు నాశనం కాకుండా చూడాలని సూచించారు. రోజుకు రెండు మూడు గంటలు గ్రామాల అభివృద్ధికి కేటాయించి, ప్రజలను చైతన్యపరిచి అభివృద్ధి వైపు అడుగులు వేయాలని సిద్ధయ్య పిలుపునిచ్చారు. గెలిస్తే చరిత్ర, ఓడితే అనుభవం అని ఆయన అన్నారు.
లక్ష్యం సర్పంచ్ అవ్వడం కాదు — ఊరి భవిష్యత్తు మార్చడం..
నేటి ధాత్రి కథలాపూర్
కౌన్సిల్ ఫర్ సిటిజెన్ రైట్స్ (పౌర మరియు మానవ హక్కుల సంస్థ రాష్ట్ర కార్యదర్శి తాలూకా మల్లేష్ మాట్లాడుతూ.
సర్పంచ్ అవ్వడం అంటే లంచాలు తీసుకోవడం కాదు, సర్పంచ్ అవ్వడం అంటే ఊరి సమస్యలు పరిష్కరించడం.
సర్పంచ్ అవ్వడం అంటే ప్రజల్లో గొడవలు పెట్టి లాభం పొందడం కాదు ,. అది ఊరిని కలిపి అభివృద్ధి దిశగా నడిపించడం * .
మంచి పాఠశాలలు కట్టించడం హాస్పిటల్ నిర్మించడం ప్రతి కుటుంబానికి ఇల్లు తెప్పించడం ప్రతి ఇంటికి తాగునీరు, కొళాయిలు ఏర్పాటు చేయడం ప్రజలకు కష్టసమయంలో అండగా నిలవడం — ఇదే నిజమైన సర్పంచ్ ధర్మం!
—
సర్పంచ్ అవ్వాలని కాదు — సేవ చేయాలని ఆలోచించాలి! ప్రతి పనికి డబ్బు ఆశించే వారు ఊరిని ఎప్పుడూ అభివృద్ధి చేయలేరు.
*ఎలక్షన్ టైంలో సానుభూతి మాటలు, ప్రమాణాలు, కన్నీటి నాటకం చూపించే వారు, ఊరి అభివృద్ధి కాదు — తమ స్వార్థాన్ని మాత్రమే కాపాడుతారు.*
—
యువత ముందుకు రావాలి! స్వచ్ఛతతో, సేవా భావంతో, నిజాయితీతో ఉన్న యువతను సర్పంచ్గా ఎన్నుకుంటే గ్రామం మారుతుంది!
లంచం లేని పాలన — యువతతోనే సాధ్యం!
> “ గ్రామం కోసం యువత — యువత కోసం గ్రామం”
—
అవినీతి అలవాటు పడ్డ వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ సర్పంచ్గా ఎన్నుకోవద్దు! అటువంటి వారిని సపోర్ట్ చేసే వాళ్లను కూడా నమ్మకండి. వారి మాయమాటలకు మోసపోవద్దు — అటువంటి వ్యక్తుల చేత గ్రామ భవిష్యత్తు నాశనం అవుతుంది.
—
యువతనే ఆశ, యువతనే మార్పు! యువతను గెలిపిద్దాం — మన ఊరి భవిష్యత్తును వెలిగిద్దాం!
ప్రయాణానికి ప్రమాదకరంగా మారే పొదలను కత్తిరించిన ఫిర్దౌస్
◆:- బిఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు మొహమ్మద్ ఫిర్దౌస్,
జహీరాబాద్ నేటి ధాత్రి:
కోహిర్ సామాజిక కార్యకర్త బిఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు మొహమ్మద్ ఫిర్దౌస్, కావేలి చౌరాహా నుండి కోహిర్ వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్ల కొమ్మలు గడ్డిని జెసిబి సహాయంతో నరికివేశారు. ఇటీవలి వర్షాకాలంలో కావేలి చౌరాహా నుండి కోహిర్ రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్ల కొమ్మలు తరచుగా పెద్ద సరుకు రవాణా ట్రక్కులను నారింజ బ్రిడ్జి మోర్ వద్ద రోడ్డు పక్కన పెరిగిన ఢీకొట్టడం వల్ల తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని స్పష్టంగా కనిపించింది. ఈ సందర్భంలో, ముహమ్మద్ ఫిర్దౌస్ భవనాలు వీధుల శాఖ అధికారులకు సంబంధిత చెట్ల కొమ్మలు గడ్డిని నరికివేయాలని తెలియజేశారు, దానిపై భవనాలు వీధుల శాఖ అధికారులు ముహమ్మద్ ఫిర్దౌస్ ఈ పనిని నిర్వహించడానికి అనుమతించారు, దీనిపై ముహమ్మద్ ఫిర్దౌస్ తన సొంత ఖర్చుతో ఈ పనిని నిర్వహించారు. ముహమ్మద్ ఫిర్దౌస్ యొక్క ఈ చొరవను ప్రజలు, ముఖ్యంగా ప్రయాణికులు అభినందిస్తున్నారు.
మెట్ పల్లి సాయి శ్రీనివాస హాస్పిటల్ లో కోరుట్ల ఇంచార్జ్ జువ్వాడి నార్సింగ్ రావు ఆసుపత్రి లో పేషెంట్లకు పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో బెజ్జారపు శ్రీనివాస్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఆటో డ్రైవర్ల చొరవ: గుంతల పూడికతో ప్రమాదాలకు తాత్కాలిక విరామం
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్లో ఉత్తరగడ్డ కింద ఉన్న ప్రమాదకరమైన రోడ్డు గుంతలను స్థానిక ఆటో డ్రైవర్లు, గ్రామ పెద్దలు, దాతలు కలిసి సొంత నిధులతో, శ్రమదానంతో పూడ్చివేశారు. అధికారుల నిర్లక్ష్యంతో ఏర్పడిన ఈ గుంతల వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం ఉదయం నుండి రాత్రి వరకు జరిగిన ఈ కార్యక్రమం స్థానిక ప్రజల ఐక్యతకు నిదర్శనం. అయితే, శాశ్వత మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
ఝరాసంగం బీఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు, జూనే గావ్ మాజీ ఎంపీటీసీ విజేందర్ రెడ్డి మంగళవారం మండలంలో పలు గ్రామాల్లో ప్రజ ల సౌకర్యార్థం సిమెంట్ బెంచీలను అందజేశారు.
జిల్లపల్లి బోరేగావ్ ప్యాలరం గ్రామంలో షేర్లు వేయడం జరిగింది అమ్మ క్రీస్తు శేషులు అయిన జ్ఞాపకార్థం గ్రామాల్లోని పలు వీధుల్లో ప్రజ లు కూర్చునేందుకు ఈ బెంచీలను ఏర్పా టు చేశారు. తన తల్లి మాణెమ్మ జ్ఞాపకార్థం బెంచీలను ఏర్పాటు చేసినట్లు విజేం దర్ రెడ్డి తెలిపారు.
కాలి నడకన దారూర్ జాతర వెళ్తున్న భక్తులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించిన యువకులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నుండి దారూర్ జాతరకు కాలి నడకన వెళ్తున్న భక్తులందరికీ బంటారాం గ్రామం వద్ద జహీరాబాద్ ప్రాంతానికి చెందిన యువకులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు పూర్తి చేశారు . పాదయాత్ర గా వెళ్తున్న వారికి మార్గ మధ్యలో భోజనానికి మంచి నీళ్లకు ఇబ్బంది కలగకుండా భోజనాలు పండ్లు మంచి నీళ్లు సౌకర్యం అందుబాటులో పాదయాత్రగా వెళుతున్న భక్తులకు ఇబ్బందులు కలగాకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు, దారూర్ వెళ్లే భక్తులను జహీరాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాల సంతోషంగా జీవించాలని దేవునితో ప్రత్యేక ప్రార్థనలు చేయాలన్నారు, ఈ కార్యక్రమంలో తిమోతి, ప్రభాకర్, వినోద్ భాను, భాస్కర్, యువరాజ్ రాజు తదితరులు పాల్గొన్నారు,
సిరిసిల్లలో ఉచిత వైద్య శిబిరం – సిరిసిల్ల బిజెపి పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్
సిరిసిల్ల (నేటి ధాత్రి):
బాలల దినోత్సవం పురస్కరించుకొని శాంతినగర్ లో పోకల భవాని, బిజెపి పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్ ఆధ్వర్యంలో సరయు హాస్పిటల్ వారి సహకారంతో డాక్టర్ టి. రవళి మరియు డాక్టర్ టి. సాయికుమార్ పర్యవేక్షణలో శుక్రవారం శాంతినగర్ లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మహిళలకు మరియు పిల్లలకు వైద్య పరీక్షలు చేసి తగు మందుల పంపిణీ జరిగినది.. బిజెపి పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్ మాట్లాడుతూ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని బాలలకు మంచి వైద్యం అందించాలనే సదుద్దేశంతో ఇట్టి శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగినది అలాగే మహిళలందరికీ వైద్య పరీక్షలు చేసి తగు మందులు అందించడం జరిగినది తెలిపారు. కార్యక్రమానికి సహకరించిన డాక్టర్ టి. రవళి, డాక్టర్ టి సాయికుమార్ కు కృతజ్ఞతలు అలాగే ఇట్టి కార్యక్రమంలో పాలుపంచుకున్న శాంతినగర్ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు.. ఇట్టి కార్యక్రమంలో అడప సంతోష్, వడ్నాల శేఖర్ బాబు, వెలిశాల అభినయ్, కొంపెల్లి విజయ్, రామారావు, సోమిశెట్టి పూజిత, చోడబోయిన కౌసల్య, కమటం మంజుల, చెవిటి మల్లీశ్వరి, సువర్ణ, సౌజన్య, రూప, మహిళా బృంద సభ్యులు పాల్గొన్నారు.
వారసత్వ సంపదలను కాపాడుకోవడం మన బాధ్యత- తల్లోజు ఆచారి.
కల్వకుర్తి / నేటి ధాత్రి :
కల్వకుర్తి పట్టణంలోని గచ్చుబావి శుద్ధి కార్యక్రమం గత మూడు రోజులుగా దిగ్విజయంగా కొనసాగుతుంది మూడవరోజు మాజీ జాతీయ బీసీ కమిషన్ మెంబర్ తల్లోజు ఆచారి పాల్గొన్నారు.ముందుగా శివాలయం దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. పూజలో పాల్గొన్న అనంతరం సేవా కార్యక్రమంలో పాల్గొని కాసేపు మట్టికుప్పల తట్టలు మోశారు తదనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడిన తల్లోజు ఆచారి కల్వకుర్తి పట్టణంలో పెద్ద ఎత్తున యువత స్వచ్ఛందంగా తరలిరావడం శుభపరిణామం వారసత్వ సంపద అయినటువంటి గచ్చుబావి పరిరక్షణ కోసం ప్రతిరోజు ఒక గంట సమయం కేటాయించి కాపాడుకోవాలనే ఆలోచన చాలా గొప్పదని వారసత్వ సంపదలు మన సంస్కృతికి సాంప్రదాయానికి మూల స్తంభాలని హిందూ ధర్మాన్ని పరిరక్షించే ఒక ఆధ్యాత్మిక కేంద్రం అలాంటి కేంద్రాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందువు పైన ఉందని ఇంతటిపాల్గొన్నారు. మాహాత్కార్యంలో ప్రతి ఒక్కరు పాల్గొని ఆ శివయ్య కృపను పొందాలని ఇకపై తరచూ గచ్చుబావిని సందర్శిస్తుంటానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక బిజెపి నాయకులు యువత పెద్ద మొత్తంలో పాల్గొన్నారు.
అమరవీరుల వారోత్సవాల సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణ పరిధిలోని కల్యాణ లక్ష్మీ గార్డెన్స్లో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ముఖ్య అతిథిగా హాజరై, రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి స్వయంగా రక్తదానం చేసి, రక్తదానం చేసిన వారికి ప్రశంస పత్రాలను అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…
రక్తదానం ప్రాణధానంతో సమానమని ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారి జీవితాలను కాపాడడంలో రక్తదానం కీలక పాత్ర పోషిస్తుందన్నారు.అమరవీరుల వారోత్సవాల సందర్భంగా స్వచ్చందంగా యువత ,ప్రజలు,ఆటో డ్రైవర్లు,పోలీస్ అధికారులు, నేతాజీ డిగ్రీ కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు విద్యార్థులు సిబ్బంది సుమారు 460 మంది రక్తదాన శిబిరంలో పాల్గొనడం అభినందించదగ్గ విషయమని, విధి నిర్వర్తనలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల త్యాగాలను సమాజం ఎప్పటికీ మరువదని, వారి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం పోలీస్ ఫ్లాగ్ డే నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు.
పోలీసులు కేవలం శాంతి భద్రతలను పరిరక్షించడమే కాకుండా సేవా కార్యక్రమాల్లోను ముందు వరసలో వుంటారని, ముఖ్యంగా రక్తదానంపై వున్న ఆపోహలను నమ్మకుండా ప్రతి ఒక్కరు రక్తదానం చేసేందుకు ముందుకు రావాలన్నారు.మనం చేసే రక్తదానం వలన అత్యవసర సమయంలో,ప్రమాద సమయంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి,తల సేమియా వ్యాధిగ్రస్తులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, సి.ఐ లు కృష్ణ, మొగిలి, శ్రీనివాస్, వీరప్రసాద్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు, మధుకర్, నటేష్,ఆర్.ఐ లు మధుకర్, రమేష్, యాదగిరి, ఎస్.ఐ లు, డాక్టర్ సంధ్యారాణి,కరీంనగర్, సిరిసిల్ల, నిజామాబాద్ జిల్లాకు చెందిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు గుడ్లరవి,పెండ్యాల కేశవరెడ్డి, బుస్స ఆంజనేయులు ,కరీంనగర్,సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
స్పూర్తి సర్వీసెస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ ఆకుల రమేష్.
చిట్యాల మండల కేంద్రానికి చెందిన అంబేద్కర్ యువజన సంఘం మండల సీనియర్ నాయకులు గురుకుంట్ల కిరణ్ అంబేద్కర్ నేషనల్ అవార్డుకు ఎంపికైనట్లు స్ఫూర్తి సర్వీసెస్ సొసైటీ ఇండియా ఎన్జీవోస్ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డాక్టర్ ఆకుల రమేష్ తెలిపారు. చిట్యాల మండల అంబేద్కర్ యువజన సంఘంలో గత 15 సంవత్సరాలుగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిస్తూ , భావజాలాన్ని ముందుకు తీసుకెళ్ళుచూ మరియు మహనీయుల కార్యక్రమాలను నిర్వహిస్తూ మృతుల కుటుంబాలను , పరామర్శించి సహాయ సహకారాలు అందించాడని, దళితులపై, మహిళలపై జరుగుతున్న సంఘటనలను ఖండిస్తూ వారికి అండగా నిలబడ్డారని , సామాజిక సేవ కార్యక్రమాలు అనేకం చేశాడని అన్నారు . అతను చేస్తున్న సేవలను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేయడం జరిగిందని డాక్టర్ రమేష్ చెప్పారు. అంబేద్కర్ నేషనల్ అవార్డుకు ఎంపికైన గురుకుంట్ల కిరణ్ కు నవంబర్ 5న సిటీ కల్చరల్ సెంటర్ ఆడిటోరియం ఆర్టిసి క్రాస్ రోడ్ ముషీరాబాద్ వివేక నగర్ కవాడిగూడ హైదరాబాద్* లో ఈ అవార్డు అందించడం జరుగుతుందని తెలిపారు. కిరణ్ మట్లాడుతూ నాకు ఈ అవార్డు ఎంపిక చేసిన డాక్టర్ ఆకుల రమేష్ గారికి సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.
మత సామరస్యానికి ప్రతీకగా పెనుగొండ ఆటో యూనియన్ – సమ్మయ్య గౌడ్
దేవాలయం చుట్టూ స్టీల్ ఫెన్సింగ్ కు 20వేల రూపాయలు అందించిన సమ్మిగౌడ్
మైసమ్మ తల్లి దీవెనలతో ప్రతి ఒక్కరూ క్షేమం: ఆటో యూనియన్ అధ్యక్షుడు షేక్ ఆసిఫ్
కేసముద్రం/ నేటి ధాత్రి
కేసముద్రం గ్రామం పెనుగొండ ఆటో యూనియన్ మత సామరస్యానికి ప్రతీకగా, ఆటో డ్రైవర్లకు, ప్రయాణీకులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దీవిస్తూ మైసమ్మ తల్లి దేవాలయ నిర్మాణం చేపట్టారు. యూనియన్ అధ్యక్షుడు షేక్ ఆసిఫ్ మాట్లాడుతూ గ్రామంలో ఆటో కేంద్రం వద్ద ఉన్న మైసమ్మ తల్లిని చెట్టు కింద కొలిచేవారమని, అనంతరం ఆటో డ్రైవర్ల సహకారంతో రేకుల షెడ్డుతో నీడను ఏర్పాటు చేసినప్పటికీ అందరినీ కంటికి రెప్పలా కాపాడుతూ మైసమ్మ తల్లికి శాశ్వత ఆలయ నిర్మాణం చేపట్టాలని సంకల్పించి ఆటో డ్రైవర్లు, గ్రామ పెద్దలు, మండలం లోని ప్రజా ప్రతినిధుల సహకారాన్ని కోరామని తెలిపారు. అడగగానే స్పందించి ఆలయం చుట్టూ ఏర్పాటు చేసే స్టీల్ ఫెన్సింగ్ కు మండల కాంగ్రెస్ నాయకు సమ్మిగౌడ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు చిలువేరు సమ్మయ్య గౌడ్ రూ.20 వేల ఆర్థిక సహాయం అందజేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.మామూలుగా ఆలయాలను హిందువులు మాత్రమే నిర్మిస్తారని కానీ అందుకు భిన్నంగా హిందు, ముస్లీం తేడాలు లేవని దేవుడు ఎవరికైనా ఒక్కరేనని విశ్వాసం వ్యక్తం చేస్తూ మత సామరస్యానికి ప్రతీకగా ముస్లిం సోదరులు ఆలయ నిర్మాణానికి పూనుకోవడం అభినందించదగ్గ విషయమని, అలాంటి వారితో నేను సైతం ఉండాలని, మైసమ్మ తల్లి దేవాలయ నిర్మాణంలో తనకు భాగస్వామ్యం కల్పించిన పెనుగొండ ఆటో యూనియన్ అధ్యక్షుడు షేక్ ఆసిఫ్, ఇతర సభ్యులకు సమ్మయ్య గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కమిటీ ఉపాధ్యక్షులు షేక్ ఇమామ్ పాషా, తాటి వీరన్న,నాంచారి శ్రీను,ఈసాల లక్ష్మయ్య, కొండ బత్తుల నరేష్, దేవరపు వెంకన్న,తాటి ఉపేందర్,ముత్యం వెంకన్న బొమ్మర మల్లయ్య,షేక్ మదార్, తాటి కుమారస్వామి, షేక్ ఇమ్రాన్,షేక్ అమీర్, చిన్నబోయిన వీరన్న, పూణెం సంతోష్,కల్తీ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
రక్తదానం చేసిన మండల కాంగ్రెస్ నాయకులు * ఘనంగా పోలీస్ అమరవీరుల దినోత్సవం * ఎస్పీ కార్యాలయ ఆవరణలో రక్తదాన శిబిరం మహాదేవపూర్ అక్టోబర్ 21 (నేటి ధాత్రి)
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేపూర్ మండలం కాంగ్రెస్ నాయకులు మంగళవారం రోజున ఎస్పీ కార్యాలయ ఆవరణలోని రక్తదాన శిబిరంలో రక్తదానం చేశారు. పోలీస్ అమరవీరుల దినోత్సవ సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయ ఆవరణలో ఎస్పీ కిరణ్ కరే, డీఎస్పీ సత్యనారాయణ, సిఐ వెంకటేశ్వర్లు, పవన్ కుమార్ లా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ శిబిరంలో మండల కాంగ్రెస్ నాయకులు కటకం అశోక్, బుర్రి శివరాజు తో పాటు పలువురు నాయకులు పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ మోతే సాంబయ్య, గ్రామ నాయకులు ఆకుల శ్రీధర్, ఎలకండి శ్రీకాంత్, బుర్రి మహేందర్, కళ్యాణ్, హరీష్ తోపాటు పలువురు నాయకులు, ఎస్పీ కార్యాలయ సిబ్బంది, రక్తదాన శిబిర సిబ్బంది పాల్గొన్నారు.
గ్రంథాలయానికి 40 వేల రూపాయల పుస్తకాలు అందించిన నరహరి
భూపాలపల్లి నేటిధాత్రి
జిల్లా కేంద్రంలోని గ్రంథాలయానికి తన తల్లిదండ్రులు దివంగత గుండు రాధ,రామలక్ష్మన్ జ్ఞాపకార్థం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు గౌడు కు రూ 40 వేల రూపాయల విలువగల పుస్తకాలను అందించి ఔదార్యం చాటుకున్న భూపాలపల్లి రూరల్ మండలం కమలాపురం గ్రామానికి చెందిన పూజిత,నరహరి దంపతులు. సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి సమాజంలో పుట్టినరోజు చనిపోయిన రోజుల పేరుతో ఎన్నో డబ్బులు వృధా చేస్తున్నారని,ఏదైనా ఒక మంచి పని చేయాలని ఉద్దేశంతో విజ్ఞానాన్ని అందించడానికి పుస్తకాలను గ్రంధాలయానికి అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిసిసి అధికార ప్రతినిధి గాజర్ల అశోక్ పిసిసి మెంబర్ చల్లూరు మధు ఏఐటీయుసి నాయకుడు రమేష్. బాలగొని రమేష్ మంతెన సమ్మయ్య తిరుపతి తదితరులు పాల్గొన్నారు
దిగవంతనేత మాజీ మంత్రి ఎండి ఫరీదోద్దీన్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న గొప్ప మానవతావాది #ఉమ్మడి_ఆంధ్రప్రదేశ్_రాష్ట్ర_మాజీ_మంత్రి_వర్యులు తెలంగాణ రాష్ట్ర మాజీ ఎమ్మెల్సీ(“కీర్తిశేషులు స్వర్గీయ మహమ్మద్ ఫరిదుద్దిన్ జయంతి”)సందర్బంగా అభిమానుల అధ్వర్యంలో ఉదయం 11 గంటలకు జహీరాబాద్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి నందు రోగులకు,బాలింతలకు పండ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న బిజీ సందీప్ గోవర్ధన్ రెడ్డి బాలిరెడ్డి నవీద్ నిజాం అలీ మాజీ సర్పంచ్ నరేష్ మాజీ సర్పంచ్ రాజు శ్రీనివాస్ నాయక్ జైరాజ్ బాలరాజ్ కవేలి కృష్ణ ఇక్బాల్ వసంత్ భార్కత్ ముబీన్ రామానుజన్ రెడ్డి ప్రణీష్ రావు అభిమానులు పాల్గొన్నరు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివంగత మహమ్మద్ ఫలితద్దీన్ ప్రజల గుండెల్లో ఉన్నారని వారు పేర్కొన్నారు. అనునిత్యం ప్రజల కొరకే తపించే మంచి నాయకుడిని కోల్పోయామని వారు వివరించారు. కుల మతాలకతీతంగా ప్రతి వ్యక్తికి నేనున్నానంటూ ధైర్యం చెప్తే మహోన్నతమైన వ్యక్తిని కోల్పోయామని వారు ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నారు,
ఝరాసంగం కేంద్రమైన మండల కేంద్రనికి చెందిన ఏఐఎంఐఎం పార్టీ నుంచి షేక్ రబ్బానీ జెడ్పిటిసి బరిలోకి దిగేందుకు ఏఐఎంఐఎం తరఫున ముందుకొచ్చారు. పార్టీ అధిష్టానం నుంచి అవకాశం లభిస్తే, ఝరాసంగం మండలాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని సోమవారం నాడు విడుదల చేసిన పత్రిక ప్రకటనలో తెలిపారు. షేక్ రబ్బానీ 2010 లో పార్టీ మండల అధ్యక్షులుగా రాజకీయాల్లోకి ప్రవేశించి ప్రజల మధ్య నుంచి వచ్చిన నేతగా, సమస్యలపై బహుళ అనుభవం కలిగి ఉన్నానని, పార్టీ టికెట్ లభిస్తే మరింత విస్తృతంగా సేవలం దించేందుకు సిద్ధమని అన్నారు. ఝరాసంగం మండలం నుండి జెడ్పిటిసి అభ్యర్థిగా ముగ్గురి పేర్లు ఏఐఎంఐఎం అధిష్టానానికి పంపినట్టు సమాచారం. అందులో తన పేరు కూడా ఉండడం గర్వంగా ఉందని, ప్రజలు ఆశీర్వదిస్తే మరింత సేవ చేసే అవకాశం కోరుతున్నానని పేర్కొన్నారు.
కేసముద్రం మండలంలోని ఉప్పరపల్లి గ్రామంలో యువత యూత్ క్లబ్ అనుబంధంగా గత 20 సంవత్సరాల నుండి గ్రామ ప్రజల ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలలో భాగంగా రావణాసుర వధ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమానికి కేసముద్రం మున్సిపాలిటీలోని సమ్మి గౌడ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు చిలువేరు సమ్మయ్య గౌడ్ తన వంతుగా రావణాసుర బొమ్మకు దాతగా నిలిచారు..ఈ సందర్భంగా సమ్మి గౌడ్ ఫౌండేషన్ అధినేత సమ్మయ్య గౌడ్ మాట్లాడుతూ… గ్రామ ప్రజలంతా కలిసి దసరా ఉత్సవాలను పురస్కరించుకొని చేస్తున్నటువంటి రావణాసుర వద కార్యక్రమంలో నన్ను మీ కుటుంబ సభ్యునిగా భావించి మీతోపాటు భాగస్వామిని చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉందని ఆనందాన్ని వ్యక్తపరిచారు. అదేవిధంగా గ్రామ యువత యూత్ మాట్లాడుతూ… అన్నా మా గ్రామం నుండి మా యువత యూత్ అడిగిన వెంటనే స్పందించి దసరా ఉత్సవాలలో భాగంగా రావణ సుర వద కార్యక్రమానికే కాదు మీరు మా గ్రామంలో పేదింటికి ఒక బిడ్డగా ఆడబిడ్డలకు అన్నగా యువతకు సోదరునిగా గ్రామ ప్రజలకు ఒక బిడ్డగా మీరు చేస్తున్నటువంటి సేవలు మరువలేనివని సమ్మి గౌడ్ ఫౌండేషన్ పట్ల వర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో యువత యూత్ క్లబ్ అధ్యక్షులు తండా సంపత్, ఉపాధ్యక్షులు పలస రాకేష్,రావణాసుర ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఎటురోజు పరిపూర్ణ చారి, ఉపాధ్యక్షులు తండా శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు కోమాకుల రమేష్, పబ్బతి సారంగం, శాగంటి రాములు, ముదురుకోళ్ల రమేష్, అడప రమేష్, ఎండి షబ్బీర్, ప్రవీణ్, శ్రీకాంత్, గంట రవి, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
పైలెట్ కాలనీ లో గల సింగరేణి కమ్యూనిటి హాల్ లో స్వచ్ఛతాహి సేవ కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ఏరియా సివిల్( ఏజినఎం ) రవికూమర్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వయంగా కమ్యూనిటి హాల్ ముందు వైపు, వెనుక వైపు ఉన్న పిచ్చి మొక్కలను చెత,చెదారాలను, అధికారులు సివిల్ సిబ్బంది తో కలిసి శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఏజినఎం మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి, ప్రతి పౌరుడిలో స్వచ్ఛ భారత్ ఆలోచన పదిలంగా ఉండాలని ఆయన కోరారు. పరిశుభ్రత ఒక్క వ్యక్తిగత పరిశుభ్రతకే పరిమితం కాకుండా, సమాజ సంక్షేమానికి మూలస్తంభంగా నిలుస్తుందన్నారు . సింగరేణి సంస్థలో పని చేస్తున్న ప్రతి ఉద్యోగి వారి పని ప్రదేశాలలో, నివాస ప్రాంతాలలో శుభ్రత పాటిస్తూ మిగతా సమాజానికి ఆదర్శంగా నిలవాలన్నారు. స్వచ్ఛతా నినాదాన్ని ప్రతిసారీ మన జీవితాల్లో భాగం చేసుకోవాలని కోరారు. అందరి కృషితోనే పరిశుభ్రత సాధ్యమౌతుంది” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏరియా సర్వే అధికారి శైలేంద్ర కుమార్, ఎన్విరాన్మెంట్ అధికారి పోశమల్లు, సివిల్ (ఎస్. ఇ) బాలరాజు, అశోక్ రెడ్డి,ఇతర అధికారులు,ఉద్యోగులు ,సివిల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
దసరా సందర్భంగా గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మిక సిబ్బందికి నూతన వస్త్రాల బహూకరణ.
చందుర్తి, నేటిధాత్రి:
చందుర్తి మండలం మల్యాల గ్రామంలో దసరా సందర్భంగా గ్రామానికి చెందిన తొగరి గంగాధర్ (ఎస్ వి సూపర్ మార్కెట్) పారిశుద్ధ్య కార్మికులందరికీ నూతన వస్త్రాలు అందించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్మికులు అతనికి కృతజ్ఞతలు తెలియజేశారు. గత ఐదు సంవత్సరాల నుండి పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలు అందించడం, అలాగే గ్రామంలో కూరగాయల మార్కెట్ తేవడంలో ముఖ్య భూమిక పోషించడం, జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో గ్రంథాలయాన్ని మరియు సైన్స్ ల్యాబ్ ను ఏర్పాటు చేయడం, ఇలాంటి గ్రామానికి ఎన్నో సేవలు చేస్తున్నటువంటి తొగరి గంగాధర్ ని గ్రామపంచాయతీ కార్మికులు శాలువాతో ఘనంగా సన్మానించారు. అలాగే ఊరంతా శుభ్రం చేస్తున్న పారిశుద్ధ కార్మికుల యొక్క బాగోగులు గుర్తు చేసుకుంటూ వారికి నూతన వస్త్రాలు అందించడాన్ని గ్రామస్తులు అభినందించారు, గ్రామంలో ప్రతి పౌరుడు తమ గ్రామానికి ఏదో రకంగా వీలైనంతవరకు సేవ చేయాలని ఈ సందర్భంగా కోరుకున్నాడు. ఈ కార్యక్రమంలో పరిశుద్ధ కార్మికులు తొగరి గంగాధర్ కొడగంటి గంగాధర్ పాటి సుధాకర్, బండపెళ్లి దేవయ్య, కుమ్మరి నాగరాజు, చింతం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు
అమ్మవారి మండపం వద్ద.. భరతనాట్యం , మ్యాజిక్ షో , నిత్య అన్నదాన కార్యక్రమం
నిజాంపేట: నేటి ధాత్రి
దేవి శరన్నవరాత్రులను పురస్కరించుకొని నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో కౌండిన్య యుత్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నాట్యమండలి చే దుర్గామాత మండపం వద్ద భరతనాట్యం కార్యక్రమం మరియు మ్యాజిక్ షో అలాగే నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ.. ప్రతి ఏటా భక్తిశ్రద్ధలతో అమ్మవారిని కొలుచుకోవడం జరుగుతుందన్నారు. నవరాత్రులు రోజుకు ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ఆధునిక కాలంలో సంస్కృతి సంప్రదాయాలు నేటి యువతకు తెలియజేయాలని ఉద్దేశంతో భరతనాట్యం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. అలాగే మూఢనమ్మకాలను నమ్మవద్దని మ్యాజిక్ షో నిర్వహించామని తెలిపారు. అలాగే నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించామని తెలిపారు ఈ కార్యక్రమంలో కౌండిన్య యూత్ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.