మానవ హక్కుల అవగాహన కై విద్యార్థుల ర్యాలీ..

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-11T114655.902.wav?_=1

 

మానవ హక్కుల అవగాహన కై విద్యార్థుల ర్యాలీ

మందమర్రి నేటి ధాత్రి

 

మందమర్రి పట్టణంలో మానవ హక్కుల అవగాహనకై పాఠశాల విద్యార్థులచే ర్యాలీమందమర్రి పట్టణంలో ఈరోజు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మదర్ తెరిసా పాఠశాల విద్యార్థులచే మానవ హక్కుల పై అవగాహన కలిగించేందుకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థ మహిళా మదర్ తెరిసా ఎడ్యుకేషనల్ సొసైటీ సర్వీస్ సెక్యూరిటీ మందమరి కే భువనేశ్వరి ప్రిన్సిపల్ ఎన్జీవో మాట్లాడుతూ రాజ్యాంగం ప్రజలకు సమాజంలో స్వేచ్ఛ స్వాతంత్ర్యాలతో జీవించడానికి హక్కులను విధులను ఏర్పాటు చేయడం జరిగిందని మానవ హక్కులను మనమంతా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని కుల మత భేదాలు లేకుండా సమానత్వంగా జీవించడానికి మానవ హక్కుల గురించి విద్యార్థులకు తెలియజేసేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. రాజ్యాంగం మనకు హక్కులతో పాటు విధులను కూడా ఏర్పాటు చేసిందని వాటిని అనుసరిస్తూ రాజ్యాంగబద్ధంగా విధానం ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మదర్ తెరిసా పాఠశాల విద్యార్థులు స్వచ్ఛంద సంస్థ సభ్యులు పాల్గొన్నారు.

మందమర్రిలో విద్యార్థులకు నాసా కిట్ల పంపిణీ

విద్యార్థులకు నాసా కిట్టు అందజేత

మందమర్రి నేటి ధాత్రి

 

శ్రీ చైతన్య మందమర్రి బ్రాంచ్ ఈ రోజు నాసా ప్రోగ్రాములో పాల్గొన్న విద్యార్థులకు నాసా కిట్టు అందజేసినారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిధిగా మందమర్రి ఎస్.ఐగా విధులు నిర్వహిస్తున్న రాజశేఖర్ గారు పాల్గొన్నారు నాసాలో పాల్గొన్న విద్యార్థుల “అందరికీ “నాసా కిట్టును అందజేస్తారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి వారు మాట్లాడారు శ్రీ చైతన్య పాఠశాలలో విద్యతో పాటు విజ్ఞాన దాయకమైన కార్యక్రమాలను నిర్వహించడం ఆనందదాయకమైన విషయమని అన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన పాఠశాల యాజమాన్యాన్ని అభినంధించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఏ.జి.యం అరవింద్ రెడ్డి గారు, అకాడమిక్ కో ఆర్డినేటర్ బి. నాగరాజు గారు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఎం. రమేష్ గారు, అకాడమిక్ డీన్ కె.రవికుమార్ గారు, ప్రైమరి ఇంచార్జ్ ఎన్. సునితగారు, ప్రైమరీ ఇంచార్జ్ ఎ. తిరుమలగారు, నాసా ఇంచార్జ్ అదితి గార్లతో పాటు పాఠశాల ఉపాధ్యాయునీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

పత్తి రైతుల సమస్యను పరిష్కరించాలని అధికారులకు వినతి పత్రం…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-24T155913.136.wav?_=2

 

పత్తి రైతుల సమస్యను పరిష్కరించాలని అధికారులకు వినతి పత్రం

 

మందమర్రి మండలంలోని రైతులు ఐక్యంగా రైతు వేదికను సందర్శించి, కౌలు రైతుల సంక్షేమం కోసం అధికారులతో విస్తృతంగా సమావేశమయ్యారు.
రైతులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న పలు కీలక సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా కాపస్ కిసాన్ యాప్ కారణంగా రైతులు అనేక సాంకేతిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, పత్తి కొనుగోలు ప్రక్రియలో ఆలస్యాలు అవరోధాలు ఏర్పడుతున్నాయని రైతులు వివరించారు.

ప్రస్తుతం యాప్ ఆధారంగా కేవలం 7 క్వింటాళ్ల వరకు మాత్రమే పత్తిని కొనుగోలు చేయడం రైతులకు భారీ నష్టాన్ని కలిగిస్తోందని, రైతుల వాస్తవ ఉత్పత్తి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ పరిమితిని 12 క్వింటాళ్ల వరకు పెంచాలని రైతులు అధికారులు ముందు వినతిపత్రం ద్వారా అధికారికంగా కోరారు. చిన్న, మధ్య తరహా కౌలు రైతులు యాప్ లోపాల వల్ల ఆర్థికంగా ఇబ్బందులలో పడుతున్నారనీ, ప్రభుత్వం రైతుల పట్ల సానుభూతితో వ్యవహరించాలని వారు అభ్యర్థించారు.

ఈ సమావేశంలో రైతులు తమ సమస్యలను స్పష్టంగా వివరించడమే కాకుండా, పత్తి కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలను మెరుగుపరచడం, తూకం చర్యల్లో పారదర్శకత, చెల్లింపుల్లో వేగం వంటి అంశాలను కూడా ఉటంకించారు. రైతుల ఏకగ్రీవ అభిప్రాయం ఏమిటంటే కౌలు రైతుల సమస్యలను ప్రభుత్వం అత్యవసరంగా పరిష్కరించాలి.

ఈ కార్యక్రమంలో మండలంలోని పలువురు రైతు నాయకులు, సంఘ ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొని ఐక్యంగా తమ మద్దతు తెలిపారు. రైతుల ఆశాభావం ఏమిటంటే, ఈ వినతి పత్రం ద్వారా వచ్చిన అంశాలను అధికారులు ప్రాధాన్యంగా పరిగణించి తగిన చర్యలు తీసుకుని రైతుల ను ఆదుకోవాలని విజ్ఞప్తి చేసారు.

వందేమాతర గీతం ప్రచురించి నేటికి 150 సంవత్సరాలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-21T160234.230.wav?_=3

 

వందేమాతర గీతం ప్రచురించి నేటికి 150 సంవత్సరాలు

 

వందేమాతర గీతం ప్రచురించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మందమర్రి మండలంలోని ఆదిల్పెట్ చౌరస్తాలో సామూహిక వందేమాతరం జీతాల పని చేయడం ఏర్పాటు జరిగింది

ఆనాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ

స్వాతంత్ర్య సంగ్రామంలో వందేమాతర నినాదం ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చిందని, బ్రిటిష్ ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించిందని అన్నారు. ప్రతి ఒక్కరూ వందేమాతర గీతాన్ని గుండెల్లో నింపుకుని దేశ పురోభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు

ఈ సామూహిక వందేమాతరం గీతాలపన కార్యక్రమంలో గ్రామ ప్రజలు,విద్యార్థులు, ఉపాధ్యాయులు, యువకులు

భారతీయ జనతా పార్టీ నాయకులు డి.వి దీక్షితులు, దేవర్నేని సంజీవరావు, గిరినేటి జనార్ధన్, వంజరీ వెంకటేష్, పెంచాల రంజిత్, దుర్గం మల్లేష్, బోర్లకుంట లక్ష్మణ్, ఎనుగందుల రాజయ్య, ధారవేణి రవి, కాపురపు వినయ్, రాచర్ల మహేందర్,కొమురోజు రాము, సుంకరి ప్రవీణ్ ,ఏనుగందుల సత్యం, సాయి తదితరులు పాల్గొన్నారు

ఘనంగా మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలి జన్మదిన వేడుకలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-21T155737.165.wav?_=4

 

ఘనంగా మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలి జన్మదిన వేడుకలు

మందమర్రి నేటి ధాత్రి

 

పీసీసీ సభ్యులు నూకల రమేష్ గారి ఆధ్వర్యంలో మంచిర్యాల డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్‌సాగర్ రావు గారి జన్మదిన వేడుకలను మందమర్రి పట్టణంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా నూకల రమేష్ మాట్లాడుతూ, మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీకి సురేఖమ్మ గారు ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. ఆమె అధ్యక్షతలో జిల్లాలోని మూడు నియోజకవర్గాలను అత్యధిక మెజారిటీలతో గెలిపించడంలో ఆమె కృషి ఎంతో గొప్పదని పేర్కొన్నారు.

భారత్ జోడో యాత్ర, ఆజాద్ కి గౌరవ్ యాత్ర, రాజీవ్ సద్భావన యాత్రల సందర్భంగా ఆమె వందల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. అహర్నిశలు కార్యకర్తలకు అండగా నిలబడుతూ, పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికై నిరంతరం కృషి చేస్తున్న నాయకురాలు సురేఖమ్మ గారు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో టీపీసీసీ మాజీ కార్యనిర్వాహక కార్యదర్శి ఎండి ముజాహిద్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సిద్ధం జనార్దన్, సీనియర్ జిల్లా నాయకులు నర్సోజీ, యువజన కాంగ్రెస్ నాయకులు నరేందర్, రంజిత్, నవీన్, కిరణ్, సతీష్, సురేష్, అనిరుద్, సంతోష్ తదితర నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

స్మశాన వాటిక సాధన కోసం సంతకాల సేకరణ…

స్మశాన వాటిక సాధన కోసం సంతకాల సేకరణ

మందమర్రి నేటి ధాత్రి

 

యాపల్, అంగడి బజార్‌ పాత బస్టాండ్ లో వెయ్యికి పైగా సంతకాలు సేకరణ!

మంచిర్యాల జిల్లా,మందమర్రి: పట్టణంలోని యాపల్ అంగడి బజార్, పాత బస్టాండ్ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్ర సమస్య అయిన స్మశాన వాటిక లేమిపై ‘స్మశాన వాటిక సాధన కమిటీ’ బుధవారం రోజు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. తమ ప్రాంతంలో స్మశానం లేకపోవడం వల్ల దశాబ్దాలుగా పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టమని తెలిపారు
ఏడు దశాబ్దాల సమస్య
యాపల్ అంగడి బజార్, పాత బస్టాండ్ పరిసర ప్రాంతాల ప్రజలు గత సుమారు 70 సంవత్సరాలుగా స్మశాన వాటిక లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో కేకేటు ప్రాంతం వద్ద ఉన్న స్థలాన్ని స్మశాన వాటిక కోసం ఉపయోగించారు. అయితే, ఇటీవల ఆ స్థలం కూడా కబ్జాకు గురి కావడంతో సమస్య మరింత జటిలమైంది.
వెయ్యికి పైగా సంతకాలు సేకరణ
ప్రజలు ఈ దీర్ఘకాలిక సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు స్మశాన వాటిక సాధన. కమిటీ సభ్యులు వాడవాడలా తిరిగి, పాత బస్టాండ్ ప్రాంతంలో ప్రత్యేకంగా శిబిరం ఏర్పాటు చేసి సంతకాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో సుమారు 1000కి పైగా సంతకాలను స్వీకరించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు.
ఎమ్మార్వో కార్యాలయంలో వినతి
సేకరించిన ఈ సంతకాలను ఎం.ఆర్.వో కార్యాలయంలో అందజేసి, సమస్య తీవ్రతను తెలియజేయాలని కమిటీ సభ్యులు నిర్ణయించుకున్నారు. స్మశాన వాటిక సాధన కమిటీ సభ్యులందరూ ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని, ప్రజల నుంచి విస్తృత మద్దతు పొందారు. స్మశాన వాటిక కోసం తమ పోరాటాన్ని కొనసాగిస్తామని కమిటీ సభ్యులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్మశాన వాటిక సాధన కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

రిజర్వేషన్లు 42% లేకుంటే యుద్ధమే…

రిజర్వేషన్లు 42% లేకుంటే యుద్ధమే

మందమర్రి నేటి ధాత్రి

 

42శాతం రిజర్వేషన్లు లేకుండా స్థానిక ఎన్నికలునిర్వహిస్తే ప్రభుత్వం పై యుద్దమే…

కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో రాజ్యాంగ సవరణ *బిల్లు సత్వరమే ప్రవేశపెట్టాలి….

ఈరోజు మందమర్రి పట్టణంలో సింగరేణి హై స్కూల్ గ్రౌండ్ లో బీసీ సమాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన చాయ్ పే చర్చ కార్యక్రమంలో నరెడ్ల శ్రీనివాస్ బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు అన్నారు. వివిధ బీసీ కుల సంఘాలతో మాట్లాడి బీసీలకు న్యాయం గా రావాల్సిన హక్కుల గూర్చి చర్చించడం జరిగింది.
ఈ సందర్భంగా మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్ బిల్లు రాజ్యాంగ సవరణ కోసం పార్లమెంట్లో ప్రవేశపెట్టి రాజ్యాంగ సవరణ చేసి 42% రిజర్వేషన్ల కు రాజ్యాంగం బద్దంగా చేయాలని విజ్ఞప్తి చేస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ. నరెడ్ల ‌శ్రీనివాస మాట్లాడుతూ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు 130 సార్లు రాజ్యాంగ సవరణలు చేశారు అలాగే ఏ ఉద్యమం లేకుండానే అగ్రకులాలకు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 103ను ఐదు రోజుల్లో సవరణ చేసి 10% ఈ డబ్ల్యూ ఎస్ రిజర్వేషన్లు కల్పించిన కేంద్ర ప్రభుత్వం 40 సంవత్సరాలుగా బీసీలకు విద్యా ఉద్యోగ స్థానిక సంస్థలు చట్టసభలలో రిజర్వేషన్లు కల్పించాలని ఉద్యమాలు చేస్తున్న బీసీలకు ప్రజాస్వామ్య వాటా ఇవ్వకపోవడం బాధాకరం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం బీసీల న్యాయమైన డిమాండ్ ను గుర్తించి 42 శాతం రిజర్వేషన్లపై రాజ్యాంగ సవరణ చేసి కేంద్ర ప్రభుత్వం బీసీల పక్షాన నిలబడాలని కోరుకుంటున్నాం లేనిపక్షంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నా మన్నారు.
ఈ కార్యక్రమంలో కార్మిక నాయకుడు సేలంద్ర సత్యనారాయణ
మైనార్టీ నాయకులు ఎండి ఎండి అబ్బాస్
సగర సంగం జిల్లా అధ్యక్షులు బర్ల సదానందం‌‌ పద్మశాలి సంఘ జిల్లా అధ్యక్షుడు చిలగాని సుదర్శన్ ‌మరియు నాయకులు
ఒజ్జా సాగర్ బాబు దూడపాక రాజేందర్
శనిగారపు జనార్ధన్ బిసి సమాజ్ నాయకులు వెన్నంపల్లి రవీందర్ అంకం సాగర్
శీలం మహేందర్
డాక్టర్ పోషం
కంది తిరుపతి
నస్పూరి తిరుపతి
పిల్లి మల్లేష్
బర్ల శేఖర్
శేఖర్ సార్ బీసీ కుల సంఘాల నాయకులు స్థానిక నేతలు తదితరులు పాల్గొన్నారు.

అసైన్డ్ భూముల్లోనీ వెంచర్లల్లో ఫ్లాట్లు కొనుగోలు చేయకండి..

అసైన్డ్ భూముల్లోనీ వెంచర్లల్లో ఫ్లాట్లు కొనుగోలు చేయకండి..

మందమర్రి ఎమ్మార్వో సతీష్

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

రామకృష్ణాపూర్ పట్టణంలో అసైన్డ్ భూములు అన్యక్రాంతమవుతున్నాయని, అసైన్డ్ భూముల్లో వెంచర్లు వేస్తున్నారనీ ,ఫిర్యాదులు వస్తున్నాయని మందమర్రి ఎమ్మార్వో సతీష్ తెలిపారు. అసైన్డ్ భూములను ఆక్రమించి వెంచర్లు చేసి ఫ్లాట్లు ఏర్పాటు చేస్తే అట్టి ఫ్లాట్లు ప్రజలెవరూ కొనుగోలు చేయరాదని ఎమ్మార్వో సతీష్ స్పష్టం చేశారు. ప్రభుత్వ అనుమతులు లేని ఫ్లాట్లను కొనుగోలు చేయవద్దని, ప్రభుత్వ భూముల్లో ఎవరైనా వెంచర్లు చేసి ఫ్లాట్లుగా మార్చి క్రయ విక్రయాలు జరిపినచో చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రామకృష్ణాపూర్ పట్టణంలో గల మూతపడిన పాఠశాలల స్థలాలు సైతం ఫ్లాట్లుగా చేసి విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోబడతాయని, అట్టి భూములను మళ్లీ ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోబడతాయని అన్నారు.

యువతి యువకులకు రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు…

యువతి యువకులకు రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు

మందమర్రి నేటి ధాత్రి

 

రోడ్డు భద్రతపై మందమర్రి పోలీసుల క్రియాశీలక అడుగులు: యువతతో ‘రోడ్డు భద్రతా కమిటీ’ ఏర్పాటు

మంచిర్యాల జిల్లాలోని మందమర్రి పట్టణంలో రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా పోలీస్ శాఖ ఒక ముఖ్యమైన అవగాహన సదస్సును నిర్వహించింది. ముఖ్యంగా యాపల్, అంగడి బజార్, మేదరి బస్తి ప్రాంతాల్లో తరచుగా జరుగుతున్న ప్రమాదాల దృష్ట్యా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. యాపల్ ప్రాంతంలో జాతీయ రహదారి (ఎన్.హెచ్)రోడ్డు పై జరుగుతున్న ప్రమాదాలు నాలుగు నెలల్లోనే నాలుగు-ఐదు ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోవడంపై అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ఈ సదస్సును యాపల్ ప్రాంతంలోనే నిర్వహించడం జరిగింది.

అవగాహన అంశాలు:

ఈ సదస్సులో పోలీసులు రహదారి భద్రత ప్రాముఖ్యత, ట్రాఫిక్ నియమ నిబంధనలు, తప్పనిసరిగా సీట్‌బెల్ట్ మరియు హెల్మెట్ వాడకం గురించి వీడియోలు, ఛాయాచిత్రాల (ఫోటోల) ద్వారా ప్రజలకు వివరించారు.

యువతకు ప్రత్యేక సూచనలు:

పిల్లలకు వయస్సు పూర్తి కాకుండా వాహనం నడపడం చట్టరీత్యా నేరం అని పోలీసులు స్పష్టం చేశారు. డ్రైవింగ్‌కు సంబంధించిన అన్ని నిబంధనలను తప్పక పాటించాలని, ప్రమాదాల నివారణలో ప్రజల భాగస్వామ్యం అత్యవసరమని అధికారులు తెలిపారు.

‘రోడ్డు భద్రతా కమిటీ’ ఏర్పాటు:

ప్రజల్లో నిరంతర అవగాహన కల్పించడానికి, ప్రమాదాల నివారణకు కృషి చేయడానికి యాపల్ ప్రాంతంలో కొంతమంది యువతతో పోలీసులు ఒక ‘రోడ్డు భద్రతా కమిటీ’ని ఏర్పాటు చేశారు.

అందులో ముఖ్యులుగా అబ్బాస్, వనం నరుసయ్య, వెంకటరెడ్డి, సాంబమూర్తి, రాచర్ల రవి, రాజేశ్ చోట్టన్, రామ, సుజాత, సంగత్రి సంతోష్, అంజయ్య లైన్‌మెన్, భూపెల్లి కానుకయ్య, శ్రీనివాసు ఈ కమిటీ సభ్యులుగా బాధ్యతలు స్వీకరించారు.

డి.సి.పి. ప్రసంగం:

కార్యక్రమంలో పాల్గొన్న మంచిర్యాల డి.సి.పి. మాట్లాడుతూ, రహదారి భద్రత నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఏ.సి.పి., మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్, సి.ఐ., ఎస్.ఐ.లను ఆదేశించారు. ప్రమాదాలు జరిగినప్పుడు కొందరు వ్యక్తులు “రోడ్డు సరిగా లేక యాక్సిడెంట్ అయింది” అనడం లేదా మద్యం సేవించి నడిపిన వ్యక్తిని పట్టుకుంటే, “ప్రభుత్వమే వైన్ షాపులు బంద్ చేయించొచ్చు కదా” అంటూ చేసే వితండవాదం సరికాదని డి.సి.పి. స్పష్టం చేశారు. ఇటువంటి వితండవాద ధోరణిని మార్చడానికి, ప్రజల్లో బాధ్యత పెంచడానికి ఈ అవగాహన సదస్సులు ఉద్దేశించబడ్డాయని ఆయన వివరించారు.

పాల్గొన్న ప్రముఖులు:

ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏ.సి.పి. రవికుమార్, మందమర్రి సి.ఐ. శశిధర్, ట్రాఫిక్ ఎస్.ఐ. రంజిత్, ఎస్.ఐ. రాజశేఖర్, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఐ) ప్రతినిధులు, మందమర్రి పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్ ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు నీ పరామర్శించిన నాయకులు..

మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు నీ పరామర్శించిన నాయకులు

మందమర్రి నీటి ధాత్రి

 

ఈరోజు చెన్నూరు మాజీ ఎమ్మెల్యే మాజీ ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు ఇంటి వద్ద మర్యాద పూర్వకంగా కలిసి గత కొంతకాలంగా అనారోగ్యం తో బాధపడుతున్న కారణంగా వారిని పరామర్శించి వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోవడం జరిగింది
*
పరామర్శించిన వారిలో వి హెచ్ పి ఎస్ జాతీయ నాయకులు పెద్దపల్లి సత్యనారాయణ ఎం ఆర్ పి ఎస్ అసిఫాబాద్ జిల్లా కో ఇన్చార్జి మంత్రి మల్లేష్ మాదిగ
బి.ఎస్.పి జిల్లా అధ్యక్షులు ముల్కల్ల రాజేంద్రప్రసాద్
ఎం ఆర్ పి ఎస్ సీనియర్ నాయకులు గాలి పెళ్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు

మనోవికాస పిల్లలకు అరటి పండ్లు బ్రెడ్డు, నోట్ బుక్స్ పెన్ను లు పంపిణీ..

మనోవికాస పిల్లలకు అరటి పండ్లు బ్రెడ్డు, నోట్ బుక్స్ పెన్ను లు పంపిణీ

మందమర్రి నేటి ధాత్రి

 

ఈరోజు మందమర్రి సింగరేణి ఉన్నత పాఠశాల మనోవికాస పిల్లలకు

బెల్లంపల్లి నివాసి గుండేటి అంబదాస్ లత గార్ల కుమారుడు శివరాంప్రసాద్ ఎనిమిదవ పుట్టినరోజు సందర్భంగా
మనోవికాస పిల్లలకు అరటి పండ్లు బ్రెడ్డు, నోట్ బుక్స్ పెన్ను లు పంపిణీ చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో పాల్గొన్న అక్క వైష్ణవి మేనమామ మేనత్త ఆడేపు అశోక్ కుమార్ సరోజన సహకరించిన స్కూల్ టీచర్ సురేఖ గారికి ప్రత్యేక ధన్యవాదాలు

రోడ్డు ప్రక్కన ప్రమాదకరంగా మారిన చెట్లను తొలగించుట

రోడ్డు ప్రక్కన ప్రమాదకరంగా మారిన చెట్లను తొలగించుట

బిజెపి నేత ఉడుత కుమార్

వీణవంక, (కరీంనగర్ జిల్లా):నేటి ధాత్రి:

వీణవంక మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో జమ్మికుంటకు వెళ్లే ప్రధాన రహదారి బ్రిడ్జ్ మూలమలుపు వద్ద ప్రమాదకరంగా మారిన ముళ్ళ కంపలను చెట్లను అదే గ్రామానికి చెందిన బిజెపి నేత ఉడుత కుమార్ స్వచ్ఛందంగా లేబర్ సహాయంతో తొలగించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పోతిరెడ్డిపల్లి గ్రామం నుండి నిత్యం జమ్మికుంటకు వెళ్లే వాహనాలకు మూలమలుపు వద్ద పెరిగిన చెట్ల వల్ల, ఎదురుగా వచ్చే వాహనాలు ఢీకొని పలుమార్లు ప్రమాదాలు జరిగిన, గ్రామ అధికారులు పట్టించుకోవడంలేదని, వాహనదారుల ప్రయాణం సురక్షితంగా జరగాలని స్వచ్ఛందంగా రోడ్డు వెంట ఉన్న చెట్లను తొలగించడం జరిగిందన్నారు.

పార్ట్‌టైమ్ ఉద్యోగం పేరుతో ఆన్‌లైన్ మోసం…

పార్ట్‌టైమ్ ఉద్యోగం పేరుతో ఆన్‌లైన్ మోసం

మందమర్రి నేటి ధాత్రి

 

సైబర్ వలలో చిక్కుకోవద్దు:
మందమర్రి ఎస్ఐ రాజశేఖర్.

పోలీస్ శాఖ తరపున ప్రజలందరికీ విజ్ఞప్తి చేయునది ఏమనగా, ఇటీవల ‘పార్ట్‌టైమ్ ఉద్యోగాలు’ లేదా ‘ఆన్‌లైన్ టాస్క్‌లు’ పేరుతో జరుగుతున్న సైబర్ మోసాలపై ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. మందమర్రి పట్టణం ఫస్ట్ జోన్ ప్రాంతానికి చెందిన ఒక యువకుడు ‘గూగుల్ రివ్యూ మేనేజ్‌మెంట్’ సంస్థలో ఉద్యోగం పేరుతో వచ్చిన వాట్సాప్ మెసేజ్‌కు స్పందించి, సులభంగా డబ్బు సంపాదించవచ్చనే అత్యాశతో 48,500/- రూపాయలు మోసపోయారు. ఈ సంఘటనలో సైబర్ నేరగాళ్లు ముందుగా చిన్న టాస్క్‌లు (ఉదాహరణకు: 5-స్టార్ రేటింగ్ ఇవ్వడం) పూర్తి చేయించి, రూ. 200 వంటి స్వల్ప మొత్తాన్ని జీతంగా చెల్లించారు. ఆ తరువాత, ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించి, ఇది ‘చివరి ఆర్డర్’ అని చెప్పి, బాధితుడిని పలు దఫాలుగా వారి ఖాతాలకు డబ్బు పంపమని ఒత్తిడి చేశారు. ఈ క్రమంలో ఆయన మొత్తం రూ. 48,500/- కోల్పోయారు.
ఇటువంటి మోసపూరిత వలలో ఎవరూ చిక్కుకోకుండా ఉండేందుకు, గుర్తు తెలియని వ్యక్తుల నుండి వచ్చే ఆన్‌లైన్ పార్ట్‌టైమ్ జాబ్ ఆఫర్లను అస్సలు నమ్మవద్దని పోలీస్ శాఖ సూచిస్తోంది. అలాగే, బ్యాంక్ వివరాలు, ఓటీపీ (ఓటిపి), ఏటీఎం పిన్ లేదా ఇతర వ్యక్తిగత సమాచారాన్ని ఫోన్‌లోగానీ, మెసేజ్‌ల ద్వారా గానీ ఎవరికీ తెలియజేయకూడదు. అనుమానాస్పద లింక్‌లు లేదా అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే వీడియో కాల్స్‌కు స్పందించడం ద్వారా సైబర్ నేరగాళ్లకు అవకాశమివ్వకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ మీరు సైబర్ మోసానికి గురైనట్లయితే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా, వెంటనే జాతీయ టోల్-ఫ్రీ నంబర్ 1930కు డయల్ చేసి ఫిర్యాదు నమోదు చేయండి. లేదా www.cybercrime.gov.in పోర్టల్‌లో ఫిర్యాదు చేయవచ్చు.
సైబర్ నేరాల నియంత్రణకు, పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తోంది. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండి, అప్రమత్తంగా వ్యవహరించాలని మంద

గురుకులాలలో సీట్ల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-16T141826.764.wav?_=5

 

గురుకులాలలో సీట్ల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మందమర్రి నేటి ధాత్రి

 

జిల్లాలోని అన్ని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో గురుకుల ప్రవేశ పరీక్ష రాసిన విద్యార్థినీ, విద్యార్థులు, గతంలో దరఖాస్తు చేసుకున్న వారితో పాటు, ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ నెల 17 వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా లక్షెట్టిపేట (బాలికల) గురుకుల విద్యాలయంలో దరఖాస్తులు సమమర్పించాలని తెలిపారు. కుల ధ్రువీకరణ పత్రంతో పాటు ప్రవేశ పరీక్ష రాసిన విద్యార్థులు హాల్ టికెట్, ర్యాంకు ధ్రువీకరణ పత్రాల నకలు ప్రతులు జత పరచాలని సూచించారు. లక్షెట్టిపేట, చెన్నూరు, మందమర్రి, బెల్లంపల్లి (బాలికలు), బెల్లంపల్లి, కాసిపేట, కోటపల్లి, మంచిర్యాల, జైపూర్ (బాలుర) సాంఘిక సంక్షేమ గురుకులాలలో ఖాళీగా ఉన్న సీట్లను ఈ నెల 18న లాటరీ పద్ధతిలో విద్యార్థులను ఎంపిక చేసి, భర్తీ చేయడం జరుగుతుందని తెలిపారు. బాలికల గురుకులాలలోని 6వ తరగతిలో ఎస్ సి 6, ఎస్టి 2, బీసీ 3, జనరల్ 3, మైనారిటీ 2 సీట్లు ఉన్నాయని, 7వ తరగతిలో బీ సి 5 సీట్లు, 8 వ తరగతిలో ఎస్ సి 4, ఎస్టి 1, బీసీ 10, జనరల్ 6, మైనారిటీ 5, 9వ తరగతి లో ఎస్ సి 3, ఎస్టి 4, బీసీ 4, జనరల్ 5, మైనారిటీ 3 సీట్లు ఉన్నాయని తెలిపారు. బాలుర గురుకులాలలో 5వ తరగతిలో, ఎస్టి 3, జనరల్ 3, మైనారిటీ 2 సీట్లు, 6వ తరగతిలో ఎస్ సి 9, ఎస్టి 5, జనరల్ 1, మైనారిటీ 6 సీట్లు, 7వ తరగతిలో ఎస్ సి 5 సీట్లు, 8వ తరగతిలో ఎస్ సి 8, బీసీ 8, జనరల్ 6, మైనారిటీ 8, 9వ తరగతి లో ఎస్ సి 11, బీసీ 4, ఓసీ 7, మైనారిటీ 5 సీట్లు ఉన్నాయని తెలిపారు.

మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది

ప్రజలను ఇబ్బంది పెడుతున్న మీసేవ కేంద్రం…

ప్రజలను ఇబ్బంది పెడుతున్న మీసేవ కేంద్రం

మందమర్రి నేటి ధాత్రి

 

మంచిర్యాల జిల్లా మందమర్రి పాత బస్టాండ్ ఏరియాలోని మున్సిపల్ ఆఫీస్ ఆవరణలో ఉన్న మీ (ఈ) సేవ కేంద్రం మేనేజర్ ఉపేందర్ ఇంచార్జి జనార్ధన్ గార్లు మందమర్రి పట్టణ ప్రాంత ప్రజలకు పౌర సౌకర్యాల సేవల నిమిత్తం మీ సేవ కేంద్రానికి వస్తున్న విద్యార్థులను, యువకులను, వృద్ధులను, అవహేళన చేస్తూ, ప్రజలతో దురుసుగా ప్రవర్తిస్తూ, ప్రజలకు తెలియని విషయాలు సలహా సూచనలు ఇవ్వకపోక వారినీ బెదిరిస్తూ , సమయపాలన పాటించకుండా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న తరుణంలో మీ సేవ మేనేజర్ ఉపేందర్ ఇంచార్జి జనార్ధన్ గార్ల పై తక్షణమే చర్యలు తీసుకోవాలని మంచిర్యాల కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్ గారికి మందమర్రి పట్టణ అఖిల పక్ష పార్టీ నాయకులు, యువ నాయకులు ,సోషల్ మీడియా వారియర్స్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేయడం జరిగింది. కలెక్టర్ దీపక్ కుమార్ గారు సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకుంటాము అని హామీ ఇవ్వడం జరిగింది…ఈ కార్యక్రమంలో పట్టణ అఖిల పక్ష పార్టీ నాయకులు, ,యువ నాయకులు, ఆకారం రమేష్, బండి శంకర్,సతీష్, కత్తి రమేష్, సొత్కు ఉదయ్,సిపేల్లి సాగర్, రాయబారపు కిరణ్, చిప్పకుర్తి శశిధర్, మహేష్, తదితరులు పాల్గొన్నారు…

సైబర్ కేటుగాళ్ల వలలో పడిన మందమర్రి వివాహిత…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-13T122324.681.wav?_=6

 

సైబర్ కేటుగాళ్ల వలలో పడిన మందమర్రి వివాహిత

మందమర్రి నేటి ధాత్రి

 

సైబర్ క్రైమ్ ఫై అధికారులు పలుమార్లు హెచ్చరిస్తున్న మోసపోతున్న స్థానికులు

మందమర్రి పట్టణంలో నివసిస్తున్నటువంటి వివాహిత సైబర్ కేటుగాళ్ల వల్ల లొ పడింది. తన మొబైల్ ఫోన్లో ఇంస్టాగ్రామ్ చూస్తుండగా జాబు ఆఫర్లు రావడంతో ఆ లింకును ఓపెన్ చేయగా వాట్సాప్ లో సైబర్ క్రైమ్ కేటుగాడు వివాహిత ఒకరికొకరు జాబు గురించి చర్చించుకొని ముందుగా 300 రూపాయలు ఆ కేటుగాడు వివాహితకు పంపించడం జరిగింది. దీనితో వివాహిత ఆ సైబర్ క్రైమ్ కేటుగాడిని సులువుగా నమ్మింది. ఆసరాగా తీసుకున్న సైబర్ దొంగ మాయమాటలు చెప్పి ఈ జాబులో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే అంతకు డబల్ డబ్బులు సంపాదించుకోవచ్చు అని చెప్పడంతో వివాహిత ముందుగా 5000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఆ తర్వాత సైబర్ దొంగ ఇలాంటి మాయమాటలు ఎన్నో చెప్పి 27 వేల రూపాయల దాకా ఆ వివాహిక వద్ద నుండి డబ్బులు దోచుకోవడం జరిగింది. నాలాంటి పరిస్థితి మరి ఎవరికి రాకూడదు అని తను బాధతో కుమిలిపోతుంది.

మరొక బాధాకరమైన విషయము ఏమిటి అంటే తన పిల్లల స్కూలు ఫీజు కోసం దాచుకున్న ఫీజు మొత్తాన్ని సైబర్ మోసగాడి మాయలో పడి ఆ వివాహిత పోగొట్టుకోవడం జరిగింది.

చీఫ్ జస్టిస్ గవాయ్‌పై దాడి – కఠిన చర్యలు కోరిన గుడికందుల రమేశ్

సుప్రీం చీఫ్ జస్టిస్ గవాయి పై దాడి చేసిన వ్యక్తి పై చర్యలు తీసుకోవాలి

మందమర్రి నేటి ధాత్రి

Vaibhavalaxmi Shopping Mall

భారత అత్యున్నత పదవిలో ఉన్న సుప్రీం చీఫ్ జస్టిస్… జస్టిస్ గవాయి పై జరిగిన దాడి.. యావత్ న్యాయ వ్యవస్థ, ప్రజాస్వామ్యంపై దాడి జరిగినట్లు అని సామాజిక ఉద్యమ నాయకుడు గుడికందుల రమేశ్ అన్నారు. బుధవారం మందమర్రిలో మాట్లాడుతూ…..సుప్రీంకోర్టులో భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ దాడికి యత్నించిన వ్యక్తి వ్యక్తిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఒక కేసు విచారణ సందర్భంగా వాదనలు వినిపిస్తున్న లాయర్ రాకేష్ ఏకంగా చీఫ్ జస్టీస్ బీఆర్ గవాయ్ పై దాడి చేసేందుకు యత్నించాడు. తన షూను తీసి సీజేపై విసిరేందుకు ప్రయత్నించగా అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, తోటి లాయర్లు అప్రమత్తమై తనను అడ్డుకున్నారు.భారత దేశ న్యాయవ్యవస్థలో అత్యున్నత స్థానంలో ఉన్న బీఆర్ గవాయ్ పై జరిగిన దాడి దేశ ప్రజలను కలచివేసింది. ఈ ఘటనను పలు పార్టీల నేతలు, ప్రముఖులు ఖండించాలని కోరుతూ, మన దేశ న్యాయవ్యవస్థలో అత్యున్నత స్థానంలో ఉన్న గౌరవనీయులపై దాడి చేసి భయపెట్టే ఈ
నీచమైన ఘటనను ఖండించడానికి మాటలు సరి పోవని అన్నారు. ఇది మన దేశ చరిత్రలో ఒక చీకటి రోజని ఇలాంటి పిరికిపంద దాడులతో తాను వెనక్కి తగ్గబోనని ధైర్యంగా ప్రకటించిన మన అజేయమైన భారత ప్రధాన న్యాయమూర్తి బీ.ఆర్.గవాయ్ కు ప్రజాస్వామ్యవాదుల మద్దతు ఎల్లప్పుడు ఉంటుందని తెలిపారు.

చనిపోయిన ఫోటోగ్రాఫర్స్ పిల్లల చదువులకు ఆర్థిక సహాయం

చనిపోయిన ఫోటోగ్రాఫర్స్ పిల్లల చదువులకు ఆర్థిక సహాయం

మందమర్రి నేటి ధాత్రి

Vaibhavalaxmi Shopping Mall

మంచిర్యాల జిల్లా మందమర్రి ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో
చనిపోయిన ఫోటోగ్రాఫర్స్. పిల్లలకు. చదువు ఖర్చుల నిమిత్తం
తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం కుటుంబ భరోసా మిగులు నిధుల నుండి ఒక్కొక్కరికి 5000/- రూపాయల చొప్పున మొత్తం
నలుగురి పిల్లల కు 20000/-రూపాయల చెక్ ను

Financial

 

బాధిత కుటుంబాలకు ఈరోజు స్థానిక ఫోటో భవన్లో అందజేయడం జరిగినది
ఈ కార్యక్రమంలో. మందమర్రి పట్టణ అధ్యక్షులు పసుల వెంకటస్వామి. ప్రధాన కార్యదర్శి ఆడెపు అశోక్ కుమార్. వర్కింగ్ ప్రెసిడెంట్ వలస మణిరజ్. మాజీ ఉపాధ్యక్షులు కామెర గణేష్. కార్యదర్శి. బాణావత్ కృష్ణ. ప్రచార కార్యదర్శి రామస్వామి సురేందర్. తదితరులు పాల్గొన్నారు.

మహిళ మెడలో నుండి 2 తులాల చైన్ చోరీ…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-29T120815.000.wav?_=7

 

మహిళ మెడలో నుండి 2 తులాల చైన్ చోరీ

మందమర్రి నేటి ధాత్రి

 

మందమర్రి..
మండలంలోని పొన్నారం గ్రామంలో అర్థరాత్రి మహిళ మెడలో నుండి 2 తులాల చైన్ ను దొంగలించిన దొంగ..
పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత మహిళ కుటుంబ సభ్యులు..
గ్రామానికి చేరుకున్న మందమర్రి సీఐ శశిధర్ రెడ్డి,రామకృష్ణాపూర్ ఎస్ఐ రాజశేఖర్..

దొంగతనం ఘటన పై విచారణ చేస్తున్న పోలీసులు..

పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version