సామాజిక న్యాయానికి మండల్ కమిషన్…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-81-1.wav?_=1

మండల్ కమిషన్ సిఫారసుల అమలుతోనే సామాజిక న్యాయం

*నేటి ధాత్రి.

కేయూ క్యాంపస్*
మండల్ కమిషన్ సిఫారసులతోనే ఇతర వెనకబడిన తరగతులకు కేంద్ర విద్యా ఉద్యోగాలలో 27 శాతం రిజర్వేషన్లు అమలులోకి వచ్చాయని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ సుంకర జ్యోతి అభిప్రాయపడినారు, డాక్టర్ తిరునహరి శేషు ఆధ్వర్యంలో యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో జరిగిన బీపీ మండల్ 107వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ప్రొఫెసర్ జ్యోతి మాట్లాడుతూ రెండవ వెనుకబడిన తరగతుల చైర్మన్ గా మండల్ కమిషన్ సిఫారసుల మేరకే ఓబీసీ లకి కేంద్ర విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు సాధ్యమైనాయని అభిప్రాయపడినారు. మండల్ కమిషన్ సిఫారసుల ప్రకారంగా కేంద్ర విద్యా ఉద్యోగాలలో 27 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి కానీ కేంద్ర విద్యా ఉద్యోగల లో ఓబీసీలకు రిజర్వేషన్లు 22 శాతానికి మించి దక్కటం లేదని అభిప్రాయపడినారు. బీసీ నాయకులు డాక్టర్ తండు నాగయ్య మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చిన ఈ ఏడు దశాబ్దాల కాలంలో కాక కలేల్కర్ కమిషన్ రిపోర్ట్ కానీ మండల్ కమిషన్ రిపోర్ట్ కానీ జస్టిస్ రోహిణి కమిషన్ రిపోర్ట్ లను అమలు చేయటానికి ప్రభుత్వాలు ముందుకు రాకపోవడం వలన ఓబీసీలకు అన్యాయం జరుగుతుందని అభిప్రాయబడినారు. మండల్ కమిషన్ నివేదికని పూర్తిస్థాయిలో అమలుపరచినప్పుడే దేశంలో సామాజిక న్యాయం సాధించబడుతుందని అభిప్రాయపడినారు. బిసి నాయకులు డాక్టర్ ఎర్రబొజ్జు రమేష్ మాట్లాడుతూ జనగణలో భాగంగా జాతి ఆధారిత కుల గణన జరగాలని కాక ఖలేల్కర్ కమిషన్ మండల్ కమిషన్లు సిఫారసు చేసినా ఆ దిశగా నిర్ణయాలు తీసుకోవటానికి ప్రభుత్వలకు ఏడు దశాబ్దాల సమయం పట్టిందంటే ఓబీసీల అభివృద్ధి సంక్షేమం పట్ల ప్రభుత్వాల వైఖరి తేటతెల్లమవుతుందని విమర్శించినారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కరుణాకర్ డాక్టర్ ఫిరోజ్ డాక్టర్ వెన్నంపల్లి విజయకుమార్ డాక్టర్ లక్ష్మీనారాయణ డాక్టర్ దాసు డాక్టర్ శ్రీలత డాక్టర్ రమేష్ డాక్టర్ స్వామి డాక్టర్ జయప్రకాశ్ డాక్టర్ తాళ్లపల్లి సంజీవ్ డాక్టర్ సదానందం డాక్టర్ కొమురయ్య, కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

నమ్మిండ్ల శ్రీను అన్నకు జన్మదిన శుభాకాంక్షలు..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-72-3.wav?_=2

TPCC ఉపాధ్యక్షుడు నమ్మిండ్ల శ్రీను అన్నకు జన్మదిన శుభాకాంక్షలు
*బర్ల సహాదేవ్ అడ్వకేట్
వర్దన్నపేట నియోజకవర్గ అధికార ప్రతినిధి

వర్దన్నపేట (నేటిధాత్రి):

యువతకు మార్గదర్శి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అన్న అని అంటే కష్ట కాలంలో నేనున్నా అని భరోసా ఇచ్చే నాయకుడు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు నమ్మిండ్ల శ్రీను అన్న గారు జన్మదిన శుభాకాంక్షలు
ప్రజలతో కలసి మమేకమై ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతూ, ఎప్పుడూ అందరికి అందుబాటులో ఉంటూ, నిజాయితీతో కూడిన రాజకీయాలకు ప్రతీకగా నిలుస్తూ, సామాజిక న్యాయానికి అండగా నిలుస్తూ ప్రజా హృదయాలలో స్థానం సంపాదించుకున్నారు.
నమ్మిండ్ల శ్రీను అన్న గారు కేవలం ఒక నాయకుడు మాత్రమే కాకుండా ప్రజల ఆపదలో అండగా నిలిచే సహృదయుడు, యువతకు మార్గదర్శి. ఆయన సేవా తపన, దూరదృష్టి, కష్టసుఖాలలో అందరితో కలసి నిలబడే ధైర్యసాహసాలు ఈనాటి రాజకీయాల్లో అరుదైన లక్షణాలు.
ఆయన పాదయాత్రలు, ప్రజల సమస్యలపై పోరాటం, బడుగు బలహీన వర్గాల కోసం చేసే కృషి ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం. ఆయనలాంటి నాయకుడు మన వర్ధన్నపేట నియోజకవర్గానికి దక్కడం గర్వకారణం.ఈ సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయురారోగ్యాలతో ప్రజా సేవలో ఎల్లప్పుడూ ముందుండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను

మామిడిగూడెం ఆదివాసులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలి…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-71-3.wav?_=3

 

మామిడిగూడెం ఆదివాసులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలి

ఐటీడీఏ పీవో కు వినతి పత్రం అందజేత

న్యూడెమోక్రసీ నేత ముసలి సతీష్

 

నేటిదాత్రి చర్ల

చర్ల మండలం మామీడిగూడెం చెందిన 50 కుటుంబాలు 1995 నుంచి సర్వేనెంబర్ 62 మరియు 65 లో సాగులో ఉన్నారు ఈ మధ్యకాలంలో దుమ్ముగూడెం కు చెందిన ఫారెస్ట్ అధికారులు అక్రమంగా భూమిలోకి వచ్చి ఆదివాసులను బెదిరించి పంటలు పీకినట్టుగా మొక్కలు తీసేసినట్టుగా కేసులు నమోదు చేశారు తక్షణమే వారిపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని ఆ భూములను ఆదివాసి ప్రజలకు పంచాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ భద్రాచలం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు చర్ల వచ్చిన భద్రాచలం ఐటిడిఏ పిఓ కు వినతిపత్రం అందించారు
అనంతరం న్యూ డెమోక్రసీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ మాట్లాడుతూ చర్ల మండలంలో ఆదివాసి ప్రజలకు హక్కులు ఉన్న భూమిలోకి పోయే పరిస్థితిని ఫారెస్ట్ వారు కల్పించడం లేదని సాగులో ఉన్న భూములను గుంజుకొని అమాయకులైన ఆదివాసులపై తప్పుడు కేసులు నమోదు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఈ చర్యలను ఉపసంహరించుకోవాలని కోరుతున్నాం అని అన్నారు గతంలో కూడా ఫారెస్ట్ అధికారులకు గుర్తు చేశాం అయినా మామిడిగూడెం గ్రామానికి చెందిన తొమ్మిది మంది మహిళలని అరెస్టు చేసి ఏడుగురుపై కేసు నమోదు చేసి ఒకరిని వదిలిపెట్టి ఇంకొక మహిళ ఎటుపోయారో తెలవని పరిస్థితిలో ఉన్నదని ఆచూకీ దొరకడం లేదని పిఓ కి గుర్తు చేశారు తక్షణమే ఆ మహిళ ఆచూకీ తెలపాలని సర్వేనెంబర్ 62 65 భూములు ఆదివాసి ప్రజలకు పంచాలని 1/70 యాక్టు ఏజెన్సీ చట్ట ప్రకారం ఇక్కడ ఆదివాసులని అధికారులు గానీ నియమించాలని ఇక్కడ ఫారెస్ట్ వారు సామాజిక వర్గాల తోటి అధికారం చలా ఇస్తున్నారని ఇది మానుకోవాలని వారన్నారు ఏ సామాజిక వర్గమైన పేద ప్రజలకు న్యాయం చేసేటట్టుగా చట్టాలకు అనుకూలంగా లోబడి పని చేయాలని వారు గుర్తు చేశారు తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని ఇంకో మహిళ ఆచూకీ వెల్లడించాలని లేనిపక్షంలో దశల వారి ఆందోళనకు పూనుకోవాల్సి వస్తుందని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీగా తెలియజేస్తున్నాం అని అన్నారు అనంతరం భద్రాచలం ఐ టి డి ఏ పి ఓ మాట్లాడుతూ ఈ సమస్యని త్వరలోనే పరిష్కరిస్తామని ఫారెస్ట్ అధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తెల్లం రామకృష్ణ తెల్లం పెంటమ్మ కొమరం సమ్మయ్య చల్లం శ్రీను శ్యామల అరుణ తెల్లం వెంకటరమణ కొమరం రామక్క తదితరులు పాల్గొన్నారు

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో జరిగిన వికలాంగుల…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-70-2.wav?_=4

 

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో జరిగిన వికలాంగుల సన్నాహక సదస్సు కార్యక్రమం

◆:- పాల్గొన్న బిజెపి సీనియర్ నాయకురాలు జ్యోతి పండాల్

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఆదివారము రాత్రి ఎన్ కన్వెన్షన్ లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో జరిగిన పెద్దలు, గౌరవనీయులు మరియు పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ మందకృష్ణ మాదిగ గారి వికలాంగుల సన్నాహక సదస్సులో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ మందకృష్ణ మాదిగ గారు మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకం తీసుకురావడానికి ఎమ్మార్పీఎస్ ఏ కారణం అని చెప్పడం జరిగింది, అలాగే రేషన్ బియ్యం పంపిణీ నాలుగు కేజీల నుంచి ఆరు కేజీల వరకు పెంచాలని పోరాటం చేసింది కూడా ఎమ్మార్పీఎస్ ఏ అని కూడా వారు సభలో చెప్పడం జరిగింది, అలాగే చిన్నపిల్లల గుండె సమస్యలకి ఉచిత వైద్యం చేయించాలని కూడా ఎమ్మార్పీఎస్ ఏ పోరాటం చేసిందని మరియు ఇప్పుడు వికలాంగుల పెన్షన్ 200 నాటి నుండి 2000 వరకు పెరిగేంత వరకు ఎమ్మార్పీఎస్ పోరాటం చేసింది అని మరియు 2023 లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్ 4000 నుండి 6000 వరకు పెంచడం జరుగుతుందని అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాలని లేనిపక్షంలో రేవంత్ రెడ్డి తన సీఎం పదవికి రాజీనామా చేయాలని సెప్టెంబర్ 9 వ తేదీన మహా గర్జన పేరుతో భారీ బహిరంగ సభ ని నిర్వహిస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మరియు అధ్యక్షులైన మందకృష్ణ మాదిగ గారు వికలాంగులకు పిలుపునివ్వడం జరిగింది. వారు మాట్లాడిన తర్వాత జ్యోతి పండాల్ మందకృష్ణ మాదిగ గారికి సన్మానం చేయడం జరిగింది. ఎమ్మార్పీఎస్ ద్వారా వివిధ అట్టడుగు వర్గాలకు చెందిన ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేస్తున్న ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులైన గౌరవనీయులు మరియు పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ మందకృష్ణ మాదిగ గారికి సన్మానం చేయడానికి అవకాశం ఇచ్చిన ఎమ్మార్పీఎస్ డిస్టిక్ జనరల్ సెక్రెటరీ అబ్రహం మాదిగ మరియు మండల అధ్యక్షులకి, వారి టీమ్ అందరికీ మరియు రాయికోటి నరసింహులు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో వికలాంగులు వృద్ధులు, ఒంటరి మహిళలు ఎంఆర్పిఎస్ టీం మరియు తదితరులు పాల్గొన్నారు,

మోసం చేసిన సర్కారు – మందకృష్ణ మాదిగ హెచ్చరిక..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-69-2.wav?_=5

మోసం చేసిన సర్కారు.. తాడోపేడో తెల్చుకుందాం: మందకృష్ణ మాదిగ,

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్: రాష్ట్రంలోని 50 లక్షల పెన్షనర్లకు 20 నెలలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ తీవ్ర స్థాయిలో ఆరోపించారు. అధికారం చేపట్టి 20 నెలలవుతున్న ఇచ్చిన హామీ అమలు చేయకుండా పెన్షనర్లను మోసం చేస్తున్న ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుందామని ఆయన హెచ్చరించారు. సెప్టెంబర్ 9న హైదరాబాదులో నిర్వహించ పెన్షనర్ల బహిరంగ సభకు భారీ సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని జహీరాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన పెన్షనర్ల బహిరంగ నియోజకవర్గ సన్నాహక సదస్సును ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.20 నెలల నిర్లక్ష్యానికి మూల్యం చెల్లించక తప్పదన్నారు. ఈ సందర్భంగా ఆరోగ్యశ్రీ, పెన్షన్ల పెంపు, రేషన్ బియ్యం పెంపు తదితర సంక్షేమ పథకాల కోసం తాను చేసిన పోరాటం, దాని నేపథ్యాలను పేపర్, ఆడియో క్లిప్పింగ్స్ లతో సభకు వివరించి తన పోరాటపటీమను వివరించారు. విపక్షాల అసమర్థత, అధికార కరపక్షం నిర్లక్ష్యంతో పేదల సమస్యలు గుర్తు రావని, హామీలను పట్టించుకోరని మండిపడ్డారు. తను ఎప్పుడూ.. అణగారిన వర్గాల పక్షంలోనే పోరాడుతానన్నారు. ఇక్కడ అన్ని వర్గాల వారికి సేవ చేసే అవకాశం తనకు కలుగుతుందన్నారు. ఎమ్మార్పీఎస్ అందరికీ భరోసానిచ్చే బ్రాండ్ అని స్పష్టం చేశారు. ప్రభుత్వం పెన్షనర్ల పట్ల చేస్తున్న మోసాన్ని ఎండగట్టేందుకే బలమైన ఉద్యమాన్ని నిర్మిస్తున్నామన్నారు.వికలాంగులకు రూ.6000తో పాటు వితంతువులు, ఒంటరి మహిళలు, వృద్ధులు ఇతర పెన్షన్లన్ని డబుల్ చేసేంతవరకు పోరాటం ఆగదన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వ్యాప్తంగా వికలాంగులు, పెన్షనర్లందరూ భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా విపక్ష పార్టీ నేతలు, పనులు, పెన్షనర్లు మందకృష్ణ మాదిగను మాలలు, శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలు, ఎమ్మార్పీఎస్, పెన్షనర్లు సంఘం నేతలు అబ్రహం మాదిగ ఉల్లాస్ మాదిగ జయరాజ్, నర్సింలు, రామరవి కిరణ్, జ్యోతి, నారాయణ, విశ్వనాథ్ యాదవ్, జైరాజ్ మాదిగ, మైకల్ మాదిగ, రవికుమార్, నిర్మల్ మాదిగ, రాజు, మనోజ్, నగేష్, యేసప్ప, రాజేందర్, సింగితం రాజు, తదితరులు పాల్గొన్నారు.

ముస్లింలా నిజమైన పక్షపాతి మందకృష్ణ మాదిగ…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-23T105618.755.wav?_=6

 

ముస్లింలా నిజమైన పక్షపాతి మందకృష్ణ మాదిగ.

◆:- అబ్రహం మాదిగ………

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ముస్లింలా హక్కుల కోసం పోరాడింది.
దాడులు జరిగితే ఉద్యమించింది..
సచార్ నివేదిక అమలుకు నినదించింది.
రిజర్వేషన్ల వాటా కోసం స్పందించింది..
బట్టలు కాదు.. బ్రతుకు కావాలంటూ
రాజకీయ ప్రాతినిధ్యంకై రణం చేసింది..
ఉగ్రవాదుల పేరుతో ఎన్కౌంటర్ చేస్తే
ముక్తకంఠంతో నిరసిస్తూ ఖండించింది.
సినిమాలలో మీడియాలో సామాజిక మాధ్యమాల్లో
ముస్లింలు అంటేనే టెర్రరిస్టులుగా, సంఘవిద్రోహ శక్తులుగా చూపిస్తుంటే ఆ సమాజ పోకడను
తప్పుబట్టి సమానత్వపు సందేశాన్ని ఇచ్చింది దండోరా.

 

 

హిందూ దేవాలయాలకు కెసిఆర్ వందల కోట్లు ప్రకటిస్తుంటే, హిందూ దేవాలయాలే కాదు
ఘన చరిత్ర కల్గిన పవిత్ర మక్కా మసీదుకు కూడా వందకోట్లు కేటాయించాలని డిమాండ్ చేసింది.

నసీమా అనే చిన్నారి గుండె కోసం తల్లడిల్లింది
ఆసమస్య పరిష్కారానికి ఓ నూతన పోరాటానికి శ్రీకారం చుట్టి వేలాది గుండెలను ఒకటి చేసి పోరాటం చేసింది. “ఆరోగ్యశ్రీ పథకమై” ఆయుస్సు పోసింది.

ఆడ బిడ్డల మాన-ప్రాణాలను కాపాడే కర్తవ్యాన్ని
భుజాన మోసింది..అసిఫా, తార బేగం లాంటి ఎందరో ముస్లిం బిడ్డలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతుంటే వాటిని నిరసిస్తూ ముస్లింల గొంతై గర్జన చేసింది.

తెలంగాణ పోరులో ముందున్నా దగా పడ్డ
రహిమున్నిసా త్యాగాన్ని తట్టిలేపింది.

మదార్ సాహెబ్ అన్నను మా సంఘానికి
జిల్లా అధ్యక్షుల్ని చేసి అనేక సామాజిక పోరాటాల్ని ముందుకు నడిపింది..మాదిగ హక్కులే మానవ హక్కులంటూ సమరం సాగించింది.

తాను పెట్టిన మహాజన సోషలిస్టు పార్టీలో
ముస్లింలకు ప్రాతినిధ్యం కల్పించింది.
పలు జిల్లాలకు జిల్లా అధ్యక్షులుగా నియమించింది.
రజి హైదర్, ఇస్లాముద్దీన్ గార్లను లీడర్లుగా నిలబెట్టింది.
సెల్లులో బందీలు కాదు ముస్లింలు “బాద్ షా” లవ్వాలన్నది.. షేక్ బందగీల్లా తెగువ చూపాలన్నది ముస్లింల అభ్యున్నతి కోసం నిబద్ధతతో కొట్లాట కొనసాగించింది మాన్యులు మందకృష్ణ మాదిగ గారే.!

జస్టిస్ మురళీధరన్ కమిషన్, జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్, జస్టిస్ రాజేంద్ర సింగ్ సచార్ కమిటీ ఇలా అనేక కమిటీలు వేసినా సిఫారిసులు చేసిన వాటిని అమలు చేయకుండా ప్రభుత్వాలు దగా చేస్తుంటే, ఆమోసాన్ని ఎండగడుతూ ఉద్యమించింది.

ముస్లింలపై దాడులు, దౌర్జన్యాలు జరుగుతుంటే వారిపక్షాన మాట్లాడితే మా రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందోనని పార్టీలు వివిధ నాయకులే మౌనం వహిస్తుంటే, ముస్లింలకు మద్దతుగా నిలబడి, మేము అండగా ఉన్నామని ప్రకటించి వారి పక్షాన నిలిచింది.

ఊకదంపుడు ఉపన్యాసాలు కాదు, వేసిన కమిటీల సిఫారసులను అమలు చేస్తే చాలు ముస్లింల జీవన విధానంలో మార్పులు, పురోగతి వస్తుందని వాటి అమలుకు డిమాండ్ చేసింది, వక్ఫ్ భూముల పరిరక్షణకు తన వానిని వినిపించింది. వారి అభివృద్ధి,అభ్యున్నతికి తనదైన శైలిలో శ్రమించింది ఎమ్మార్పీఎస్ ఉద్యమమే.

దళిత్-ముస్లిం భాయ్ భాయ్”
“దళిత-ముస్లింల ఐక్యత వర్ధిల్లాలి” అనే
నినాదం ఇచ్చింది.. ఆ నినాదానికి బలమైన
పునాది వేసింది, ఆత్మీయతను పంచి అనురాగాన్ని పెంచింది. ఏజాతి అయినా స్వయంగా తన గుణగణాలను మార్చుకోనంత వరకు అల్లాహ్ దాని స్థితిని మార్చడు: దివ్య ఖురాన్ 13:11 సూక్తిని సందేశంగా ఇచ్చి ఐక్య పోరాటాలకు మన జాతుల విముక్తికి ఉద్యమించాలని పిలుపునిచ్చి మహోన్నతమైన సామాజిక, సంస్కృతిక, ప్రజాస్వామ్య హక్కుల ఉద్యమ సంఘం ఎమ్మార్పీఎస్.

ఇలా చెప్పుకుంటు పోతే ఎన్నో, ఇంకెన్నో ఉన్నాయి అందుకే

ముస్లింలా పక్షాన నిజాయితీగా నిలబడి నిరంతరం పోరు చేసింది ముస్లింల పక్షపాతిగా నిలిచింది మహాజన నేత మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారే.

అతడే నిఖార్సయిన నాయకుడు,
నిజమైన సమాజ సేవకుడు
అన్నివర్గాలకు ఆప్తుడు,
ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ నిలబడి
అక్కున చేర్చుకునే ఆత్మీయుడు
అపదోస్తే అండగా నిలిచే మహోన్నతుడు
మానవత్వపు పోరాటాలకు, మనిషి తత్వపు ఉద్యమాలకు కేంద్ర బిందువు అతడు.

అతడే..

సామాజిక న్యాయ స్వప్నం అతడే
మానవ హక్కుల రూపం అతడే.

కాబట్టి ముస్లింలు ఇప్పటికైనా ఒక సరికొత్త స్వతంత్ర ఉద్యమ, రాజకీయ ప్రణాళికలతో ముందుకు నడవాలి.. ముస్లింల కోసం మాదిగలు చేసిన త్యాగాన్ని,పోరాటాన్ని మరవకుండా మదిన పెట్టుకోవాలి.

నాటి స్వాతంత్ర్య ఉద్యమ అనంతరం అంబేద్కర్ గారిని విశ్వసించక గాంధీ గారిని నమ్మి, వారు చేసిన కుట్రలకు బలై నష్టపోయినట్టుగా మరొకమారు మోసపోకండి..
కృష్ణ మాదిగ గారి సారధ్యంలో సమరం సాగించండి
అలయ్.. బలయ్ తోనే లాడాయికి సిద్ధమవ్వండి.

పవిత్రంగా కొలిచే ఈరంజాన్ పర్వదినమే ముస్లిం వర్గాల ప్రజల్లో నూతన మార్పుకు నాంది కావాలని.. పార్టీల జెండాలు కాదు.. మన ప్రజల ఎజెండాలకు అనుగుణంగా ముందుకు నడవాలి.. జరుగుతున్న నష్టాన్ని గ్రహించి, పార్టీల, నాయకుల అణిచివేత దోపిడిలను మదిన తలిచి, పీడిత వర్గాలతో కలిసి సంఘటిత శక్తిగా నిలిచి, మనకోసం కొట్లాడే గొంతులకు ముస్లింలు అండగా నిలవాలి.. ఓటు చైతన్యంతో కూడిన రాజకీయ, ప్రజా చైతన్య పోరాటాలకు, దళిత ముస్లింల శాశ్వత ఐక్యతకు, పీడిత వర్గాల రాజ్యాధికార సాధనకు కేంద్రమవ్వాలని, దానికి సామాజిక న్యాయమే, సమానత్వపు సూత్రమే పునాదిగా రాజ్యాంగ ప్రవేశిక లక్ష్యాలే మేనిఫెస్టోగా మహనీయుల మార్గంలో మందకృష్ణన్న ఆశయానికి బలమై ముందుకు సాగాలని ఆదిశగా ఇప్పటినుండే అడుగులు పడాలని ఆశిస్తున్నామన్నారు,

బాoసేప్ 12వ మహాసభలను విజయవంతం చేయండి

బాoసేప్ 12వ మహాసభలను విజయవంతం చేయండి

నిజాంపేట్, నేటి ధాత్రి

 

మెదక్ జిల్లా నిజాంపేట్ మండల కేంద్రంలో బాంసేఫ్ ప్రచారకులు, బాంసేఫ్ 12వ రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్స్ కరపత్రాల ఆవిష్కరణ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బాంసేఫ్ అధ్యక్షులు నరేందర్ ఆధ్వర్యంలో కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులాదారిక జనగణన చేస్తామని ప్రకటించిన కులాదారిక జన గణన చేపట్టకపోవడం ద్వారా ఓబిసి ఎస్సి, ఎస్టీ కులాల ప్రజలను మోసం చేస్తున్నాయని వారు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆయన అన్నారు. ఈవీఎంల విషయంలో మౌనాన్ని పాటించడం ద్వారా అవకతవకలు పాల్పడడం బిజెపి కాంగ్రెస్ పార్టీలు ఒకదానిని ఒకటి సహకరించుకుంటున్నాయని ఆయన ఎద్దేవ చేశారు. తాము పుట్టిన సమాజ అభివృద్ధి కొరకు తమ బానిసత్వాన్ని వదిలించుకోవడం తమ ధనాన్ని తమ అజ్ఞానాన్ని తమ సమయాన్ని వెచ్చించిన వారు ధన్యులు అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డిడిఎఫ్ మెదక్ జిల్లా అధ్యక్షులు దుబాసి సంజీవ్, టి ఎమ్మార్పీఎస్ మెదక్ జిల్లా అధ్యక్షులు గరుగుల శ్రీనివాస్,
అంబేడ్కర్ సంఘం అధ్యక్షులు కొత్తల గంగారం,
భారతీయ యువ మోర్చా కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఇల్లిందల ప్రభాకర్,
భారత ముక్తి మోర్చా కామారెడ్డి జిల్లా అధ్యక్షులు గడ్డం రవి,నర్సింలు నిజాంపేట్ మండల డిబిఎఫ్ ఉపాధ్యక్షులు బ్యాగరి రాజు,వడ్డెర సంఘం మైశయ్య,మల్లయ్య,మైనార్టీ నాయకులు సమీర్, సలీం, హైమద్ తదితరులు పాల్గొన్నారు.

బహుజనుల ఆత్మగౌరవం కోసం పోరాడిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్

బహుజనుల ఆత్మగౌరవం కోసం పోరాడిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్

తాండూరు,( మంచిర్యాల) నేటి ధాత్రి :

 

తాండూరు మండల కేంద్రంలోని మోకు దెబ్బ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి వేడుకలను మంగళవారం గౌడ కులస్తులు ఘనంగా నిర్వహించారు.అనంతరం పాపన్న గౌడ్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా మోకు దెబ్బ నాయకులు మాట్లాడుతూ పీడిత జనుల కోసం, బహుజనుల ఆత్మగౌరవం కోసం తన సర్వస్వాన్ని దారబోసిన మహాయోధుడు పాపన్న అని కొనియాడారు.మొఘల్‌ సామ్రాజ్యవాదాన్ని,సైన్యాన్ని సైతం ఎదిరించి నిలబడిన వీరుడు పాపన్న అని అన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్సై కిరణ్ కుమార్ హాజరయ్యారు.ఈ కార్యక్రమంలోమోకుదెబ్బ రాష్ట్ర అధికార ప్రతినిధి బుసారపు మొండిగౌడ్,రాష్ట్ర నాయకులు తాళ్లపల్లి శంకర్ గౌడ్,జిల్లా కార్యదర్శి పెరుమాండ్ల భాస్కర్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి బురగడ్డ పుణ్ణం గౌడ్,చీకటి వెంకటేశం గౌడ్,చీకటి మొండి గౌడ్,చీకటి రవి గౌడ్,మడ్డి అరుణేశ్వర్ గౌడ్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎండి. ఈసా,జిల్లా ఉపాధ్యక్షుడు సూరం రవీందర్ రెడ్డి,బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు పులుగం తిరుపతి,మాజీ ఎంపీపీ సిరంగి శంకర్,బీఆరెస్ నాయకులు మాసాడి శ్రీరాములు,కాంగ్రెస్ నాయకులు చొప్పదండి నరేష్, మాజీ ఉప సర్పంచ్ చిర్ల రాజేశం,నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

24న జహీరాబాద్ కు మందకృష్ణ మాదిగ రాక

24న జహీరాబాద్ కు మందకృష్ణ మాదిగ రాక

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఈ నెల 24న జహీరాబాద్ లో పెన్షన్ పెంపు కోసం నిర్వహించే మహా గర్జన సన్నాహక సదస్సుకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జహీరాబాద్ నియోజకవర్గంలోని వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు తప్పక హాజరు కావాలని తెలంగాణ వికలాంగుల వేదిక జిల్లా అధ్యక్షులు నర్సింహులు కోరారు.

తొర్రూరులో పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-27-6.wav?_=7

తొర్రూరులో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 375వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు

తొర్రూరుడివిజన్ నేటి ధాత్రి

తొర్రూరు పట్టణ కేంద్రంలో సోమవారం సర్దార్ సర్వాయి పాపన్న 375వ జయంతి వేడుకలను గౌడ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బహుజన యుద్ధ వీరుడు, విప్లవకారుడు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాలలు అర్పించి ఆయనకు ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా మోకు దెబ్బ జిల్లా కార్యదర్శి మేరుగు మల్లేశం గౌడ్ మాట్లాడుతూ, “బహుజనులంతా ఐక్యంగా ఉండి రాజ్యాధికార సాధన కోసం కలిసికట్టుగా కృషి చేయాలి. పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తి నేటి తరానికి మార్గదర్శకం కావాలి” అని పిలుపునిచ్చారు.

Sardar Sarvai Papannagoud’s

వేడుకల్లో భాగంగా ఈరోజు హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం ప్రతిష్ట కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు నిర్వహించిన భూమిపూజ సందర్భంగా వారి చిత్రపటాలకు గౌడ సంఘాల ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు.

ఈ సందర్భంగా గౌడ సంఘాల నాయకులు మాట్లాడుతూ, “సర్దార్ పాపన్న విగ్రహ ప్రతిష్ట కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి మరియు ముఖ్యమంత్రికి హృదయపూర్వక కృతజ్ఞతలు” తెలిపారు.
కార్యక్రమంలో గోపా జిల్లా అధ్యక్షుడు కుర్ర శ్రీనివాస్ గౌడ్, తొర్రూరు గోపా డివిజన్ అధ్యక్షుడు తాళ్లపల్లి రమేష్ గౌడ్ జీఎస్పీఎస్ అధ్యక్షులు దీకొండ శ్రీనివాస్ గౌడ్ కె ఎస్ పి ఎస్ గౌరవ అధ్యక్షులు చామకూరి ఐలయ్య గౌడ్ అధ్యక్షులు నాగపురి అశోక్ గౌడ్ ప్రధాన కార్యదర్శి కుంభం మహేష్ కుమార్ గౌడ్ ఎస్ఎస్పిజి అధ్యక్షులు చీకటి అశోక్ గౌడ్ కంట మహేశ్వర సంఘంలో గౌరవాధ్యక్షులు చీకటి రమేష్ గౌడ్ అధ్యక్షులు నిమ్మల శేఖర్ ప్రధాన కార్యదర్శి ఓం ప్రకాష్ గౌడ్ గౌడ యువజన సంఘం అధ్యక్షులు బొమ్మెర వినోద్ గౌడ్ కార్యదర్శి ప్రవీణ్ గౌడ్, టౌన్ యువజన అధ్యక్షుడు బొమ్మ గాని మనోజ్ గౌడ్, చీకటి వీరన్న గౌడ్ తొర్రూరు పట్టణంలోని నాలుగు సంఘాల గౌరవ సభ్యులు ప్రజా
ప్రతినిధులు, స్థానిక నాయకులు, యువత, మహిళలు, మరియు పెద్ద సంఖ్యలో బహుజన ప్రజలు పాల్గొని జయంతి ఉత్సవాలను విజయవంతం చేశారు.

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-26-6.wav?_=8

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం

రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క.

#ప్రజల కోసం సమాజం కోసం ఉమ్మడి హక్కుల కోసం పోరాడిన వారిని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి.

ములుగు జిల్లా, నేటిధాత్రి:

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని, ప్రజల కోసం సమాజం కోసం ఉమ్మడి హక్కుల కోసం పోరాడిన సర్వాయి పాపన్న గౌడ్ లాంటి వారిని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు.
సోమవారం ములుగు జిల్లా కేంద్రంలోని సంక్షేమ భవనంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375 వ జయంతి ఉత్సవాల సందర్భంగా ముఖ్య అతిథిగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా,
స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి
దనసరి అనసూయ సీతక్క పాల్గొని శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించి,
జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలను ప్రతి సంవత్సరం అధికారికంగా జరపడం జరుగుతుందని, చాలా సంతోషకరమని అన్నారు.
ప్రతి ఒక్కరూ మహనీయుల జీవిత చరిత్రను వారి త్యాగాలను గుర్తుంచుకోవాలని మర్చిపోతే మాత్రం మానవ మనుగడకు భవిష్యత్తు కష్టతరం అవుతుందని , ” నాకోసం పనిచేస్తే నాలోనే ఉండిపోతావు – జనం కోసం పనిచేస్తే జనంలో ఉండిపోతావ్ అని అన్నారు.
సర్దార్ సర్వాయి పాపన్న ఉమ్మడి వరంగల్ జిల్లా జనగామ ప్రాంతంలోని ఖిలషాపూర్ అనే గ్రామంలో జన్మించారని పశువుల కాపరిగా ఉంటూ రాజుల సైన్యాలను వారి ఆగడాలను ఎదిరించి, అరికట్టి ఉమ్మడి హక్కుల కోసం పోరాడారని , అన్యాయాలను ఎదిరించిన ఆయన జీవిత చరిత్ర మనకు ఆదర్శమని పేర్కొన్నారు. సమాజంలో గౌడ్ అన్నలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సమస్యల పరిష్కరించడం కొరకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించేటట్లు చూస్తానని పేర్కొన్నారు.
మహనీయుల విగ్రహాలను త్వరలో ఏర్పాటు చేయుటకు, బీసీ భవన్ ఏర్పాటు చర్యలు తీసుకుంటాం
ప్రభుత్వం బి.సి. రిజర్వేషన్ 42 శాతం అమలు కు కట్టుబడి ఉందని ,
బీసీ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలనీ ఈ సందర్భంగా మంత్రి కోరారు.
ఈ సందర్భంగా కల్లుగీత కార్మికులకు కాటమయ్య 100 రక్షక కవచాలను మంత్రి అందచేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవిన్యూ సి హెచ్ మహేందర్ జి, ఆర్డీఓ వెంకటేష్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్, ఎక్సైజ్ సి ఐ సుధీర్ కుమార్, వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి ఇంచార్జీ సర్దార్ సింగ్, బి.సి. కులస్థులు,
బి.సి. సంఘ నాయకులు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

బహుజన రాజ్యాధికారమే ఆగిన ధ్యేయం.

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-18T124359.652.wav?_=9

 

బహుజన రాజ్యాధికారమే ఆగిన ధ్యేయం.

సర్వాయి పాపన్న గొప్ప పోరాట, విప్లవకారుడు.

మహబూబ్ నగర్/నేటి ధాత్రి

 

 

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి.

పీడితులు, బహుజనులు ఏకమై పోరాడితే రాజ్యాధికారం సాధించవచ్చని నిరూపించిన సామాన్యుడు, గొప్ప బహుజన విప్లవకారుడు, ధీరుడు సర్వాయి పాపన్న గౌడ్ అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా.. మహబూబ్ నగర్ నగరం పద్మావతి కాలనీ, గ్రీన్ బెల్ట్ లో ఉన్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కుల, మత, జాతి వర్గ విభేదాలు లేని సమాజం కోసం దాదాపు 350 ఏండ్ల కిందనే కృషి చేసిన బహుజన పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని, 17వ శతాబ్దంలోనే స్వీయ సైన్యంతో దక్కన్‌పై బహుజనుల సంక్షేమ బాధ్యత తీసుకొని తొలి బహుజన రాజ్య స్థాపన చేసిన గొప్ప వీరుడు తొలి బహుజన రాజు అని ఆయన చెప్పారు.
బహుజన కులాలను ఏకం చేసి గెరిల్లా సైన్యాన్ని తయారు చేసుకొని జమీందారుల ఆస్తులను కొల్లగొట్టి పేద ప్రజలకు పంచిపెట్టాడన్నారు. తన సైన్యం ద్వారా చిన్న చిన్న సంస్థానాలను ఆక్రమించుకుంటూ, తన సొంత ఊరు ఖిలాషాపూర్‌ను రాజధానిగా చేసుకుని, 1675లో సర్వాయిపేట కేంద్రంగా తన రాజ్యాన్ని స్థాపించాడన్నారు. ఆ తర్వాత ఎన్నో ప్రాంతాలను తన ఆధీనంలోకి తెచ్చుకున్న పాపన్న. ఔరంగజేబు మరణానంతరం మొఘల్ రాజు బహదూర్ షా పాపన్నను స్వయం పాలకునిగా సంధికి ఆహ్వానించి కొంత కప్పం చెల్లించి గోల్కొండ కోటకు రాజుగా కొనసాగవచ్చని బహదూర్ షా ప్రతిపాదన చేశాడని, దానికి అంగీకరించిన పాపన్న, మొఘల్ గోల్కొండ కోటపై బహుజనుల జెండాను ఎగురవేశాడని చెప్పారు. అయితే ఇది నచ్చని జమీందార్లు, దేశముఖ్‌లు, జాగీర్దార్లు పాపన్న పరిపాలనలో తాము కొనసాగలేమని, ఆయనను పదవి నుంచి తప్పించాలని బహదూర్ షాను వేడుకోవడంతో పాపన్నను బంధించి తేవాలని ఆయన సైన్యాన్ని ఆదేశించారు. మొఘల్ సైన్యం పెద్ద ఎత్తున పాపన్నపై మూకుమ్మడిగా దాడికి దిగగా, పాపన్న తీవ్రంగా గాయపడి కొన్నిరోజుల ఆజ్ఞాత జీవితం గడిపారని, ఆయన మరణంపై వివిధ కథలు ప్రచారంలో ఉన్నా ఆయన ఒక యోధుడిగా తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు.

 

 

నిజాం పాలకులకు, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడి బహుజనుల అభ్యున్నతికి కృషి చేశారని, ఆయన బాటలో బహుజనులు, గౌడ కులస్తులు నడవాలని పిలుపునిచ్చారు, సర్వాయి పాపన్న గౌడ్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా ప్రభుత్వం నిర్వహిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. పాపన్న గౌడ్ స్పూర్తి నేటి యువతకు ఆదర్శంగా ఉండేలా ట్యాంక్ బండ్‌పై ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో శంకుస్థాపన చేసుకుంటున్నామని, తెలంగాణలో ప్రతి గ్రామ గ్రామాన ఆయన విగ్రహాలు ఏర్పాటు చేసి ఆయన చరిత్ర భవిష్యత్ సమాజానికి తెలిసేలా ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయేందిర బోయి, టి.పీసీసీ ప్రధాన కార్యదర్శి మిథున్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్ ఇందిర, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి వేడుకలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-18T122002.725-1.wav?_=10

 

సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి వేడుకలు.

చిట్యాల,నేటిధాత్రి :

 

 

జయశంకర్ జిల్లా భూపాలపల్లి చిట్యాల మండలం
గోపాలపురం గ్రామంలో గౌడ సంఘం అధ్వర్యంలో సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గౌడ సంఘం అధ్యక్షుడు బత్తిని నారాయణ గౌడ్ నివాళులు అర్పించారు ఈ సందర్భంగా గౌడ సంఘం అధ్యక్షుడు బత్తిని నారాయణ మాట్లాడుతూ
సామాన్య గౌడ గీత కార్మికుని కుటుంబంలో పుట్టి చరిత్ర సృష్టించిన బహుజన వీరుడు
నిజాం నిరంకుశత్వాన్ని ఎదిరించిన అలుపెరగని పోరాట యోధుడు
భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా అసమాన పోరు చేసిన ధీరుడు
మొఘలాయిల పెత్తనంపై సమర శంఖారావాన్నిపూరించి
గోల్కొండ కోటాపై జెండాను ఎగరేసిన తొలి తెలుగు చక్రవర్తి
వందల ఏండ్ల క్రితమే అణగారిన ప్రజల ఆత్మ గౌరవాన్నివెలుగెత్తి చాటుతూ, సామాజిక న్యాయాన్నిఅమలు చేసిన సమరసేనాని, తొలి బహుజన చక్రవర్తి శ్రీ సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఇవే మా ఘన నివాళులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గౌడ్ సంఘం కుటుంబ సభ్యులు పోశాల రాజు, పోశాల పైడయ్య, బత్తిని సదయ్య, పులి కిరణ్, పులి యుగేంధర్ , కోరుకోప్పుల అశోక్, కోల వేంకటేష్, మూల పైడయ్య, కోల మొగిళి, గ్రామస్తులు పాల్గొన్నారు.

దళిత ఎమ్మెల్యే అవమానం – జహీరాబాద్‌లో ఉద్రిక్తత..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-22-5.wav?_=11

దళితుడు అన్న కారణంగా ఎమ్మెల్యే గారిని అవమానించారు

◆:- తీవ్రంగా ఖండించిన ఝరాసంగం దళిత నాయకులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ పట్టణంలో ఫ్రెండ్స్ ఫంక్షనల్ లో నిరుపేదలకు గత ప్రభుత్వం టిఆర్ఎస్ నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇంటి తాళాలను ఇవ్వడం గురించి సభ నిర్వహించడం జరిగింది అక్కడికి జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు వెళ్లడం జరిగింది అక్కడ అధికార సభ కాబట్టి స్థానిక అధికారులు సమక్షంలో నిర్వహించాలి కానీ కాంగ్రెస్ కు సంబంధించిన నాయకునితో సభ అధ్యక్షత నిర్వహించడం జరిగింది.ఎమ్మెల్యే మీటింగ్ ప్రాంతానికి వెళ్లిన అక్కడ అధికారులు వేదికపై పిలవకుండా అవమానించడం జరిగింది దీన్ని మేము ఒక దళితుడు అన్న కారణంగా ఎమ్మెల్యే గారిని అవమానించారని అనుకుంటున్నామని దళిత సంఘాల నాయకులు వ్యతిరేకించారు.గత ప్రభుత్వం టిఆర్ఎస్ నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లను పట్టాలు ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డబల్ బెడ్ రూమ్ అర్హులకు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు అది తెలుసుకొని బి ఆర్ఎస్ పార్టీ జహీరాబాద్ స్థానిక శాసనసభ్యులు మాణిక్ రావు ఇట్టి విషయంపై కలెక్టర్ ఆర్డిఓ ఎమ్మార్వో ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి వెంటనే ఇళ్ల తాళాలు ఇవ్వాలని చెప్పడం జరిగింది గురువారం జరిగిన మీటింగ్ లో శాసనసభ్యులు మాణిక్ రావు వేదికపై పిలవకుండా అవమానించడం ఇది కాంగ్రెస్ రౌడీ రాజకీయానికి నిదర్శనం అని కాంగ్రెస్ నాయకులు రౌడీల్ల వివరిస్తున్నారని మరొకసారి ఇలాంటి సంఘటనలు జరిగితే దళిత సంఘాల నాయకులము చూస్తూ ఊరుకోమని తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమం లో దళిత సంఘాల నాయకులు సామెల్ బాలరాజ్ సంగమేష్ రాజకుమార్, సుధాకర్ ప్రభాకర్ శ్రీనివాస్, రమేష్ తదితరులు ఉన్నారు.

ఆదివాసీ జేఏసీ 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుక…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-15-5.wav?_=12

ఆదివాసి సంఘాల ఐక్యవేదిక (జేఏసీ) ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ఆదివాసీ జేఏసీ అధ్యక్షులు పోలేబోయిన వెంకటనారాయణ.

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..నేటిధాత్రి…

కరకగూడెం మండలం భట్టుపల్లి గ్రామంలో గల కొమరం భీమ్ సెంటర్ యందు ఆదివాసి సంఘాల ఐక్యవేదిక(జేఏసీ) కరకగూడెం మండల శాఖ ఆధ్వర్యంలో ఆదివాసీ జేఏసీ అధ్యక్షులు పోలేబోయిన వెంకటనారాయణ జాతీయ పతకం ఆవిష్కరించి 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆదివాసీ జేఏసీ అధ్యక్షులు పోలేబోయిన వెంకటనారాయణ మాట్లాడుతూ. బ్రిటిష్ ప్రభుత్వ పరిపాలనలో మగ్గిపోయిన భారతీయుల జీవితాలకు 15 ఆగస్టు 1947న బ్రిటిష్ బానిస సంకెళ్ళను తెంచి భారతీయ పౌరులందరికి స్వేచ్ఛ స్వాతంత్రం కల్పించుటకు ఎందరో మహానుభావులు మహనీయులు ప్రాణ త్యాగాల ఫలితమే మనం ఇప్పుడు జరుపుకుంటున్న 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అని కొనియాడారు. ఇప్పుడే కాదు ఎప్పుడు వారి త్యాగాలను మరవకుడదు వారిని స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడుస్తూ యువత ముందుండాలని పిలుపునిచ్చారు. స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయులు వారి స్వలాభం కోసం పోరాటం చేయలేదు దేశంలోని పౌరులందరూ స్వతంత్ర భారతదేశంలో సగౌరవంగా జీవించుటకు, స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావంతో మెలగాలని, ప్రతి ఒక్కరి హక్కులు హరించకుండా వారి వారి హక్కులను కాపాడుకోవాలనే ఉద్దేశంతో మహనీయులైనటువంటి మాహత్మ గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, లాంటి వారు ఎందరో మహనీయులు స్వాతంత్ర ఉద్యమం ప్రారంభించి మనకోసం స్వాతంత్ర తెచ్చిపెట్టారు. కానీ ఇప్పుడున్న సమాజంలో స్వచ్చ, సమానత్వం, సోదర భావం కరువైయ్యాయాని వారి ప్రాణ త్యాగాలకు విలువ లేకుండా పోయిందని ఇప్పటి నుంచి అయినా యువత ఆయొక్క మహనీయుల ఆశయాలకై పని చేయాలకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ జేఏసీ ప్రధాన కార్యదర్శి కలం సాంబమూర్తి, జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ చందా రామకృష్ణ, జేఏసీ నాయకులు పోలేబోయిన సర్వేష్, కొమరం శంకర్, కలం సంపత్, ఊకె నరేష్, పోలేబోయిన స్వామి ప్రసాద్, ఆదివాసీ ఉద్యోగులు కొమరం అశోక్, పూనెం శంకర్, ఆదివాసీ సీనియర్ నాయకులు కొరగట్ల నరసింహారావు, గోగ్గల నరేష్, రాజకీయ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకాన్ని..

79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క

ములుగు జిల్లా, నేటిధాత్రి:

మంత్రి సీతక్క మాట్లాడుతూ జిల్లా ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, ప్రముఖులకు, స్వాతంత్య్ర సమరయోధులకు, అధికారులకు, విద్యార్థిని, విద్యార్థులకు, మీడియా ప్రతినిధులకు ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక 79వ భారత స్వాతంత్య్రదినోత్సవ శుభాకాంక్షలు.
ప్రపంచ చరిత్రలో ఆగస్టు,15కు విశిష్ట స్థానం ఉంది. గాంధీజీ సారథ్యంలో సాగిన భారత స్వాతంత్ర్య పోరాటం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. మహాత్ముడి సారథ్యంలో బయట శతృవులైన బ్రిటీషర్లపై యుద్ధం గెలిచిన మనం.. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ సారథ్యంలో దేశ అంతర్గత శతృవులైన పేదరికం, అసమానతలు, అస్పృశ్యత, అంటరానితనంపై పోరాటానికి నాంది పలికాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగ ముసాయిదా కమిటీకి అధ్యక్షత వహించి, భారతదేశ పునాది పత్రాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. పౌరులకు, అణగారిన వర్గాలకు సమానత్వం, సామాజిక న్యాయం, ప్రాథమిక హక్కుల రక్షణ కోసం నిబంధనలు ఉండేలా చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి ఎందరో మహానుభావులు స్వాతంత్య్ర ఉద్యమానికి ఊపిరులు ఊదారు. మనం సాధించుకున్న స్వాతంత్ర్యానికి అర్థం, పరమార్థం చేకూర్చే ప్రజాస్వామ్య పాలనకు పునాదులు వేసుకున్నాం.
2047 నాటికి భారతదేశ ముఖచిత్రాన్ని మార్చే గేమ్ ఛేంజర్ పాత్రలో తెలంగాణ కీలకంగా ఉండాలన్న సంకల్పం మాది. ఆ సంకల్పానికి దార్శనిక పత్రమే ‘తెలంగాణ రైజింగ్ 2047’. 2035 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను మార్చే మహత్తర లక్ష్య పత్రంగా తెలంగాణ రైజింగ్ – 2047 ఉంటుంది. ఇది కేవలం ప్రణాళిక కాదు. ప్రపంచ వేదికపై తెలంగాణను సగర్వంగా నిలబెట్టే సంకల్పం.
స్థానిక సంస్థలలో… విద్యా, ఉద్యోగాలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించే బిల్లులను ఈ ఏడాది మార్చి 17న రాష్ట్ర శాసనసభ ఆమోదించింది.
యువతను రక్షించుకుంటేనే తెలంగాణకు భవిత. యువత ఉద్యోగ, ఉపాధికి పెద్ద పీట వేస్తున్నాం. బాధ్యతలు స్వీకరించిన మరుక్షణం టీజీపీఎస్సీని సంస్కరించాం. 20 నెలల కాలంలో దాదాపు 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం.
ములుగు జిల్లా 2019లో ఏర్పడినప్పటి నుండి వెనుకబడిన జిల్లాగా ఉండగా ఇప్పుడు కొత్త మెరుగులతో అన్ని సౌకర్యాలు కల్పిస్తూ అభివృద్ధి పథంలో తీసుకెళ్లుటకు నూతన ప్రణాళికలు రూపొందించాం. అందులో భాగంగా జిల్లాలో నూతన ఆయిల్ పామ్ పరిశ్రమ నిర్మాణం, జిల్లా ప్రజల సౌకార్యార్ధం జిల్లా కేంద్రంలో మాడల్ బస్టాండ్, ఏటూరునాగారంలో కొత్త బస్ డిపో నిర్మాణ పనులు ప్రారంభమైనవి. ఒకే చోట అన్ని ప్రభుత్వ కార్యాలయాల సేవలు జిల్లా ప్రజలకు అందించుటకు నూతన కలెక్టరేట్ భవననిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి త్వరలో ప్రారంభించుకోవడం జరుగుతుంది. సమ్మక్క – సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ, శాశ్వత భవనాల ఏర్పాటుకు కృషి చేయడం జరుగుతుంది. జిల్లా కేంద్రంలో టాస్క్ సెంటర్ ద్వారా యువతకు ఉపాధి అవకశాలను పెంచుటకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసాం. తద్వారా 51 మంది యువతకు ఉపాధి కల్పించడం జరిగింది. ములుగు, బండారుపల్లి, జీవింతరావుపల్లి గ్రామాలతో ములుగు మున్సిపాలిటీగా ఏర్పాటు చేయటకు కృషి చేయడం జరిగింది. మల్లంపల్లిలో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణం, జిల్లాలో మరో 15 సబ్ సెంటర్ల ఏర్పాటు కోసం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 2026 లో జరగనున్న శ్రీ సమ్మక్క- సారలమ్మ మేడారం జాతరకు దాదాపు ఒక కోటి 50 లక్షల మంది భక్తులు దర్శించుకొనున్ననేపధ్యంలో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లకై ప్రతి శాఖను సమాయత్తం చేయడం జరుగుతుంది.
ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంది. ప్రజా సంక్షేమం కోసం మన జిల్లాలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పథకాలు, సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని మీకు వివరించడానికి సంతోషిస్తున్నాను.

మహాలక్ష్మి పథకం :
ఆడబిడ్డలకు పైసా ఖర్చు లేకుండా ఆర్టీసి బస్సుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించుటకు ప్రభుత్వం కొలువుదీరిన రెండు రోజుల్లోనే మహాలక్ష్మి పధకం ప్రారంభించడం జరిగింది. జిల్లాలో ఇప్పటి వరకు ఒక కోటి 35 లక్షల మంది మహిళలకు 81 కోట్ల 23 లక్షల రూపాయలకు పైగా ఖర్చు చేయడం జరిగినది. జిల్లా ప్రజల సౌకార్యార్ధం జిల్లా కేంద్రంలో 4 కోట్ల 80 లక్షలతో మాడల్ బస్టాండ్, ఏటూరునాగారంలో 6 కోట్ల 28 లక్షలతో కొత్త బస్ డిపో నిర్మాణ పనులు ప్రారంభమైనవి. మంగపేటలో 52 లక్షల నిధులతో బస్టాండ్ నిర్మాణ పనులు తుది దశలో ఉన్నవి త్వరలో ప్రారంభించుకోవడం జరుగుతుంది.

వైద్య ఆరోగ్య శాఖ :
ఆరోగ్య శ్రీ బ్రాండ్ స్కీం : మసకబారిన ఈ పథకానికి పూర్వవైభవం తెచ్చాం.
బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆరోగ్య శ్రీ పరిధిని రూ.5 నుండి 10 లక్షల వరకు ఉచిత వైద్యం పొందేలా తెచ్చిన ఈ పథకం ద్వారా ఈ సంవత్సరం జిల్లాలో 2800 మందికి వైద్య సేవలకుగాను 10 కోట్ల 99 లక్షలకు పైగా రూపాయాల లబ్ది చేకూర్చడం జరిగింది. ఈ సంవత్సరం 1056 గర్భిణి స్త్రీలకుగాను 748 స్త్రీలకి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు (71 శాతం) చేయడం జరిగినది. సీజనల్ వ్యాధుల నిర్మూలన కొరకు ఉచిత ఆరోగ్య శిబిరాల ద్వారా 24 వేల 38 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, 34 మలేరియా 10 డెంగ్యూ కేసులను నిర్ధారించి, వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించడం జరిగినది. అటవీ ప్రాంతాలలో తక్షణ వైద్య సహాయం అందించుటకు రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా నూతన ఆలోచనతో 3 తాత్కాలిక కంటైనర్ సబ్ సెంటర్లను ఏర్పాటు చేసి 4182 మంది పేద గిరిజన ప్రజలకు పరీక్షలు నిర్వహించి, 19 లక్షల 56 వేల రూపాయలను లబ్ది చేకూర్చడం జరిగింది.

ప్రభుత్వ జనరల్ హాస్పిటల్:
ఓ.పి, ఐ.పి. సేవలు గత సంవత్సరం కన్నా 10 శాతం పెరిగినవి. రోజువారి ఓపి 715, ఐ.పి. 165 గా ఉన్నది. మాతా శిశు సంబంధిత సేవలు మరింతగా పెరిగాయి. జనరల్ సర్జరీ విభాగంలో క్యాన్సర్ శస్త్ర చికిత్సలు జరుగుతున్నవి. ఈ నెల ఇద్దరికీ రొమ్ము కణితి, ఒకరికి దవడ కణితి విజయవంతంగా తొలగించి మెరుగైన వైద్య సేవలు అందించినందుకు గాను ఈ సందర్భంగా వైద్య సిబ్బందిని అభినందిస్తున్నాను.

ప్రభుత్వ వైద్య, నర్సింగ్ కళాశాల :
ఎంబీబీఎస్ రెండవ సంవత్సరం కొరకు 50 సీట్లకు ఎన్.ఎం.సి. నుండి అనుమతి పొందడం జరిగింది. కళాశాలలో కావాల్సిన మైక్రోబయాలజీ, పాథాలజీ, కమ్యూనిటీ మెడిసిన్, ఫోరెన్సిక్ మెడిసిన్, ఫార్మా కాలేజీ విభాగాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఎంబిబిఎస్ కోర్స్ తో పాటు పారామెడికల్ కోర్స్ డి.ఎం.ఎల్.టి., డి.ఎం.ఎస్.టి. 60 సీట్లతో ల్యాబ్, తరగతి గదుల సౌకర్యాలను కల్పిస్తూ తరగతులను ప్రారంభించడం జరిగింది.

వ్యవసాయ శాఖ : రైతుల విషయంలో రాజీ పడలేదు. తెలంగాణ రైతును రుణ విముక్తి చేసి, దేశంలో అత్యధిక పంట పండిచే దిశగా ప్రోత్సహించాం. వ్యవసాయానికి పెద్ద పీట వేస్తూ రైతు భరోసా పథకం కింద వ్యవసాయ భూములకు వానా కాలానికి ఎకరానికి 12 వేల చొప్పున 79 వేల 481 మంది రైతుల ఖాతాలో 99 కోట్ల 10 లక్షల జమ చేయడం జరిగింది. రైతు బీమా పథకం కింద 2024-25 సంవత్సరంలో 218 మంది రైతు కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల చొప్పున 10 కోట్ల 90 లక్షలను రైతుల నామినిల కుటుంబ ఖాతాలో జమ చేయడం జరిగింది. సబ్ మిషన్ వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద ఎస్సీ, ఎస్టీ మహిళా సన్న చిన్న కారు రైతులకు 50% రాయితీపై 79 లక్షల 60 వేల రూపాయలను వ్యవసాయ పరికరాలు అందించుటకు కేటాయించడం జరిగింది. జిల్లాలో మొక్కజొన్న పంట వేసి నష్టపోయిన 671 మంది రైతులకు 3 కోట్ల 80 లక్షల 97 వేల రూపాయలను నష్టపరిహారం ఇప్పించడం జరిగింది.

విద్యుత్ శాఖ : గృహ జ్యోతి పథకం ద్వారా జిల్లాలో 200యూనిట్ల వరకు 39వేల 79 విధ్యుత్ వినియోగదారులకు ఉచితంగా జీరో బిల్లులు అందించడం జరిగింది. తద్వారా ఇప్పటి వరకు 39 కోట్ల 44 లక్షల రూపాయలను లబ్దిదారులకు సబ్సిడీ కల్పించాము. 21 కోట్ల 29 లక్షల నిధులతో బుచ్చంపేట, అడవీరంగాపూర్, గట్టమ్మ, జగ్గన్నపేట, నార్లపూర్, లింగాల, రోయ్యూరు గ్రామాల్లో నూతన 33 / 11 కె.వి. విద్యుత్ ఉప కేంద్రాలు ఏర్పాట్లకు శంకుస్థాపన చేయడం జరిగినది. కోడిశాల కుంటలో 2 కోట్ల 70 లక్షలతో నిర్మించుకున్న 33 / 11 కె.వి. విద్యుత్ ఉపకేంద్రం ప్రారంభించడం జరిగింది.

పౌర సరఫరాల శాఖ :70 ఏళ్లుగా పిడిఎస్ వ్యవస్థ పేద ప్రజల ఆహార భద్రతకు భరోసా ఇస్తోంది. అదే స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం ఉగాది నుంచి “సన్న బియ్యం” పంపిణీని ప్రారంభించింది. సన్నధాన్యానికి ఇప్పటివరకు 52 కోట్ల 70 లక్షల రూపాయల బోనస్ చెల్లించడం జరిగింది. జిల్లాలో ఇప్పటి వరకు యాసంగి సీజన్ పంటలకు కనీస మద్దతు ధర పై 78 వేల 701 టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైతుల ఖాతాలలో 485 కోట్ల 49 లక్షల రూపాయలను చెల్లింపు చేయడం జరిగింది. నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు గ్యాస్ సిలిండర్ భారంగా మారకుండా మహాలక్ష్మి పథకంలో భాగంగా జిల్లాలో 50 వేల 64 మందిని అర్హులుగా గుర్తించి, ఇప్పటి వరకు 500 రూపాయల చొప్పున ఒక లక్ష 64 వేల 169 సిలెండర్లను డెలివర్ చేసి, 4 కోట్ల 39 లక్షల సబ్సిడీని లబ్దిదారుల ఖాతాలో జమ చేశాం. రేషన్ కార్డులు గత పది సంవత్సరాల నుండి లేక ఇబ్బందులు పడుతున్న నిరుపేద కుటుంబాలకు జిల్లాలో 6 వేల 207 కొత్త రేషన్ కార్డులు జారీ చేయడం జరిగింది. పదేళ్ల తర్వాత చేతిలో రేషన్ కార్డుతో… రేషన్ షాపుల వద్ద సందడి కనిపిస్తోంది. పేదల ఆకలి తీర్చటంతో పాటు, వారు ఆత్మగౌరవంతో జీవించేందుకు జిల్లాలో ప్రతినెల 97 వేల 634 రేషన్ కార్డుదారులకు, ప్రతి నెల 7 కోట్ల 88 లక్షల రూపాయలను వెచ్చించి 1,751 టన్నుల పోషకాలతో కూడిన సన్న బియ్యం సరఫరా చేయడం జరుగుతున్నది.

జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ : గ్రామీణ మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనే ఉద్దేశంతో చేపట్టిన ఇందిరా మహిళ శక్తి పథకం లో భాగంగా ఎస్.హెచ్.జి. లకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో జిల్లాలోని 28 వేల 797 మంది విద్యార్థులకు ఏకారూప దుస్తులను వీరి ద్వారా కుట్టించి విద్యార్థులకు అందజేయడం జరిగింది. స్వయం సహాయక సంఘాల ద్వారా జిల్లాలో పౌల్ట్రీ మదర్ యూనిట్లు 5, మొబైల్ ఫిష్ రిటైల్ అవుట్ లెట్లు యూనిట్లు 2 ఏర్పాటు చేయడం జరిగినది. సదరం క్యాంపు ద్వారా 6,776 మంది దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్లు జారీ చేయడం జరిగింది. బ్యాంకు లీకేజీ కింద 1060 మహిళా సంఘాలకు 80 కోట్ల 54 లక్షల రుణాలు మంజూరు చేశాం. స్త్రీ నిధి కింద 33 వి.ఓ. లకు, 136 సంఘాల సభ్యులకు 4 కోట్ల 50 లక్షలు మంజూరు చేశాం. చేయూత పెన్షన్ పథకం ద్వారా 38 వేల 60 మంది లబ్దిదారులకు 9 కోట్ల 87 లక్షల రూపాయలను ప్రతి నెల పెన్షన్స్ అందిచడం జరుగుతుంది.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఈ సంవత్సరం 7లక్షల 57 వేల పనిదినాలు కల్పించి, 47 వేల 50 మంది కూలీలకు 20 కోట్ల 80 లక్షల రూపాయలను వేతనంగా చెల్లించడమే కాకుండా, 12 కోట్ల 32 లక్షల రూపాయలను మెటీరియల్ కొరకు ఖర్చు చేయడం జరిగింది.

జిల్లా పంచాయతీ శాఖ : జిల్లాలోని 171 గ్రామ పంచాయితీలలో ట్రాక్టర్ల ద్వారా ప్రతి ఇంటి నుండి చెత్త సేకరించి, డంపింగ్ యార్డులకు తరలించి గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడం జరుగుతుంది. జిల్లా లోని 171 పంచాయితిలలోని నర్సరిలలో 11 లక్షల 39 వేలకు పైగా మొక్కలను సంరక్షించడం జరుగుతుంది.

నీటిపారుదల శాఖ : యాసంగి పంట సాగుకు 53 వేల 278 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు సరఫరా చేయడం జరిగింది. అంతేగాకుండా ప్రస్తుత సంవత్సరం వానకాల పంటల కొరకు సుమారు 88 వేల 18 ఎకరాలకు పైగా సాగునీరు అందించుటకు చర్యలు తీసుకొన బడుచున్నవి.

మిషన్ భగీరథ: జిల్లాలో 601 ఓ. హెచ్.ఎస్.ఆర్. లతో 88 వేల 30గృహాలకు అన్ని అవసరాలకు సరిపడు సురక్షిత మంచినీరు సరఫరా చేయడం జరుగుతున్నది.

ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం: నిరుపేదలకు ప్రతి ఒక్కరికీ సొంత ఇంటికల నిజం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించి ఇందిరమ్మ ఇళ్ళ పథకాన్ని అమలుపరుస్తోంది. మొదటిదశలో నిరుపేదలై ఉండి.. ఇంటి స్థలం ఉండి ఇల్లు లేని వారిని ప్రామాణికంగా తీసుకుని 5 లక్షలతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టాం. ఇందులో బాగంగా జిల్లాలోని 10 మండలాలు, ఒక మున్సిపాలిటీకి మొదటి దశలో 4601 ఇండ్లు మంజూరు కాగా 3 వేల 678 ఇండ్లు గ్రౌండ్ అయ్యాయి. 1561 ఇండ్లు నిర్మాణ పనులు వివిద దశల్లో పురోగతిలో ఉండగా ఇప్పటి వరకు 9 కోట్ల 81 లక్షలు చెల్లించాం. ఈ పథకంతో పేదవాళ్లకు సొంతింటి కల సాకారమైంది.

కళ్యాణ లక్ష్మీ/షాదీముబారక్ పథకం:
2025-26 సంవత్సరంలో కళ్యాణ లక్ష్మీ/షాదీముబారక్ పథకాల క్రింద వివాహాలు జరిగిన పేద కుటుంబాలకు రూ.1 లక్ష 116/- ల చొప్పున 2 కోట్ల 71 లక్షల రూపాయలను 271 మంది లబ్దిదారులకు అందించడం జరిగినది.

అటవీశాఖ : వనమహోత్సవములో భాగంగా 171 గ్రామపంచాయితీలలో 14 లక్షల 26 వేల మొక్కలను నాటడం జరుగుతుంది. ఈ లక్ష్య సాధనలో భాగంగా వివిధ శాఖలలోని నర్సరీలలో 25 లక్షల 40 వేల మొక్కలను పెంచడం జరిగినది. తూనికాకు సేకరణలో 10వేల 359 “ఎస్. బి. “లకు 341 లక్షల 86 వేల కలెక్షన్ చేసి, 10 వేల 631 కూలీలకు రుసుముగా ఇవ్వడం జరిగింది. కాంపా అభివృద్ధి పనుల కింద ఒక లక్ష 33 వేల పని దినాలు కల్పించడం జరిగింది.

పశు వైద్య, పశుసంవర్ధక శాఖ : పాడి పశువులకు ఒక లక్ష 75 వేల గాలి కుంటు, జబ్బ వాపు, గురక వ్యాది టీకాలను, 65 వేల లంపి చర్మవ్యాధి టీకాలను వేయడం జరిగింది. గొర్రెలలో మేకలలో చిటుకు రోగం నీలి నాలుక వ్యాధి నివారణకు 42 వేల 194 టీకాలు వేయడం జరిగింది.

పరిశ్రమల శాఖ : టీజీ ఐపాస్ క్రింద 24 సూక్ష్మ మరియు చిన్న తరహా పరిశ్రమలకు 40 వివిధ రకముల అనుమతుల మంజూరు చేయడం జరిగింది. ఇట్టి పరిశ్రమల ద్వారా 38 కోట్ల 20 లక్షల పెట్టుబడితో 221 మందికి ఉపాధి కల్పించడం జరుగుతున్నది. టీ ప్రైడ్ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, పి.హెచ్.సి. పారిశ్రామిక వేత్తలకు 10 యూనిట్లకు 33 కోట్ల 32 లక్షల రూపాయలు రాయితి మంజూరు చేయడం జరిగింది.

పర్యాటక శాఖ : రామప్ప ఐలాండ్ వద్ద 13 కోట్ల నిధులతో అభివృద్ది పనులను, ప్రసాద్ స్కీమ్ లో భాగంగా 61 కోట్లతో యూనెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం పర్యాటక ప్రాంతం పాలంపేట గ్రామంలో ఇంటర్ప్రిటేషన్ సెంటర్, ఫుడ్ కోర్టులు, సావనీర్ షాప్, ల్యాండ్ స్కేపింగ్ పనులు చేపట్టడం జరుగుతుంది.

రెవెన్యూ శాఖ : రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ రికార్డులను అత్యంత పారదర్శకంగా, సరళతరంగా, రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించుటకు గాను నూతన ఆర్.ఓ.ఆర్. భూ భారతి చట్టంను రూపొందించినది. ఇందులో భాగంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతుల నుండి 36 వేల 673 అర్జీలను స్వీకరించి, రికార్డులు పరిశీలన అనంతరం 6 వేల 284 దరఖాస్తులను ఆమోదించడం జరిగినది. భూములను రీసర్వే నిమిత్తం మొదటి దశలో రాష్ట్ర వ్యాప్తంగా 5 గ్రామాలను ఎంపిక చేసిన దానిలో వెంకటాపురం మండలంలోని నూగూరు రెవెన్యూ గ్రామం ఒకటి. దీనిలో భాగంగా ప్రతి భూ భాగాన్ని సర్వే చేసి రైతుల యొక్క విభాగానికి ల్యాండ్ పార్సెల్ మ్యాప్ తయారు చేసి రైతుల యొక్క ఆమోదం ద్వారా రెవెన్యూ రికార్డులలో అప్ డేట్ చేయుటకు ప్రక్రియ మొదలైనదని తెలుపుతున్నాను.

ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ సంక్షేమ శాఖలు : జిల్లాలోని 48 వసతి గృహాల్లోని విద్యార్థులకు కామన్ డైట్ అమలు చేస్తున్నాం. ఆహార నాణ్యత పరిశీలనకు ఫుడ్ కమిటీలను ఏర్పాటు చేశాం. సంక్షేమ, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో ఆహార తనిఖీలు నిర్వహించడం, నాణ్యత పరిశీలనకు ప్రతి వారం ఫుడ్ విత్ చిల్డ్రన్ కార్యక్రమాన్ని చేపట్టాం. ప్రత్యేక అధికారులు వారంలో 3 రోజులు విద్యార్థులతో సహపంక్తి భోజనాలు చేసి నాణ్యత, సౌకర్యాల కల్పనకు చర్యలు చేపట్టాం. డైట్, కాస్మొటిక్ చార్జీలను పెంచాం. ఈ శాఖల ద్వారా విద్యనభ్యసించే విద్యార్థులకు ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్, బెస్ట్ అవైలబుల్ స్కీం అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి తదితర పథకాలు అమలు చేస్తున్నాం.

విద్య శాఖ : ఈ విద్య సంవత్సరము ఇంటర్మీడియట్ ఫలితాలలో 81.12 శాతం సాదించి ములుగు జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపిన, విద్యార్థులకు, అధ్యాపకులకు అభినందనలు. ఈ విద్య సంవత్సరం కన్నాయిగూడెం మండలంలోని కే.జి.బి.వి. పాఠశాలను జూనియర్ కాలేజీగా ఉన్నతీకరించడం జరిగినది. ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన, నాణ్యమైన విద్యా బోధనకు అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా 6 కోట్ల 91 లక్షలతో 239 పాఠశాలల్లో మరమ్మత్తు పనులు పూర్తి చేయడం జరిగింది. ఈ విద్యా సంవత్సరం 413 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న 20 వేల 112 మంది విద్యార్థులకు లక్షా 27 వేల 880 ఉచిత పాఠ్య పుస్తకాలు, లక్షా 9 వేల 215 వ్రాత పుస్తకాలను పంపిణీ చేశాం.

State Minister Danasari Anasuya Seethakka

ఉద్యానశాఖ : జిల్లాలో సమీకృత ఉద్యాన అభివృద్ధి పథకం, తెలంగాణ సూక్ష్మనీటి పారుదల పథకం, సమీకృత జాతీయ నూనె గింజల ఆయిల్ పామ్ పథకాలు అమలు చేస్తున్నాం. సమీకృత జాతీయ నూనె గింజలు, ఆయిల్ పామ్ పథకం లో భాగంగా 265 మంది రైతులకు 343.78 హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగుకు పరిపాలన అనుమతులు, 72 మంది రైతులకు 88.74 హెక్టార్లలో 33.35 లక్షల రూపాయలను సబ్సిడీ మంజూరు చేయడం జరిగింది. ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించుటకు, రైతులు ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభం పొందాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం12 ఎకరాల్లో ఆయిల్ ఫ్యాక్టరీకోసం కేఎన్ బయోసైన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కి అనుమతి ఇచ్చి, నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం జరిగినది.

సమ్మక్క సారక్క ట్రైబల్ సెంట్రల్ యూనివర్సిటీ: బీఏ ఎకనామిక్స్ హానర్స్, ఇంగ్లీష్ హానర్స్ కోర్సులతో ప్రారంభమైన యూనివర్సిటీ లో గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం విద్యార్థుల సంఖ్య పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత యూనివర్సిటీ భవనాల నిర్మాణం కోసం జిల్లా కేంద్రంలోని గట్టమ్మ దేవాలయానికి ఎదురుగా 287 ఎకరాల రెవెన్యూ భూమిని, 50 ఎకరాల అటవీ భూమిని కేటాయించి, త్వరలో యూనివర్సిటీ శాశ్వత భవనాల నిర్మాణానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది.

మహిళా, శిశు సంక్షేమ శాఖ : ఈ సంవత్సరంలో సఖి కేంద్రం ద్వారా 196 మంది మహిళలకు వివిధ రకాల సేవలు అందించడం జరిగింది. 1372 మంది గర్భిణి స్త్రీలకు, 1037 మంది పాలిచ్చే తల్లులకు ప్రతి రోజు అన్నము, పప్పు, కూరగాయలు పాలు, గుడ్డుతో కూడిన ఒక పూట సంపూర్ణ భోజనాన్ని అందిస్తున్నాము. 5,938 మందికి 7 నెలల నుండి 3 సం.ల లోపు చిన్నారులకు నెలకు 2.5 కేజీల బాలామృతముతో పాటు 16 గుడ్లను అందిస్తున్నాము. 6 వేల 424 మందికి 3 నుండి 6 సం.ల లోపు పిల్లలకు ఒక గ్రుడ్డు, అన్నము, పప్పు, కూరగాయలు, స్నాక్స్ ప్రతి రోజు పంపిణి చేయడం జరుగుతున్నది. వికలాంగుల కోసం సదరం సర్టిఫికెట్లు పొందే ప్రక్రియను సులభతరం చేసాము. గతంలో కేవలం 7 రకాల వైకల్యాలను మాత్రమే సదరం క్యాంపులలో గుర్తించే వారు. ఇప్పుడు 21 రకాల వైకల్యాలను గుర్తించి సర్టిఫికెట్లను జారీ చేస్తున్నాం. జిల్లాలో 600 మంది దివ్యాంగులను గుర్తించి వారికి బ్యాటరీ వీల్ చైర్స్- 150, వీల్ చైర్స్- 250, హియరింగ్ ఎయిడ్స్- 40, ట్రై సైకిల్స్ 150, మోటరైజ్డ్ వెహికల్స్ 10, అందించడం జరిగింది. జిల్లాలో ఐదుగురు దివ్యాంగులు సకలాంగులను వివాహం చేసుకున్న 3 జంటలకు లక్ష చొప్పున ప్రోత్సాహక బహుమతి అందించడం జరిగింది.

గిరిజన అభివృద్ధి శాఖ : జనవరి 28 నుండి 31 వరకు మేడారం శ్రీ సమ్మక్క- సారలమ్మ మహా జాతరను అత్యంత వైభవంగా నిర్వహించుటకు ఏర్పాట్లు జరుగుతున్నవి. ఎస్టి, ఎన్డీ.ఎఫ్ పథకంలో భాగంగా గత రెండు సంవత్సరాలలో 52 రోడ్లు, 68 కోట్ల 51 లక్షలతో మంజూరు కాగా 12 రోడ్లు పూర్తి అయినవి. మిగతావి ప్రగతిలో ఉన్నవి. 25 గ్రామ పంచాయతీ బిల్డింగ్ పనులు 5 కోట్లతో మంజూరు కాగా 2 పూర్తి అయి మిగతావి పురోగతిలో ఉన్నవి. అసిస్టెంట్ టు ఐటీడీఏ లో భాగంగా గత రెండు సంవత్సరములలో 110
పనులు 723 లక్షల 30 వేలతో మంజూరు కాగా 70 పనులు పూర్తి అయినవి. అంగన్వాడి కేంద్రాలు, ఆశ్రమ పాఠశాలలు, సబ్ సెంటర్ల రిపేర్ల నిమిత్తము 227 పనులు, 11 కోట్ల 65 లక్షలతో మంజూరు కాక 126 పనులు పూర్తయినవి. 101 పనులు పూర్తి దశలో ఉన్నవి.

రహదారులు, భవనముల శాఖ :జిల్లాలో ఎస్టి.యస్.డి.ఎఫ్., ఆర్.డి.ఎఫ్., తదితర పథకాల ద్వారా 93 పనులకు గాను 228 కోట్ల 50 లక్షల నిధులు మంజూరు చేయడం జరిగినది. 12 పనులు పూర్తికాగా 81 పనులు వివిధ దశలలో పురోగతిలో ఉన్నవి. సమీకృత జిల్లా కార్యాలయముల సముదాయ భవనం (కలెక్టరేట్), నివాస గృహముల నిమిత్తం 63 కోట్ల 50 లక్షల నిధులు మంజూరు చేయడం జరిగినది. శరవేగంగా నిర్మాణం పనులు జరుగుచున్నవి. కోర్టు సముదాయ భవన నిర్మాణం కొరకు 81 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగినది. త్వరలో పనులు ప్రారంభించడం జరుగుతుంది.

పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ :జిల్లాలో మహత్మా గాంధీ జాతీయ ఉపాది హామీ పథకం క్రింద 9 కోట్ల 52 లక్షల అంచనా వ్యయంతో 22 గ్రామ పంచాయతీ భవనాలు 30 అంగన్వాడి కేంద్రాలు 76 స్కూల్ టాయిలెట్స్ పనులు చేపట్టడం జరిగింది. సి.ఆర్.ఆర్. పథకం ద్వారా 73 కోట్ల 98 లక్షలతో 37 రోడ్లు, ఎం.ఆర్.ఆర్. పథకం ద్వారా 109 కోట్ల 76 లక్షలతో 62 రోడ్లు మంజూరు చేయడం జరిగినది. ఎఫ్ డి ఆర్, ఎస్టి ఆర్ పథకాల ద్వారా 28 కోట్ల 49 లక్షల నిధులతో 24 పనులు వివిధ దశలలో పురోగతిలో ఉన్నవి. ఎస్.డి.ఎఫ్. గ్రాంటు క్రింద ఎస్.టి కాంపోనెంట్ లో 33 కోట్ల 25 లక్షల తో 10 రోడ్లు మంజూరు చేయడం జరిగినది. ఎస్.ఎస్.ఎం. జె. గ్రాంట్ క్రింద 7 కోట్ల 14 లక్షలతో 11 కూడలి అభివృద్ధి వివిధ దశలలో పురోగతిలో ఉన్నవి. 6 కోట్ల అంచనా వ్యయంతో 3 ఎం.పి.డి.ఓ. కార్యాలయ భవనాలు, ఒక కోటి 80 లక్షలతో 2 పి. ఆర్. సబ్ డివిజన్ ఆఫీస్ భవనాలు, 2 కోట్లతో ఒక పి.ఆర్.ఎస్. ఈ. ఆఫీస్ భవనం మంజూరు చేయడం జరిగినది.

యాస్పిరేషన్ అవార్డు : మన జిల్లాకు యాస్పిరేషన్ అంశాలలో రాష్ట్రస్థాయిలో అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా జిల్లాకు అవార్డు ఇవ్వడం ఎంతో గౌరవంగా ఉంది. ఈ సందర్భంగా కృషి చేస్తున్న జిల్లా కలెక్టర్ ని, జిల్లా యంత్రాంగాన్ని అభినందిస్తున్నాను. మన జిల్లా యాస్పిరేషన్ నుండి ఇన్పిరేషన్ జిల్లాగా అభివృద్ధి చెంది రోల్ మాడల్ గా నిలవాలని ఈ సందర్భంగా ఆకాంక్షిస్తున్నాను.

పోలీస్ శాఖ : శాంతి భద్రతల పరిరక్షణకు పొలిసుశాఖ పటిష్ట చర్యలు తీసుకుంటూ, ఆధునిక టెక్నాలజీ వినియోగంతో నేరాలను చేధించడంతో పాటు నియంత్రణ చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. శాంతి భద్రతల పరిరక్షణలో నిరంతరం నిమగ్నమైన జిల్లా ఎస్పి, పోలిస్ అధికారులకు, సిబ్బందికి అభినందనలు.
మారుమూల గ్రామాలు, నిరుపేదలు నివసిస్తున్న మన జిల్లా సమగ్రాభివృద్ధికి నిరంతర కృషి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమత్రి శ్రీ ఏనుముల రేవంత్ రెడ్డి గారికి, జిల్లాలో ప్రభుత్వ, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సమర్ధవంతంగా అమలు చేసేందుకు తమ పూర్తి సహకారం అందిస్తున్న వరంగల్ ఉమ్మడి జిల్లా ఇంచార్జి మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి, పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనమండలి సభ్యులు, గౌరవ శాసన సభ్యులు, వివిధ సంస్థల గౌరవ చైర్మన్లు. డైరెక్టర్లు, సభ్యులు, స్థానిక గౌరవ ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, స్వచ్చంధ సంస్థల ప్రతినిధులకు, జిల్లా ప్రజలకు, ప్రభుత్వ యంత్రాంగానికి, పాత్రికేయులకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నాను.
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్న ఈ పండుగ వేళ మీ అందరికీ మరొక్కసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తూ ముగిస్తున్నాను.

జహీరాబాద్ బిసి తాలూకా కమిటీ ఏకం అవుదాం పోరాడుదాం సాధిద్దాం

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-12T173735.480.wav?_=13

జహీరాబాద్ బిసి తాలూకా కమిటీ ఏకం అవుదాం పోరాడుదాం సాధిద్దాం

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలో బీసీ సంఘాల నాయకులు ఏకధాటికి వచ్చారు బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని స్వాతంత్రం వచ్చినప్పటినుండి ఇప్పటివరకు అగ్రకులాల వారికే అధికారంలో కొనసాగుతున్నారు రాజకీయంలో ముందడుగు వేయకపోవడమే ఇప్పటికైనా ఇప్పటికైనా మనకెందుకు అనుకుంటే సంపన్న వర్గాల అధికారుల బీసీలను అన్నదొక్కారు ఇప్పుడిప్పుడే రాజా అధికారం దిశగా అడుగులు వేసి రాష్ట్ర బీసీ ప్రజలకు చైతన్యమే లక్ష్యంగా బీసీ మరియు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బడుగు బలహీన వర్గా లను కలుపుకొని స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసి పార్టీలకు సంబంధం లేకుండా ఇన్నాళ్లు మన జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తూ ఓటు ద్వారా సమాధానం చెబుతూ అత్యధిక మెజార్టీతో గెలవడమే మన లక్ష్యం మనమంతా ఏకం అవుదాం పోరాడుదాం సాధిద్దాం
ఈ కార్యక్రమానికి జహీరాబాద్ నియోజకవర్గ బీసీ నాయకులు హుగ్గేల్లి రాములు , పెద్ద గొల్ల నారాయణ, కొండాపురం నరసింహులు, మహమ్మద్ ఇమ్రాన్, బీసీ మైనార్టీ అధ్యక్షులు, రాములు నేత, విశ్వనాధ్ యాదవ్, షికారి గోపాల్ , శ్రీనివాస్,ప్రభు గౌడ్, వడ్డెర శేఖర్ ,దత్తు, సిద్దు అడ్వకేట్, పెద్ద ఎత్తున తదిపర్లు పాల్గొన్నారు.

బీసీ రిజర్వేషన్లపై ఎందుకీ గలభా?

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-19-2.wav?_=14

బీసీ రిజర్వేషన్లపై ఎందుకీ గలభా?
-వేముల మహేందర్ గౌడ్
-బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

ఆగస్టు 7 భారత సమాజంలో తరతరాలుగా విద్యకు, భూమికి దూరంచేసి వెనుక వేయబడ్డ వర్గానికి స్వతంత్ర భారతదేశంలో సుమారు 50 సంవత్సరాల తర్వాత రిజర్వేషన్లు కల్పించబడ్డ రోజు..సామాజిక న్యాయం కోసం 40 సంవత్సరాలు వెనకబడ్డ వర్గాల పోరాటానికి గుర్తింపు లభించిన రోజు..లోక్‌సభలో మాజీ ప్రధాని విపి సింగ్ ఇతర వెనకబడ్డవర్గాల కోసం ఉద్యోగాల్లో రిజర్వేషన్ల ప్రకటన జారీ చేసిన రోజు..నేడు దేశవ్యాప్త బీసీ రిజర్వేషన్ల ఉద్యమానికి నాంది పలికిన రోజు..బీసీల 42 శాతం రిజర్వేషన్ల అంశం..ప్రస్తుతం హైదరాబాద్ ఇంద్రపార్క్ నుంచి ఢిల్లీలోని జంతర్‌మంతర్‌కు చేరింది. తెలంగాణనే కాదు యావత్ భారతదేశం బీసీల 42 శాతం రిజర్వేషన్లు అమలు అవుతాయా, కావా? అనే ప్రశ్నతో వెయ్యి కండ్లతో ఎదురు చూస్తుంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు లేని పరిమితి బీసీ రిజర్వేషన్లకు ఎందుకు? 2019 జనవరి నెలలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టడం, రెండు సభలలో ఆమోదించడం, (Passage both houses) రాష్ట్రపతి సంతకం చేయడం, గెజిట్‌లో ప్రచురించడం, అమలు కావడం చకచకా జరిగిపోయాయి. కానీ బీసీలకు విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ..తెలంగాణ రాష్ట్రం రెండు బిల్లులు పంపి ఆరు నెలలు గడుస్తున్నా..నిర్ణయం తీసుకోవడంలో జాప్యం ఎందుకు? స్థానిక సంస్థలలో బీసీల 42% రిజర్వేషన్లు అమలు చేయాలని 2018 చట్టంలో సెక్షన్ 285ఎ కి సవరణ చేసి గవర్నర్‌కు ఆర్డినెన్స్ పంపిస్తే..మళ్లీ ఆర్డినెన్స్ ఢిల్లీకి (రాష్ట్రపతి సలహా కోసం) చేరింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు లేని అగ్నిపరీక్ష బీసీల 42 శాతం రిజర్వేషన్లకు ఎందుకు? అసలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు లేని 50 శాతం పరిమితి నిబంధన బీసీ రిజర్వేషన్లకు ఎందుకు? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను సుప్రీం కోర్టు సమర్ధించింది, బీసీ 42 శాతం రిజర్వేషన్లను సమర్థించదా? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు తీర్పు. జనహిత్ అభియాన్ వర్సెస్ ఇండియా కేసులో 2022 నవంబర్ 7న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను సుప్రీం కోర్టు 3:2 మెజార్టీ ద్వారా సమర్థించింది. ముఖ్యంగా ఈ కేసులో సుప్రీం కోర్టు స్పష్టపరిచిన అంశాల్లో ఆర్టికల్ 15(4), 16(4) కింద రిజర్వేషన్లు అసాధారణ పరిస్థితులలో తప్ప 50 శాతం మించకూడదు అనే తీర్పు సామాజికంగా, విద్యా పరంగా వెనుకబడిన తరగతులకు (ఎస్‌సీ, ఎస్‌టీ, ఓబీసీలు వంటివి) వర్తిస్తుంది. ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు కాదు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌ను విడిగా పరిగణిస్తారు. ఈడబ్ల్యూఎస్ (10 శాతం) ఇప్పటికే ఎస్‌సీ, ఎస్‌టీ లేదా ఓబీసీ రిజర్వేషన్ల పరిధిలోకి రాని వారికి, ఎందుకంటే ఇది అదనంగా కల్పిస్తున్న రిజర్వేషన్లు. 103వ రాజ్యాంగ సవరణ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోసం ఆర్టికల్స్ 15(6), 16(6)లను రాజ్యాంగానికి చేర్చింది. కాబట్టి ఆమోదిస్తున్నాం. ఇది రాజ్యాంగంలో భాగం కాబట్టి, సుప్రీంకోర్టు గతంలో న్యాయపరంగా రూపొందించిన 50 శాతం నియమాన్ని అధిగమిస్తుందని తీర్పు ఇచ్చింది. తమిళనాడు వెనుకబడిన తరగతులు, ఎస్‌సీ, ఎస్‌టీల చట్టం, 1993ను ఆమోదించింది. ఇది 69 శాతం రిజర్వేషన్లను కల్పిస్తుంది. న్యాయ సమీక్ష నుండి రక్షించడానికి రాజ్యాంగంలోని 9షెడ్యూల్‌లో ఈ చట్టం చేర్చబడింది. 2018లో మహారాష్ట్ర ఎస్‌ఇబీసీ (సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులు) వర్గం కింద మరాఠాలకు 16 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఒక చట్టాన్ని ఆమోదించింది. ఇది మొత్తం రిజర్వేషన్లను 70 శాతంకి పెంచింది. మే 2021లో సుప్రీంకోర్టు 50 శాతం పరిమితిని ఉల్లంఘించడానికి ఎటువంటి అసాధారణ పరిస్థితులు లేవని దానిని కొట్టివేసింది. రాజస్థాన్ గుజ్జర్లకు 5 శాతం రిజర్వేషన్లు, ఇతర ఓబీసీలకు 21 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి ప్రయత్నించింది, దీనితో మొత్తం రిజర్వేషన్లు 70 శాతం కంటే ఎక్కువయ్యాయి. రాజస్థాన్ హైకోరు, సుప్రీం కోర్టు 50 శాతం పరిమితిని ఉల్లంఘించాయి. అసాధారణ పరిస్థితులను సమర్థించడానికి తగినంత డేటా లేదని ఈ చట్టాన్ని కొట్టివేసాయి. బీహార్ ప్రభుత్వం నవంబర్ 2023లో బీహార్ కుల సర్వే ఆధారంగా రిజర్వేషన్లను 75 శాతంకి పెంచుతూ చట్టాన్ని ఆమోదించింది. పాట్నా హైకోర్టు అసాధారణ పరిస్థితులు ఉంటే తప్ప రిజర్వేషన్ 50 శాతం మించకూడదని, కుల సర్వే డేటాలో అసాధారణ పరిస్థితులు నిరూపించబడలేవని, అదనపు రిజర్వేషన్లను సమర్థించడానికి తగినంత బలమైన సామాజిక, -ఆర్థిక సూచికలు దీనికి లేవని కొట్టివేసింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును, కృష్ణమూర్తి కేసులో ఇచ్చిన త్రిబుల్ టెస్ట్ తీర్పును, వివిధ రాష్ట్రాల్లో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు, సుప్రీం కోర్టు తీర్పులను ఇతర రాష్ట్రాల అనుభవాలను దృష్టిలో ఉంచుకున్న తెలంగాణ ప్రభుత్వం వెనుకబడిన తరగతులకు ( బీసీలు) 42 శాతం
రిజర్వేషన్లను అమలు చేయడానికి నవంబర్-, డిసెంబర్ 2024లో తెలంగాణ సామాజిక,- ఆర్థిక, కుల సర్వే (ఎస్‌ఇఇఇపిసి)ని నిర్వహించింది, ఇది 96.9% గృహాలను కవర్ చేసింది. జనాభాలో బీసీలు 56.33 శాతం ఉన్నారని తేల్చింది. సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా డేటాను విశ్లేషించడానికి, రిజర్వేషన్ సంస్కరణలను సిఫార్సు చేయడానికి బీసీ కమిషన్ ను ఏర్పరచింది. మార్చి 2025లో, తెలంగాణ శాసనసభ విద్యా, ప్రభుత్వ ఉద్యోగాలలో బీసీ రిజర్వేషన్లను 42 శాతంకి పెంచడం (29 శాతం నుండి), పంచాయతీలు, మున్సిపాలిటీల వంటి స్థానిక సంస్థలకు 42 శాతం కోటాను పెంచడం కోసం (18 శాతం ఎస్‌సీ, 10 శాతం ఎస్‌టీ కోటాలతో పాటు మొత్తం 70 శాతంకి తీసుకురావడం) రెండు బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించింది. పార్లమెంట్ అనుమతి కోసం ఢిల్లీకి పంపింది. జూలై 2025లో తెలంగాణ మంత్రివర్గం తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 285ఎని సవరించడానికి ఆర్డినెన్స్ జారీ చేయడానికి ఆమోదం తెలిపింది. గవర్నర్ ఈ ఆర్డినెన్స్‌ను 1 ఆగస్టు 2025న రాష్ట్రపతికి పంపారు. ప్రస్తుతం ఏం చేయాలి. బీసీల 42 శాతం రిజర్వేషన్లు అమలు కావాలంటే తప్పనిసరిగా రాజ్యాంగా సవరణ అవసరం. 50 శాతం పరిమితిని అధిగమించాలంటే అసాధారణ పరిస్థితుల్లో అధిగమించవచ్చు. 50 శాతం పరిమితి అనేది న్యాయపరమైన మినహాయింపే కానీ రాజ్యాంగపరమైన మినహాయింపు కాదు. కాబట్టి 56.36 శాతం ఉన్న బీసీలకు తగినంత ప్రాతినిధ్యం లేదని డెడికేట్ కమిషన్ ద్వారా రిపోర్టును సమర్పిస్తూ సమగ్ర సర్వే, శాస్త్రీయ డేటాను ముందు ఉంచే ప్రయత్నం చేయాలి. తమిళనాడు మాదిరిగా 42 శాతం బీసీ రిజర్వేషన్ల అంశాన్ని 9వ షెడ్యూల్లో చేర్చి కోర్టుల నుంచి మినహాయింపు పొందవచ్చు. (తొమ్మిదవ షెడ్యూల్లోని చట్టాలను న్యాయ సమీక్ష చేయవచ్చు). రాజ్యాంగ సవరణ కోసమే తెలంగాణ సమాజం ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తుంది. ఇంత జరుగుతున్నా బీసీ రిజర్వేషన్లకు మోక్షం లభించడం లేదంటే యావత్ భారతదేశం, తెలంగాణ సమాజం దానికి కారకులు ఎవరో నిర్ణయించుకోవాలి.

ప్రజా యుద్ధ నౌక గద్దర్ 3వ వర్ధంతి వేడుకలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-15.wav?_=15

ప్రజా యుద్ధ నౌక గద్దర్ 3వ వర్ధంతి వేడుకలు

భూపాలపల్లి నేటిధాత్రి

తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం కార్యాలయంలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ (టీపీఎఫ్) జిల్లా అధ్యక్షుడు పిక కిరణ్ ఆధ్వర్యంలో ప్రజాయుద్ధం నౌక గద్దర్ మూడో వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కామెర గట్టయ్యముఖ్య అతిథి హాజరై ప్రజాయుద్ధనౌక గద్దర్ చిత్రపటానికి పూలదండలతో ఘనంగా నివాళులు అర్పించారు
ఈ సందర్భంగా తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గట్టయ్య మాట్లాడుతూ, కామ్రేడ్ గద్దర్ అన్న తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయ సాధన ప్రజాసామిక తెలంగాణ ప్రజా స్వామిక తెలంగాణ కోసం ప్రజలు పోరాడవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని గద్దర్ అన్న విప్లవ సాంస్కృతికోధ్యమ సారధి ప్రజా యుద్ధ నౌక గద్దర్ అన్న తన ఆట,పాట మాటతో పాలకవర్గాల దోపిడి దౌర్జన్యాలపై ప్రజల్ని చైతన్యవంతం చేయడమే కాకుండా ప్రజా ఉద్యమాల వైపు నడిపించడానికి ఆయన చేసిన కృషి ఎనలేనిది, యువతరాన్ని విప్లవ ఉద్యమం వైపు ఆకర్షించడంలో ఆయన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంత దోహాధం చేశాయి. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో సింగరేణి గని కార్మికులను సమీకరించడానికి బాయి నుండి బాయి.కార్యక్రమం తెలంగాణ కొంగు బంగారం సింగరేణిలో ఎంతో స్ఫూర్తినిచ్చింది. ఆయన ఆట పాట మాటను నిర్మూలించడానికి రాజ్యం కాల్చిన తూటాలను సైతం ధిక్కరించి రాజ్య హింసను దోపిడి వ్యవస్థను ఎండ కట్టింది. సాంస్కృకోద్యమానికి ఆయన లోటు ఎనలేనిది, ప్రజా గళాలు, కళాలు కలుషితమవుతున్న నేటి సాంస్కృతిక ఉద్యమ, భావవాదం వైపు కొట్టుకుపోతున్న తరుణంలో ఆయన లోటు తీర్చలేనిది. ఆయన వదిలి వెళ్ళిన విప్లవ సాంస్కృతిక ఉద్యమ బాధ్యతను భుజానికి ఎత్తుకుందాం
ఇదే ఆయనకు మనం ఇచ్చే ఘనమైన నివాళి అని పేర్కొన్నారు. అమరుడు గద్దర్ కు సింగరేణి ఉద్యోగుల సంఘం ప్రజా సంఘాలు నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో నాయకులు. దాసరి జనార్ధన్. దుబాసి పార్వతి. కర్ణాటక సమ్మయ్య. అయితే బాపు. కోడిమేత సరస్వతి.సంజీవ్. వావిలాల లక్ష్మణ్. దేవి సత్యం. రాసమల్ల భద్రయ్య. జైపాల్ సింగ్. అక్కల బాపు. రాజన్న. తదితరులు పాల్గొన్నారు.

42 శాతం రిజర్వేషన్ తోబీసీలకు సామాజిక న్యాయం

42 శాతం రిజర్వేషన్ తోబీసీలకు సామాజిక న్యాయం
రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

42% శాతం రిజర్వేషన్ తో బీసీలకు సామాజిక న్యాయం జరుగుతుందని మొగుళ్ళపల్లి కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు కాత్య రాజు రమేష్ తెలిపారు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మకంగా 42 శాతం బీసీ రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికల వైపు అడుగుపెట్టడం ఒక విప్లవాత్మక నిర్ణయం అని అన్నారు.

క్యాబినెట్ సమావేశంలో బీసీ రిజర్వేషన్ల అమలు స్థానిక సంస్థలకు రిజర్వేషన్లు ఖరారు చేయాలన్న హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఆ అంశంపై ముఖ్యమంత్రి అధ్యక్షతన డా. బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రిమండలి సమావేశంలో చర్చించి బీసీలకు 42% శాతం రిజర్వేషన్లు కల్పించాలని తీర్మానించినది. విద్యా, ఉద్యోగం, రాజకీయ రంగాల్లో బీసీలకు 42% శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ గత మార్చి నెలలో జరిగిన సమావేశాల్లో బిల్లులకు శాసనసభ ఆమోదించి గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి నివేదించిన విషయం తెలిసిందే 2018 చట్టాన్ని సవరించి బీసీలకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేయడం ఆనందించదగ్గ విషయమని ఆయన అన్నారు

కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ అగ్రనేత శ్రీ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో చేసిన “జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచాలి” అన్న డిమాండ్‌ను దేశంలో తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలోనే అమలు చేస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు. బిసి డిక్లరేషన్ సభలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తానని ఇచ్చిన మాట ప్రకారంగా మాట నిలబెట్టుకునేందుకు ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని అమలు పరచేందుకు కృషి చేసిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క అలాగే మంత్రివర్గ వర్గ సభ్యులందరికీ మరియు మా స్థానిక గౌరవ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పేరు పేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు, తెలంగాణ సమాజం, ముఖ్యంగా బీసీ సామాజిక వర్గం, సామజిక న్యాయం కోసం పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version