మున్సిపల్ కమిషనర్ చేతుల మీదుగా ఫోటో ట్రేడ్ ఎక్స్ పో పోస్టర్స్ ఆవిష్కరణ..

మున్సిపల్ కమిషనర్ చేతుల మీదుగా ఫోటో ట్రేడ్ ఎక్స్ పో పోస్టర్స్ ఆవిష్కరణ

మందమర్రి నేటి ధాత్రి

మంచిర్యాల జిల్లా మందమర్రి ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 19,20,21 హైదరాబాద్ లో “ఓం” కన్వెన్షన్ హాల్లో జరగనున్న ఫోటో ట్రేడ్ ఎక్స్ పో పోస్టర్స్ ను మందమర్రి మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు ఆవిష్కరించారు కమిషనర్
మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఫోటోగ్రఫీ ఒక సృజనాత్మకత పూర్తిగా మారిందని ఇటువంటి ఎక్స్పోలకు కొత్త పరికరాలు డిజిటల్ టెక్నాలజీలు ఫోటో గ్రాఫర్స్ కు దోహదపడుతాయని తెలిపారు
యువత ఈ రంగాన్ని వృత్తిగా ఎంచుకోవడం ద్వారా మంచి అవకాశాలను పొందగలరని సూచించారు. ఫోటోగ్రఫీ రంగం ఇప్పుడు రానున్న టెక్నాలజీ కూడా ఫోటోగ్రాఫర్లు వాడుకోవాలని ఎక్స్పోలో కెమెరాలు, లెన్స్లు,డ్రోన్లు ప్రింటింగ్ పరికరాలు లైటింగ్ సిస్టం ఫోటో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లు స్టూడియో మోడల్స్ ప్రదర్శించనున్నట్లు తెలిపారు జిల్లాలోని ఫోటోగ్రాఫర్లు ప్రొఫెషనల్ స్టూడియోలు ఆసక్తిగల యువత తప్పక పాల్గొని ప్రయోజనం పొందాలని కోరారు ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అప్పసు రామన్న ప్రధాన కార్యదర్శి పోతరవేణి శ్వాస తిరుపతి , కోశాధికారి ముక్కెర శ్రీనివాస్ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు వడ్లకొండ కనకయ్య గౌడ్ మందమర్రి పట్టణ అధ్యక్షులు పసుల వెంకటస్వామి ప్రధాన కార్యదర్శి ఆడెపు అశోక్ కుమార్ కోశాధికారి బద్రి సతీష్ గౌరవ సలహాదారులు నక్క తిరుపతి ఎం.వి సత్యనారాయణ జాడి ముకుందాం ఉపాధ్యక్షులు నక్క పవన్. ఆర్ సుజిత్ వర్కింగ్ ప్రెసిడెంట్ వలస మణిరజ్ ప్రచార కార్యదర్శి. కె హరి కృష్ణ
కార్యదర్శి. పసుల రవి. మంచిర్యాల జిల్లా మాజీ కోశాధికారి సిపతి రవి. మొగిలి సత్యనారాయణ ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు

మున్సిపల్ కమిషనర్ చేతుల మీదుగా ఫోటో ట్రేడ్ ఎక్స్ పో పోస్టర్స్ ఆవిష్కరణ…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-12T131925.691.wav?_=1

 

మున్సిపల్ కమిషనర్ చేతుల మీదుగా ఫోటో ట్రేడ్ ఎక్స్ పో పోస్టర్స్ ఆవిష్కరణ

మందమర్రి నేటి ధాత్రి

 

https://youtu.be/P-tFvsSUVDg?si=l59BVy67t8lI2R8x

 

మంచిర్యాల జిల్లా మందమర్రి ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 19,20,21 హైదరాబాద్ లో “ఓం” కన్వెన్షన్ హాల్లో జరగనున్న ఫోటో ట్రేడ్ ఎక్స్ పో పోస్టర్స్ ను మందమర్రి మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు ఆవిష్కరించారు కమిషనర్
మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఫోటోగ్రఫీ ఒక సృజనాత్మకత పూర్తిగా మారిందని ఇటువంటి ఎక్స్పోలకు కొత్త పరికరాలు డిజిటల్ టెక్నాలజీలు ఫోటో గ్రాఫర్స్ కు దోహదపడుతాయని తెలిపారు
యువత ఈ రంగాన్ని వృత్తిగా ఎంచుకోవడం ద్వారా మంచి అవకాశాలను పొందగలరని సూచించారు. ఫోటోగ్రఫీ రంగం ఇప్పుడు రానున్న టెక్నాలజీ కూడా ఫోటోగ్రాఫర్లు వాడుకోవాలని ఎక్స్పోలో కెమెరాలు, లెన్స్లు,డ్రోన్లు ప్రింటింగ్ పరికరాలు లైటింగ్ సిస్టం ఫోటో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లు స్టూడియో మోడల్స్ ప్రదర్శించనున్నట్లు తెలిపారు జిల్లాలోని ఫోటోగ్రాఫర్లు ప్రొఫెషనల్ స్టూడియోలు ఆసక్తిగల యువత తప్పక పాల్గొని ప్రయోజనం పొందాలని కోరారు ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అప్పసు రామన్న ప్రధాన కార్యదర్శి పోతరవేణి శ్వాస తిరుపతి , కోశాధికారి ముక్కెర శ్రీనివాస్ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు వడ్లకొండ కనకయ్య గౌడ్ మందమర్రి పట్టణ అధ్యక్షులు పసుల వెంకటస్వామి ప్రధాన కార్యదర్శి ఆడెపు అశోక్ కుమార్ కోశాధికారి బద్రి సతీష్ గౌరవ సలహాదారులు నక్క తిరుపతి ఎం.వి సత్యనారాయణ జాడి ముకుందాం ఉపాధ్యక్షులు నక్క పవన్. ఆర్ సుజిత్ వర్కింగ్ ప్రెసిడెంట్ వలస మణిరజ్ ప్రచార కార్యదర్శి. కె హరి కృష్ణ
కార్యదర్శి. పసుల రవి. మంచిర్యాల జిల్లా మాజీ కోశాధికారి సిపతి రవి. మొగిలి సత్యనారాయణ ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు

సెల్ టవర్ నిర్మాణం నిలిపి వేయండి…

సెల్ టవర్ నిర్మాణం నిలిపి వేయండి

మందమర్రి నేటి ధాత్రి

 

 

 

స్థానిక మందమర్రి ప్రాణహిత కాలనీ ( షిర్కె) లో నిర్మిస్తున్న ఎయిర్టెల్ టవర్ నిర్మాణం ఆపాలని కాలనీ వాసులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కాలనీ కి దగ్గర గా ఉన్నా సోలార్ ప్రాజెక్టు వల్ల కాలనీ వాసులు వేడికి ఇబ్బంది పడుతున్నారని, ఇప్పుడు కాలనీ కి అతి దగ్గరగా సెల్ టవర్ నిర్మించడం వల్ల, పిల్లలు రేడియేషన్ కి గురి కావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఇప్పటికే ఏరియా జిఎం గారికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని అన్నారు. ఈ టవర్ నిర్మాణం గురించి తమకు ఏలాంటి సమాచారం లేదని మున్సిపల్ అధికారులు అంటున్నారని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. కాలనీ కి దూరం గా ఈ నిర్మాణాన్ని చేపట్టాలని కోరుతున్నారు.

కుంగ్ ఫు పోటీలలో చిచ్చర..

 

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-09T145838.609.wav?_=2

 

ప్రెస్ నోట్

కుంగ్ ఫు పోటీలలో చిచ్చర
పిడుగుల ప్రతిభ

మందమర్రి నేటి ధాత్రి

 

 

 

—ముఖ్య అతిథిగా ఎస్ ఐ రాజశేఖర్.

మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణం సెప్టెంబర్ ఈ నెల 7న కరీంనగర్ రెవెన్యూ గార్డెన్స్ లో మూడవ రాష్ట్ర స్థాయి కుంగ్‌ ఫూ అండ్ కరాటే పోటీలకు మందమర్రి పట్టణానికి చెందిన విద్యార్థులు ఎంపికైనట్లు మస్టర్‌ జెట్టి కృష్ణ తెలిపారు. కుంగ్‌ ఫూ నుంచి ప్రథమ స్థానంలో అద్విక్, ద్వితీయ స్థానంలో పెండ్యాల శ్రీకృతి, శాన్విత్, తృతీయ స్థానంలో విష్ణు వర్ధన్, యశ్వంత్ వర్మ, ఈసందర్భంగా సెప్టెంబర్ 8 నాడు మందమర్రి సింగరేణి హై స్కూల్ గ్రౌండ్ లో ఎస్ ఐ రాజశేఖర్, ముఖ్యఅతిథిగా విచ్చేసి గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేసి పలువురిని అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

పాపయ్య గారికి నివాళులర్పించిన నల్లాల ఓదెలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-68.wav?_=3

పాపయ్య గారి పార్థివదేహానికి పూలమాలవేసి ప్రగాఢ సానుభూతి తెలిపిన నల్లాల ఓదెలు

మందమర్రి నేటి ధాత్రి

*మందమర్రి ఏరియా టీబీజీకేఎస్ వైస్ ప్రెసిడెంట్ మేడిపల్లి సంపత్ తండ్రి పాపయ్య కి నివాళులు అర్పించిన మాజీ విప్, మాజీ చెన్నూరు శాసనసభ్యులు నల్లాల ఓదెలు

మందమర్రి ఏరియా టీబీజీకేఎస్ వైస్ ప్రెసిడెంట్ మేడిపల్లి సంపత్ గారి తండ్రి మేడిపల్లి పాపయ్య స్వర్గస్తులవగా విషయం తెలుసుకొని కరీంనగర్ జిల్లా, జమ్మికుంట మండలం, రామన్నపల్లి గ్రామంలోని వారి స్వగృహం నందు పాపయ్య గారి పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించి,వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన *మాజీ విప్, మాజీ చెన్నూరు శాసనసభ్యులు నల్లాల ఓదెలు

మందమర్రి గణేష్ ఉత్సవాల్లో 108 ప్రసాదాలతో ప్రత్యేక పూజలు…

బొజ్జ గణపయ్యకు108 ప్రసాదాలతో పూజలు.

మందమర్రి నేటిధాత్రి

గత 5 సంవత్సరాలుగా శ్రీ బాల గణేష్ మండలి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు అందరూ చిన్న పెద్ద అందరూ కలిసి భక్తిశ్రద్ధలతో గణపతి నవరాత్రుల ఉత్సవాలను జరుపుతున్నారు.

మందమర్రి శ్రీ బాల గణేష్ మండలి ఆధ్వర్యంలో వినాయకుడికి అత్యంత ఇష్టమైన మోదకం, లడ్డు ప్రసాదాలు, ఉండ్రాళ్ళు, పూరి, కోవా, పానకము,అరిసి పొంగల్,కుజి,బూందీ,
చారు, నైవేద్యము పండ్లు పలహారాలు 108 ప్రసాదాలతో బొజ్జ గణపయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మహిళలు అందరూ కలిసి మన సాంస్కృతికి అనుగుణంగా చీరలు కట్టుకొని గణనాథుని పూజలో పాల్గొన్నారు.

తదనంతరం మహా గణనాథునికి హారతి పాటలతో హారతిపట్టి పూలతో అభిషేకం చేసి ఆ మూషిక వాహనానికి భక్తితో అలరించిన భక్తులు

ఈ కార్యక్రమం లో ముఖ్యులుగా ముందు ఉండి నడిపించిన వారు… చిటికనేని వెంకట్రావ్ సుశీల, పంబాల శ్రీనివాస్, పట్టి భాను చందర్, పట్టి సతీష్ బాబు, మారం వినీత్, కుంభం రాజు, నూనె రాజేశం, కట్ట తాత రావు, కట్ట సూరిబాబు, అనబోయిన కుమార్, కొమ్మ రాజబాబు, ముప్పు రాజు భక్తులు పాల్గొన్నారు.

దీపాల కాంతుల్లో వెలిగిన గణనాథుడు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-01T124619.561.wav?_=4

 

దీపాల కాంతుల్లో వెలిగిన గణనాథుడు

మందమర్రి నేటి ధాత్రి

మందమర్రి యాపల్లోని శ్రీ బాల గణేష్ మండలి ఆధ్వర్యంలో దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.

 

 

దీనిలో భాగంగా మహిళలు అధిక సంఖ్యలో దీపాలను తీసుకువచ్చి గణనాథుని ముందు అలంకరించి వేల సంకలో దీపాల వెలుగుల్లో గణనాధుని చూడాలని మండపం ముందు శివలింగాన్ని రూపుదిద్ది ఓంకారాన్ని, స్వస్తిక్ రూపాన్ని ముంగిట అలంకరించి వాటిపైన దీపాలు అలంకరించి మహిళా భక్తులు వారి యొక్క భక్తిని గణనాథునికి

 

సమర్పించుకున్నారు ముజేకాలు ఏలే ఆ గణనాథుడికి ఎన్ని చేసినా మాకు తనివి తీరదు అని పాటలు పాడుకుంటూ వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేశారు ఇట్టి అదృష్టం మాకు లభించడం ఆ గణనాథుడు మాకు ఇచ్చిన అదృష్టంగా భావిస్తూ దీపాలతో భక్తి పాటలు పాటలు పాడుకుంటూ దీపాలతో వినాయకుడికి హారతి పట్టారు

ఈ కార్యక్రమంలో భాగంగా స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొని వారి యొక్క భక్తిని కూడా చాటుకున్నారు.

 

 

ఈ కార్యక్రమం లో ముఖ్యులుగా ముందు ఉండి నడిపించిన వారు… చిటికనేని వెంకట్రావ్ సుశీల, పంబాల శ్రీనివాస్, పట్టి భాను చందర్, పట్టి సతీష్ బాబు, మారం వినీత్, కుంభం రాజు, నూనె రాజేశం, కట్ట తాత రావు, కట్ట సూరిబాబు, అనబోయిన కుమార్, కొమ్మ రాజబాబు, ముప్పు రాజు భక్తులు పాల్గొన్నారు.

సింగరేణి హై స్కూల్ గ్రౌండ్ లో మినీ హ్యాండ్ బాల్ బాల బాలికల పోటీలు…

సింగరేణి హై స్కూల్ గ్రౌండ్ లో మినీ హ్యాండ్ బాల్ బాల బాలికల పోటీలు

మందమర్రి నేటి ధాత్రి

 

 

ఓటమి గెలుపుకు నాంది అని ఓటమెరుగని జీవితంలో కిక్ ఉండదని గెలుపుతో గర్వం పెరుగే అవకాశం ఉందని ఓటమితో వచ్చినటువంటి క్రమశిక్షణ పట్టుదల గెలుపు చిరకాలంగా ఉంటుందని కాబట్టి ఓటమితో కుంగిపోకుండా గెలుపు అనే గమ్యస్థానం చేరుకోవడానికి అహర్నిశలు కృషి చేయాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కనపర్తి రమేష్ అన్నారు.
నేడు మందమర్రి సింగరేణి హై స్కూల్ గ్రౌండ్ నందు జరిగిన మినీ హ్యాండ్ బాల్ బాల బాలికల ఉమ్మడి అదిలాబాద్ జిల్లా జట్టు ఎంపిక పోటీల్లో పాల్గొని ఆయన మాట్లాడుతూ గెలుపు కోసం సరైన క్రమశిక్షణతో కూడిన సాధన అవసరమని ఆయన అన్నారు.
ఇక్కడ ఎంపిక కాబడ్డ మినీ అండర్ 12 ఇయర్స్ బాల బాలికలు రేపు అనగా 31 /8/ 2025 న హైదరాబాదు లోని మీదని మైదానమందు జరిగేటటువంటి రాష్ట్ర హ్యాండ్ బాల్ సెలక్షన్స్ లో జిల్లా తరపున పాల్గొంటారని ఆయన వివరించారు.
ఈ కార్యక్రమం లో హ్యాండ్ బాల్ కోచ్ సునార్కర్ అరవింద్, పీడీ సంతోష్, పి ఈ టి. రాధారాణి,
సీనియర్ క్రీడాకారులు ప్రవీణ్, సంజయ్,రఘు, వర్మ, అమూల్య లు పాల్గొన్నారు.

ఉచిత వైద్య శిబిరం…

ఉచిత వైద్య శిబిరం

మందమర్రి నేటి ధాత్రి

 

 

జిల్లా కలెక్టర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి గార్ల ఆదేశానుసారం , ప్రధానమంత్రి టిబి ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగం గా శనివారం రోజు మందమర్రి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధి లోని దీపక్ నగర్ సబ్ సెంటర్ లోని మందమర్రి మార్కెట్ ప్రాంతంలో మండల వైద్య అధికారి రాపాక రమేష్ గారి ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. అట్టి శిబిరంకు హాజరైన రోగులు ప్రజలతో మాట్లాడారు.. ఆయన క్షయ వ్యాధి నివారణ కై అవగాహన కల్పిస్తూ రెండు వారాలకు పైగా దగ్గు లక్షణాలు ఉంటే క్షయ వ్యాధిగా అనుమానించాలన్నారు. ప్రతి ఆరోగ్య కేంద్రంలో వ్యాధి నిర్ధారణ తెమడ పరీక్షలు ఉచితంగా చేస్తున్నారు. క్షయ వ్యాధి నిర్ధారణ జరిగితే ఉచితంగా చికిత్స అందిస్తూ, చికిత్స పూర్తయ్యే వరకు ప్రతినెల 1000 చొప్పున పోషణ భత్యాన్ని ప్రభుత్వం అందిస్తుందని ఆయన తెలిపారు. వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్నవారికి ఈ వ్యాధి తొందరగా వ్యాపిస్తుందని, అందుకు అన్ని రకాల పోషకాహారాలు దొరికే ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమ మార్గం అన్నారు. సత్వరమే వ్యాధి నిర్ధారణ జరిగి చికిత్స ప్రారంభించి వ్యాధి వ్యాప్తిని అరికట్టవచ్చు అని తెలిపారు. తుంపర్ల ద్వారా ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందే ఈ వ్యాధి మద్యం సేవించే వారికి పొగాకు నమిలే వారికి సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఈ శిబిరంలో అవసరం ఉన్నవారికి అన్ని రకాల పరీక్షలు చేశారు. అలాగే ఎక్స్ రే అవసరం ఉన్నవారిని మంచిర్యాల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి 102 వాహనం ద్వారా తీసుకెళ్లి పరీక్షల నిమిత్తం తిరిగి మరల తీసుకొని రావడం జరుగుతుంది ఈ శిబిరంలో డా. భవానీ, జిల్లా టిబి కో ఆర్డినేటర్ సురేందర్, సూపర్వైజర్లు,కళావతి. టిబి సూపర్వైజర్ కుమార్, ఏఎన్ఎం, పద్మ, జ్యోతి,
ఐసీటీసీ కౌన్సిలర్ శ్రీలత,అలేఖ్య,రేష్మ,ఆర్బిఎస్కే సిబ్బంది డా. పద్మ శ్రీ ,అజయ్ ..
ఆశాలు.. తదితరులు పాల్గొన్నారు

వినాయక ఉత్సవ కమిటీ సభ్యులకు పోలీసువారి ఆంక్షలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-28T132148.392.wav?_=5

 

వినాయక ఉత్సవ కమిటీ సభ్యులకు పోలీసువారి ఆంక్షలు

మందమర్రి నేటి ధాత్రి

 

వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా, సురక్షితంగా జరుపుకోవాలని మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి ప్రజలకు సూచించారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, డిఐజి (ఐపీఎస్), మంచిర్యాల డిసిపి ఏ భాస్కర్ ఐపీఎస్, బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ ల ఆదేశాల మేరకు మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ) శశిధర్ రెడ్డి గణేష్ మండప నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలు పండుగను ఆనందంగా జరుపుకునే క్రమంలో భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.గణేష్ మండపాల ఏర్పాట్లు గురించి పోలీస్ వారికి సమాచారం అందించాలని, విగ్రహం సైజు, బరువు, ఉత్సవాల తేదీలు, నిమజ్జనం వివరాలు, కమిటీ సభ్యుల సమాచారాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుని, అనుభవజ్ఞులైన వారి ద్వారా మాత్రమే విద్యుత్ కనెక్షన్లు ఏర్పాటు చేయించుకోవాలి. గ్రామ పంచాయతీ లేదా మున్సిపాలిటీ, విద్యుత్ శాఖల నుండి అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి. వివాదాస్పద స్థలాల్లో మండపాలు ఏర్పాటు చేయకూడదు.

 

 

జాగ్రత్తలు పాటించాలి
మండపాల వద్ద అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా నిర్వాహకులు పూర్తి బాధ్యత వహించాలి. రాత్రిపూట కనీసం ఇద్దరు కమిటీ సభ్యులు కాపలాగా ఉండి, చిన్న పిల్లలు, వృద్ధులను మండపాల వద్ద పడుకోనివ్వరాదు. మండపంలో మండే స్వభావం ఉన్న పదార్థాలు లేదా పటాకులు ఉంచకూడదు. అగ్నిప్రమాదాలు జరిగితే వాటిని అదుపు చేయడానికి ఇసుక, నీటిని సిద్ధంగా ఉంచుకోవాలి.
ఉదయం 8 నుండి రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్లు వినియోగించాలి. ఇతర మతాలు, కులాలను కించపరిచే పాటలు లేదా అసభ్యకరమైన పాటలు పెట్టరాదు. గణేష్ మండపం వద్ద లేదా ఊరేగింపులో డీజేలను వాడటం పూర్తిగా నిషేధం. ఊరేగింపు సమయంలో ముస్లిం ప్రార్థనల వేళ మసీదుల వద్ద మైకులు ఆపి, ప్రశాంతంగా వెళ్ళాలి. మండపాలు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించకుండా ఏర్పాటు చేయాలి.
నిమజ్జనం మరియు పర్యావరణ పరిరక్షణ
నిమజ్జనం రోజున పోలీసులు సూచించిన మార్గాల్లో మాత్రమే ఊరేగింపు నిర్వహించాలి. ఊరేగింపు నిర్ణీత సమయంలోగా పూర్తయ్యేలా చూసుకోవాలి. ఊరేగింపు సమయంలో వాలంటీర్లను నియమించుకుని, కమిటీ సభ్యులు విగ్రహంతో పాటు ఉండాలి. మద్యం తాగి నిమజ్జనంలో పాల్గొనరాదు. సమావేశం సందర్భంగా పర్యావరణాన్ని కాపాడేందుకు మట్టి గణపతులను పూజించాలని సీఐ శశిధర్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో మట్టి గణపతులను నిర్వాహకులకు పంపిణీ చేశారు. ఈ సమావేశంలో ఎస్ఐ రాజశేఖర్, ఎలక్ట్రిసిటీ ఏఈ, గణేష్ మండపాల నిర్వాహకులు, హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

వెంకటాపూర్ గ్రామానికి మరొక రేషన్ షాప్ కొరకు వినతిపత్రం…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-23T151556.326.wav?_=6

వెంకటాపూర్ గ్రామానికి మరొక రేషన్ షాప్ కొరకు వినతిపత్రం.

మందమర్రి నేటి ధాత్రి

 

 

వెంకటాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు వేల్పుల చిరంజీవి మందమర్రి బి వన్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం మంత్రి వివేక్ వెంకటస్వామిని, కలిసి వెంకటాపూర్ గ్రామo ప్రజల తరపున రేషన్ షాప్ మరొకటి కావాలని మంత్రి వర్యులకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి వివేక వెంకట్ స్వామి సానుకూలంగా స్పందించి సంబంధించిన ఆఫీసర్ కి సిపారస్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.

గణేష్ మండపాల నిర్వాహకులకు విజ్ఞప్తి…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-21T111230.742-1.wav?_=7

 

 

గణేష్ మండపాల నిర్వాహకులకు విజ్ఞప్తి

మందమర్రి నేటి ధాత్రి

 

 

మందమర్రి సర్కిల్ పరిధిలోని గణేష్ మండపాల నిర్వాహకులకు విజ్ఞప్తి

ప్రజలు శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రులు జరుపుకోవాలి.
– శశిధర్ రెడ్డి, సర్కిల్ ఇన్స్పెక్టర్, మందమర్రి.

భద్రత, బందోబస్తు కొరకే గణేష్ ఆన్‌లైన్ నమోదు విధానం
తెలంగాణ రాష్ట్ర పోలీసుల వెబ్‌సైట్‌లో గణేష్ విగ్రహాల ఏర్పాటు, ఊరేగింపులకు అనుమతి కోసం తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ ద్వారా సేకరించిన సమాచారం కేవలం మండపం నిర్వహణ, భద్రతా ఏర్పాట్ల కొరకు మాత్రమే. ఈ సమాచారం ద్వారా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత బందోబస్తు ఏర్పాటు చేయడానికి పోలీసు శాఖకు సులువుగా ఉంటుంది. పోలీస్ శాఖ ఆన్‌లైన్ ద్వారానే అనుమతి మంజూరు చేస్తుంది, అనుమతి పొందిన తర్వాతే వినాయక మండపాలను ఏర్పాటు చేసుకోవాలని తెలియజేస్తున్నాము.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయు విధానం:
అధికారిక లింక్: https://policeportal.tspolice.gov.in/
పైన ఇచ్చిన లింక్‌ను క్లిక్ చేసి, అందులో ఈ క్రింది వివరాలను పూర్తిగా నమోదు చేయాలి:
* దరఖాస్తుదారుని వివరాలు
* విగ్రహం ఏర్పాటు చేస్తున్న ప్రదేశం పోలీస్ స్టేషన్ పరిధి
* విగ్రహం మండపం ఎత్తు
* కమిటీ సభ్యుల పేర్లు, వారి ఫోన్ నెంబర్లు చిరునామా
* విగ్రహ ప్రతిష్ట తేదీ నిమజ్జనం చేసే తేదీ, సమయం, ప్రదేశం
* నిమజ్జనానికి ఉపయోగించే వాహనం వివరాలు
* మండప నిర్వాహకులు వాలంటీర్ల పూర్తి వివరాలు
గణేష్ మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా పాటించవలసిన నియమ నిబంధనలు: గణేష్ మండపాల పూర్తి బాధ్యత నిర్వాహకులదే. మండపాలకు వినియోగించే విద్యుత్ నీ సంబంధిత శాఖ వారి అనుమతితో తీసుకోవాలి. అలాగైతే ఇలాంటి విద్యుత్ ప్రమాదాలు జరగకుండా నివారించడానికి వీలవుతుంది.
వినాయక విగ్రహాలను తీసుకువచ్చేటప్పుడు అదే విధంగా, నిమజ్జనానికి తీసుకువెళ్తున్నప్పుడు విద్యుత్ తీగలను గమనిస్తూ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
ప్రతీ మండపం వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి.
ప్రభుత్వం నిర్దేశించిన సమయానికే నిమజ్జనం పూర్తి చేయాలి.
గణేష్ మండపాలు ప్రజా రవాణాకు, అత్యవసర వాహనాలకు, ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బంది కలగని ప్రదేశంలో ఏర్పాటు చేసుకోవాలి. మండపం ఏర్పాటు చేసే స్థలం కోసం సంబంధిత యజమాని లేదా ప్రభుత్వ శాఖల నుండి ముందస్తు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి.
గణేష్ మండపాల నిర్వాహకులు, కమిటీ సభ్యుల వివరాలు, మరియు వారి ఫోన్ నెంబర్లను మండపం వద్ద కనిపించేలా ఏర్పాటు చేయాలి.
సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు స్పీకర్లను వినియోగించరాదు.
మండపాల్లో శోభాయాత్ర సందర్భంగా డీజే (బి జె)లను ఏర్పాటు చేయడంపై పూర్తి నిషేధం విధించబడింది. గణేష్ మండపం వద్ద 24 గంటలు ఇద్దరు వాలంటీర్లు పర్యవేక్షణలో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని క్యూలైన్లు ఏర్పాటు చేయడంతో పాటు, వాటిని నియంత్రించడానికి వాలంటీర్లను నియమించాలి. అగ్ని ప్రమాదాల నివారణకు ముందుజాగ్రత్త చర్యగా మండపం దగ్గర రెండు బకెట్ల నీళ్లు, రెండు ఇసుక బస్తాలు, ఫైర్ ఎక్స్‌టింగ్విషర్ (ఆంటీ-ఫైర్ ఎక్విమెంట్) ఏర్పాటు చేసుకోవాలి. గణేష్ మండపాల వద్ద మద్యం సేవించడం, పేకాట ఆడటం, అసభ్యకరమైన నృత్యాలు, అన్యమతస్తులను కించపరిచే విధంగా ప్రసంగాలు చేయడం లేదా పాటలు పెట్టడం పూర్తిగా నిషేధం.
ప్రతీ మండపం వద్ద విధిగా ఒక “పాయింట్ పుస్తకం” ఏర్పాటు చేయాలి. పోలీసు అధికారులు తనిఖీకి వచ్చినప్పుడు అందులో సూచనలు వ్రాసి సంతకం చేస్తారు. మండపాల వద్ద ఏదైనా అనుమానాస్పదంగా బ్యాగులు, వస్తువులు లేదా వ్యక్తులు కనిపిస్తే, తక్షణమే డయల్ 100కు గానీ లేదా స్థానిక పోలీసులకు గానీ సమాచారం అందించాలి.
సామాజిక మాధ్యమాలలో వచ్చే ఎలాంటి పుకార్లను, వదంతులను నమ్మవద్దు. ఎలాంటి సందేహాలు ఉన్నా సంబంధిత పోలీసు అధికారులకు లేదా డయల్ 100కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవాలి. పండుగ ప్రశాంతంగా జరిగేందుకు పోలీసు వారికి సహకరిస్తూ, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వినాయక నవరాత్రులు శోభాయాత్రను విజయవంతంగా పూర్తి చేయాలని కోరుతున్నాము.

ఘనంగా 186వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు…

ఘనంగా 186వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు

మందమర్రి నేటి ధాత్రి

 

మంచిర్యాల జిల్లా మందమర్రి ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఫోటో భవన్లో 186వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు ఘనంగా* *నిర్వహించారు*ముందుగా అధ్యక్షులు శ్రీ పసుల వెంకటస్వామి *

ఫోటోగ్రఫీ పితామహుడి*జండా ఎగురవేశారు అనంతరం సభ్యుల సమక్షంలో కేక్ కటింగ్ చేసరు తర్వాత సింగరేణి ఉన్నత పాఠశాల మనో వికాస పిల్లలకు ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు దీనిలో భాగంగా మంచిర్యాల జిల్లా సీనియర్ ఫోటోగ్రాఫర్స్. వైద్య రవి కి సోమ బాలాజీ కి. కల్లాటి *రాజు కి జయ శంకర్ కి

 

*శాలువాతో *ఘనంగా సన్మానించి ఆత్మీయ జ్ఞాపిక అందజేశారు
*కార్యక్రమంలో
రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు వడ్లకొండ కనకయ్య గౌడ్. కోశాధికారి బద్రి సతీష్ . గౌరవ సలహాదారులు * నక్క తిరుపతి*ఎం.వి సత్యనారాయణ జాడి ముకుoదo *వర్కింగ్* ప్రెసిడెంట్ వలస మణిరాజ్ ఉపాధ్యక్షులు * నక్క పవన్*లక్కిరెడ్డి అనిధర్ రెడ్డి ఆర్ సుజిత్*తాళ్లపల్లి రమేష్* కార్యదర్శులు పసుల రవి .

 

 

పగిడి రాజలింగు *ప్రచార కార్యదర్శులు.*కందుకూరి శ్రీకాంత్ బన్నీ శివ. కార్యనిర్వహ కార్యదర్శి జూపక సాది మాజీ ఉపాధ్యక్షులు కామెర గణేష్ విక్టరీ అశోక్.కామెర మహేందర్ సభ్యులు సిహెచ్ రవి మేడి అభిలాష్. ఐమాక్స్ *ప్రసాద్*బుజ్జి హరి భారత్ వరుణ్ తదితరులు పాల్గొన్నారు

మార్వాడి గో బ్యాక్ నినాదాన్ని ఖండించిన గుడికందుల రమేశ్…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-18T153438.935.wav?_=8

 

మార్వాడి గో బ్యాక్ నినాదాన్ని ఖండించిన గుడికందుల రమేశ్

మందమర్రి నేటి ధాత్రి

 

 

మార్వాడి గో బ్యాక్ నినాదాన్ని సామాజిక ఉద్యమకారుడు గుడికందుల రమేశ్ తీవ్రంగా ఖండించారు. సోమవారం మందమర్రిలో ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. దేశ పౌరులందరికీ ఏ ప్రాతంలోనైన వ్యాపారం చేసుకునే హక్కు ఉందన్నారు. గో బ్యాక్ నినాదం వెనుక ఎదో కుట్ర ఉంటుదని, కాబట్టి ప్రజలు, యువకులు, విద్యార్థులు భాగస్వాములై నష్టపోవద్దని సూచించారు. తెలుగాణ ప్రాంతం గంగా, జమున, తెహజీబ్ కు ప్రతీక అన్నారు. ఇక్కడ కులం, మతం, ప్రాంతం అనే వైరుధ్యాలు, వైషమ్యాలు లేవన్నారు. ప్రతి ఒక్కరిని అక్కున చేర్చుకొని ఆదిరించిన గొప్ప సరస్కతి, చరిత్ర కలిగిన నేల తెలంగాణ అన్నారు….

నూతన జిల్లా అధ్యక్షుడికి మందమర్రి ఫోటోగ్రాఫర్స్ సన్మానం..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-14-7.wav?_=9

నూతన జిల్లా అధ్యక్షుడికి మందమర్రి ఫోటోగ్రాఫర్స్ సన్మానం

మందమర్రి నేటి ధాత్రి

మంచిర్యాల జిల్లా మందమర్రి ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు . మందమర్రి పాత బస్టాండ్ వ్యాపార సంఘం అధ్యక్షులు శ్రీ వడ్లకొండ కనకయ్య గౌడ్ అధ్యక్షతన ఈరోజు మందమర్రి అంగడి బజార్ ఏరియా శివకేశావఆలయం లో. నూతనంగా ఎన్నుకోబడిన. మంచిర్యాల జిల్లా అధ్యక్షులు అప్పసు రామన్న కి. ప్రధాన కార్యదర్శి పోతరవేణి శ్వాస తిరుపతి కి. కోశాధికారి ముక్కెర శ్రీనివాస్ కి
ప్రత్యేక పూజలు నిర్వహించి
ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో ఘనంగా శాలువా తో సత్కరించడం జరిగినది ఈ కార్యక్రమంలో
శివ కేశవ సంజీవ దేవాలయం.మందమర్రి అంగడి బజార్. అధ్యక్షులు. రంగ భూమయ్య * *గౌరవ అధ్యక్షులు రాచర్ల రవికుమార్ ప్రధాన కార్యదర్శి రాచర్ల.గణేష్ కోశాధికారి గడ్డం రామన్న కమిటీ సభ్యులు. బట్టు నారాయణరెడ్డి రంగ గురువయ్య * *కేశెట్టి సత్తయ్య గుడి పూజారి దిలీప్ శుక్ల *మందమర్రి పట్టణ అధ్యక్షులు పసుల వెంకటస్వామి. ప్రధాన కార్యదర్శి ఆడేపు అశోక్ కుమార్. *కోశాధికారి బద్రి సతీష్. సిహెచ్ రవి. కుటుంబ భరోసా ఇంచార్జ్ నూనె సురేష్ తదితరులు పాల్గొన్నారు**

కాంట్రాక్టర్ వీరభద్రరావుకు ఘన నివాళులు…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-9-7.wav?_=10

కాంట్రాక్టర్ వీరభద్రరావుకు ఘన నివాళులు

మందమర్రి నేటి ధాత్రి

సింగరేణి కాంట్రాక్టర్ దివంగత కోనేరు వీరభద్ర రావు ప్రథమ వర్థంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు, సన్నిహితులు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. వీరభద్ర రావు(కోనేరు) ట్రాన్స్ పోర్ట్ పేరుతో సుపరిచితుడైన కాంట్రాక్టర్ కోనేరు వీరభద్రరావు గత సంవత్సరం అనారోగ్యంతో మృతి చెందగా, ఆదివారం విజయవాడలో ఆయన కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో ప్రథమ వర్థంతి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సింగరేణి ప్రాంతానికి చెందిన పలువురు హాజరై, వీరభద్రరావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటిస్తూ, ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ, వీరభద్రరావుతో వారికున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వీరభద్ర రావుకు సింగరేణి తో విడదీయరాని బంధం కలదని తెలుపుతూ భావోద్వేగానికి లోనయ్యారు.

వీరభద్ర రావు సింగరేణి కోల్ ట్రాన్స్ పోర్ట్ కాంట్రాక్టర్ గా మందమర్రి పట్టణం తోపాటు సింగరేణి వ్యాప్తంగా మంచి పేరు గడించారని తెలిపారు. అప్పట్లో కోల్ ట్రాన్స్ పోర్ట్ కాంట్రాక్టర్ అంటే సింగరేణి వ్యాప్తంగా వీరభద్ర రావు ట్రాన్స్ పోర్ట్ కు మంచి పేరు కలదన్నారు. పట్టణంలోని ఎంతో మందికి తన ట్రాన్స్ పోర్ట్ లో ఉద్యోగాలు కల్పించడంతో పాటు తన లాగే కోల్ ట్రాన్స్ పోర్ట్ లో రాణించాలనే అనుకునే ఔత్సాహికులకు అవకాశాలు కల్పించడం తోపాటు, వారికి వెన్నుదన్నుగా నిలిచి, సహాయ సహకారాలు అందించారని, అదేవిధంగా ఎంతో మంది నిరుపేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వీరభద్రరావు కుటుంబ సభ్యులు ఆయన సతీమణి వెంకటరమణమ్మ, కుమారుడు కోనేరు ప్రసాద్ బాబు, మనవళ్లు డాక్టర్ ఫణికుమార్, కృష్ణకాంత్, వికాస్, కుటుంబ సభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, పట్టణ ప్రముఖులు, ప్రజలు పాల్గొన్నారు.

సిట్టింగ్ షాప్ లో కుళ్ళిపోయిన మాంసం…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-12T172811.206-1.wav?_=11

సిట్టింగ్ షాప్ లో కుళ్ళిపోయిన మాంసం

మందమర్రి నేటి ధాత్రి

మందమర్రి పట్టణంలోని కనకదుర్గ వైన్స్ పక్కనున్న
సిట్టింగ్ షాప్‌లో మురిగిపోయిన చికెన్‌ను రోస్ట్ చేసి విక్రయిస్తున్న ఘటన వెలుగుచూసింది. మద్యం సేవించేందుకు వచ్చిన పలువురు కస్టమర్లు రోస్ట్ ముక్కల్లో దుర్వాసనతో పాటు రంగు మారిన మాంసం గమనించి వ్యతిరేకించారు.


ఈ విషయంపై సమాచారం అందుకున్న మందమర్రి మున్సిపల్ సిబ్బంది అక్కడికి చేరుకొని తనిఖీలు నిర్వహించారు. షాప్‌లో నిల్వ ఉంచిన మురిగిపోయిన చికెన్‌ను స్వాధీనం చేసుకుని, ఆహార భద్రతా నిబంధనలు ఉల్లంఘించినందుకు యజమానిపై చర్యలు తీసుకునే విషయాన్ని అధికారులు తెలిపారు.

చెడిపోయిన మాంసాన్ని విక్రయించడం కస్టమర్ల ఆరోగ్యానికి ప్రమాదకరమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఫుడ్ సేఫ్టీ విభాగం కూడా దృష్టి సారించి, భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

పరిపాలనను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-07T152502.610.wav?_=12

పరిపాలనను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం…

జీవో 76 ప్రకారం ఇండ్ల పట్టాలను పక్కన పెట్టిన ప్రభుత్వం…

హైడ్రా పేరిట పేదల ఇండ్లను కూలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం…

చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన గాలికి వదిలేసిందని, ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు పరచడం లేదని చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. గురువారం రామకృష్ణాపూర్ పట్టణంలోని జయశంకర్ చౌరస్తాలో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. సూపర్ బజార్ చౌరస్తాలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి రామాలయం చౌరస్తాలో అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడారు. మందమర్రి పట్టణంలో జయశంకర్ ఏడడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు తరలి వెళుతున్నామని అందులో భాగంగానే రామకృష్ణాపూర్ పట్టణం నుండి ర్యాలీగా వెళ్లడం జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నెరవేర్చడంలేదని దుయ్యబట్టారు. సింగరేణి ప్రాంతంలో జీవో నెంబర్ 76 ప్రకారం వీళ్ళ పట్టాలు గత మా ప్రభుత్వంలో అందించడం జరిగిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో పట్టాలు అందించడంలో విఫలమయ్యిందని అన్నారు. హైడ్రా పేరిట పేదల ఇండ్లను కులుస్తుందని ధ్వజమెత్తారు.

Congress government

20 నెలల పరిపాలనలో ప్రజలకు ప్రభుత్వం చేసింది ఏమీ లేదని అన్నారు. రానున్నది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో చెన్నూర్ నియోజకవర్గం ఇంచార్జ్ డాక్టర్ రాజా రమేష్, పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, సీనియర్ నాయకులు రామిడి కుమార్, మాజీ కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, యూత్ నాయకులు పాల్గొన్నారు.

ఠాగూర్ స్టేడియంలో స్టేట్ లెవల్ జూనియర్ గర్ల్స్ ఫుట్బాల్

ఠాగూర్ స్టేడియంలో స్టేట్ లెవల్ జూనియర్ గర్ల్స్ ఫుట్బాల్ పోటీలు

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్ ఠాగూర్ స్టేడియంలో ఈ నెల 9వ తేదీ నుండి 12 వ తేదీ వరకు జూనియర్ గర్ల్ స్టేట్ లెవెల్ ఫుట్ బాల్ ఛాంపియమా షిప్ పోటీలు నిర్వహించబడునని జిల్లా ఫుట్ బాల్ అసోసియేషన్స్ జనరల్ సెక్రటరీ పిన్నింటి రఘునాథ్ రెడ్డి, క్యాతనపల్లి మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు తెలిపారు. స్థానిక స్టేడియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ఈ పోటీలకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి క్రీడాకారులు పాల్గొంటారని, పోటీల్లో పాల్గొనే వారికి బోజన వసతి, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. ఈ పోటీలకు సింగరేణి సంస్థ అన్ని విధాలుగా తోడ్పాటు అందించడం సంతోషదాయకమన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు, జిల్లా అధికార ప్రతినిధి వోడ్నాల శ్రీనివాస్, సీనియర్ క్రీడాకారులు, నాయకులు పాల్గొన్నారు.

మందమర్రిలో అమ్మ మాట – అంగన్వాడి బాట.

మందమర్రిలో అమ్మ మాట – అంగన్వాడి బాట

మందమర్రి నేటి ధాత్రి

 

 

 

 

అంగన్వాడీ కేంద్రాలు పిల్లల భవితకు పునాదులు

మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని విద్యానగర్ సెక్టర్ లో గల మందమర్రి నాలుగవ కేంద్రం,ఒకటవ జోన్ లోని మూడవ కేంద్రంలోని అంగన్వాడి కేంద్రాలలో అంగన్వాడి బడిబాట కార్యక్రమాన్ని గురువారం రోజు పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా సంక్షేమ అధికారి, సిడిపిఓ హాజరు కావడం జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా బడిబాట ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం అంగన్వాడీ లో నూతనంగా చేరిన పిల్లలకు అక్షరాభ్యాసం, అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ రెండున్నర సంవత్సరాల పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలని, అంగన్వాడీ కేంద్రాలు అమ్మ ఒడిలాంటివి అని, పిల్లల భవిష్యత్తుకు పునాదులు లాంటివని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల టి డబ్ల్యూ ఓ రోఫ్ ఖాన్, సిడిపిఓ విజయలక్ష్మి, సూపర్వైజర్ సరిత, అంగన్వాడి టీచర్లు, ఆయమ్మలు, పిల్లల తల్లితండ్రులు పిల్లలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version