సోషల్‌ మీడియా కేసులు…..

సోషల్‌ మీడియా కేసులు.. ఏపీ హైకోర్ట్ కీలక ఆదేశాలు

సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకే సోషల్‌ మీడియా కేసుల్లో రిమాండ్‌ విధిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ హై కోర్టు స్పష్టం చేసింది. సోషల్‌ మీడియాలో అనుచిత, అభ్యంతరకర పోస్టులు, వ్యాఖ్యల కేసుల్లో నిందితులకు రిమాండ్‌ విధించే సమయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాలని ఏపీ హైకోర్ట్ తేల్చిచెప్పింది.

అమరావతి: సుప్రీంకోర్టు (Supreme Court) మార్గదర్శకాల మేరకే సోషల్‌ మీడియా కేసుల్లో రిమాండ్‌ విధిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ హై కోర్టు (Andhra Pradesh High Court) స్పష్టం చేసింది. సోషల్‌ మీడియాలో అనుచిత, అభ్యంతరకర పోస్టులు, వ్యాఖ్యల కేసుల్లో నిందితులకు రిమాండ్‌ విధించే సమయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాలని తేల్చిచెప్పింది. ఈ మేరకు రాష్ట్రంలోని మేజిస్ట్రేట్లకు హైకోర్టు స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే శాఖాపరమైన విచారణ, కోర్టు ధిక్కారణ చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ఈ మేరకు మేజిస్ట్రేట్‌లకు వివరాలు వెల్లడిస్తూ.. రిజిస్ట్రార్‌ జ్యుడీషియల్‌ సర్క్యులర్‌ జారీ చేశారు.

సోషల్‌ మీడియాలో అనుచిత, అభ్యంతరకర పోస్టులు, వ్యాఖ్యలకు సంబంధించిన కేసుల్లో నిందితులకు రిమాండ్‌ విధించే సమయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాలని సూచించింది. నిందితులకు రిమాండ్‌ విధించే సమయంలో అర్నే‌ష్‌కుమార్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ బీహార్‌ కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలని పట్టించుకోకుండా మేజిస్ట్రేట్‌లు నిందితులకు రిమాండ్‌ విధిస్తున్నట్లు కోర్టు దృష్టికి వచ్చిందని ఏపీ హైకోర్టు గుర్తుచేసింది. మూడు నుంచి ఏడు సంవత్సరాల శిక్షపడే ఇలాంటి కేసుల్లో ముందుగా విచారణ చేశాకే మేజిస్ట్రేట్లు నిర్ణయం తీసుకోవాలని ఏపీ హై కోర్టు సూచించింది.

ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడిగా మేరుగు.

ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడిగా మేరుగు. మోహన్

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడుగా మేరుగు మోహన్ ఎన్నికయ్యారు. శనివారం ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడి పదవికి ఎన్నికలు నిర్వహించారు.ఈ నేపథ్యంలో గతేడాది అధ్యక్షులుగా ఉన్న మేరుగు మోహన్ మరోమారు అధ్యక్షులుగా ఎన్నికైనట్లు ఎన్నికల నిర్వహణ భాద్యులు తెలిపారు. నూతన కమిటీలో అధ్యక్షులు మేరుగు. మోహన్,ఉపాధ్యక్షులు ఆకారపు స్వామి,ప్రధాన కార్యదర్శి సౌడారపు మధు,సహాయ కార్యదర్శి సంగినేని. ప్రశాంత్,కోశాధికారి ఎర్రబెల్లి. విద్యా సాగర్ లు ఎన్నికయ్యారు.

టిడబ్ల్యూజేఎఫ్ అనుబంధ ఎలక్ట్రానిక్ మీడియా.

టిడబ్ల్యూజేఎఫ్ అనుబంధ ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులుగా నాగేంద్ర

పరకాల నేటిధాత్రి

 

 

 

టిడబ్ల్యూజేఎఫ్ అనుబంధ ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులుగా గూడెల్లి నాగేంద్ర ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది.శుక్రవారం హనుమకొండ ప్రెస్ క్లబ్ లో జరిగిన జిల్లా మహాసభల్లో నాగేంద్ర ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య ప్రకటించారు.ఈ సందర్భంగా నాగేంద్ర మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యత అప్పగించిన రాష్ట్ర జిల్లా నాయకులకు నాగేంద్ర కృతజ్ఞతలు తెలియజేశారు.జర్నలిస్టు సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ టిడబ్ల్యూజేఎఫ్ ఎలక్ట్రానిక్ మీడియా విభాగాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానన్నారు.ఈ సందర్భంగా పలువురు నాగేంద్రకు అభినందనలు తెలియజేశారు.

మీడియా మిత్రులకు శ్రీవారి భక్తుల అభివందనాలు.

మీడియా మిత్రులకు శ్రీవారి భక్తుల అభివందనాలు

సీఎం నోట శుభవార్త విన్నాము

తిరుపతిని మధ్య రహిత క్షేత్రంగా సాధిద్దాం

తిరుపతి(నేటి ధాత్రి)మార్చి 24:

శ్రీనివాస సదానంద స్వామి స్వాముల ఆధ్వర్యంలో చేపట్టిన తిరుమల పవిత్రతను కాపాడుకుందాం శ్రీవారి పాదాల చెంత ముంతాజ్ హోటల్ ను నిలిపివేయాలని నిరసనలు నిరాహార దీక్షలు పాదయాత్రలో చేపట్టిన కార్యక్రమాలను మీడియా మిత్రులు ప్రత్యేకంగా పలుమార్లు ప్రచురించి నందుకు మీడియా మిత్రులకు స్వామివారి భక్తులైన మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని ఆదివారం స్థానిక ప్రెస్ క్లబ్ లో బీసీ నాయకులు శ్రీవారు భక్తుల జగన్నాథం మరియు అభయ హస్త గోవింద సేవ మండలి అధ్యక్షులు చంద్రమౌళి లు అన్నారు,సీఎం తిరుమలకు వస్తున్నారు. సీఎం నోటి శుభవార్త విందురని టిటిడి పాలకమండలి చైర్మన్ స్వాములకు ఫోన్ చేసి స్వయంగా తెలిపారని హిందూ పరిషత్ ఓంకార్ తెలిపారు,ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల ప్రక్షాళన ముంతాజ్ హోటల్ తోనే మొదలెట్టారని ముఖ్యమంత్రి కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు,
అలాగే సైనికులకు హిందువులకు పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి నీ మధ్య రహిత క్షేత్రంగా కలిసి పోరాడుదాం అని పలు పుణ్యక్షేత్రాలలో మధ్యరహిత పుణ్యక్షేత్రాలు గా ఎలాగైతే చేశారో అలాగే తిరుపతి పుణ్యక్షేత్రాన్ని కూడా మధ్యాహ్నం క్షేత్రంగా చేసేంతవరకు హిందువులందరు కలిసి పోరాడుదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అభయాస్త గోవింద మండలి సేవా సభ్యులు సురేష్ , రోహిత్ బాబు తదితరులు పాల్గొన్నారు..

ఇద్దరికీ నా జీవితాంతం రుణపడి ఉంటాను.

ఇద్దరికీ నా జీవితాంతం రుణపడి ఉంటాను..

*ఒకటి మా అధినేత పవన్ కళ్యాణ్, రెండవది మీడియాకి – కిరణ్ రాయల్..

తిరుపతి(నేటి ధాత్రి) మార్చి 06:

నేను ఏ తప్పు చేయలేదు అని కొంతమంది నమ్మారు అది చాలు, ఇది నా పై దాడి కాదు ఒక కులం పై దాడి.. సామాన్యుడు రాజకీయాలు చేస్తే భరించలేరని రాజకీయంగా ధైర్యంగా పోరాటం చేసిందుకు 26 రోజులు మానసిక క్షోభకు గురిచేశారని కిరణ్ రాయల్ గురువారం మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో తొక్కాలని చూశారని, నన్ను నా కుటుంబాన్ని టార్గెట్ చేశారని, నేను జీవితకాలం రుణపడి ఉండేది ఇద్దరికేనని.. మా అధినేత పవన్ కళ్యాణ్, రెండోది మీడియాకు అన్నారు. ఏ తప్పు చేయలేదని పవన్ కళ్యాణ్ కు తెలుసు కాబట్టే విచారణ చేయమన్నారని, తిరుపతిలో కాపులను టార్గెట్ చేశారన్నారు. అందుకే నా గొంతు నొక్కి అణగదొక్కే ప్రయత్నం చేశారని, నేనే తప్పు చేయలేదని కొందరు నమ్మారు అది చాలన్నారు. నేను మొండివాడిని కాబట్టే నిలదొక్కుకుని తప్పు చేయలేదని బయటకు వచ్చానని కిరణ్ స్పష్టం చేశారు. నాపై జరిగిన కుట్రలో ఉన్న వారందరి జాతకాలు వద్ద ఉన్నాయని, సాక్ష్యాలతో అన్నీ మా అధినేత పవన్ కళ్యాణ్ వద్ద ఉంచుతానన్నారు.లక్ష్మిరెడ్డి తో ఉన్నది ఆర్థిక లావాదేవీలు మాత్రమే నని, ఒక మహిళను రాజకీయాల్లోకి లాగి అనేక రకాలుగా హింసకు గురి చేశారని కిరణ్ రాయల్ వాపోయారు..

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version