గ్రంథాలయానికి 40 వేల రూపాయల పుస్తకాలు అందించిన నరహరి….

గ్రంథాలయానికి 40 వేల రూపాయల పుస్తకాలు అందించిన నరహరి

భూపాలపల్లి నేటిధాత్రి

 

జిల్లా కేంద్రంలోని గ్రంథాలయానికి తన తల్లిదండ్రులు దివంగత గుండు రాధ,రామలక్ష్మన్ జ్ఞాపకార్థం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు గౌడు కు రూ 40 వేల రూపాయల విలువగల పుస్తకాలను అందించి ఔదార్యం చాటుకున్న భూపాలపల్లి రూరల్ మండలం కమలాపురం గ్రామానికి చెందిన పూజిత,నరహరి దంపతులు. సందర్భంగా వారు మాట్లాడుతూ
నేటి సమాజంలో పుట్టినరోజు చనిపోయిన రోజుల పేరుతో ఎన్నో డబ్బులు వృధా చేస్తున్నారని,ఏదైనా ఒక మంచి పని చేయాలని ఉద్దేశంతో విజ్ఞానాన్ని అందించడానికి పుస్తకాలను గ్రంధాలయానికి అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిసిసి అధికార ప్రతినిధి గాజర్ల అశోక్ పిసిసి మెంబర్ చల్లూరు మధు ఏఐటీయుసి నాయకుడు రమేష్. బాలగొని రమేష్ మంతెన సమ్మయ్య తిరుపతి తదితరులు పాల్గొన్నారు

దిగవంతనేత మాజీ మంత్రి ఎండి ఫరీదోద్దీన్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

దిగవంతనేత మాజీ మంత్రి ఎండి ఫరీదోద్దీన్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 జహీరాబాద్ ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న గొప్ప మానవతావాది #ఉమ్మడి_ఆంధ్రప్రదేశ్_రాష్ట్ర_మాజీ_మంత్రి_వర్యులు తెలంగాణ రాష్ట్ర మాజీ ఎమ్మెల్సీ(“కీర్తిశేషులు స్వర్గీయ మహమ్మద్ ఫరిదుద్దిన్ జయంతి”)సందర్బంగా అభిమానుల అధ్వర్యంలో ఉదయం 11 గంటలకు జహీరాబాద్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి నందు రోగులకు,బాలింతలకు పండ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న బిజీ సందీప్ గోవర్ధన్ రెడ్డి బాలిరెడ్డి నవీద్ నిజాం అలీ మాజీ సర్పంచ్ నరేష్ మాజీ సర్పంచ్ రాజు శ్రీనివాస్ నాయక్ జైరాజ్ బాలరాజ్ కవేలి కృష్ణ ఇక్బాల్ వసంత్ భార్కత్ ముబీన్ రామానుజన్ రెడ్డి ప్రణీష్ రావు అభిమానులు పాల్గొన్నరు

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివంగత మహమ్మద్ ఫలితద్దీన్ ప్రజల గుండెల్లో ఉన్నారని వారు పేర్కొన్నారు. అనునిత్యం ప్రజల కొరకే తపించే మంచి నాయకుడిని కోల్పోయామని వారు వివరించారు. కుల మతాలకతీతంగా ప్రతి వ్యక్తికి నేనున్నానంటూ ధైర్యం చెప్తే మహోన్నతమైన వ్యక్తిని కోల్పోయామని వారు ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నారు,

జడ్పిటిసి బరిలో షేక్ రబ్బానీ

జడ్పిటిసి బరిలో షేక్ రబ్బానీ

◆:- అధిష్టానం అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తా

జహీరాబాద్ నేటి ధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

ఝరాసంగం కేంద్రమైన మండల కేంద్రనికి చెందిన ఏఐఎంఐఎం పార్టీ నుంచి షేక్ రబ్బానీ జెడ్పిటిసి బరిలోకి దిగేందుకు ఏఐఎంఐఎం తరఫున ముందుకొచ్చారు. పార్టీ అధిష్టానం నుంచి అవకాశం లభిస్తే, ఝరాసంగం మండలాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని సోమవారం నాడు విడుదల చేసిన పత్రిక ప్రకటనలో తెలిపారు. షేక్ రబ్బానీ 2010 లో పార్టీ మండల అధ్యక్షులుగా రాజకీయాల్లోకి ప్రవేశించి ప్రజల మధ్య నుంచి వచ్చిన నేతగా, సమస్యలపై బహుళ అనుభవం కలిగి ఉన్నానని, పార్టీ టికెట్ లభిస్తే మరింత విస్తృతంగా సేవలం
దించేందుకు సిద్ధమని అన్నారు. ఝరాసంగం మండలం నుండి జెడ్పిటిసి అభ్యర్థిగా ముగ్గురి పేర్లు ఏఐఎంఐఎం అధిష్టానానికి పంపినట్టు సమాచారం. అందులో తన పేరు కూడా ఉండడం గర్వంగా ఉందని, ప్రజలు ఆశీర్వదిస్తే మరింత సేవ చేసే అవకాశం కోరుతున్నానని పేర్కొన్నారు.

రావణాసుర బొమ్మ దాత….సమ్మిగౌడ్ చిలువేరు…

రావణాసుర బొమ్మ దాత….సమ్మిగౌడ్ చిలువేరు

కేసముద్రం/ నేటి దాత్రి

 

కేసముద్రం మండలంలోని ఉప్పరపల్లి గ్రామంలో యువత యూత్ క్లబ్ అనుబంధంగా గత 20 సంవత్సరాల నుండి గ్రామ ప్రజల ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలలో భాగంగా రావణాసుర వధ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమానికి కేసముద్రం మున్సిపాలిటీలోని సమ్మి గౌడ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు చిలువేరు సమ్మయ్య గౌడ్ తన వంతుగా రావణాసుర బొమ్మకు దాతగా నిలిచారు..ఈ సందర్భంగా సమ్మి గౌడ్ ఫౌండేషన్ అధినేత సమ్మయ్య గౌడ్ మాట్లాడుతూ… గ్రామ ప్రజలంతా కలిసి దసరా ఉత్సవాలను పురస్కరించుకొని చేస్తున్నటువంటి రావణాసుర వద కార్యక్రమంలో నన్ను మీ కుటుంబ సభ్యునిగా భావించి మీతోపాటు భాగస్వామిని చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉందని ఆనందాన్ని వ్యక్తపరిచారు. అదేవిధంగా గ్రామ యువత యూత్ మాట్లాడుతూ… అన్నా మా గ్రామం నుండి మా యువత యూత్ అడిగిన వెంటనే స్పందించి దసరా ఉత్సవాలలో భాగంగా రావణ సుర వద కార్యక్రమానికే కాదు మీరు మా గ్రామంలో పేదింటికి ఒక బిడ్డగా ఆడబిడ్డలకు అన్నగా యువతకు సోదరునిగా గ్రామ ప్రజలకు ఒక బిడ్డగా మీరు చేస్తున్నటువంటి సేవలు మరువలేనివని సమ్మి గౌడ్ ఫౌండేషన్ పట్ల వర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో యువత యూత్ క్లబ్ అధ్యక్షులు తండా సంపత్, ఉపాధ్యక్షులు పలస రాకేష్,రావణాసుర ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఎటురోజు పరిపూర్ణ చారి, ఉపాధ్యక్షులు తండా శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు కోమాకుల రమేష్, పబ్బతి సారంగం, శాగంటి రాములు, ముదురుకోళ్ల రమేష్, అడప రమేష్, ఎండి షబ్బీర్, ప్రవీణ్, శ్రీకాంత్, గంట రవి, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

స్వచ్ఛతాహి సేవ కార్యక్రమం…

స్వచ్ఛతాహి సేవ కార్యక్రమం

భూపాలపల్లి నేటిధాత్రి

పైలెట్ కాలనీ లో గల సింగరేణి కమ్యూనిటి హాల్ లో
స్వచ్ఛతాహి సేవ కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ఏరియా సివిల్( ఏజిన‌ఎం ) రవికూమర్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వయంగా కమ్యూనిటి హాల్ ముందు వైపు, వెనుక వైపు ఉన్న పిచ్చి మొక్కలను చెత,చెదారాలను, అధికారులు సివిల్ సిబ్బంది తో కలిసి శుభ్రం చేశారు.
ఈ సందర్భంగా ఏజిన‌ఎం మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి, ప్రతి పౌరుడిలో స్వచ్ఛ భారత్ ఆలోచన పదిలంగా ఉండాలని ఆయన కోరారు. పరిశుభ్రత ఒక్క వ్యక్తిగత పరిశుభ్రతకే పరిమితం కాకుండా, సమాజ సంక్షేమానికి మూలస్తంభంగా నిలుస్తుందన్నారు . సింగరేణి సంస్థలో పని చేస్తున్న ప్రతి ఉద్యోగి వారి పని ప్రదేశాలలో, నివాస ప్రాంతాలలో శుభ్రత పాటిస్తూ మిగతా సమాజానికి ఆదర్శంగా నిలవాలన్నారు. స్వచ్ఛతా నినాదాన్ని ప్రతిసారీ మన జీవితాల్లో భాగం చేసుకోవాలని కోరారు. అందరి కృషితోనే పరిశుభ్రత సాధ్యమౌతుంది” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏరియా సర్వే అధికారి శైలేంద్ర కుమార్, ఎన్విరాన్మెంట్ అధికారి పోశమల్లు, సివిల్ (ఎస్. ఇ) బాలరాజు, అశోక్ రెడ్డి,ఇతర అధికారులు,ఉద్యోగులు ,సివిల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

చందుర్తి గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు దసరా బహూకరణ…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-01T140343.778.wav?_=1

 

దసరా సందర్భంగా గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మిక సిబ్బందికి నూతన వస్త్రాల బహూకరణ.

చందుర్తి, నేటిధాత్రి:

చందుర్తి మండలం మల్యాల గ్రామంలో దసరా సందర్భంగా గ్రామానికి చెందిన తొగరి గంగాధర్ (ఎస్ వి సూపర్ మార్కెట్) పారిశుద్ధ్య కార్మికులందరికీ నూతన వస్త్రాలు అందించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్మికులు అతనికి కృతజ్ఞతలు తెలియజేశారు. గత ఐదు సంవత్సరాల నుండి పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలు అందించడం, అలాగే గ్రామంలో కూరగాయల మార్కెట్ తేవడంలో ముఖ్య భూమిక పోషించడం, జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో గ్రంథాలయాన్ని మరియు సైన్స్ ల్యాబ్ ను ఏర్పాటు చేయడం, ఇలాంటి గ్రామానికి ఎన్నో సేవలు చేస్తున్నటువంటి తొగరి గంగాధర్ ని గ్రామపంచాయతీ కార్మికులు శాలువాతో ఘనంగా సన్మానించారు. అలాగే ఊరంతా శుభ్రం చేస్తున్న పారిశుద్ధ కార్మికుల యొక్క బాగోగులు గుర్తు చేసుకుంటూ వారికి నూతన వస్త్రాలు అందించడాన్ని గ్రామస్తులు అభినందించారు, గ్రామంలో ప్రతి పౌరుడు తమ గ్రామానికి ఏదో రకంగా వీలైనంతవరకు సేవ చేయాలని ఈ సందర్భంగా కోరుకున్నాడు. ఈ కార్యక్రమంలో పరిశుద్ధ కార్మికులు తొగరి గంగాధర్ కొడగంటి గంగాధర్ పాటి సుధాకర్, బండపెళ్లి దేవయ్య, కుమ్మరి నాగరాజు, చింతం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు

అమ్మవారి మండపం వద్ద..

అమ్మవారి మండపం వద్ద..
భరతనాట్యం , మ్యాజిక్ షో , నిత్య అన్నదాన కార్యక్రమం

నిజాంపేట: నేటి ధాత్రి

 

దేవి శరన్నవరాత్రులను పురస్కరించుకొని నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో కౌండిన్య యుత్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నాట్యమండలి చే దుర్గామాత మండపం వద్ద భరతనాట్యం కార్యక్రమం మరియు మ్యాజిక్ షో అలాగే నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ.. ప్రతి ఏటా భక్తిశ్రద్ధలతో అమ్మవారిని కొలుచుకోవడం జరుగుతుందన్నారు. నవరాత్రులు రోజుకు ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ఆధునిక కాలంలో సంస్కృతి సంప్రదాయాలు నేటి యువతకు తెలియజేయాలని ఉద్దేశంతో భరతనాట్యం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. అలాగే మూఢనమ్మకాలను నమ్మవద్దని మ్యాజిక్ షో నిర్వహించామని తెలిపారు. అలాగే నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించామని తెలిపారు ఈ కార్యక్రమంలో కౌండిన్య యూత్ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు

అపోలో హాస్పిటల్ డాక్టర్లచే ఉచిత ఇ ఎ న్ న్టి చెవి పరీక్షలు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-22T120332.527.wav?_=2

 

అపోలో హాస్పిటల్ డాక్టర్లచే ఉచిత ఇ ఎ న్ న్టి చెవి పరీక్షలు
విజయవంతం
వనపర్తి నేటిదాత్రి .

వనపర్తి పట్టణంలో ఆదివారం నాడు శ్రీ సత్య సాయి సేవ సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ అపోలో డాక్టర్లచే దాదాపు 200 మంది పేషెంట్లకు చౌడు కు చెవుడుకు సంబంధించిన వారికి ఉచితంగా పరీక్షలు చేయించామని శ్రీ సత్య సాయి సేవ సంస్థ కన్వీనర్ రమేష్ రెడ్డి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కన్వీనర్ మనోహర్ రెడ్డి ఒక ప్రకటనలో విలేకరులకు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేషంట్లకు అవసరం ఉన్నవారికి ఉచితంగా వినికిడి మిషన్లు పంపిణీ చేశామని అదేవిధంగా అన్నదానం రిటైర్డ్ విద్యుత్ ఉద్యోగి ఏర్పాటు చేశారని వారి పేర్కొన్నారు చిన్న పిల్లలకు రెండు సంవత్సరాల వరకు వినికిడి లోపం ఉంటుందని వారికి శ్రీ సత్య సాయి సేవ సంస్థ డాక్టర్లకే ఆపరేషన్లు ఉచితంగా ఏర్పాట్లు చేయించామని వారు పేర్కొన్నారు అదేవిధంగా ప్రతి ఆదివారం ప్రతి గురువారం శ్రీ సత్యసాయి సేవా సంస్థ తరపున ఉచితంగా హోమియోపతి డాక్టర్ పేషెంట్లకు వైద్యం చేస్తున్నారని అదేవిధంగా ఉచిత హోమియోపతి మందులు సరఫరా చేస్తున్నారని వారు పేర్కొన్నారు హోమియోపతి డాక్టర్ కు శ్రీ సత్య సాయి సేవ సంస్థ తరఫున ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు హైదరాబాదు రోడ్డులో ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రతిరోజు పేషెంట్లకు శ్రీ సత్యసాయి సేవా సంస్థ తరఫున దాదాపు 300 మందికి అన్నదానం ఏర్పాటు చేస్తున్నామని వారు తెలిపారు అన్నదానం ఏర్పాటు చేసేవారు శ్రీ సత్య సాయి సేవా సంస్థ కన్వీనర్ రమేష్ రెడ్డిని సత్యసాయి మందిరంలో సంప్రదించాలని మనోహర్ రెడ్డి వనపర్తి జిల్లా శ్రీ సత్య సాయి సేవా సంస్థ కన్వీనర్ నరహరి పుల్లయ్య శెట్టి ఒక ప్రకటనలో కోరారు

ఈద్ మిలాద్ రక్తదానం, సర్టిఫికెట్లు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-15T130429.464.wav?_=3

 

ఈద్ మిలాద్-ఉన్-నబీ సందర్భంగా రక్తదాన శిబిరంలో సర్టిఫికెట్లు పంపిణీ షేక్ ఫరీద్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్‌లో ఈద్ మిలాద్-ఉన్-నబీ ఊరేగింపు సందర్భంగా, ఈద్గా మైదానంలో అర్హులైన ముస్లిం బాలికల సామూహిక వివాహాలు నిర్వహించారు, దీనికి ప్రత్యేక అతిథి షేక్ ఫరీద్, సీనియర్ బిఆర్ఎస్ నాయకుడు, రైల్వే మాజీ కార్యనిర్వాహక సభ్యుడు సయ్యద్ మొహియుద్దీన్, టౌన్ బ్రిక్స్ పార్టీ మాజీ అధ్యక్షుడు పాల్గొన్నారు. బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు షేక్ ఫరీద్ రక్తదాన శిబిరంలో సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా, మైనారిటీ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ముహమ్మద్ గౌరీ మియాన్ సికందర్, షేక్ జహంగీర్ అజార్, షేక్ మోయిన్ వసీం, రఫీక్ అన్సారీ, జుబైర్, బిఆర్ఎస్ క్యాంప్ ఇన్‌చార్జ్ సయ్యద్ అహ్మద్ వాగర్ పాల్గొన్నారు.

శ్రీ ఉమా మహేశ్వర సేవ సమితి ఆధ్వర్యంలో ఆలయాల శుద్ధి కార్యక్రమం

శ్రీ ఉమా మహేశ్వర సేవ సమితి ఆధ్వర్యంలో ఆలయాల శుద్ధి కార్యక్రమం

ఆలయ కమిటీ అధ్యక్షుడు ఆకుల సుభాష్ ముదిరాజ్

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండలంలోని ధర్మారావుపేటలొ ఆదివారం చంద్రగ్రహణం కారణగా ఆలయాల మూసిన సందర్బంగా తిరిగి సోమవారం శ్రీ ఉమా మహేశ్వర సేవ సమితి ఆధ్వర్యంలో ఆలయాలు శుద్ధి కార్యక్రమం.

 

దేవత మూర్తులను గ్రామ దేవతలకు పవిత్ర గంగా నది జలలతో స్నానాలు జరిపించడం జరిగిందని అర్చకులు రాజేందర్ సంప్రోక్షణ చేసి దూప దీప నైవేద్యలతో యధావిధిగా పూజ కార్యక్రమాలు పునః ప్రారంభం చేశారని సేవ సమితి అధ్యక్షులు ఆకుల సుభాష్ ముదిరాజ్ అన్నారు..ఈ కార్యక్రమంలొ సమితి సభ్యులు వాల నర్సింగరావు దూలం శంకర్ ఆకుల దామోదర్ బెతి రవీందర్ రెడ్డి గందే ప్రకాష్ సింగం రాజవిరు ఎల్లంకి శ్రీనివాస్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారని తెలిపారు

సొంత ఖర్చులతో బోర్ వెల్ మోటార్ ఏర్పాటు చేసిన యువత…

సొంత ఖర్చులతో బోర్ వెల్ మోటార్ ఏర్పాటు చేసిన యువత

జైపూర్,నేటి ధాత్రి:

 

 

సొంత ఖర్చులతో బోర్ వెల్ మోటార్ ఏర్పాటు చేసి కొత్తగూడెం కాలనీ వాసులకు నీటి కష్టాలు తొలగించిన యువకులు.జైపూర్ మండలం ముదిగుంట గ్రామంలోని కొత్తగూడెం కాలనీలో బోర్ వెల్ మోటార్ చెడిపోయి కాలనీ వాసులు గత రెండు నెలలుగా నీటి కష్టాలు ఎదుర్కొంటున్నామని అధికారుల దృష్టికి,ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన ఎవరూ కూడా పట్టించుకోలేదు అని గ్రామస్తులు వాపోయారు.ఈ విషయం తెలుసుకున్న ముదిగుంట గ్రామానికి చెందిన యువకులు స్వచ్ఛందంగా ముందుందుకు వచ్చిన యువకులు గుండా సురేష్ గౌడ్,ఆకుల రవికుమార్,జిల్లాల శ్రీకాంత్,దూగుట రాజశేఖర్ వారి సొంత ఖర్చులతో కొత్త మోటర్ బిగించి కాలనీవాసులు ఎదుర్కొంటున్న నీటి సమస్యకు పరిష్కార మార్గం చూపారు.ఈ సందర్భంగా యువత మాట్లాడుతూ.. గ్రామంలో ఏ సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకువస్తే తమ వంతుగా కృషిచేసి సమస్య పరిష్కారం అయ్యేలా చేస్తామని అన్నారు.అలాగే కొత్తగూడెం కాలనీ వాసుల నీటి కష్టాలు తొలగిపోవడంతో యువకులకి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

శ్రీ భవానీ ‌సేవా సమితి నూతన కార్యవర్గం ఎన్నిక…

శ్రీ భవానీ ‌సేవా సమితి నూతన కార్యవర్గం ఎన్నిక

రాయికల్ సెప్టెంబర్ 5, నేటి ధాత్రి:

 

జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణ శ్రీ భవానీ ‌సేవా సమితి నూతన కార్యవర్గాన్ని శుక్రవారం రోజున సభ్యుల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. గౌరవ అధ్యక్షుడుగా రాయిల్ల జనార్థన్,ముఖ్య సలహాదారుడుగా గంగాధరి సురేష్, నూతన అధ్యక్షుడుగా శ్రీగద్దె సుమన్ ,ఉపాధ్యక్షులుగా కొయల్ కర్ వినోద్,తొగిటి రవితేజ, ప్రధాన కార్యదర్శి మోర శశికాంత్,కోశాధికారిగా గట్టు నవీన్ కుమార్ , సంయుక్త కార్యదర్శిలుగా దువ్వాక కృష్ణ చైతన్య,శ్రీ గద్దె శ్రావణ్ కుమార్,కార్యవర్గ సభ్యులు పారిపెల్లి శివ ప్రసాద్,కటుకం శివ కుమార్,గట్ల తరుణ్,కొరల్ కర్ ప్రవన్,కుంబలకర్ వెంకటేష్,కట్టెకొల అకిలేష్ లను ఏకగ్రీవంగా శ్రీ భవానీ సేవా సమితి సభ్యులు అందరు ఎన్నుకున్నారు.

శివాజీ యువసేన ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-05T113838.352.wav?_=4

శివాజీ యువసేన ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ

అన్న ప్రసాద కార్యక్రమం అభినందనీయం సీఐ క్రాంతికుమార్,ఎస్ఐ విట్టల్

పరకాల నేటిధాత్రి

 

 

గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శివాజీ యువసేన అధ్యక్షులు ఆర్పి జయంత్ లాల్ ఆధ్వర్యంలో మహా అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పరకాల సీఐ క్రాంతి కుమార్ మరియు ఎస్ ఐ విట్టల్ పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం అన్నవితరణ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శివాజీ యువసేన ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కుల మతాలకతీతంగా నిర్వహించే పండుగ శాంతియుతంగా నిర్వహించుకోవాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో శివాజీ యువసేన గౌరవ అధ్యక్షులు ఆర్పీ జయంతి లాల్,కిరాణా వర్తక సంఘ అధ్యక్షులు కిరణ్ కుమార్,శివాజీ యువసేన నాయకులు దినేష్,రాజేష్,నాగరాజ్ అర్జున్,వంశీ,లడ్డు,ఖాసీం,రాజకుమార్ ,శ్రీనివాస్,రాకేష్,పవన్,రవి,మహేందర్,సూర్య,ప్రవీణ్,రజినీకాంత్,అనిల్,నర్సింగరావు,మార్కండేయ,అశోక్,రవి,రాజు తదితరులు మరియు భక్తులు పాల్గొన్నారు.

గణేష్ ఉత్సవంలో అన్నదానం ప్రారంభించిన ఎమ్మెల్యే దంపతులు…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-04T164005.932.wav?_=5

 

గణేష్ ఉత్సవాలలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దంపతులు

ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్, భూక్య ఉమా,

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

కేసముద్రం మున్సిపాలిటీ పరిధి కేసముద్రం విలేజ్ ఎన్టీఆర్ నగర్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్, వారి సతీమణి భూక్య ఉమా ముఖ్య అతిథులుగా పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది.

 

ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన మండల ఎస్టీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అజ్మీర రమేష్ మండల ఓబీసీ ప్రెసిడెంట్ చిట్ల సంపత్ లావుడియా వెంకన్న అజ్మీర రాజు అజ్మీర దీప్లా మరియు ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరించిన టిపిసిసి ఓబీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల వీరన్న యాదవ్ మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ పిఎసిఎస్ చైర్మన్ బండారి వెంకన్న, తరాల వీరేశం, దస్రు నాయక్, కేసముద్రం కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ కత్తెరసాల శ్రీనివాస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కీర్తి సురేందర్ బ్లాక్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ మాసాడి శ్రీనివాస్ మాజీ వార్డ్ మెంబర్ గుండు లక్ష్మీనారాయణ ఇందిరమ్మ కమిటీ సభ్యుడు సుభాష్ రెడ్డి బోళ్ల కటయ్య బొల్ల అశోక్, తదితరులు పాల్గొన్నారు.

మున్సిపల్ కార్మికులకు సిబ్బందికి ఎనర్జీ డ్రింక్ పంపిణీ చేసిన లైన్స్ క్లబ్..

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-04T124355.369.wav?_=6

 

మున్సిపల్ కార్మికులకు సిబ్బందికి ఎనర్జీ డ్రింక్ పంపిణీ చేసిన లైన్స్ క్లబ్..

రామాయంపేట, సెప్టెంబర్ 4 నేటి ధాత్రి (మెదక్)

రామాయంపేట లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులకు విశేష సన్మానం లభించింది. గురువారం ఉదయం స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో పారిశుధ్య కార్మికులు, మున్సిపల్ సిబ్బందికి ఎనర్జీ డ్రింక్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కమిషనర్ దేవేందర్ ముఖ్య అతిథిగా హాజరై కార్మికులకు ఎనర్జీ డ్రింక్స్‌ను అందజేశారు.
లైన్స్ క్లబ్ అధ్యక్షుడు దేమే యాదగిరి, జిల్లా అధ్యక్షుడు పోదేండ్ల లక్ష్మణ్ యాదవ్, సభ్యులు వంగరి కైలాస్, దోమకొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఈ సందర్భంగా కమిషనర్ దేవేందర్ మాట్లాడుతూ – “పట్టణం శుభ్రంగా, ఆరోగ్యంగా ఉండటానికి పారిశుధ్య కార్మికుల కృషి అత్యంత కీలకం. ఇలాంటి సేవా కార్యక్రమాలు వారికి ప్రోత్సాహం కలిగిస్తాయని తెలిపారు.
కార్మికులు తమ భావాలను వ్యక్తం చేస్తూ, శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ – “మేము ప్రతిరోజూ ఉదయం నుంచి రాత్రి వరకు శ్రమిస్తాం.
ఇలాంటి గుర్తింపు మా కష్టానికి నిజమైన గౌరవం” అన్నారు.

పోచమ్మ శంకర్ మాట్లాడుతూ “ఇంతవరకు ఎవరు మాపై ఇంత శ్రద్ధ చూపలేదు. లైన్స్ క్లబ్ చేసిన సత్కారం మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది”.

లైన్స్ క్లబ్ అధ్యక్షుడు దేమే యాదగిరి మాట్లాడుతూ – “సమాజానికి మూలస్తంభాలుగా నిలుస్తున్న పారిశుధ్య కార్మికులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత” అని తెలిపారు. జిల్లా అధ్యక్షుడు పోదేండ్ల లక్ష్మణ్ యాదవ్ మాట్లాడుతూ – “ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తాం” అని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో లైన్స్ క్లబ్ అధ్యక్షుడు దేమే యాదగిరి. లక్ష్మణ్ యాదవ్. వంగరి కైలాస్. దోమకొండ శ్రీనివాస్. శ్రీధర్ రెడ్డి. చల్ మెడ ప్రసాద్ పోచమ్మ శంకర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.

ఓం శ్రీ సాయి అగ్ని గణేష్ వద్ద మహా అన్నదానం.

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-02T130836.794-1.wav?_=7

ఘనంగా ఓం శ్రీ సాయి అగ్ని గణేష్ యూత్ ఆధ్వర్యంలో మహా అన్న ప్రసాద వితరణ

* శివరాజ్ యాదవ్ కుటుంబ సభ్యులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్, నియోజకవర్గ పట్టణ పరిధిలో కాంతా రెడ్డి కాలనీ బాలాజీ నగర్ సమీపంలో గల ఓం శ్రీ సాయిఅగ్ని గణేష్ యూత్ ఆధ్వర్యంలో గణేష్ మండపం దగ్గర మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కాంతారెడ్డి కాలనీకి చెందిన శివరాజ్ యాదవ్ వారి కుటుంబ సభ్యులతో నిర్వహించారు. శివరాజ్ యాదవ్ మాట్లాడుతూ ఈ అన్నదానం కేవలం ఆహారం అందించడం కాదు, ఇది ఒక గొప్ప పుణ్య కార్యమని, అన్నదానం ద్వారా మనం ఇతరులకు సహాయం చేసినప్పుడు మనకు ఒక గొప్ప సంతృప్తి లభిస్తుంది. అన్నదానం చేయడం ద్వారా, మన గత కర్మలను తొలగించవచ్చని అదేవిధంగా అన్నదానం స్వీకరించిన వారి ఆశీర్వాదాలు మన జీవితంలో సాను కూలతను తీసుకు వస్తాయి. అన్నదానం ద్వారా ఇతరులకు ఆహారం అందించడం ద్వారా వారి జీవితాన్ని ఇచ్చే అవకాశం లభిస్తుంది అన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయ వంతం చేశారు. ఈ కార్యక్రమంలో గణేష్ కమిటీ సభ్యులు తలారి సందీప్, ఉప్పరి మహేందర్, బి. సంతోష్, తరుణ్, ధనరాజ్, వినయ్ కుమార్, ఉప్పరి దత్తు, సాయి కుమార్, సాయి చరణ్, ప్రణీత్ కుమార్, లడ్డు, తదితరులు కాలనీవాసులు పాల్గొన్నారు.

సమాజ సేవ మహోన్నతమైంది జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురబి…

సమాజ సేవ మహోన్నతమైంది జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురబి

వనపర్తి నేటిదాత్రి .

సమాజ సేవ మహోన్నత మైన దని జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి అన్నారు. ఇటీవల
66 యూనిట్ల రక్తం
సేకరించిన సందర్భంగా వనపర్తి శాఖ బ్రహ్మ కుమారిస్ శోభ . నాగమణిలను కలెక్టర్ అభినందించారు ఈమేరకు జిల్లా కలెక్టర్ వారికి
ప్రశంసాపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో డీ ఎమ్ హెచ్ ఒ డాక్టర్ శ్రీనివాసులు సీనియర్ జర్నలిస్ట్ గంధం భక్త రాజు పాల్గొన్నారు

ఘనంగా ప్రముఖ వ్యాపారవేత్త జన్మదిన వేడుకలు…

ఘనంగా ప్రముఖ వ్యాపారవేత్త జన్మదిన వేడుకలు.

కల్వకుర్తి / నేటి ధాత్రి :

 

కల్వకుర్తి పట్టణంలోని ప్రముఖ వ్యాపారవేత్త జిల్లా రైస్ మిల్ మాజీ అధ్యక్షుడు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ ట్రస్టీ చైర్మన్ జూలూరు రమేష్ బాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వాసవి క్లబ్ కల్వకుర్తి మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ ఆమనగల్ ఆధ్వర్యంలో సంయుక్తంగా ఉచిత మధుమేహ పరీక్షల శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. వాసవి క్లబ్ ఆధ్వర్యంలో జడ్చర్ల పట్టణంలోని సత్యేశ్వర ఆలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ కే సి జి ఎఫ్ కల్వకుర్తి అధ్యక్షుడు బాదం రాఘవేందర్,ప్రధాన కార్యదర్శి నీల కోటేశ్వర్, జోన్ చైర్మన్ చిదిరే శ్రీనివాసులు, పూర్వ అధ్యక్షులు ఈ. రమేష్, జి . శంకర్,. కె గోపాల్, జే సత్యనారాయణ,. యo. అశోక్, బాదం హరీష్,సిహెచ్ శ్రీధర్, గుబ్బ ప్రభాకర్, నారాయణ రాజు, పి నరసింహులు గుప్తా, పట్టణ అధ్యక్షులు వాస శేఖర్, కంది ప్రవీణ్, సంబు రమణ, దుగ్గి వెంకటేష్,పాపిశెట్టి శ్రీనివాసులు, గార్లపాటి శ్రీనివాసులు, సంబు ముత్యాలు,రాచూరి రామ్మోహన్, పోల శ్రీధర్,గోవిందు చంద్రయ్య, వాసవి క్లబ్ మిత్రులు పాల్గొన్నారు. 

గ్లోబల్ ఆక్రిడేషన్ కౌన్సిల్, పాండి యూనివర్సిటీ ఆధ్వర్యంలో..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-35-5.wav?_=8

గ్లోబల్ ఆక్రిడేషన్ కౌన్సిల్, పాండి యూనివర్సిటీ ఆధ్వర్యంలో

డాక్టర్ పట్ట పొందిన ఐక్య వేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్

వనపర్తి నేటిదాత్రి .

గ్లోబల్ అక్రిడే షన్ యునైటెడ్ నేషన్..నేషనల్ పీస్ యూనివర్సిటీ వారిచే అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ పాండిచ్చేరిలో డాక్టర్ రేట్ పట్ట పొందారు25 సంవత్సరాలుగా వనపర్తి జిల్లా ప్రజల సమాజ సేవకు, ప్రజా సమస్యలపై 18 ఏళ్లపాటు రాజీలేని పోరాటానికి గుర్తింపుగా ఈ గౌరవం దక్కిందని సతీష్ తెలిపారు వనపర్తి కాంగ్రెస్ పార్టీ నుండి మాజీ కౌన్సిలర్,గా సేవలు వనపర్తి జిల్లా అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ గౌరవ డాక్టరేట్ ప్రధానం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
కౌన్సిలర్ గా ఉన్నప్పుడు ఇంకుడు గుంతలు తవ్వించడం హరితహారం లో ఒకేసారి మూడు వేల చెట్లు నాటడం ప్లాస్టిక్ వ్యతిరేకంగా బట్ట సంచులు ఉచితంగా ప్రజలకు పంచడం.కరోనా సమయంలో పోలీసు శాఖకు , మున్సిపల్ కార్మికులకు అన్నదానం చేయడం కార్మికులకు నిత్యావసర సరుకులు పంచడం ఐదు సంవత్సరాలలో ప్రభుత్వ ఆస్తులు రక్షించడం ప్రజా సమస్యలపై పోరాడడం అనేక సేవ లకు గురించి డాక్టరేట్ ఇచ్చారని చెప్పారు.
శనివారం పాండిచ్చేరి రాష్ట్రంలో గ్లోబల్ ఆక్రిడేషన్ కౌన్సిల్, పాండి యూనివర్సిటీ ఆధ్వర్యంలోజరిగిన కార్యక్రమంలో యూనివర్సిటీ ప్రతినిధులు పట్టా అందజేశారు
డాక్టరేట్ అందుకున్న సందర్భంగా సతీష్ యాదవ్ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై చేస్తున్న సేవా కార్యక్రమాలను గమనించి సేవలకు గుర్తింపుగా గౌరవ డాక్టరేట్ ఇవ్వటం గర్వంగా ఉందని, శ్రీ కృష్ణాష్టమి రోజున పట్ట అందుకోవడం అదృష్టం గా ఉందని అన్నారు
గౌరవానికి దోహదపడిన వనపర్తి పట్టణ, జిల్లా ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని రాబోవు కాలంలో వనపర్తి జిల్లా ప్రజలకు మరింత సేవ చేయడానికి ఉపయోగపడుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సులర్లు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు*

పౌర సంక్షేమ సమితి స్వాతంత్ర్య వేడుకలు..

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-15T123401.367.wav?_=9

 

పౌర సంక్షేమ సమితి ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

సిరిసిల్ల టౌన్ : (నేటిధాత్రి)

 

 

 

నేడు భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల పౌర సంక్షేమ సమితి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ సభ్యుల ఉత్సాహం మధ్యన అధ్యక్షుడు బియాంకర్ శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశం చాలా అత్యున్నత దేశమని స్వతంత్రం సిద్ధించి 79 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా జిల్లా ప్రజలకు మరియు పౌర సంక్షేమ సమితి సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. భారత్ ఇంకా అభివృద్ధి చెందాలని దానికి అందరూ కృషి చేయాలని పేర్కొన్నారు. వివిధ విభాగాలలో విద్య వైద్యం మహిళా అభివృద్ధికి కృషి జరపవలసి ఉన్నదని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో
బియ్యంకార్ శ్రీనివాస్,అధ్యక్షుడు వేముల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి చిప్ప దేవదాసు, కోశాధికారి మరియు సభ్యులు వేముల పోశెట్టి,శివశంకర్,కోడం వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version