ఘనంగా ఎన్ హెచ్ ఆర్ సి. గ్రేటర్ వరంగల్ ముఖ్య నాయకుల సమావేశం.

ఘనంగా ఎన్ హెచ్ ఆర్ సి. గ్రేటర్ వరంగల్ ముఖ్య నాయకుల సమావేశం

హాజరైన రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య

గ్రేటర్ వరంగల్, హనుమకొండ, వరంగల్ జిల్లా కమిటీల నియామకం

నేటిధాత్రి”,హనుమకొండ:

జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) గ్రేటర్ వరంగల్ ముఖ్య నాయకుల సమావేశం హనుమకొండ పట్టణంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య సార్ ముఖ్యఅతిథిగా హాజరై సంస్థ విధి విధానాలను తెలియజేశారు. అవినీతి అక్రమాలకు తావులేని సమాజం కోసం తమ సంస్థ చేస్తున్న కార్యక్రమాలలో విద్యావంతులు, మేధావులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగ చట్టాలకు అనుగుణంగా రాజీలేని పోరాటాలు చేస్తూ అవినీతి అక్రమార్కులను సమాజంలో దోషులుగా చూపించడమే తమ సంస్థ ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. మంచిని పెంచడం మానవత్వాన్ని పంచడం వంటి కార్యక్రమాలు తమ సంస్థలో ప్రధాన అంశాలని తెలిపారు. రాష్ట్ర అధికార ప్రతినిధి, న్యాయవాది మాదాసు మొగిలయ్యతో కలిసి ఈ సందర్భంగా ఇటీవల రద్దు చేసిన గ్రేటర్ వరంగల్, హనుమకొండ, వరంగల్ జిల్లా నూతన కమిటీలను, పలు నియామకాలను ప్రకటించారు.

రాష్ట్ర కమిటీ సభ్యులుగా: ఉచత శ్రీకాంత్, విసంపెల్లి నగేష్, భానోత్ జవహర్లాల్ నెహ్రూ నాయక్

ఉమ్మడి వరంగల్ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ గా: ఆవునూరి కిషోర్

గ్రేటర్ వరంగల్ కమిటీ
గ్రేటర్ అధ్యక్షులుగా: కోమండ్ల శ్రీనివాస్
ప్రధాన కార్యదర్శిగా: గూడూరు నరేందర్

హనుమకొండ జిల్లా కమిటీ:
జిల్లా అధ్యక్షులుగా: డాక్టర్ బండి సదానందం
ఉపాధ్యక్షులుగా: పడాల మురళీకృష్ణ
ప్రధాన కార్యదర్శిగా: పల్లెవేని మహేష్

వరంగల్ జిల్లా కమిటీ:
జిల్లా అధ్యక్షులుగా: మేరుగు రాంబాబు
ఉపాధ్యక్షులుగా: గుజ్జ సురేందర్
ప్రధాన కార్యదర్శిగా: సంగెం రమేష్
అధికార ప్రతినిధిగా: నర్మేట యాదగిరి

తదితరులను నియమించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు పాక శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర నాయకులు మరియు ఉమ్మడి జిల్లా నాయకులు పాల్గొన్నారు.

చేయూత పెన్షన్ దారుల సమావేశం.

చేయూత పెన్షన్ దారుల సమావేశం.
మహాదేవపూర్ జులై 31 (నేటి ధాత్రి)
మహాదేవ పూర్ మండలంలోని అంబటిపల్లి గ్రామంలో గ్రామపంచాయతీ వద్ద చేయూత పెన్షన్ దార్ల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశాన్ని MSP సీనియర్ నాయకులు పత్తి మల్లేష్ మాట్లాడుతూ
చేయూత పెన్షన్లన్నీ పెంచాలని వికలాంగు కి 4000 వేల నుంచి 6000, వృద్ధులు వితంతువులకి 2000 నుంచి 4000 రూపాయలు పెంచాలని డిమాండ్ చేస్తూ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ చేస్తున్న పోరాటం గురించి వారికి వివరించి ఆగస్టు13 న హైదరాబాద్ లో జరుగు పెన్షన్ దార్ల జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాసభకు ప్రతి ఒక్కరు తరలి రావాలని కోరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వికలాంగుల మండల అధ్యక్షుడు వీరగంటి సమ్మయ్యపాల్గొన్నారు.
సమావేశం అనంతరం గ్రామ కమిటీ
అధ్యక్షులు:-కూర తిరుమల చారి
ఉపాధ్యక్షుడు: -గుజ్జల సురేందర్
ప్రధాన కార్యదర్శి: – తాటిపల్లి సమ్మయ్య
కార్యదర్శి:- మానేటి కృష్ణకుమార్, శ్యామల యశోద
ప్రచార కార్యదర్శి: -దాసరి రాజేశ్వరి
సభ్యులు: – దామర్లకుంట చంద్రశేఖర్
వావిలాల వైకుంఠం
పి రాజక్క
దామర్లకుంట వెంకటమ్మ
పత్తి బుచ్చయ్య
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బెల్లంపల్లి సురేష్ మాదిగ, రవితేజ మాదిగ
దుమ్ము వెంకటేశ్వర్లు మాదిగ
జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇంచార్జ్ పాల్గొనడం జరిగింది

బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని విజయవంతం చేద్దాం..

బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని విజయవంతం చేద్దాం

మొగుళ్ళపల్లిబిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బలుగూరి తిరుపతిరావు

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-26T151132.047.wav?_=1

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
భూపాలపల్లి జిల్లా కేంద్రంలో 27న జిల్లా పార్టీ కార్యాలయంలో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి , జిల్లా పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి నేతృత్వంలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరుగుతుందని, ఇట్టి సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మాజీ మంత్రి, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల రామారావు హాజరవుతారని ఈ సమావేశానికి మొగుళ్ళపల్లిమండల మండలంలోని ఇస్సి పేట గ్రామంలో మాజీ సర్పంచ్ కీ.శే కొడాలి కొమురయ్య గారి విగ్రహావిష్కరణ అనంతరం మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ సాయి గార్డెన్ నందు కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు మండలపరిధిలోని అన్ని గ్రామాల బిఆర్ఎస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు గ్రామ శాఖ అధ్యక్షులు యూత్ అధ్యక్షులు కార్యకర్తలు , పార్టీ కుటుంబ సభ్యులు, అభిమానులు, అనుబంధ సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మొగుళ్ళపల్లి మండల బి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బలుగూరితిరుపతిరావు తెలిపారు

మండలస్థాయి సమావేశం విజయవంతం చేయాలి.

బిఆర్ఎస్ మండలస్థాయి సమావేశం విజయవంతం చేయాలి

మండల అధ్యక్షులు,వైస్.ఎంపీపి చింతిరెడ్డి మధుసూదన్ రెడ్డి

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-5-2.wav?_=2

పరకాల నేటిధాత్రి
18 జులై శుక్రవారంరోజున పరకాల పట్టణంలో స్థానిక పద్మశాలి భవన్ లో బిఆర్ఎస్ మండల మరియు గ్రామస్థాయి విస్తృతస్థాయి సమావేశం నిర్వహించడం జరుగుతుందని,ఈ సమావేశానికి మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి ముఖ్య అతిధులుగా హాజరువ్వానున్నారని మాజీ వైస్ ఎంపీపి బిఆర్ఎస్ మండల అధ్యక్షులు చింతిరెడ్డి మధుసూదన్ రెడ్డి తెలిపారు.ఈ సమావేశానికి పట్టణ మరియు మండల,గ్రామ పార్టీ,మరియు అనుబంధ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు,మాజీ జెడ్పిటీసి,ఎంపిటిసి,సర్పంచ్ లు,కోఅప్షన్ సభ్యులు,సోసైటీ ఛైర్మెన్లు,కమిటీ సభ్యులు,యూత్ విభాగం,పార్టీ శ్రేణులు,అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజవంతం చేయాలని కోరారు.

కాంగ్రెస్ పార్టీ సమావేశంలో పాల్గొన్న దేశిని కోటి.

జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశంలో పాల్గొన్న దేశిని కోటి
(జమ్మికుంట: నేటిధాత్రి)
కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ హుజురాబాద్ నిజయోకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఉడతల ప్రణవ్ బాబు కు స్వాగతం పలుకుతూ శాలువాతో సత్కరించిన దేశిని కోటి. దొంత రమేష్. సుంకర రమేష్.జిల్లాల తిరుపతిరెడ్డి.సతీష్ రెడ్డి.మేకల తిరుపతిరెడ్డి. నల్ల కొండల రెడ్డి.శ్రీనివాస్.తదితరులు సత్కరించారు.
ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడుతూ రానున్న స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టింది ప్రజలు కాంగ్రెస్ పార్టీని విశ్వసిస్తున్నారు మీరందరూ ఐక్యతగా ఉండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థన గెలిపించాలని విభేదాలు లేకుండా పనిచేయాలని ఎంపీటీసీలను జడ్పిటిసి లను ఎంపీపీలుగా జిల్లా పరిషత్ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరడం జరిగింది

టిపిసిసి ప్రధాన కార్యదర్శి నల్లపు దుర్గాప్రసాద్ .

జై బాబు జై భీమ్ జై సంవిధాన్ భారీ బహిరంగ సభను విజయవంతం చేయండి

టిపిసిసి ప్రధాన కార్యదర్శి నల్లపు దుర్గాప్రసాద్

 

నేటి ధాత్రి చర్ల :

జూన్ 4వ తేదీన హైదరాబాద్ ఎల్‌బీ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించబోవు సభలో 15000 వేల మంది గ్రామస్థాయి నాయకుల సమక్షంలో ఏర్పాటు చేయబోయే జై బాబు జై భీమ్ జై సంవిధాన్ భారీ బహిరంగ సభకు
ప్రధాన అతిథిగా భారత జాతీయ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హాజరుకానున్నారు
అలాగే ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క టిపిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఎఐసిసి ప్రధాన కార్యదర్శి మీనాక్షి నటరాజన్ ఇతర మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు జిల్లా అధ్యక్షులు కార్పొరేషన్ చైర్మన్లు వైస్ ప్రెసిడెంట్లు టిపిసిసి ప్రధాన కార్యదర్శులు మరియు అనేకమంది కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొననున్నరు కావున ఈ భారీ బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొనవలసిందిగా మనవి చేస్తున్నామని టిపిసిసి ప్రధాన కార్యదర్శి నల్లపు దుర్గాప్రసాద్ పిలుపునిచ్చారు

నాల్గవ తరగతి ఉద్యోగుల సర్వసభ్య సమావేశం

నాల్గవ తరగతి ఉద్యోగుల సర్వసభ్య సమావేశం

ఎల్లప్పుడూ ఉద్యోగులకు అండగా ఉంటాం జిల్లా అధ్యక్షులు గీట్ల సుమిత్

మంచిర్యాల జులై 01 నేటి దాత్రి :

 

 

జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో తెలంగాణ నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం సర్వ సభ్య సమావేశం జిల్లా అధ్యక్షుడు గీట్ల. సుమిత్ అధ్యక్షత న నిర్వహించారు. ఈ సమావేశంలో మంచిర్యాల జిల్లా తెలంగాణ నాల్గవ తరగతి ఉద్యోగులు ఎదుర్కొంటున్నా సమస్యల పైన మరియు ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సిన
బకాయి బిల్లుల మంజూరు ,
ఆరోగ్య కార్డులను పూర్తి స్థాయిలో మంజూరు చేయాలని
నాల్గవ తరగతి ఉద్యోగులకు ప్రతి
2 సంవత్సరాలకు ఒకసారి పదోన్నతులు కల్పించాలనే ప్రభుత్వం జీఓ జారీ చేయాలని తెలంగాణ ప్రభుత్వన్నీ కోరుతూ ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గీట్ల. సుమిత్ మాట్లాడుతూ
జిల్లా లోని మండల స్థాయి అధికారులు కొందరు నాల్గవ తరగతి ఉద్యోగుల పై అనుచిత పదాలు ,దురుసుగా ప్రవర్తిస్తున్నారని ,క్రింది స్థాయి ఉద్యోగులపై ఇలా ప్రవర్తించడం సరైనది కాదని, అలాంటి సందర్భాలు ఎదురైతే
జిల్లా సంఘానికి తెలియజేస్తే పై స్థాయి అధికారుల దృష్టికి తీసుకొన్ని వెళ్లి న్యాయం జరిగే వరకు తెలంగాణ నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం ఎల్లపుడు ముందుగా ఉండి పోరాటం చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమములో గౌరవ అధ్యక్షులు తిరుపతి, అసోసియేట్ ప్రెసిడెంట్ శ్రీలత, కోశాధికారి సుజాత,
సునీత, శేఖర్, ముంతాజ్ అలీ ఖన్,
శ్రీనివాస్, వెంకటేష్, సతీష్, శోభ తదితరులు
పాల్గొన్నారు.

కేబినెట్‌ మీటింగ్‌కు వచ్చిన పవన్..

కేబినెట్‌ మీటింగ్‌కు వచ్చిన పవన్.. వెంటనే హైదరాబాద్‌కు పయనం

 

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హుటాహుటిన హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు. ఏపీ కేబినెట్‌ సమావేశానికి వచ్చిన ఆయన వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారు.

 

 

 

 

అమరావతి, జూన్ 24: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) హైదరాబాద్‌కు పయనమయ్యారు. పవన్ తల్లి అంజనా దేవి (Anjana Devi) స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్నారు. విషయం తెలిసిన వెంటనే పవన్ హుటాహుటిన హైదరాబాద్‌కు బయలుదేరారు. ఈరోజు (సోమవారం) ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి ఉపముఖ్యమంత్రి కూడా వచ్చారు. కేబినెట్ సమావేశం మొదలవగానే తల్లికి అనారోగ్యంగా ఉందని సమాచారం అందింది. దీంతో కేబినెట్ అనుమతి తీసుకుని మరీ పవన్ హైదరాబాద్‌కు వెళ్లారు. కేబినెట్‌కు వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబుకు (CM Chandrababu Naidu) చెప్పి పవన్ కళ్యాణ్ గన్నవరం ఎయిర్‌పోర్టుకు బయలుదేరి వెళ్లారు.

మరోవైపు.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. అమరావతికి వివిధ కంపెనీల రాకకు సంబంధించి ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. ఏడవ ఎస్‌ఐపీబీ సమావేశంలో ఆమోదం తెలిపిన 19 ప్రాజెక్టులకు సంబంధించి రూ.28,546 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది.

అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ పరిధిలో 1450 ఎకరాల్లో మౌలికవసతుల కల్పనకు టెండర్ పిలవడానికి ఈ సమావేశంలో మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. విశాఖలో దిగ్గజ ఐటి సంస్థ కాగ్నిజెంట్‌కు 22.19 ఎకరాల భూమిని ఎకరా 99 పైసలకు కేటాయించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. 49వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం నిర్ణయాలకు కూడా ఆమోదం తెలుపనుంది కేబినెట్. పురపాలక శాఖలో 40 బిల్డింగ్ ఇన్‌స్ట్రక్టర్ల పోస్టులను అప్‌గ్రేడ్‌ చేసేందుకు కేబినెట్ అంగీకారం తెలుపనుంది. కొత్తగా మరో 7 అన్నాక్యాంటీన్లు ఏర్పాటుకు కూడా కేబినెట్ ఆమోదం తెలుపనుంది.

టెక్స్టైల్స్ పార్క్ యజమానులతో సమావేశం.

టెక్స్టైల్స్ పార్క్ యజమానులతో సమావేశం…

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):

shine junior college

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని టెక్స్టైల్స్ పార్క్ యజమానులతో చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యార్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అనంతరం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం మినీ సమావేశ మందిరంలో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా టెక్స్టైల్స్ పార్క్ యజమానులు తమకు ప్రభుత్వం నుంచి మరిన్ని వస్త్రం ఉత్పత్తి ఆర్డర్లు ముందస్తుగా ఇవ్వాలని, తమ సమస్యలు పరిష్కరించాలని.

park

చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యార్ ను కోరారు. వివిధ శాఖలకు అవసరమైన ఆర్డర్స్ అందజేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం నాణ్యతతో వస్త్రాలు ఉత్పత్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్యనారాయణ గౌడ్, సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ స్వరూప రెడ్డి, చేనేత జౌళి శాఖ జేడీ ఎన్ వెంకటేశ్వర్ రావు, ఏడీ రాఘవరావు, వివిధ మ్యాక్స్ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు యజమానులు ఆసాములు, టెక్స్టైల్స్ పార్క్ యజమానుల సంఘం అధ్యక్షుడు అన్నల్ దాస్ అనిల్ తదితరులు పాల్గొన్నారు.

ఎంపీడీవో ఆఫీసులో సమస్త సమీక్ష సమావేశం

ఎంపీడీవో ఆఫీసులో సమస్త సమీక్ష సమావేశం

జైపూర్,నేటి ధాత్రి:

 

 

జైపూర్ మండలంలోని సమస్త పంచాయతి కార్యదర్శులు,ఉపాధి హామీ సిబ్బందితో జైపూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపిడిఓ,ఎంపీఓ ఆధ్వర్యంలో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సమావేశంలో గ్రామపంచాయతీ కార్యదర్శులకు,పారిశుద్ధ్య కార్మికులకు,ఈజీఎస్ సిబ్బందికి కొన్ని ముఖ్య నిర్ణయాలను,సూచనలను తెలియజేస్తూ ఆదేశాలు జారీ చేశారు.వివరాలలోకి వెళితే అన్ని గ్రామ పంచాయతీలలో ఈత చెట్ల ప్లాంటేషన్,కెనాల్ ప్లాంటేషన్,బండ్ ప్లాంటేషన్ ద్వారా మొక్కలు నాటాలని,ఇంటింటికి 6 మొక్కలు పంపిణీ చేయాలని,అన్ని రకాల రోడ్ల ప్రక్కన అవెన్యూ ప్లాంటేషన్ క్రింద మొక్కలు నాటాలని,కంక మొక్కల ప్లాంటేషన్,ఆర్ఓఆర్ బండ్ ప్లాంటేషన్,ఫారెస్ట్ ల్యాండ్ లలో మొక్కలు నాటాలని నిర్ణయించారు. అలాగే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో,ప్రభుత్వ భవనములలో మంచి పూల మొక్కలు,పండ్ల మొక్కలు నాటించాలనీ,వన మహోత్సవం రిజిష్టరులో నమోదు చేసి ఉంచుకోవాలని సూచించారు.గ్రామ పంచాయతీలలో అవసరమున్న చోట కమ్యూనిటీ సోక్ పిట్స్ నిర్మించాలని,డ్రైన్ చివరన సోక్ పిట్స్ నిర్మించి పూర్తి చేయాలని తెలిపారు.ఐహెచ్ హెచ్ఐ పూర్తి చేయాలని,కొత్త పనులు అన్ని గ్రౌండ్ చేయాలని,ఇందిరమ్మ ఇళ్లకు ఐహెచ్ హెచ్ఐ తనిఖీ పూర్తి చేసి సిద్ధంగా ఉంచాలని పంచాయతి కార్యదర్శులు బాధ్యతగా వ్యవహరించాలన్నారు.సైడ్ డ్రైన్ లలో డీసిల్టింగ్ క్లీన్ గా చేపించాలని,వాటర్ పేమెంట్ తప్పకుండా చేయాలని,ప్రతీ మంగళ వారం మరియు శుక్రవారం డ్రై డే నిర్వహించాలన్నారు.ఎంపీడబ్ల్యు వర్కర్లచే 8 గంటలు పని చేయించాలనీ,వారు ఏ ఇంటినుండి ఎక్కడికి పనిచేసినది రికార్డుల్లో నమోదు చేయాలని,2025-25 డిసిబి రిజిష్టర్లు ప్రింట్ తీసుకోవాలని,మాన్యువల్ గా రిజిష్టర్ వ్రాసి చూపించాలన్నారు.అన్ని బిల్లులు గ్రామ పంచాయతీ వారిగా ఇవ్వాలని,ఆడిట్ రిపోర్ట్ లు తయారు చేసి ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంచాలని కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు.ఈ సమావేశంలో ఎంపిడిఓ జి.సత్యనారాయణ గౌడు,ఎంపీఓ శ్రీపతి బాపు రావు,ఏపీవో బాలయ్య,పంచాయతీ కార్యదర్శులు,ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.

మందమర్రి మండల బిజెపి కార్యవర్గ సమావేశం.

మందమర్రి మండల బిజెపి కార్యవర్గ సమావేశం

మందమర్రి నేటి ధాత్రి

 

 

 

 

చిర్రగుంట గ్రామంలో మండల అధ్యక్షులు గిర్నాటి జనార్దన్ అధ్యక్షతన జరిగినది సమావేశానికి ముఖ్య అతిథులుగా బిజెపి జిల్లా అధ్యక్షులు నంగునూరు వెంకటేశ్వర గౌడ్ ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్ సీనియర్ నాయకులు దేవరనేనిసంజీవరావు దీక్షితులు పాల్గొన్నారు

ఈ కార్యక్రమంలో మండలప్రధాన కార్యదర్శులువంజరి వెంకటేష్ రాజేష్ నాయక్ కర్రె రాజయ్య ఎనగందుల రాజయ్య దుర్గ మల్లేష్ చిరంజీవి దేవేందర్ రాము మెండే పోచయ్య ప్రదీప్ కుమార్అశోక్ఉప్పుల రాజుసలేంద్ర శ్రీనివాస్ దిలీప్ దశరథం రాకేష్ ప్రశాంత్ మారుతి వివిధ గ్రామాల బిజెపి అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు .

 

 

BJP Executive Committee

 

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు 11 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి సుపరిపాలన గురించి స్థానిక సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి పై రాబోవు స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల గురించి రాబోవు నెల రోజులలో చేయవలసిన పార్టీ కార్యక్రమాల గురించికార్యకర్తలతో మాట్లాడారు

నిజాంపేటలో 4 విడత సామాజిక తనిఖీ సమావేశం

నిజాంపేటలో 4 విడత సామాజిక తనిఖీ సమావేశం

నిజాంపేట: నేటి ధాత్రి

జాతీయ ఉపాధి హామీ పనుల్లో భాగంగా నిజాంపేట రైతు వేదికలో సోమవారం 4 విడత సామాజిక తనిఖీ సమావేశం ఏపీడీ రంగాచారి, డీవీఓ శ్రీహరి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత కొన్ని రోజులుగా గ్రామీణ ప్రాంతాల్లో జాతీయ ఉపాధి హామీ పనులకు కూలీలకు వచ్చిన వేతనాలు, గ్రామాల్లో జరిగిన పనుల గూర్చి సామాజిక తనిఖీ బృందం వివరాలను సేకరించడం జరిగిందన్నారు. వాటిపై మండల స్థాయి సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో రాజీరెడ్డి , ఏపీఓ శ్రీనివాస్, వివిధ గ్రామాల కార్యదర్శిలు, కంప్యూటర్ ఆపరేటర్లు ఉన్నారు.

(మాస్) సభ విజయవంతం.

(మాస్) సభ విజయవంతం

సిరిసిల్ల టౌన్: ( నేటిధాత్రి )

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని,చేనేత వస్త్ర వ్యాపార సంఘంలో,మన ఆలోచన సాధన సమితి (మాస్) సభ అధ్యక్షుడు ఎనుగుల ఎల్లయ్య మాట్లాడుతు (మన ఆలోచన సాధన సమితి)ఆలోచన చైతన్యం, చైతన్యమే ఆయుధం, అనే భావాలతో బీసీ ఉద్యమం నవ శకం ఆరంభమైంది అని అన్నారు. అంతేకాకుండా ప్రధాన లక్ష్యమైన రాజ్యాధికారం బీసీల సమైక్యతలో ఉంటుందని జ్యోతిబాపూ పూలే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంలోని భాగమే బీసీల సమైక్యత అని తెలిపారు.కటకం నర్సింగరావు .దొంత ఆనందం, మంగలి పల్లి శంకర్, రాష్ట్ర శాఖ నుంచి హాజరై బీసీల సమైక్యత కోసం అనర్ఘళంగా ఉపన్యాసం అందించారు. బీసీలు అందరూ ఒకటైతే బీసీలకు రాజ్యాధికారం వస్తే అందరూ సామాజిక ,ఆర్థికంగా, బలపడతారని సభలో తెలిపారు. సిరిసిల్ల కుల సంఘాల నుండి ప్రతి ఒక్కరిని చైతన్యవంతం చేయడానికి కుల సంఘానికి ఇద్దరు చొప్పున కన్వీనర్లను నియమించాలని సూచనతో పాటు 15న బీసీ సమైక్యత జెండాను సిరిసిల్ల పట్టణంలో చైతన్యవంతంగా ఎగరవేయాలని నిశ్చయించారు. ఈ కార్యక్రమంలో వ్యాఖ్యాతగా దొంత దేవదాసు వ్యవహరించారు,గాదమైసయ్య, వెంగళ అంకయ్య,యువ కవి వెంగళ లక్ష్మణ్, తన గానంతో అందరినీ ముగ్ధుల్ని చేశారు. డాక్టర్ జనపాల శంకరయ్య,కోడం నారాయణ, తదితర నాయకులు పాల్గొన్నారు.

మందమర్రి మండల బిజెపి కార్యవర్గ సమావేశం.

మందమర్రి మండల బిజెపి కార్యవర్గ సమావేశం

మందమర్రి నేటి ధాత్రి

 

 

చిర్రగుంట గ్రామంలో మండల అధ్యక్షులు గిర్నాటి జనార్దన్ అధ్యక్షతన జరిగినది సమావేశానికి ముఖ్య అతిథులుగా బిజెపి జిల్లా అధ్యక్షులు నంగునూరు వెంకటేశ్వర గౌడ్ lప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్ సీనియర్ నాయకులు దేవరనేనిసంజీవరావు దీక్షితులు పాల్గొన్నారు .

ఈ కార్యక్రమంలో మండలప్రధాన కార్యదర్శులువంజరి వెంకటేష్ రాజేష్ నాయక్ కర్రె రాజయ్య ఎనగందుల రాజయ్య దుర్గ మల్లేష్ చిరంజీవి దేవేందర్ రాము మెండే పోచయ్య ప్రదీప్ కుమార్అశోక్ఉప్పుల రాజుసలేంద్ర శ్రీనివాస్ దిలీప్ దశరథం రాకేష్ ప్రశాంత్ మారుతి వివిధ గ్రామాల బిజెపి అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు .

BJP Durgam Ashok.

 

 

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు 11 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి సుపరిపాలన గురించి స్థానిక సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి పై రాబోవు స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల గురించి రాబోవు నెల రోజులలో చేయవలసిన పార్టీ కార్యక్రమాల గురించికార్యకర్తలతో మాట్లాడారు

విద్యార్థులకు సరస్వతి ఉత్తమ విద్యార్థి అభినందన సభ.

విద్యార్థులకు సరస్వతి ఉత్తమ విద్యార్థి అభినందన సభ.

చిట్యాల, నేటిధాత్రి :

 

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో శనివారం రోజు ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్ ఇన్చార్జి వేల్పుల రాజ్ కుమార్ మాట్లాడుతూ జిల్లా లోని ప్రభుత్వ ,గురుకుల కేజీబీవీ మోడల్ స్కూల్ మరియు కళాశాల
10 వ మరియు ఇంటర్ లో
ఉత్తమ ఫలితాలు సాధించిన 2024/2025
వారికి ఎబివిపి ఆద్వర్యం లో
అభినందన సభ నిర్వహించడం జరుగుతుంది అని
కావున జిల్లా లోని
విద్యార్థులు పేరు నమోదు
చేసుకోవాలని,నమోదు కొరకు 7287920310…సంప్రదించాలి అని ఒక ప్రకటనలో తెలిపారు

మంత్రివర్గ సమావేశంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి.

మంత్రివర్గ సమావేశంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి

సీఎం రేవంత్ రెడ్డికి నర్సంపేట డిపో జేఏసీ విజ్ఞప్తి

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సచివాలయంలో జూన్ 5 గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగు మంత్రివర్గ సమావేశంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ కీలక ప్రకటన చేయాలని ఆర్టీసీ నర్సంపేట డిపో జేఏసీ చైర్మన్ కె.రంగయ్య, వైస్ చైర్మన్ గొలనకొండ వేణు సీఎం రేవంత్ రెడ్డికి బుధవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో తొలిసారి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రావాలని 40 వేల మంది యావత్ ఆర్టీసీ కార్మికులు, వారి కుటుంబ సభ్యులు సహా విశేష కృషి చేశామని, గెలుపులో భాగస్వామ్యం అయ్యామని వారు గుర్తు చేశారు.

ఆర్టీసీ ప్రభుత్వ విలీనం అయితే తమ జీవితంలో అద్భుతం జరుగుతుందని కార్మికులు ప్రతి రోజు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారని, ఆర్టీసీ కార్మికుల ఆత్మగౌరవం అయినటువంటి ప్రభుత్వ విలీనం అడుగు దూరంలో ఆగిందని, దాన్ని కేబినెట్ సమావేశంలో “విలీనం అమలు తేదీ” ని సగర్వంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించి కార్మికుల జీవితాలలో వెలుగు నింపాలని వారు కోరారు.

CM Revanth Reddy.

 

 

 

మహిళా ప్రయాణీకుల కోసం ఉచిత మహాలక్ష్మి పథకం విజయవంతం కావడానికి, ప్రభుత్వానికి ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్లు మంచి పేరు తీసుకువచ్చారని తెలిపారు.

పూర్తి స్థాయిలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే ప్రభుత్వంపై ఒక్క రూపాయి కూడా అదనపు భారం పడదని, ప్రతి నెల మహాలక్ష్మి డబ్బులతోనే ట్రెజరరీ నుండి జీతాలు సులభంగా ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం చెల్లించవచ్చని వారు అన్నారు.

విలీనంతో పాటు రెండు పీఆర్సీలు 2021 మరియు 2025 ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రకటిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మికులు, కుటుంబ సభ్యులందరం జీవితాంతం ఋణపడి ఉంటామని రంగయ్య, వేణు తెలిపారు.

ఓపెను జిమ్ కొరకు ప్లేస్ పరిశీలన కమిటీ సభ్యుల సమావేశం.

ఓపెను జిమ్ కొరకు ప్లేస్ పరిశీలన కమిటీ సభ్యుల సమావేశం.

కల్వకుర్తి/ నేటిదాత్రి :

 

 

 

 

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలోని యోగ గ్రూప్ సభ్యులు ప్రభుత్వ పాఠశాల ఆవరణలో రోజు వాకింగ్ మరియు ఎక్ససైజ్ చేస్తుంటారు. అందులో భాగంగా పాఠశాల ఆవరణలో చివరిలో’ ఓపెన్ జిమ్ ఉంటే బాగుంటుందని గత నెల రోజుల క్రితం ఆనంద్ కుమార్, కల్వకుర్తి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, ఆర్యవైశ్యుల పట్టణ అధ్యక్షులు వాస శేఖర్ దృష్టికి తీసుకెళ్లారు. దానిని పాఠశాల యొక్క ప్రధానోపాధ్యాయురాలు తో మాట్లాడి కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తో చర్చించి “ఓపెన్ జిమ్”మంజూరు చేయించినట్లు తెలిసినది. ఇందులో భాగంలోనే మంగళవారం పాఠశాల ఆవరణలో స్థలాన్ని పరిశీలించినారు.

కేంద్రంలో హిందూ సంఘాల సమావేశం.

మంచిర్యాల జిల్లా కేంద్రంలో హిందూ సంఘాల సమావేశం

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

 

మంచిర్యాల జిల్లా కేంద్రంలో హిందూ సంఘాలు సమావేశం మంగళవారం ఏర్పాటు చేయడం జరిగింది. సోమవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో కొందరు ముస్లిం ముకలు గోవుల అక్రమ రవాణా గోవధ నిర్వహిస్తున్నారని,సమాచారం మేరకు,మెదక్ విభాగ్ కార్యదర్శి గ్యాదరి రాజారాం పై 14 మంది హిందూ బంధులు అడ్డుకుంటే ముస్లిం ముకలు వారిపై విచక్షణ రహితంగా దాడులు చేయడం జరిగినట్టు తెలిపారు.ఆ దాడులను ఖండిస్తూ రాజారాం కు ఎలాంటి హాని తలపెట్టిన పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అవుతుందని అన్నారు.దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఇకపై దాడులకు,ప్రతి దాడులకు హిందూ సమాజం సిద్దంగా ఉంది అని, తెలియజేస్తూ ఖబర్దార్ మతోన్మాద శక్తుల్లారా, ఖబర్దార్,అంటూ హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో హిందూ సంఘాల ఐక్యవేదిక కార్యదర్శి కర్ణ కంటి రవీందర్,రాష్ట్రీయ హిందూ పరిషత్ లీగల్ అడ్వైజర్ కొట్టినటేశ్వర్,వి హెచ్ పి కోశాధికారి బైరి విష్ణు దాస్,సందేశ్గుప్తా,శివాజీ సేన ఉదేయ్,శ్రీకాంత్,సంతోష్,బద్రి నారాయణ,వెంకట్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.

సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు

మెపా రాష్ట్ర కార్యదర్శి తాళ్ళ రవి ముదిరాజ్

పరకాల నేటిధాత్రి:

 

ఈనెల 25న ములుగు జిల్లా వెంకటాపూర్ లో ముదిరాజ్ ల సింహగర్జన సభ చైతన్య ర్యాలీకి ఎన్ని అడ్డంకులు ఎదురొచ్చిన ధైర్యంగా ఎదుర్కొంటూ,అందరం ఒక తాటిపై వచ్చి సభను సక్సెస్ చేశామని సభకు అహర్నిశలు కష్టపడి విజయతీరాలకు చేర్చిన మెపా ఫౌండర్స్ మెంబర్స్,మెపా కోర్ కమిటీ సభ్యులకు,పిలవగానే సభకు వచ్చిన గౌరవ,ముఖ్య అతిథులకు,ముదిరాజ్ బందు మిత్రులకు,శ్రేయోభిలాషులకు,వివిధ జిల్లా,మండల,గ్రామాల ముదిరాజ్ కుల బాంధవులకు,మిత్రులకు శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని మెపా రాష్ట్ర కార్యదర్శి తాళ్ళ రవి ముదిరాజ్ తెలిపారు.వారు మాట్లాడుతూ
ముదిరాజ్ ల బలగం,బలాన్ని,గలాన్ని చాటి చెప్పమని,మన హక్కుల పిల్లల బంగారు భవిష్యత్తు కోసంవిద్య,ఉద్యోగం,సాధికారత లక్ష్యంగా ముందుకు వెళ్దామని తెలిపారు.

సహారా ఇండియా బాధితుల సంగం సమావేశం.

సహారా ఇండియా బాధితుల సంగం సమావేశం.

మందమర్రి నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మందమర్రి సింగరేణి హై స్కూల్ గ్రౌండ్ లో జరిగిన సహారా ఇండియా బాధితుల సంఘం సమావేశమై ఈ క్రింద పేర్కొనబడిన తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించనైనది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సహారా బాధితుల సంఘం సభ్యుడు చిలుక సంజీవ్ మాట్లాడుతూ సహారా డబ్బులు విషయంపై మందమర్రి ఏజెంట్ డి. శ్రీనివాసరావు, మేనేజర్ ఎస్. టి. రావు ను నిలదీయగా గత ఐదు నెలల క్రితం లీగల్ నోటీసులు జారీ చేశారు.. అంటే అడిగితే న్యాయానికి సంకెళ్లు వేస్తారా మీరు? ఇది ఎక్కడి న్యాయం? చట్టానికి కళ్ళు ఉన్నాయని నిరూపిస్తాం. వందమంది దోషులు తప్పించుకున్నా పరవాలేదు గాని ఒక నిర్దోషికి మాత్రం శిక్ష పడకూడదు భారతీయ శిక్ష స్మృతి ప్రకారం అని పేర్కొన్నారు. ఈ విషయం పై త్వరలో జిల్లా కలెక్టర్, రామగుండం సిపి పోలీస్ కమిషనర్, స్థానిక ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మరియు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ వినతి పత్రం అందజేసి. అనంతరం ధర్నాలు రాస్తారోకలు గ్రామాల నుంచి మండలాల వరకు మండలం నుంచి జిల్లా వరకు జిల్లా నుంచి రాష్ట్రం వరకు పోరాడి మా డబ్బులు మాకు తెచ్చుకునే దిశగా ఎంత దూరమైనా వెళ్తామని పేర్కొన్నారు. అలాగేసింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గజ్జల్లి వెంకటయ్య మాట్లాడుతూ
సహారా ఇండియా సంస్థలో కాలపరిమితి పూర్తి అయిన ఖాతాదారులకు వెంటనే సహారా సంస్థ డబ్బులు చెల్లించాలి. అలాగే బెల్లంపల్లి మంచిర్యాల నస్పూర్ కాలనీలో ఉన్నటువంటి సహారా ఇండియా మేనేజర్లకు బాధితుల డిపాజిట్లు వెంటనే చెల్లించే విధంగా కృషి చేయాలని వినతి పత్రాలు ఇవ్వడానికి తీర్మానం చేయనైనది.సంవత్సరాల తరబడి సహారా కార్యాలయాల చుట్టూ తిరుగుతూ డిపాజిట్లు చెల్లించకపోవడం వలన వృద్ధులు వితంతువులు సీనియర్ సిటిజల్లు సింగరేణి విశ్రాంత ఉద్యోగులు ఇతరులు చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇట్టి విషయంపై కూడా పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ కి అదేవిధంగా బెల్లంపల్లి చెన్నూరు మంచిర్యాల శాసనసభ్యులకు కూడా సహారా బాధితుల పక్షాన వినతి పత్రాలు సమర్పించి బాధితులను ఆదుకునే విధంగా కృషి చేయాలని కోరుతూ తీర్మానించడమైనది.ఇట్టి కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా సహారా బాధితుల సంఘం సభ్యుడు చిలుక సంజీవ్, సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గజ్జెల్లి వెంకటయ్య, డి. రాజమౌళి నస్పూర్, డి. కొమురయ్య గంగారం, వెంబడి రాజేందర్ బెల్లంపల్లి, బొల్లు రాంబాబు మందమర్రి, దండు మల్లయ్య, యాదన్న, రాజమల్లు, సదానందం, నోముల వెంకన్న, సత్యనారాయణ, అజారుద్దీన్, ఓదేలు తదితరులు మహిళా సహారా బాధితులు పాల్గొనడం జరిగింది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version