యాదగిరిగుట్ట ఆర్యవైశ్యులు ప్రతి అమావాస్య రోజున పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం చేపట్టదరు, ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో ఎన్నికైన చైర్మన్ వాణి భరత్ గౌడ్ గారికి, మరియు పదిమంది కౌన్సిలర్లకు ఆర్యవైశ్య పెద్దలు ఘనంగా సన్మానించారు. సన్మాన అనంతరం అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బిజెపి నాయకులు టిఆర్ఎస్ నాయకులు సిపిఐ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట ఆర్యవైశ్యులు తడ్క వెంకటేష్, తాళ్లపల్లి నాగరాజు, బెలిదే భాస్కర్, నువ్వుల రమేష్, రంగ సత్యం, లింగ సత్యం, ఎలకంటి మోహన్, నంగునూరు భాను, బాలేష్ గుప్తా, బెలీదే అశోక్, లక్ష్మీనారాయణ గుప్తా, అర్థం శీను, కొండూరి నరసింహ, బెలిగా నరసింహ, కూరెల్లి నరసింహ, ప్రొద్దుటూరు వేణుగోపాల్, నగేష్ గుప్తా, పెద్ద సంఖ్యలో ఆర్యవైశ్యులు పాల్గొన్నారు.
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఉపాధి హామీ కార్మికులతో నిరసన….
తంగళ్ళపల్లి నేటి ధాత్రి…..
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఉపాధి హామీ కార్మికులతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ. దేశవ్యాప్త సార్వత్రికసమ్మెలో భాగంగా తంగళ్ళపల్లి మండల కేంద్రంతోపాటు మండల జిల్లెల్ల గ్రామంలో ఉపాధి హామీ కార్మికులతో నిరసన కార్యక్రమం చేయడం జరిగిందని. ఈ సందర్భంగా ప్రభుత్వాలు ఉపాధి హామీని వెంటనే కొనసాగించాలని. ఉద్యోగ ఉపాధి భద్రత కల్పించాలని. రైతు పండించిన పంటలకు మద్దతు ధర ఇవ్వాలని. 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని.2025.వ. విద్యుత్ సవరణ .బిల్లురద్దుకై. ప్రభుత్వ రంగ పరిశ్రమల .పరిరక్షణకై కనీసవేతనాల .పెంపుకై. మతోన్మాద. కార్పోరేట్ రాజకీయాలకు .వ్యతిరేకంగా అమాలి కార్మికుల సంక్షేమం బోర్డు ఏర్పాటు చేయాలని. మధ్యాహ్నం భోజనం పథకాన్ని ప్రైవేటుపరం చేయకుండా ఉండాలని. ప్రధానంగా. ఉపాధి హామీ పథకంలో. దేశవ్యాప్తంగా 12 కోట్లమంది.పనిచేసుకునే. జీవనోపాధి .పొందుతున్నారని. మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో 90 వేల మంది ఉపాధి కార్మికులు జీవనోపాధి పొందుతున్నారని.2005లో వామపక్షాలు కాంగ్రెస్ ప్రవేశపెట్టగా. గ్రామీణ ప్రాంతంలో వలస నివారణకు పట్టెడు అన్నం దొరికే అవకాశం ఉన్న పథకం ఉపాధి హామీ పథకం అని. ఈ పథకంలో .12 కోట్లమంది. పనిచేయగా. ఈ పథకాన్ని బిజెపి ప్రభుత్వం నిర్వీవరం. చేయడానికి ఈ పథకానికి 1,50,000 కోట్ల బడ్జెట్ అవసరం ఉండగా కేవలం 85 కోట్ల బడ్జెట్తో కొనసాగించడం మూలంగా ఉపాధి హామీ కార్మికులకు సరైన వేతనాలులేక సమయానికి బకాయిలు పెండింగ్ ఉండడం మూలంగా ఉపాధి హామీ కార్మికులకు తీవ్ర నష్టం జరుగుతుందని. సంవత్సరంలో 200 రోజుల పరిధిలో కల్పించాలని రోజుకు 600 రూపాయలు ఇవ్వాలని. తెలియజేస్తూ .బిజెపి ప్రభుత్వం .ఈజిఎస్.పథకాన్ని రద్దుచేసి. కార్పొరేట్ శక్తులకు ఉపయోగ పడే విధంగా చట్టాన్ని .తీసుకువచ్చిందని. ఈ సంవత్సరంలో 125. రోజుల పని కల్పిస్తామని బిజెపి ప్రభుత్వం డొల్లమాటలు చెబుతుందని. ఒక 100. 25 రోజుల. పని కల్పిస్తామని చెబుతుందని. పని కల్పిస్తే 3 లక్షల కోట్ల బడ్జెట్ అవసరం అవుతుందని సంవత్సరంలో 100 రోజులు ఆ పని కల్పిస్తే 1.50.000. కోట్ల బడ్జెట్ పెట్టండి. బీజేపీ ప్రభుత్వం మరియు 125 రోజుల పని దినాలను ఎట్లా .కూర్చుతుందో ఆ బిజెపి మాటలు .డొల్లతనం అని .తెలియజేస్తుందని. కేంద్ర ప్రభుత్వము 90 శాతం నిధులు తోటి ఈజీఎస్ పథకం పూర్తిస్థాయిలో అమలు చేయాల్సి ఉంది కానీ. బిజెపి ప్రభుత్వం కొత్త చట్టంలో 60 శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం 40% నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని దుర్మార్గమైన నిర్ణయం చేస్తుందని. ఉపాధి హామీ చట్టాన్ని .నిర్వీరం చేయడానికి తెలుగు రాష్ట్రాల పైన 2900. కోట్ల భారం పడి ఇప్పటికే ఆర్థిక భారంతో కొట్టు ముట్టాడుతున్న. రాష్ట్రాల పైన మరొక భారం పడడం. ఇది తక్షణమే. వి.పి.జి. రద్దు చేయాలి. ఉపాధి హామీ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని. తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర నాయకులు గుంటి వేణు. మధ్యాహ్న భోజన పథకం జిల్లా కార్యదర్శి మీసం లక్ష్మణ్. సిపిఐ మండల నాయకులు బచ్చపల్లి శంకర్. రాజేందర్. బాలయ్య. రాములు. మల్లయ్య. శంకర్. ఆనందు. రవి. నరసయ్య. గోవిందు. తదితరులు పాల్గొన్నారు
ఖమ్మంలో జరిగిన సిపిఐ వందేళ్ళ ఉత్సవాల బహిరంగ సభకు భారీగా తరలిన కరీంనగర్ జిల్లా సిపిఐ శ్రేణులు
కరీంనగర్, నేటిధాత్రి:
ఖమ్మంలో జరిగిన సిపిఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు బహిరంగ సభకు సిపిఐ కరీంనగర్ జిల్లా నాయకులు, కార్యకర్తలు, పార్టీ, ప్రజా సంఘాల శ్రేణులు భారీగా తరలి వెళ్లడం జరిగిందని సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం ఖమ్మం నగరంలోని ఎస్సార్ అండ్ బిజిఎన్నార్ మైదానంలో భారత కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాల ముగింపు బహిరంగ సభ రాష్ట్ర కార్యదర్శి కూనoనేని సాంబశివ రావు అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథులుగా సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ డి.రాజా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు నలభై దేశాల అంతర్జాతీయ కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధులు, జాతీయ రాష్ట్ర నాయకులు హాజరయ్యారు. ఖమ్మం నగరంలో లక్షలాది మందితో బహిరంగ సభ జరిగిందని, వందేళ్ల ఉద్యమ ప్రస్థానంలో కమ్యూనిస్టు పార్టీ నిర్వహించిన అనేక పోరాటాలు ఉద్యమాలు సాధించిన విజయాలపై నాయకులంతా సుదీర్ఘంగా వివరించారు. రానున్న రోజుల్లో భారతదేశంలో మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ నీ బలోపేతం చేయడం కోసం నిరంతరం పని చేయాలని వక్తలు దశ,దిశా నిర్దేశం చేశారనీ పంజాల శ్రీనివాస్ తెలిపారు. ఖమ్మంకు తరలి వెళ్ళిన వారిలో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, అందే స్వామి, జిల్లా కార్యవర్గ సభ్యులు బోయిని అశోక్, కొయ్యడ సృజన్ కుమార్,గూడెం లక్ష్మి, కసిరెడ్డి సురేందర్ రెడ్డి, బత్తుల బాబు, నాగెల్లి లక్ష్మారెడ్డి, బోయినీ తిరుపతి, పిట్టల సమ్మయ్య, న్యాలపట్ల రాజుతో పాటు జిల్లా వ్యాప్తంగా దాదాపుగా రెండు వేల మంది కార్యకర్తలు పాల్గొన్నారు.
సిపిఐ పైలాన్ ఓపెనింగ్ కార్యక్రమానికి వేలాదిగా తరలి రావాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి కోరిమి రాజ్ కుమార్ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ శతజయంతి వేడుకలు జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని సిపిఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ అన్నారు.స్థానిక రావి నారాయణరెడ్డి భవన్ లో జిల్లా నాయకులతో కలిసి సిపిఐ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది.అనంతరం వారు మాట్లాడుతూ భారత దేశ స్వాతంత్ర ఉద్యమం కోసం ఆనాడు 1925 డిసెంబర్ 26వ తేదీన కాన్పూర్లో మొట్టమొదటిసారిగా కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించిందన్నారు. నాటినుండి నేటి వరకు 100 సంవత్సర చరిత్రలో అనేక ఉద్యమాలు చేసి ప్రజల మన్నన పొందుతున్న ఏకైక పార్టీ కమ్యూనిస్టు పార్టీ అని కొనియాడారు. సంపూర్ణ స్వాతంత్రం కావాలని వందలాది కమ్యూనిస్టులను ప్రాణ త్యాగం చేసిన చరిత్ర ఉందని తెలిపారు. తెలంగాణ రైతంగ సాయుధ పోరాటంలో నాలుగువేల మంది కమ్యూనిస్టుల అమరుల త్యాగాలతో నిజాం దోరాలను తరిమిన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీకి ఉందని అన్నారు. శత జయంతి ఉత్సవాలన పురస్కరించుకొని భూపాలపల్లి పట్టణ కేంద్రంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద పైలాన్ ఓపెనింగ్ కార్యక్రమాన్ని ఈనెల 28వ తేదీన నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ పైలాన్ ఓపెనింగ్ కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హాజరవుతున్నారని కావున జిల్లా కేంద్రంలో ఉన్న పార్టీ శ్రేణులు, ప్రజా సంఘాల నాయకులు, ప్రజలు, కళాకారులు మేధావులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని రాజ్ కుమార్ కోరారు. భూపాలపల్లి పట్టణ కేంద్రంలో భగత్ సింగ్ కాలనీలో సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు ప్రవీణ్ కుమార్, కారల్ మార్క్స్ కాలనీ 25వ వార్డు శాఖలో ఖ్యాతరాజ్ సతీష్, సుభాష్ కాలనీ 29వ వార్డులో కొర్మి సుగుణ, 24వ వార్డులో వేముల శ్రీకాంత్, ఆర్టీసీ బస్టాండ్ వద్ద నేరెళ్ల జోసెఫ్,కృష్ణ కాలనీలో పీక రవికాంత్ లు సిపిఐ పతాక ఆవిష్కరణలు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి గురుజపల్లి సుధాకర్ రెడ్డి, గనగల జోగేష్, గడ్డం సింహాద్రి, గోలి లావణ్య, మట్టి కృష్ణ, గంప రాజు, ఎండి అస్లాం, కుమ్మరి రమేష్ చారి,పల్లెల రజిత, పెద్దమాముల సంధ్య, పోతుగంటి స్వప్న, వాసం రజిత, మట్టి నాగమణి, సుభద్ర తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి వాంకుడోత్ బికోజి (అజయ్ ) కి సిపిఐ పార్టీ సంపూర్ణ మద్దతు
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:
గుండాల మండల కాంగ్రెస్ పార్టీ బలపరిచిన మేజర్ గ్రామపంచాయతీ గుండాల సర్పంచ్ అభ్యర్థి వాంకుడోత్ బికోజి ( అజయ్) పోటీ చేస్తున్న స్థానానికి సిపిఐ పార్టీ సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశం లో ఆ పార్టీ మండల కార్యదర్శి వాగబోయిన రమేష్ మద్దతు ప్రకటించారు. బికోజి గెలుపు కోసం మా పార్టీ శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని వారు ఈ సందర్భంగా తెలిపారు. సిపిఐ పార్టీ శ్రేణులు పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండి ఈ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలనీ వారు పిలుపు నిచ్చారు ఈ కార్యక్రమంలో బచ్చల రామయ్య దారా అశోక్,షేక్ ఖదీర్,షేక్ అబ్దుల్ నవి,కాశీం,పొంబోయిన ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
సిపిఐ జిల్లా, పట్టణ కార్యదర్శులు రామడుగు లక్ష్మణ్ ,మిట్టపల్లి శ్రీనివాస్
రామకృష్ణాపూర్,నేటిధాత్రి:
క్యాతనపల్లి మున్సిపాలిటీ లో ఈ నెల 26 న నిర్వహిస్తున్న సిపిఐ శత జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని మంచిర్యాల జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్ లు అన్నారు. పార్టీ శ్రేణులతో కలిసి మంగళవారం రామకృష్ణాపూర్ పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో వారు మాట్లాడారు. భారత గడ్డపై సీపీఐ ఎన్నో పోరాటాలు , ప్రజా సమస్యలపై అలుపెరుగని ఉద్యమాలు నిర్వహించి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో రామకృష్ణాపూర్ పట్టణంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నామని, పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరుతున్నామని తెలిపారు. ఆర్కేపి ఉపరితల గని రెండో దఫా పనుల కోసం ప్రజాభిప్రాయ సేకరణ లో పాల్గొని, ఉపరితల గని వల్ల ఇబ్బంది కలిగే ప్రజల పక్షాన నిలబడతామని అన్నారు. ఉపాధి అవకాశాలు స్థానికులకు ఇవ్వాలని కోరతామని అన్నారు .ఈ కార్యక్రమంలో ఇప్పకాయల లింగయ్య, మిట్టపల్లి పౌలు, వనం సత్యనారాయణ, కాదండి సాంబయ్య, మొండి, ఈరవేణి రవీందర్,వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.
పరకాల మున్సిపల్ కమిషనర్ గా సోమిడి అంజయ్య సోమవారం నాడు బాధ్యతలు స్వీకరించారు.అనంతరం కార్యాలయ ఉద్యోగులు నూతన కమిషనర్ ను శాలువాతో సత్కరించి స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో గంజి వెంకట్ రెడ్డి,జూనియర్ అకౌంట్ ఆఫీసర్ హర్షద్,సీనియర్ అకౌంటెంట్ శ్రీనివాసరావు,అంజి,ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ రోహిత్ పాల్గొన్నారు.
రామకృష్ణాపూర్ గురుకుల సాంఘిక సంక్షేమ పాఠశాలలో రెండు రోజుల క్రితం గోల్డ్ చైన్ పోయిందని భావించి ఇద్దరు విద్యార్థినిలను పాఠశాల పి.ఈ.టి చితకబాదడం తో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ఎదుట తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడంతో జిల్లా కలెక్టర్ విచారణ జరిపించాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశాల మేరకు సోమవారం విచారణ చేపట్టారు. ఈ విచారణలో గురుకుల పాఠశాలల జోనల్ ఇన్చార్జ్ గిరిజ, జిల్లా ఇంచార్జ్ అధికారి కే. మహేశ్వరరావు, జిల్లా కోఆర్డినేటర్ రమా కల్యాణి, పట్టణ ఇంచార్జ్ ఎస్ఐ నూనె శ్రీనివాస్, సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్ లు పాల్గొన్నారు. బాధిత విద్యార్థినులు, వారి తల్లిదండ్రులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాల ఉపాధ్యాయురాళ్ళను, పాఠశాల ప్రిన్సిపాల్ ప్రేమా రాణి నీ కూడా అధికారులు విచారించారు. ఈ సందర్భంగా జోనల్ ఇంచార్జ్ గిరిజ మాట్లాడారు. పాఠశాలలో జరిగిన సంఘటన పై విచారణ జరపాలని కలెక్టర్ ఆదేశించడంతో మొదటగా విద్యార్థినులను, విద్యార్థినిల తల్లిదండ్రులను విచారించడం జరిగిందని, అనంతరం ఉపాధ్యాయులను, పిఈటి ని సైతం విచారించి వారందరి నివేదికను తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఉపాధ్యాయులలో కమ్యూనికేషన్ లోపం కనబడుతుందని అన్నారు. నివేదికను జిల్లా కలెక్టర్ కు పంపించడం జరుగుతుందని చెప్పారు.గురుకుల పాఠశాలల సెక్రటరీ కి సైతం నివేదిక పంపిస్తామని తెలియచేశారు.
పాఠశాలలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలి..
సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్,పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్
పాఠశాలలో విద్యార్థులకు సరైన సౌకర్యాలు లేవని, సుమారు 600 మంది విద్యార్థులు చదువుకుంటున్న పాఠశాలలో సీసీ కెమెరాలు సైతం సరిగా పనిచేయడం లేదని, పాఠశాల గదులలో ఫ్యాన్ లు కూడా లేవని అన్నారు. సంబంధంలేని విషయంలో విద్యార్థులను చితక బాధడం నేరమని వెంటనే సంబంధిత అధికారులు అట్టి ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని సిపిఐ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.
ఘనంగా మాజీ ఎమ్మెల్యే గుర్రం యాదగిరిరెడ్డి నాలుగవ వర్ధంతి
రామన్నపేట నేటిదాత్రి యాదాద్రి జిల్లా
రామన్నపేట పట్టణ కేంద్రంలో సిపిఐ మాజీ శాసనసభ్యులు తెలంగాణ సాయుధ పోరాట సమరయోధుడు కామ్రేడ్ గుర్రం యాదగిరి రెడ్డి నాలుగవ వర్ధంతి సందర్భంగా రామన్నపేట మండల కేంద్రంలో ఘనంగా నివాళులు జోహార్లు అర్పించి కామ్రేడ్ గుర్రం యాదగిరి రెడ్డి త్యాగాలను స్మరించుకుంటూ రామన్నపేట సిపిఐ మండల కార్యదర్శి ఊర్కూరి నరసింహ మాట్లాడుతూ మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది సొంత ఇల్లు కూడా లేకుండా ప్రజాసేవకు అతని జీవితాన్ని అంకితం చేశారు ప్రజలకు చేసిన సేవలు మరువలేనివి అని అన్నారు నేటి యువతకు యాదగిరి రెడ్డి జీవిత చరిత్ర ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని కోరారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ నాయకులు పట్టణ కార్యదర్శి రచ్చ యాదగిరి ఏఐటీయూసీ మండల కార్యదర్శి శివరాత్రి సమ్మయ్య మండల సహాయ కార్యదర్శి కళ్లెం రామచందర్ సీనియర్ కామ్రేడ్ ఊట్కూరి భగవంతు ఏనుతల రమేష్ ఊట్కూరి కృష్ణ సిహెచ్ మల్లేశం మీసం గాలయ్య కళ్లెం యాదగిరి కొండ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు
భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాల ముగింపు ఉత్సవాల సందర్బంగా డిసెంబర్ 26న ఖమ్మంలో జరిగే చలో ఖమ్మం కార్యక్రమంలో భాగంగా సీపీఐ జిల్లా కౌన్సిల్ మెంబర్ లంకదాసరి అశోక్ అధ్యక్షతన పరకాల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో సీపీఐ రాష్ట్ర సహాయక కార్యదర్శి తక్కళ్ల పల్లి శ్రీనివాసరావు కార్మిక నాయకులతో కలిసి జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది.అనంతరం అంబేద్కర్ సెంటర్ వద్దగల అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి బస్టాండ్ కూడలి వరకు పాదయాత్రగా వెళ్లడం జరిగింది.ఈ సందర్బంగా తక్కళ్లపల్లి శ్రీనివాస్ రావు మాట్లాడుతూ భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని తొలిత గర్జించిన ఏకైక పార్టీ సిపిఐ పార్టీ అని బ్రిటిష్ వారి నుండి మన దేశ విముక్తి కొరకు ఎ
న్నో పోరాటాలు చేసిందని భూమికోసం భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం నిజామును గద్దెదించటానికి జరిగిన మహత్కార తెలంగాణ సాయుధ పోరాటంలో నాలుగున్నర వేల మంది ప్రాణ త్యాగాలతో 3000 గ్రామాలకు విముక్తి జరిగించి పది లక్షల ఎకరాల భూమిని పంచిన ఘనత భారత కమ్యూనిస్టు పార్టీ దేనని ఆయన అన్నారు. భారత గడ్డపై సిపిఐ కి వందేళ్ల ముగింపు ఉత్సవాలు ఖమ్మంలో భారీ ఎత్తున నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి దినమంతా ఏకమై కదిలి రావాలని కోరారు.ఈ కార్యక్రమంలో కలవెన శంకర్ సిపిఐ కార్య వర్గ సభ్యులు,మరుపాక అనిల్ కుమార్ డిహెచ్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,దుప్పటి సాంబయ్య సీపీఐ సీనియర్ నాయకులు,సదా విజేయ లక్ష్మీ తదితర నాయకులు పాల్గొన్నారు.
సిపిఐ పార్టీ 100 ఏండ్ల ముగింపు సభను జయప్రదం చేయండి..
సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
సిపిఐ పార్టీ 100 ఏండ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో డిసెంబర్ 26న ఖమ్మం లో జరిగే ముగింపు సభను జయప్రదం చేయాలని, ఈనెల 15 న చోడే ఘాట్ నుండి భద్రాచలం వరకు జరిగే బస్సు జాతరను జయప్రదం చేయాలని మంచిర్యాల జిల్లా సిపిఐ కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ కోరారు. జోడేఘాట్ నుండి భద్రాచలం వరకు జరిగే బస్సు జాతర కరపత్రాలను రామకృష్ణాపూర్ పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు. అనంతరం రామడుగు లక్ష్మణ్ మాట్లాడారు. బస్సు జాతర కార్యక్రమానికి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సిపిఐ జాతీయ మాజీ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి హాజరవుతారని తెలిపారు. రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్ ,రాష్ట్ర ప్రచార కార్యదర్శి మారుపాక అనిల్, ఏ ఐ ఎస్ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మణికంఠ రెడ్డి తెలంగాణ ప్రజానాట్యమండలి కళాకారులు బస్సు జాతర వెంట ఉంటారని తెలిపారు. శతజయంతి ఉత్సవాలు, ఖమ్మంలో జరిగే ముగింపు భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని అన్ని వర్గాల ప్రజలను కోరుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమితి సభ్యులు ఇప్పకాయల లింగయ్య జిల్లా సమితి సభ్యులు మిట్టపల్లి పౌలు, మనం సత్యనారాయణ, మామిడి గోపి, రాములు, దేవానంద్, చందర్, శంకర్, మురళి తదితరులు పాల్గొన్నారు.
జెండా ఎగరవేసిన ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి క్యాతరాజు సతీష్
భూపాలపల్లి నేటిధాత్రి
స్థానిక జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఏఐటీయూసీ 106వ ఆవిర్భావ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని కొమురయ్య భవన్లో జెండా ఆవిష్కరణ ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి క్యాతరాజు సతీష్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్రం రాకముందు కార్మికుల యొక్క హక్కుల కోసం ఆవిర్భవించిన గొప్ప చరిత్ర ఉన్న ఏఐటీయూసీ ఆరోజు జరిగిన స్వాతంత్ర పోరాటంలో కూడా పాల్గొన్న ఏకైక కార్మిక సంఘం ఏఐటీయూసీ మాత్రమే అని అన్నారు. మోడీ ప్రభుత్వం కార్మికులు అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న 29 చట్టాలను నాలుగు లేబర్ కోడులుగా మార్చి హక్కు లేకుండా చేసి యాజమాన్యాలకు తొత్తులుగా చట్టాలు మార్పు చేశారన్నారు. కాంట్రాక్టు వ్యవస్థ రద్దు కోసం ,కనీస వేతనాలు అమలు కోసం, సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, ఉద్యోగ భద్రత కోసం నిరంతర ఉద్యమాలు కొనసాగిస్తూనే ఉందన్నారు …ఫ్యాక్టరీల చట్టం ,ఈఎస్ఐ చట్టం, పీఎఫ్ చట్టం ,ప్రసూతి ప్రయోజనాల చట్టం, బోనస్ చెల్లింపు చట్టం, గ్రాటిటీ చెల్లింపు చట్టం ,బాల కార్మిక నిషేధ చట్టం, ఉద్యోగుల పదవి విరమణ పెన్షన్ పథకం, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టం ,ఉపాధి హామీ చట్టం .వీటితోపాటు అనేక కార్మికుల హక్కుల కోసం చట్టాలను సాధించిన గొప్ప చరిత్ర కలిగిన యూనియన్ ఎఐటియుసి అని అన్నారు.. భవిష్యత్తులో మోడీ అనుసరిస్తున్న ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఏఐటీయూసీ ఇచ్చే పోరాట పిలుపులో భాగంగా కార్మికులంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు… ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు మోట పలుకుల రమేష్, ఏఐటీయూసీ బ్రాంచ్ అసిస్టెంట్ సెక్రటరీ సుధాకర్ రెడ్డి, సిపిఐ పట్టణ కార్యదర్శి ప్రవీణ్, ఎఐటియుసి నాయకులు కమలాకర్ ,శ్రావణ్ ,రాజు ,యాదగిరి రాజయ్య, పీక రవి ,భూమయ్య తోపాటు ఏఐటీయూసీ నాయకులు పాల్గొన్నారు
ప్రజాపక్షం దిన పత్రిక ప్రజల గొంతుకగా నిలుస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్ అన్నారు. ప్రజాపక్షం దిన పత్రిక 7వ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సిపిఐ కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కలవేన శంకర్, సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, ఎఐటియుసి జిల్లా కార్యదర్శి మేకల దాసు హాజరై కేక్ కట్ చేశారు.ప్రజల సమస్యలను పరిష్కరించడంలో,పారదర్శక పాలనను,ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో ప్రజాపక్షం దిన పత్రిక ఎనలేని కృషి చేస్తుందని వారు పేర్కొన్నారు.భవిష్యత్తులో ఈ పత్రిక మరింత ముందుకు వెళ్లాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రజాపక్షం జిల్లా ప్రతినిధి పార్వతి సురేష్ కుమార్,మంచిర్యాల ఆర్సీ ఇన్చార్జి కేశేటి వంశీ,నస్పూర్ మండల విలేకరి నారగొని పురుషోత్తం,గంగారపు గౌతమ్,కుమ్మరి సతీష్, చిట్యాల వినీత్ తదితరులు పాల్గొన్నారు.
సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలు జరపాలని హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేయాలని బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జరిగే నేటి తెలంగాణ రాష్ట్ర బంద్ కు సిపిఐ సంపూర్ణ మద్దతు తెలుపుతోందని సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్ లు అన్నారు. రామకృష్ణాపూర్ పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్ లు మాట్లాడారు. బీసీలు దశాబ్ద కాలంగా రిజర్వేషన్లు పెంచాలని పోరాటాలు చేస్తున్న నేపద్యంలో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ లు కల్పించాలని తలపెట్టిన బంద్ కు వ్యాపార, వాణిజ్య, విద్యాసంస్థలు, అన్ని కుల సంఘాలు,అన్ని వర్గాల ప్రజలు సహకరించి బంద్ లో పాల్గొనాలని తెలిపారు. అగ్రకులాల వారు బీసీ రిజర్వేషన్ ఆపాలని కోరుతూ స్టే తీసుకొచ్చిన నేపథ్యంలో బంద్ కు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఇప్పకాయల లింగయ్య, సాంబయ్య , మొండి, పౌలు, మారేపల్లి రవి, రాయలింగు,రాములు,దేవానంద్, గోపి, రాజన్న తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ నేత, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దివంగత గుండా మల్లేష్ సేవలు మరువలేనివని సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ పేర్కొన్నారు. సోమవారం గుండా మల్లేష్ ఐదవ వర్ధంతిని రామకృష్ణాపూర్ పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో సిపిఐ పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్, సీపీఐ నాయకుల తో కలిసి వర్ధంతి వేడుకలు నిర్వహించారు. గుండా మల్లేష్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడారు. బెల్లంపల్లి ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల సంక్షేమానికి కృషి చేశారన్నారు. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఆయన వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆయన ఆశయాలను కొనసాగిం చాలంటే ప్రతీ కార్యకర్త క్రమశిక్షణతో పని చేయాలన్నారు. బడుగు బలహీన వర్గాల పేద ప్రజల కోసం పరితపించేవారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు పాల్గొన్నారు.
సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు న్యాలపట్ల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి
కరీంనగర్, నేటిధాత్రి:
భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కరీంనగర్ జిల్లా కౌన్సిల్ సభ్యులు న్యాలపట్ల రాజు మాతృమూర్తి న్యాలపట్ల మల్లవ్వ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో గన్నేరువరం మండలం గునుకులకొండాపూర్ గ్రామంలో రాజు నివాసానికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులను సిపిఐ జాతీయ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పరామర్శించిన అనంతరం మల్లవ్వ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ గునుకులకొండాపూర్ గ్రామంలో భారత కమ్యూనిస్టు పార్టీ నిర్మాణంలో న్యాలపట్ల మల్లవ్వ పాత్ర ఉందని, గత నలభై సంవత్సరాలుగా వారి కుటుంబమంతా సిపిఐకి అండగా ఉంటున్నారని, తాను ఉమ్మడి కరీంనగర్ జిల్లా సిపిఐ కార్యదర్శిగా, ఇందుర్తి శాసనసభ్యులుగా పని చేస్తున్న కాలంలో మల్లవ్వతో, వారి కుటుంబసభ్యులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, మల్లవ్వ చిన్న కుమారుడు రాజు విద్యార్థి యువజన దశ నుండే అనేక పోరాటాల్లో పాల్గొన్నాడని, ప్రస్తుతం సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులుగా కొనసాగుతున్నాడని, ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు నిర్వహిస్తున్న క్రమంలో అనేక ఆటుపోటులను ఎదుర్కొని కేసుల పాలై జైలు జీవితం గడిపాడని, నాడు జనశక్తి వారితో ప్రాణహాని ఉన్నప్పటికీ కూడా మల్లవ్వ గానీ వారి కుటుంబం గానీ మొక్కవోని ధైర్యంతో ఉన్నారని, కుమారునికి ప్రాణహాని ఉన్నప్పటికీ కూడా మల్లవ్వ ఎంతో ధైర్యంగా ఉండేదని అలాంటి మల్లవ్వ మృతి చెందడం అత్యంత బాధాకరమని వారి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వారి కుటుంబానికి సానుభూతిని తెలియజేయడంతో పాటు అండగా సిపిఐ ఉంటుందని వెంకటరెడ్డి తెలిపారు. ఈకార్యక్రమంలో వారిలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేన శంకర్, జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అందె స్వామి, కసిరెడ్డి మణికంఠ రెడ్డి, కరీంనగర్, సిద్దిపేట జిల్లాల సిపిఐ కార్యవర్గ సభ్యులు పోతిరెడ్డి వెంకటరెడ్డి, జాగీరు సత్యనారాయణ, నాగెళ్లి లక్ష్మారెడ్డి, కసిరెడ్డి సురేందర్ రెడ్డి, సిపిఐ గన్నేరువరం మండల కార్యదర్శి చొక్కల్ల శ్రీశైలం, జిల్లా కౌన్సిల్ సభ్యులు కాంతాల అంజిరెడ్డి, బూడిద సదాశివ, సీతారాంపూర్ మాజీ సర్పంచ్ గోలీ బాపు రెడ్డి, నవాబుపేట మాజీ ఉపసర్పంచ్ ఎలగందుల రాజయ్య, సిపిఐ మండల నాయకులు మల్లయ్య, శ్రీనివాస్, అంజయ్య, తదితరులు ఉన్నారు.
నర్సంపేట శాసన సభ్యులు మాతృమూర్తి దొంతి కాంతమ్మ గత కొన్ని రోజుల క్రితం మరణించగా గురువారం సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు పంజాల రమేష్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని కలసి విమర్శించారు. కాంతమ్మ చిత్రపటానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట మండల కార్యదర్శి అయిత యాకుబ్, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు పాలక కవిత, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు దిడ్డి పార్థసారధి, మాదన్నపేట రోడ్ సిపిఐ శాఖ కార్యదర్శి పిట్టల సతీష్, సహాయ కార్యదర్శి బాధరబోయిన యాదగిరి, గడ్డం నాగరాజు, మాతంగి సురేష్,కమ్మాల అరుణ, గౌరబోయిన పద్మ,కోలుగురి రాధిక తదితరులు పాల్గొన్నారు.
షేక్ జావిద్ ఆధ్వర్యంలో పరామర్శ..
తెలంగాణ జన సమితి పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు షేక్ జావిద్ ఆధ్వర్యంలో నర్సంపేట ఎమ్మెల్యే పంది మాధవరెడ్డి హనుమకొండలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పరామర్శించారు. షేక్ జావిద్ తో విద్యావంతుల వేదిక వరంగల్ జిల్లా అధ్యక్షులు ఎండి మహబూబాబాద్ వరంగల్ జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు మీర్జా మసూద్ అలీ మహమ్మద్ నుమాన్ మహమ్మద్ యూసుఫ్ ఆఫీస్ ఇర్ఫాన్ సాబ్ మహమ్మద్ హర్షద్ శ్రవణ్ లు ఎమ్మెల్యే తల్లి కాంతమ్మ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
స్వచ్చంధ సంస్థల ప్రతినిధుల పరామర్శ..
నర్సంపేట ఎంఎల్ఏ దొంతి మాధవరెడ్డిని తన నివాసంలో నర్సంపేట పట్టణ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పరామర్శించారు. ఎమ్మెల్యే తల్లి దొంతి కాంతమ్మ చిత్ర పటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్వచ్చంధ సంస్థల సమాఖ్య అధ్యక్షులు, కన్స్యూమర్ ఫోరమ్ జిల్లా అధ్యక్షులు గిరగాని సుదర్శన్ గౌడ్,ఏ.ఎస్.ఆర్. సంస్థ నిర్వాహకులు ఎర్రబోయిన రాజశేఖర్, స్వయంకృషి సంస్థ నిర్వాహకులు బెజ్జంకి ప్రభాకర్, ప్రతిభ సంస్థ ప్రతినిధి బోయిని వెంకటస్వామి, స్వేచ్ఛశ్రీ సంస్థ నిర్వాహకురాలు మైస వసంత, కన్స్యూమర్ ఫోరమ్ విజిలెన్స్ కమిటీ మెంబెర్ నాగేల్లి సారంగం గౌడ్,మెడికల్ స్టోర్స్ అసోసియేషన్ ప్రతినిధి రవికాంత్, సోషల్ వాలంటీర్ కాసుల వెంకటాచారి, రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్ కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
సిపిఐ మాజీ ప్రధాన కార్యదర్శి,పార్లమెంట్ మాజీ సభ్యులు కామ్రేడ్ సంస్మరణ సభ
జహీరాబాద్ నేటి ధాత్రి:
సిపిఐ మాజీ ప్రధాన కార్యదర్శి, పార్లమెంట్ మాజీ సభ్యులు కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభ 2025 ఆగస్టు 30వ తేదీన హైదరాబాద్లోని, రవీంద్రభారతి యందు ఉదయం 11.00 గంటలకు జరగనున్నది. ఈ సంస్మరణ సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ‘. డి.రాజా, సిపిఐ జాతీయ కార్యదర్శులు డాక్టర్ కె.నారాయణ, కామ్రేడ్ సయ్యద్ అజీజ్ పాషా ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నారు.ఈ సంస్మరణ సభకు ప్రతి జిల్లా నుంచి 50 మందికి తక్కువ కాకుండా కోట ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే మన సంగారెడ్డి జిల్లాకు 50 మంది కోట ఇవ్వడం జరిగింది ఆగస్టు 30వ తేదీన ఉదయం 11.00 గంటలకు హైదరాబాద్ లోని రవీంద్రభారతికి సకాలంలో హాజరు కావాల్సిందిగా కోరుతున్నాను. ఈ సంస్మరణ సభలో పాల్గొనే వారందరూ పురుషులు ఎర్ర చొక్కాలు, స్త్రీలు ఎర్ర చీరలను ధరించి రావాల్సిందిగా కోరుతున్నామన్నారు,
25 వ వార్డు సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా
క్యాతరాజు సతీష్ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి మున్సిపల్ పరిధిలో ఉన్న కారల్ మార్క్స్ కాలనీ 25వ వార్డులో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 25వ వార్డు శాఖా సమితి ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది అనంతరం మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు 25వ వార్డు ఇంచార్జ్ సతీష్ మాట్లాడుతూ 25వ వార్డులో మంచినీటి సౌకర్యం కల్పించాలని మిషన్ భగీరథ ద్వారా వచ్చే నీటి విడుదల సమయాన్ని పెంచాలని పరిశుభ్రమైన నీరును విడుదల చేయాలని, కాలనీలో అంతర్గత రోడ్లను నిర్మించాలని, సైడ్ కాల్వల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించాలని, 6 ఇంక్లైన్ గని గోడకు సింగరేణి స్కూల్ గోడకు మధ్యలో ఉన్న రోడ్డుపై చెత్తాచెదారం పేరుకుపోయి ఉండడం మూలాన ఆ రహదారి మొత్తం డంపింగ్ యార్డ్ ల తయారైన పరిస్థితి కనపడుతుందన్నారు దీని మూలాన కార్మికులు స్కూలుకు పోయే పిల్లలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మున్సిపల్ అధికారులు తక్షణమే ఆ రోడ్డుపై ఉన్న చెత్తాచెదారాన్ని తొలగించాలని, కోరారు అంతేకాకుండా వార్డులో వీధి దీపాలు వెలగడం లేదని అడిగితే టెండర్ అయిపోయిందని సమాధానం గత రెండు నెలలుగా చెబుతున్నారని ఇకనైనా వీధిలైట్లు ఏర్పాటు చేయాలని కోరారు అంతేకాకుండా వార్డులో ఉన్న సెల్ టవర్ ను తొలగించాలని డిమాండ్ చేశారు సమస్యలతో సతమతమవుతున్న కాలనీ ప్రజలను మున్సిపల్ అధికారులు చొరవ తీసుకొని సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు లేనియెడల సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు నేరెళ్ల జోసెఫ్, డి హెచ్ పి ఎస్ జాతీయ సమితి సభ్యురాలు పొన్నగంటి లావణ్య, 25 వ వార్డు మహిళా నాయకురాలు పల్లెల రజిత, పెద్దమాముల సంధ్య, క్యాత రాజు అనూష, పోతుగంటి స్వప్న, గుండేటి శివకుమార్, బిల్ సింగ్, మట్టి కృష్ణ, తోపాటు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
క్యాంపు కార్యాలయంలో జెండా ఎగరావేసిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి
పలు ప్రభుత్వ కార్యాలయాల్లో జెండా ఎగరవేసిన అధికారులు
పరకాల నేటిధాత్రి పరకాల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో అమరధామం యందు ఆగస్టు 15 రోజున 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా శాసనసభ్యులు రేవూరిప్రకాశ్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్బంగా జాతీయ పతాకాన్ని ఎగరావేశారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు,అధికారులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
ఆర్డీఓ కార్యాలయంలో….
పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో 79వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్డీఓ డాక్టర్.కన్నం.నారాయణ జెండా ఎగరావేయడం జరిగింది.అనంతరం జాతీయ గీతాలాపన చేశారు.ఈ కార్యక్రమంలో అధికారులు,కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
పోలీస్ స్టేషన్ లో….
79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణలోని పరకాల పోలీస్ వారి ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్ క్రాంతికుమార్ స్టేషన్ ప్రాంగణం లో జెండా ఎగరవేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎస్ఐలు రమేష్ బాబు,విఠల్,మహిళపోలీసులు,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
CI Krantikumar
ఎమ్మార్వో కార్యాలయంలో…..
పట్టణంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో 79వ స్వతంత్ర దినోత్సవం సందర్బంగా ఎమ్మార్వో విజయలక్ష్మి జెండా ఎగరావేయడం జరిగింది.ఈ సందర్బంగా మాట్లాడుతూ మహనీయులను అనుదినం స్మరించుకోవాలని వారి త్యాగల ఫలమే ఈ రోజని అన్నారు.ఈ కార్యక్రమంలో డీటీ.సుమన్,ఎలక్షన్ డీటీ.సూర్యప్రకాష్,ఎం.ఆర్ఐ అశోక్ రెడ్డి,దామోదర్,ఏఎస్ఓ కుమారస్వామి, ధరణి ఆపరేటర్ రఘుపతి,సీనియర్ అసిస్టెంట్ శ్రీకాంత్,ఎలక్షన్ సీనియర్ అసిస్టెంట్ భద్రయ్య, జూనియర్ అసిస్టెంట్ అర్జున్,రాజు తదితరులు పాల్గొన్నారు.
ఎంపిడిఓ కార్యాలయం లో…….
79 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగ మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి పెద్ది.ఆంజనేయులు జాతీయ పతాకాన్ని ఎగరావేశారు.అనంతరం విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో అవోపా అధ్యక్షులు ఎల్లంకి బిక్షపతి,కార్యాలయ పర్యవేక్షకులు సిహెచ్ శైలశ్రీ, ఏపిఓ ఇందిర,కార్యాలయ, ఈజీయస్ సిబ్బంది,కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
వ్యవసాయ మార్కెట్ లో……
స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ,ఏఐటీయూసీ హమాలి యూనియన్ ఆధ్వర్యంలో సిపిఐ జిల్లాకౌన్సిల్ సభ్యుల లంక దాసరి అశోక్ అధ్యక్షతన 79వ స్వతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.అనంతరం హమాలి యూనియన్ నాయకులు మహనీయుల చిత్రపటాలకు పూలతో నివాళులు అర్పించి జెండావిష్కరణ చేశారు.ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నాగెళ్లి శంకర్,శ్రీపతి రాజయ్య,హమాలీ సీనియర్ ముఠామేస్త్రి బొట్ల భద్రయ్య,కొడపాక ఐలయ్య,కోయిల శంకరయ్య,కోట యాదగిరి,గుట్ట రాజయ్య ల్,దొడ్డే పోచయ్య,కార్మిక నాయకులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.