ఎమ్మెల్యేను కలిసిన పంచాయతీ పాలకవర్గ సభ్యులు…

ఎమ్మెల్యేను కలిసిన పంచాయతీ పాలకవర్గ సభ్యులు

 

నడికూడ,నేటిధాత్రి:

 

మండలంలోని కంఠాత్మకూర్ గ్రామంలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నూతనంగా సర్పంచ్ గా ఎన్నికైన గ్రామ సర్పంచ్ కొంగంటి తిరుపతి, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ని కలిసి పుష్పగుచ్చం అందించి కృతజ్ఞతలు తెలిపారు.
నూతనంగా ఎన్నికైనా గ్రామ సర్పంచ్,ఉపసర్పంచ్,వార్డు సభ్యులకు ఎమ్మెల్యే ఆశీస్సులు అందించి అభినందనలు తెలిపారు. గ్రామపంచాయతీ పాలకవర్గం కలిసికట్టుగా ఉండి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించిచారు. ఎమ్మెల్యేను కలిసినవారిలో సర్పంచ్‌ కొంగంటి తిరుపతి,ఉపసర్పంచ్‌ కంఠాత్మకూర్ కుమారస్వామి, వార్డుసభ్యులు బుస్సా భాగ్య,గూడూరు నాగరాజు,తడుక రగుపతి,బాయి సంధ్య,కుమ్మరి మౌనిక,బుస్స తిరుపతి,ఆకుల వనిత,ఎడ్ల కిరణ్,గూడూరు జాన్సీ రాణి.
ఈ కార్యక్రమం లో నడికూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్ర దేవేందర్ గౌడ్,మండల సమన్వయ కమిటీ సభ్యులు పాడి ప్రతాప్ రెడ్డి,గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భైరపాక భద్రయ్య, ఉపాధ్యక్షులు పరమండ్ల మహేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం మహేందర్, కార్యదర్శి బొమ్మకంటి విజేందర్, గూడూరు మధుకర్,బాయి సుమన్,సీనియర్ నాయకులు కంఠాత్మకూర్ కొమురయ్య, కొత్తూరు రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ ని నమ్మి మోసపోకండి 6గ్యారంటీ ల పేరుతో అన్ని మోసలే అన్ని అబద్దాలే

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-09T163331.189.wav?_=1

 

కాంగ్రెస్ ని నమ్మి మోసపోకండి 6గ్యారంటీ ల పేరుతో అన్ని మోసలే అన్ని అబద్దాలే

:— ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సర్పంచ్ ఎలక్షన్ సందర్భంగా ఝరసంఘం మండల కేంద్రం లో బి ఆర్ ఎస్ పార్టీ బలపరచిన అభ్యర్థి వినోద — బాల్ రాజ్ & వార్డ్ మెంబర్ ల తరఫున ప్రచారం నిర్వహించిన శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు గ్రామాలకు చాలా అభివృద్ధి పథకాలు అందించారు వీటిల్లో ముఖ్యంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతుబంధు రైతు బీమా మరియు ఎరువులు అందించడం, రైతులు పండించిన వడ్లు కొనుక్కోవడం వంటివి చేశారు అలాగే గ్రామాల్లో పచ్చదనాన్ని పెంచుతూ ఇతర అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేశారు రోడ్లు నీళ్లు ప్రజలకు సమస్యలను పరిష్కరించారు అలాగే ముందుచూపుతో ఇప్పుడు జరుగుతున్న సర్పంచ్ ఎలక్షన్లో మన పార్టీ అభ్యర్థి అయినటువంటి వాళ్లను గెలిపించాలని వాళ్ల వల్ల గ్రామాల అభివృద్ధి జరుగుతుంది అని వచ్చే ఎన్నికల్లో కెసిఆర్ గారి ముఖ్యమంత్రి అవుతారని ఏలాంటి అభివృద్ధి అయినా కేసీఆర్ తోనే సాధ్యమని అన్నారు ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించండి సరైన అభ్యర్థిని ఎన్నుకోండి మన గ్రామ అభివృద్ధి మనకు ముఖ్యం అని వ్యాఖ్యానించారు

ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి నాసిరకం బీటీ రోడ్ పై ఆగ్రహం

నాసిరకం బీటీ రోడ్డు నిర్మాణంపై ఎమ్మెల్యే ఆగ్రహం.

* కాంట్రాక్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలి.

* ట్రైబల్ వెల్ఫేర్ అధికారులకు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి లేఖ.

జడ్చర్ల /నేటి ధాత్రి.

 

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం
బాలానగర్ మండలంలోని బోడగుట్ట తండా నుంచి దేవుని గుట్ట తండా వరకు నిర్మించిన 1 కిలోమీటర్ బీటీ రోడ్ ఏమాత్రం నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నాసీరకంతో నిర్మించడానికి కారణమైన కాంట్రాక్టర్, ఈ రోడ్డు నాణ్యతను ధ్రువీకరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి కోరారు.
ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కు లేఖ రాశారు. దేవునిగుట్ట తండాలో వేసిన బీటీ రోడ్డు ఒక రోజుకే గుంతలు పడిపోవడం, చేతితో లాగితే రోడ్డుపై వేసిన బీటీ పెళ్లపెల్లలుగా రావడం, బీటీ కింద కంకర వేసిన ఆనవాళ్లు కనిపించకపోవడంతో ఈ రోడ్డు నిర్మాణం విషయంగా తాండా ప్రజలు ఆందోళన వ్యక్తం చేయడం, అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో గతంలోనే ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తీవ్రంగా స్పందించి నాసిరకంగా వేసిన కొత్త బీటీ రోడ్ మొత్తాన్ని తీసివేసి దాని స్థానంలో పూర్తి నాణ్యత ప్రమాణంతో కొత్త రోడ్డు వేయాలని అధికారులను ఆదేశించడం ఈ మేరకు అధికారులు నాసిరకంగా వేసిన రోడ్డు మొత్తాన్ని తీసివేయడం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అనిరుద్ రెడ్డి ట్రైబల్ వెల్ఫేర్ ఈఈకి లేఖ రాశారు.
ఈ నాసిరకం రోడ్డు కారణంగా ప్రభుత్వం అప్రదృష్ట పాలయిందని ప్రజాధనం వృథా అయిందని పేర్కొన్నారు. ఈ రోడ్డు నిర్మాణంలో బీటీ కింద వేయాల్సిన WBM కంకర లేకపోవడం, కంకర వేయకుండానే రోడ్డు వేయడం తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం అని అభిప్రాయపడ్డారు. ఈ నాసిరకం రోడ్డు నిర్మాణానికి కారణమైన కాంట్రాక్టర్, పర్యవేక్షించిన అధికారులు, నాణ్యతను ధ్రువీకరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా అనిరుధ్ రెడ్డి డిమాండ్ చేశారు.

ఘనంగా ఎమ్మెల్యే జిఎస్ఆర్ జన్మదిన వేడుకలు..

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-10T120045.382.wav?_=2

 

ఘనంగా ఎమ్మెల్యే జిఎస్ఆర్ జన్మదిన వేడుకలు

పిప్పాల రాజేందర్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్

భూపాలపల్లి నేటిధాత్రి

 

నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు జన్మదిన వేడుకలను నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది
కాంగ్రెస్ పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పిప్పాల రాజేందర్ అన్నారు అనంతరం అంబేద్కర్ సెంటర్లో కేక్ కట్ చేసి టపాసులు పేల్చి స్వీట్లు పంచి పెద్ద ఎత్తున సంబరాలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
పెద్ద సంఖ్యలో హాజరైన అభిమానుల, కార్యకర్తల మధ్య ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు జన్మదిన వేడుకలను జరుపకోవడం చాలా సంతోషం రానున్న రోజులలో మరిన్ని ఉన్నంతమైన పదవులు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని పిప్పాల రాజేందర్ అన్నారు
ఈ కార్యక్రమంలో దాట్ల శ్రీనివాస్ మహేష్ రెడ్డి సంజన స్వామి పైడిపల్లి రమేష్ క్యాతరాజు సాంబమూర్తి పానుగంటి శీను అంబాల శ్రీనివాస్ మహిళా కాంగ్రెస్ నాయకులు మాలతి పద్మ పుష్ప యూత్ నాయకులు సురేష్ గణేష్ ప్రకాష్ తదితరులు పాల్గొనడం జరిగింది

వివాహ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు బిఆర్ఎస్ పార్టీ నాయకులు…

వివాహ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు బిఆర్ఎస్ పార్టీ నాయకులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గ పట్టణంలోని ఎస్వీ ఫంక్షన్ హాల్ లో జరిగిన మాజి మున్సిపల్ వైస్ చైర్మన్ అశోక్ శేరి గారి కూతురి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి,సీనియర్ నాయకులు నామ రవికిరణ్,మాజి పట్టణ అధ్యక్షులు మొహియుద్దీన్ ,బిఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

క్యాన్సర్‌పై వారికి అవగాహన ఉండాల్సిందే: బోండా ఉమ…

క్యాన్సర్‌పై వారికి అవగాహన ఉండాల్సిందే: బోండా ఉమ

 

మహిళలు, విద్యార్థినిలకు క్యాన్సర్‌పై అవగాహన ఉండాలని బోండా ఉమ సూచించారు. ఈ క్యాన్సర్ అవగాహన కార్యక్రమాలు కేవలం సమాచారాన్ని అందించడమే కాకుండా ప్రజలలో భయాన్ని తొలగిస్తాయన్నారు.

విజయవాడ, అక్టోబర్ 31: ఇన్నర్ వీల్ ఇంటర్నేషనల్ క్లబ్ ఆధ్వర్యంలో క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తూ నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వర్ రావు (MLA Bonda Uma Maheshwar Rao) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నేడు ప్రపంచం మొత్తం క్యాన్సర్‌ని జయించటం కోసం పోరాడుతోందన్నారు. క్యాన్సర్‌ని జయించాలంటే, మొట్టమొదటి పరిస్థితుల్లోనే దాన్ని డయాగ్నెస్ చేస్తే చాలా వరకు క్యూరైపోయే పరిస్థితి ఉంటుందని చెప్పారు. ఇవాళ లేటెస్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ ట్రీట్‌మెంట్‌తో అనేక క్యాన్సర్లకి మందులు, వ్యాక్సిన్ కూడా వచ్చాయని.. దీన్ని సామాన్య ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా బెస్ట్ క్యాన్సర్‌తో పాటు సర్వైవల్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్లు నిర్వహిస్తున్నారని వెల్లడించారు.
క్యాన్సర్ రహిత ఆంధ్రప్రదేశ్‌ను చూడాలన్నదే సీఎం చంద్రబాబు (CM Chandrababu) కల అని స్పష్టం చేశారు. మహిళలు, విద్యార్థినిలకు క్యాన్సర్‌పై అవగాహన ఉండాలని సూచించారు. ఈ క్యాన్సర్ అవగాహన కార్యక్రమాలు కేవలం సమాచారాన్ని అందించడమే కాకుండా ప్రజలలో భయాన్ని తొలగిస్తాయన్నారు. ఇన్నర్‌విల్ క్లబ్ వంటి సంస్థలు ఈ దిశగా చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. వారు కేవలం అవగాహన కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా.. ఉచిత స్క్రీనింగ్ టెస్ట్‌లను కూడా అందిస్తున్నారని తెలియజేశారు.
ఇది ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ప్రజలకు ఎంతో సహాయపడుతుందన్నారు. ఆడపిల్లలు, యువత తమ ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాలని సూచనలు చేశారు. క్యాన్సర్ లక్షణాలను గుర్తించడం, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం.. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం వంటివి చాలా ముఖ్యమన్నారు. డాక్టర్ల సలహాలు, సూచనలు పాటించడం ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చని ఎమ్మెల్యే బోండా ఉమ పేర్కొన్నారు.

వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు…

వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

హైదరాబాద్ లోని అక్షయ కన్వెన్షన్ హాల్ లో జరిగిన మాజి మున్సిపల్ చైర్మన్ మంకల్ సుభాస్ మనువారాలి వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ మాజి మార్కెట్ చైర్మన్ రామకృష్ణ రెడ్డి,మాజి ఆత్మ చైర్మన్ లు విజయ్ కుమార్, పెంటా రెడ్డి జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి కోహీర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్ సీనియర్ నాయకులు కలీం,మాజి సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షులు రవికిరణ్,మొగుడంపల్లి జనరల్ సెక్రటరీ గోపాల్ దయా వాజీద్ అస్లామ్ రయిస్ తదితరులు.

అప్పం కిషన్ ను ఆశీర్వదించిన ఎమ్మెల్యే జీఎస్సార్….

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-22T135721.287.wav?_=3

 

అప్పం కిషన్ ను ఆశీర్వదించిన ఎమ్మెల్యే జీఎస్సార్.

భూపాలపల్లి నేటిధాత్రి

 

బుధవారం భూపాలపల్లి క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్పం కిషన్ పుట్టిన రోజు సందర్భంగా కిషన్ ని ఆశీర్వదించిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎస్సార్ మాట్లాడుతూ కిషన్ నిండు నూరేళ్లు ఆయురు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

పశువులకు గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలు…

పశువులకు గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలు

ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్.

భూపాలపల్లి నేటిధాత్రి

 

పాడి రైతులు తమ పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకా వేయించాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. భూపాలపల్లి రూరల్ మండలం మోరంచపల్లి గ్రామంలో గ్రామపంచాయతీ ఆవరణలో శుక్రవారం పశువైద్య, పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గాలికుంటు వ్యాధి నివారణ టీకాల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యజమానులు తమ పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకా తప్పనిసరిగా వేయించాలని సూచించారు. పాడి రైతుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కార్యక్రమం నిర్వహిస్తున్నాయని చెప్పా రు. ఈ సంవత్సరం అధిక వర్షాలు కురిసినందున పశువులు వ్యాధుల బారిన పడుతున్నాయని అన్నారు. ఈ సందర్భంగా యజమానులకు పశువులకు బలాన్ని అందించే మల్టీ మిక్స్‌ పౌడర్‌ ప్యాకెట్లను అందజేశారు. అనంతరం జాతీయ పశువ్యాధుల నివారణ కార్యక్రమంకు సంబందించి గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ కుమారస్వామి సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

వరంగల్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

వరంగల్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని కలువనున్న సీఎం

నర్సంపేట,నేటిధాత్రి:

 

వరంగల్ కు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి రానున్నారు.ఈ నెల 15న సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ రాక ఖరారు అయ్యింది.ఐతే వరంగల్ జిల్లా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తల్లి కాంతమ్మ ఈ నెల 4 అనారోగంతో మరణించిన విషయం తెలిసిందే.కాగా సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని ఫోన్ ద్వారా అదే రోజు పరామర్శించారు.ఈ నేపథ్యంలో 15 న కాంతమ్మ పెద్దకర్మ కార్యక్రమం హన్మకొండలో ఏర్పాటు చేయనున్నారు.ఐతే ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని స్వయంగా పరామర్శించేందుకు గాను ఈ నెల 15 న ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి వరంగల్ కు వస్తున్నట్లు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం అధికార ప్రతినిధులు ఒక ప్రకటన విడుదల చేశారు.

పోలియో రహిత సమాజా నికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి…

పోలియో రహిత సమాజా నికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండల కేంద్రంలో గల గ్రామపంచాయతీ ఆవర ణంలో ఐదుసంవత్సరాల లోపు చిన్నారు లందరికీ తప్పకుండా పోలియో చుక్కలు వేయించుకోవాలని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు భూపాలపల్లి నియోజక వర్గం గ్రామపంచాయతీ కార్యాల యంలో నిర్వహించిన పోలి యో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అనంతరం చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేస్తూ, చిన్నారుల ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం ప్రతి తల్లిదం డ్రులు తమ పిల్లలకు రెండు పోలియో చుక్కలు వేయాలని పిలుపు నిచ్చారు ఎమ్మెల్యే మాట్లాడుతూ పోలియో రహిత సమాజం నిర్మాణం మన అందరి బాధ్యత

ఈ మహత్తర లక్ష్యం సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి ఈ కార్యక్రమంలో వైద్య అధికారులు, ఆశా కార్యకర్తలు,స్థానిక ప్రజలు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

దుర్వాసన వెదజల్లుతున్న దామెరా చెరువు(మినీ ట్యాంక్ బండ్)

దుర్వాసన వెదజల్లుతున్న దామెరా చెరువు(మినీ ట్యాంక్ బండ్)

 

ఎమ్మెల్యే,మున్సిపల్ అధికారులు స్పందించాలి

బిఆర్ఎస్ యువజన నాయకులు ఇంగిలి వీరేష్ రావు

ఆహ్లాదకరంగా ఉండాల్సిన దామెర చెరువు(మినీ ట్యాంక్ బండ్)ప్రాంతం దుర్గంధంతో, చెత్త చెదరంతో కంపు కొడుతూ పరిసర ప్రాంతా ప్రజల ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని అధికారులు దామెర చెరువు పై నిర్లక్ష్యం వీడాలని బిఆర్ఎస్ యువజన నాయకుడు ఇంగిలి వీరేష్ రావు అన్నారు.పరకాల ప్రజలు వాకింగ్ చేయడానికి,మరియు ఆహ్లాదకరంగా పిల్లలతో గడపడానికి గత ప్రభుత్వం సుమారు 4 కోట్ల రూపాయలతో దామెర చెరువు కట్టను మినీ ట్యాంక్ బండ్ గా తీర్చిదిద్దిందని,కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి పాలన పై శ్రద్ధ లేకుండా కేవలం పైసల పైనే శ్రద్ధ వహిస్తుందని ఆయన ఎద్దేవా చేశారు.

మునిసిపాలిటీ కి సంబంధించిన ఆటోలే ఇక్కడ చెత్త వేస్తున్నట్టు స్థానికులు వివరించారని,పక్కనే ఉన్న శ్రీనివాసకాలని ప్రజలు ఈ కంపును భరించలేక పోతున్నారని,ఈ దుర్గంధం వల్ల వారి ఆరోగ్యాలకు నష్టం జరుగుతుందని ఆయన అన్నారు.ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే, మున్సిపల్ కమీషనర్ లు ఈ సమస్యపై దృష్టి సారించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆయన కోరారు.

ఎమ్మెల్యే డోలా రోహన కార్యక్రమంలో ఆశీర్వదించారు

డోలా రోహన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

జహీరాబాద్ నేటి ధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

మొగుడంపల్లి మండల కేంద్రంలో జరిగిన గారి వార్డ్ మెంబర్ ప్రభు గారి కుమారుడి డోలా రోహన కార్యక్రమంలో పాల్గొని ఆశీర్వదించిన శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, పాక్స్ చైర్మన్ మచ్చెందర్,మాజి సర్పంచ్ లు ఈశ్వర్ రెడ్డి,సీతారాం రెడ్డి,నాయకులు ఓంకార్ రెడ్డి,గోపాల్, సంజీవ్ పవార్, దేవిదాస్ జాదవ్, రాంశెట్టి, లింబాజీ, జ్ఞానేండ్, నరేశ్ చౌహన్, సుభాష్ చందర్, కిరు, బిక్కు,
గ్రామ నాయకులు అంజన్న ,రాములు,జెట్టప్ప,వెంకట్ ,నర్సింలు,నాగన్న తదితరులు ..

పట్టణ పారిశుద్య సమస్యలను పరిష్కరించాలి…

పట్టణ పారిశుద్య సమస్యలను పరిష్కరించాలి.

జాతీయ మానవ హక్కుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట రాజయ్య

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

భూపాలపల్లి పట్టణంలోనీ పారిశుద్ధ్యం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు ఉన్నాయి.పలు కాలనీలలో సమస్యలు కంపు కొడుతున్న మున్సిపల్ అధికారులు దృష్టి సారించడం లేదని జాతీయ మాన హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట రాజయ్య పేర్కొన్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జాతీయ మానవ హక్కుల సంఘం జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు తాటికంటి రవికుమార్ ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట రాజయ్య హాజరై మాట్లాడడం జరిగింది. భూపాలపల్లి పట్టణంలోని విలీన గ్రామాలైనటువంటి జంగేడు,కాసింపల్లి, వేషాలపల్లి ,పుల్లూరి రామయ్యపల్లి ,కుందూరు పల్లి పెద్దకుంటపల్లి, గ్రామాలలో పారిశుధ్య పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నా చందాగా ఉన్నాయని అన్నారు . కాలనిలలో పిచ్చి మొక్కలు, చెత్త చెదారంతో నిండిపోయిన అధికారులు మొద్దు నిద్ర పోవడం సరైనటువంటి పద్ధతి కాదన్నారు. మున్సిపల్ కార్యాలయంలో సరైనటువంటి సిబ్బంది లేక సమస్యలు తీవ్ర స్థాయికి చేరాయని అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో చెత్తను తీసుకుపోయేటువంటి చెత్త బండ్లు, ట్రాక్టర్లు చిన్నచిన్న రిపేర్లు ఉంటే వాటిని రిపేర్లు చేయించకుండా పక్కన పెట్టడం ఇది సరైనటువంటి పద్ధతి కాదని పేర్కొన్నారు. వాహనాలను పక్కన పెట్టడం ద్వారా తుప్పు పట్టి నష్టం జరిగే ప్రమాదం ఉన్నదని వెంటనే రిపేర్ లో ఉన్నటువంటి వాహనాలను తొందరగా రిపేర్ చేయించి వాడుకలోకి తీసుకురావాలి అని కోరారు. గ్రామాలలో మహిళలు ఎంతో ఘనంగా జరుపుకునేటువంటి సద్దుల బతుకమ్మ కార్యక్రమాల ప్రాంగణాలను ముందస్తుగానే ఏర్పాటు చేయాలని కోరారు. అంతేకాకుండా 30 వార్డులకు సరిపోయేంత పారిశుద్ధ్య కార్మికులు లేరని కొత్తవారిని నియమించి ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులను పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. పారిశుద్ధ్యం లోపించడం వలన , కాల్వలలో బ్లీచింగ్ చల్లకపోవడం ,దోమల మందు ఫ్యాగింగ్ చేయకపోవడం వలన,కాలనీలలో కాలనీవాసులు తీవ్ర అనారోగ్యాలకు బలవుతున్నారని వారు పేర్కొన్నారు. వెంటనే కాలనీ సమస్యలను పరిష్కరించాలని దీనిపైన జిల్లా కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యే దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మంత్రి రాకేష్ ,సోషల్ మీడియా కన్వీనర్ అమృత అశోక్, జిల్లా ఉపాధ్యక్షులు సంగం రాజేందర్,జిల్లా అధికార ప్రతినిధి జోగుల రాజు, జిల్లా సంయుక్త కార్యదర్శి శీలపాక నరేష్ తదితరులు పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్యే పైచేసిన అనుచిత వాఖ్యలను ఖండిస్తూ బీఆర్ఎస్ నాయకులు ధర్నా …

మాజీ ఎమ్మెల్యే పైచేసిన అనుచిత వాఖ్యలను ఖండిస్తూ బీఆర్ఎస్ నాయకులు ధర్నా .

చిట్యాల, నేటిధాత్రి :

 

 

అధికార పార్టీ కాంగ్రెస్ నాయకులే ఇసుక రవాణా అసలు దొంగలు అని బీఆర్ఎస్ పార్టీ చిట్యాల మండల అధ్యక్షుడు అల్లం రవీందర్, మాజీ జెడటిసి గొర్రె సాగర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ టేకుమట్ల మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి , ఆయన సతీమణి గండ్ర జ్యోతి లపై చేసిన అనుచిత వాఖ్యలను ఖండిస్తూ, టేకుమట్ల మండలం బీఆర్ఎస్ నాయకుల అరెస్టును నిరసిస్తూ, ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని డిమాండ్ చేస్తూ శనివారం మండల కేంద్రంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అక్రమ ఇసుక రవాణా అదుపు చేయవలసిన నాయకులే.. అడ్డగోలుగా, అర్ధరాత్రిలుగా, అడ్డు అదుపు లేకుండా ఇతర జిల్లాలకు తరలిస్తున్నారన్నారు. మళ్లీ ఏం ఎరగనట్టు కాంగ్రెస్ నాయకులే రోడ్డెక్కి ధర్నాలు చేయడం ఏంటని మండిపడ్డారు. దయ్యాలు వేదాలు వల్లినట్లు సొంత పార్టీ దొంగలే ఇసుకను తరలించుకుపోతుంటే ప్రతిపక్షం పైన నోరు కాంగ్రెస్ నాయకులు నోరు జారడం సరికాదన్నారు. గ్రూపు రాజకీయాలతో గుడులు, బడులు పేరులమీదుగా రాత్రింబవళ్లు అక్రమ ఇసుక రవాణాను తరలిస్తుంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదా అని దుయ్యబట్టారు. అభివృద్ధి పైన ధ్యాస లేక ప్రతిపక్ష పాత్రులైన గండ్ర దంపతుల పైన బురద జల్లే రాజకీయాలు చేయడం సిగ్గుచేటు అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి అక్రమ ఇసుక రవాణాలను అరికట్టాలని, దీనికి భూపాలపల్లి ఎమ్మెల్యే బాధ్యత వహించాల్సి వస్తుందని డిమాండ్ చేశారు. లేనియెడల టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ చిట్యాల వర్కింగ్ ప్రెసిడెంట్ పిట్ట సురేష్ బాబు, ఉపాధ్యక్షులు కాట్రేవుల కుమార్, పార్టీ మండల ప్రధానకార్యదర్శి ఏరుకొండ రాజేందర్ గౌడ్, మడికొండ రవీందర్రావు, చిలుమల రమణాచారి, బైరం,భద్రయ్య, ఏలేటి రాజు, పర్లపెల్లి భద్రయ్య, కొండ కృష్ణఏరుకొండ రఘు, పీసరి సురేష్, పోశాల రాజు, చిలుమల రాజేష్, బుర్ర నాగరాజ్, శ్రీశైలం, ప్రభాకర్, రమేష్, వల్లబోజుల న దాని రేష్, జంగ లక్ష్మన్ అరవింద్ బోళ్ల చందు, ఏలేటి వెంకన్న, , రమేష్ తదితర బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.

అభివృద్ధిలో రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్నాం..

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-12T153147.271.wav?_=4

 

అభివృద్ధిలో రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్నాం..

#నాడు పాదయాత్రలో నా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరిస్తున్నం…

#ఇచ్చిన మాట ప్రకారం 80% పనులను పూర్తి చేయగలిగినం..

#4,53 వ డివిజన్ లలో 92.50 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే…

హన్మకొండ, నేటిధాత్రి:

 

 

https://youtu.be/P-tFvsSUVDg?si=l59BVy67t8lI2R8x

 

 

అభివృద్ధిలో రాజకీయాలకు అతీతంగా ప్రజల కోసం పనిచేస్తున్నామని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.శుక్రవారం రోజున నియోజకవర్గ పరిధిలోని 4 వ డివిజన్ జ్యోతి బసు నగర్ మరియు 53 వ డివిజన్ సరస్వతి నగర్ లో రూ.92.50 లక్షలతో అంతర్గత రోడ్లు,సైడ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.స్థానిక నాయకులు,ప్రజలతో కలసిన కాలనీల పరిస్థితులను పరిశీలించారు .

 

 

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతు నాడు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన అభివృద్ధి హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతూ 80% పనులను పూర్తి చేశామని తెలిపారు.శంకుస్థాపన చేసిన అనతికాలంలో పనులు పూర్తి అయ్యేలా చేస్తున్నామని అన్నారు.గతంలో వర్షాకాలం వస్తే వరదలో హనుమకొండ అనే శీర్షికలు ఉండేవి అని ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయక్వత్వంలో ఒకటి రెండు మినహా వరద ప్రభావిత ప్రాంతాలు లేకుండా చేసుకున్నామని చెప్పారు.రానున్న రోజుల్లో పశ్చిమ నియోజకవర్గం ఇతర నియోజకవర్గాలకు ఆదర్శవంతంగా ఉండేలా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని ప్రజల సహకారం ఉండాలని వెల్లడించారు.
ఈ కార్యక్రమలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అంబేద్కర్ రాజు, జిల్లా ఆర్టిఏ మెంబర్ పల్లకొండ సతీష్,మాజీ కార్పొరేటర్ బోడ డిన్న,ఎర్రం మహేందర్ ఆయా డివిజన్ ల అధ్యక్షులు శ్రీధర్ యాదవ్,బాబాయ్ మరియు స్థానిక నాయకులు,కార్యకర్తలు,అధికారులు,కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

పల్లెల్లో అంతర్గత రోడ్ల అభివృద్ధికి కృషి చేస్తా….

పల్లెల్లో అంతర్గత రోడ్ల అభివృద్ధికి కృషి చేస్తా

ఎమ్మెల్యే జీఎస్సార్.

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

గ్రామీణ ప్రాంత ప్రజలకు రాకపోకలు సులభతరం చేయడం, వ్యవసాయ ఉత్పత్తులకు రవాణా సౌకర్యం కల్పించడం, విద్యార్థులు, కార్మికులు, రోగులు సులభంగా ప్రయాణించేలా చేయడం లక్ష్యంగా భూపాలపల్లి నియోజకవర్గంలోని అన్ని పల్లెల్లో అంతర్గత రోడ్ల అభివృద్ధికి కృషి చేస్తానని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. గురువారం భూపాలపల్లి నియోజకవర్గంలోని భూపాలపల్లి మండలంతో పాటు గణపురం మండలంలోని వివిధ గ్రామాల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పర్యటించారు. వివిధ అభివృద్ధి పనులకు జిల్లా అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మీ తో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మొత్తం రూ.390 లక్షల వ్యయంతో వివిధ గ్రామాల్లో రోడ్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.

భూపాలపల్లి మండలం కమలాపూర్ గ్రామంలో కమలాపూర్ నుండి పెద్దాపూర్ వరకు రూ.20 లక్షలు, ఎస్ యం కొత్తపల్లి నుండి దొమ్మటిపల్లి చెరువు వరకు రూ.100 లక్షలు, గొర్లవీడు గ్రామంలో జడ్పీ రోడ్డు నుండి మల్లయ్యపల్లి వరకు రూ.20 లక్షలు, ట్రాన్స్ఫార్మర్ నుండి మొరంచవాగు వరకు రూ.20 లక్షలు.
గణపురం మండలం రంగారావుపల్లి నుండి దశరథం తండా వరకు రూ. 20 లక్షలు, వీర్లపల్లి(బంగ్లాపల్లి) నుండి చక్రవర్తిపల్లి వరకు రూ.20 లక్షలు, బంగ్లాపల్లి ఎస్సీ కాలనీ నుండి మామిడి తోట వరకు రూ.20 లక్షలు, సీతారాంపూర్ నుండి కొండాపూర్ వరకు రూ.20 లక్షలు, అప్పయ్యపల్లి తూపురం నుండి కొండంపల్లి వరకు రూ.20 లక్షలు, గణపురం చీరలపల్లి చింతల నుండి లబ్బదండ వాగు వరకు రూ.130 లక్షలతో వ్యవసాయ పొలాలకు వెళ్లే అంతర్గత రోడ్ల నిర్మాణపనులకు ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయా గ్రామాలల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ… గ్రామీణ రహదారులు బాగుంటేనే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని, అందుకోసం ప్రభుత్వ నిధులతో పాటు ఇతర పథకాల ద్వారా కూడా రహదారి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం అందే వరకు కృషి చేస్తానని ఎమ్మెల్యే చెప్పారు. అభివృద్ధి అన్నది పట్టణాలకు మాత్రమే పరిమితం కాకుండా, పల్లెల్లో కూడా సమానంగా ఉండాలి అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

గొర్లవీడు గ్రామంలో సీసీ కెమెరాలను ప్రారంభించిన ఎమ్మెల్యే జీఎస్సార్.
నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తాయని ఎమ్మెల్యే జీఎస్సార్ అన్నారు. భూపాలపల్లి మండలం గొర్లవీడు గ్రామంలో గ్రామ దాతల సహకారంతో సుమారు రూ.2 లక్షల 50 వేల వ్యయంతో 20 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నారు. కాగా, సీసీ కెమెరాల ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఎక్కడైతే శాంతిభద్రతలు పటిష్టంగా ఉంటాయో, అక్కడే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ప్రజల రక్షణ, భద్రత గురించి పోలీసులు ఎల్లవేళలా పనిచేస్తున్నట్లు తెలిపారు. దొంగతనాలు, నేరాలు, రోడ్డు ప్రమాదాలు, నిందితులను తొందరగా పట్టుకునేందుకు సీసీ కెమెరాలు ఎంతో దోహదపడతాయన్నారు. గొర్లవీడు గ్రామస్తులు దాతల సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం మంచి విషయమన్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల ప్రజలు కూడా ముందుకువచ్చి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజల్లో అవగాహన కల్పించి ముఖ్య పాత్ర పోషించిన భూపాలపల్లి పోలీసులను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, పోలీసులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు

పల్లె రోడ్డుకు మోక్షం ఎప్పుడో…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-09T135606.391.wav?_=5

 

పల్లె రోడ్డుకు మోక్షం ఎప్పుడో!

అద్వాన్నదారి,, ఎన్నాళ్ళు అవస్థలు

నేరేడుపల్లి గ్రామంలో రోడ్డు పరిస్థితి..

యేండ్ల తరబడి రోడ్డు మార్గం లేని వాడ

శాయంపేట నేటిధాత్రి:

 

 

 

శాయంపేట మండలం నేరేడుపల్లి గ్రామంలో మీసాల ఆయిలయ్య ఇంటి దగ్గర నుండి హనుమాన్ టెంపుల్ వెళ్ళే రోడ్డు అధ్వాన్నంగా తయారయ్యింది.

 

 

 

 

పల్లె ప్రజలు నిత్యం తమ అవసరాలకు మండల కేంద్రానికి రాకపోకలు సాగించే గ్రామీణ రోడ్లు పూర్తిగా ధ్వంసం గుంతల మయంగా మారడం వారికి ఇబ్బందులు తప్పడం లేదు ప్రజలు మండల కేంద్రానికి రావాలంటే మట్టిరోడ్డే దిక్కు! అది కూడా గుంతల మయంగా మారడంతో నడక నరకయాతంగా మారుతుంది ప్రతిరోజు పాఠశాల, కళాశా లకు వెళ్లే విద్యార్థులతో పాటు వివిధ పనులకు నిమిత్తం వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గ్రామస్తు లు పలుమార్లు బీటీ రోడ్డు వెయ్యాలని గత ఎమ్మెల్యేతో పాటు ప్రస్తుత ఎమ్మెల్యే అధికా రుల దృష్టికి తీసుకెళ్లిన ఫలి తంలేకపోయింది . ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే స్పందించి అధికారులు నాయకులు రాజకీయాలకు అతీతంగా స్థానిక నాయకులు చొరవ తీసుకుని రోడ్డు మార్గం సుగమం చేయాలని ప్రజలు కోరుతున్నారు.

సమీకృత హాస్టల్ ఆవరణలో ఆవరిగోడ నిర్మాణం చేపట్టాలి…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-09T111516.377.wav?_=6

 

సమీకృత హాస్టల్ ఆవరణలో ఆవరిగోడ నిర్మాణం చేపట్టాలి

ఎస్సి గర్ల్స్ హాస్టల్ కొత్త భవనం నిర్మాణం కొరకు ఎమ్మెల్యే కృషి చేయాలి

హాస్టళ్లను పర్యవేక్షణ చేసిన యు ఎస్ ఎఫ్ ఐ రాష్ట్ర కమిటి సభ్యుడు రవి..

రామాయంపేట సెప్టెంబర్ 9 నేటి ధాత్రి (మెదక్)

 

 

రామాయంపేట పట్టణ కేంద్రంలో ఉన్న పలు హాస్టళ్లను జిల్లా అధ్యక్షుడు జగన్ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ సభ్యులు గుడికందుల రవి పర్యవేక్షణ చేసి విద్యార్థుల సమస్యలు తెలుసుకుని రవి మాట్లాడుతూ…. సమీకృత హాస్టల్ ఆవరణలో అవరి గోడ లేకపోవడం వల్ల బయట వ్యక్తులు హాస్టల్లోకి వెళ్లి బాత్రూం లు నాశనం చేస్తున్నారని ఆయన అన్నారు.

 

 

 

సిగరెట్ల డబ్బాలు, అంబర్ వంటి పొట్లాలు మైదానంలో పడేసి వెళుతున్నారని అన్నారు కావునా అధికారులు అవరిగోడ నిర్మించాలని ఆయన కోరారు ఎస్సీ గర్ల్స్ హాస్టల్ సమస్యలు పరిష్కరించే నాథుడే కరువయ్యాడనీ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు శిధిల వ్యవస్థకు చేరిన హాస్టల్ కొత్త భవనం నిర్మించే దిశగా స్థానిక ఎమ్మెల్యే కృషి చేయాలని ఆయన అన్నారు పట్టణ కేంద్రంలో ఇంటర్మీడియట్ డిగ్రీ అబ్బాయిలు హాస్టల్లో ఉందామంటే వారికి హాస్టల్ సదుపాయం లేక చదువును మధ్యలోనే ఆపేస్తున్నారని ఆవేద వ్యక్తం చేశారు గురుకుల హాస్టల్ సదుపాయాలకు పెండింగ్లో ఉన్న బకాయిలు విడుదల చేయాలని ఆయన తెలియజేశారు కేజీబీవీ హాస్టల్లో నీటి కొరత తీర్చాలని. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతీ హాస్టల్లో అధికారులు విద్యార్థులతో కలిసి భోజనం చేయాలని వారి సమస్యలు పరిష్కరించాలనీ అన్నారు జిల్లా కలెక్టర్ లాగా ప్రతి విద్యాధికారులు పర్యవేక్షణలో ఉండాలని ఆయన తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో యు ఎస్ ఎఫ్ ఐ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు శేఖర్ నాయకులు మహేష్ పాల్గొన్నారు

వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం గణపతి పూజలో ఎమ్మెల్యే…

వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం గణపతి పూజలో ఎమ్మెల్యే
వనపర్తి నేటిదాత్రి .

 

 

శ్రీవాసవి కన్యక పరమేశ్వరి దేవాలయం ఆర్యవైశ్య యూవజన సంగం అద్యరములో ఏర్పాటు చేసిన గణపతి పూజలో శుక్రవారం రాత్రి పాల్గొన్నారు పూజలో
మునిసిపల్ మాజీ వైస్ చైర్మన్ బి కృష్ణ ఆర్యవైశ్య సంగం అధ్యక్షులు బచ్చు రాము వర్తక సంఘం అధ్యక్షులు పాలాది సుమన్, జిల్లా అధ్యక్షులు పూరి బాల్ రాజు శెట్టి మహిళ సంగం అధ్యక్షురాలు పిన్నం వసంత నరేందర్,కాంగ్రెస్ పార్టీ నేత రాజు కుమార్ శెట్టి యువజన సంఘం అధ్యక్షులు బచ్చు వెంకటేష్, కొండ కిషోర్, కొండ మహేష్,భక్త్తులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version