ఘనంగా వి హెచ్ పిఎస్ 18వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
మడి పెళ్లి శ్యాంబాబు మాదిగ జిల్లా ఇన్చార్జి
అంబాల చంద్రమౌళి మాదిగ ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి జిల్లా ఇన్చార్జి
భూపాలపల్లి నేటిధాత్రి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలక్షన్ ప్రచారంలో వికలాంగులకు చేయూత పెన్షన్ దారులకు ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్ పెంచాలి లేకుంటే ముఖ్యమంత్రి పదవి నుండి తప్పుకోవాలని ఎమ్మార్పీఎస్ భూపాలపల్లి జిల్లా ఇన్చార్జ్ మడిపల్లి శ్యాంబాబు మాదిగ ఎమ్మార్పీ ఎస్ ఎంఎస్పి రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు మాచర్ల వంశీకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో విహెచ్పిఎస్ 18వ ఆవిర్భావ దినోత్సవం వంశీకృష్ణ గౌడ్ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఇంచార్జ్ మడిపల్లి శ్యాంబాబు మాదిగ ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి రాష్ట్ర నాయకులు అంబాల చంద్రమౌళి మాదిగ లు జెండా ఆవిష్కరణ చేసి అనంతరం మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఎలక్షన్ ప్రచారంలో వికలాంగులు చేయూత పెన్షన్ దారులతో మాట్లాడుతూ ఈ నెల పెన్షన్ తీసుకుంటే మీకు వికలాంగులకు 4016 లు చేయూత పెన్షన్ దారులకు 2016 లు వస్తున్నాయి కానీ నన్ను నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి మాకు అధికారం ఇస్తే వచ్చే నెల నుంచి వికలాంగులకు 4016 లు ఉన్న పెన్షన్ 6000 చేయూత పెన్షన్ దారులకు 4000 ఇస్తామని నమ్మించి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చి నేటికీ 20 నెలలు గడుస్తున్న కానీ పెన్షన్ పెంచకుండా మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అక్కడి కూటమి ప్రభుత్వం వికలాంగులకు 6000 భరోసా పెన్షన్ దారులకు 4000 ఇస్తుందని మరియు మంద కృష్ణ మాదిగ విజ్ఞప్తి మేరకు కండరాల క్షీణత ఉన్న వికలాంగులకు 15000 రూపాయలు ఇస్తుందని తెలిపారు. లోటు బడ్జెట్ లో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ లో పెన్షన్ పెంచి ఇస్తుంటే మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణలో పెన్షన్ పెంచకుండా ఎమ్మెల్యేల జీతాలు మాత్రమే పెంచుకుంటూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్ దారులను మోసం చేస్తోందని అన్నారు. భూపాలపల్లి జిల్లాలో ఉన్న వికలాంగులు చేయూత పెన్షన్ దారులు మంద కృష్ణ మాదిగ నాయకత్వంలో పెన్షన్ పెంచడం కోసం జరుగుతున్న పోరాటంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని మరియు సెప్టెంబర్ 9న పరేడ్ గ్రౌండ్ హైదరాబాదులో జరుగు వికలాంగుల చేయుట పెన్షన్ దారుల మహా గర్జనను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో
ఎమ్మెస్పీ సీనియర్ నాయకులు
నోముల శ్రీనివాస్ మాదిగ
ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు దోర్నాల రాజేందర్ మాదిగ అంతడుపుల సురేష్ మాదిగ యువసేన జిల్లా అధ్యక్షులు మంద తిరుపతి మాదిగ ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు మిరపట్టి అశోక్ మాదిగ జిల్లా నాయకులు మంద కిరణ్ మాదిగ ఎమ్మార్పీఎస్ టౌన్ అధ్యక్షులు దోర్నాల భరత్ మాదిగ ఎమ్మార్పీఎస్ టౌన్ ప్రధాన కార్యదర్శి ఒంటెరి రాజేష్ మాదిగ ఎంఎస్పి టౌన్ ప్రధాన కార్యదర్శి మంచినీళ్ల వైకుంఠం మాదిగ ఒంటెరి సమ్మయ్య మాదిగ దోర్నాల నరేష్ మాదిగ ఒంటేరు నాగరాజు మాదిగ తదితరులు పాల్గొన్నారు.