కూతురి ప్రేమతో తల్లి కి సత్కారం
సిరిసిల్ల టౌన్:(నేటిధాత్రి)
భవాని సాహిత్య వేదిక ఆధ్వర్యంలో డాక్టర్ వైరాగ్యం ప్రభాకర్ సంపాదకత్వంలో పితృదినోత్సవం సందర్భంగా నాన్నకు ప్రేమతో. కవితా సంకలనం పుస్తకం లో నాన్న గొప్పతనాన్ని గురించి వర్ణిస్తూ (ఉషోదయ భానుడు నాన్న)అనే అంశంపై రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన కవయిత్రి తాళ్లపల్లి భాగ్యలక్ష్మి కవితా గానం చేసినందుకు గాను సభఅధ్యక్షులు, నాన్నకు ప్రేమతో కవితా సంపుటి సంపాదకులు డాక్టర్ వైరాగ్యం ప్రభాకర్, ముఖ్య అతిథి ఎన్వీ రఘువీర్ ప్రతాప్, విశిష్ట అతిథులు కృషిరత్న బుస్స శ్రీనివాస్, విశ్రాంత ఉపాధ్యాయులు నరహరి లక్ష్మారెడ్డి, సమీక్షకులు
కూర చిదంబరం, ఆధ్యాత్మికవేత్త బొమ్మకంటి కిషన్,తెలుగు సాహితీవేత్త ,విమర్శకులు
డాక్టర్ మోతుకుల నారాయణ గౌడ్ చేతుల మీదుగా ప్రముఖ తెలుగుసాహితీవేత్త,
కవి,రచయిత్రి శ్రీమతి తాళ్లపల్లి భాగ్యలక్ష్మి (ఝాన్సీ) ఆమె తల్లి శ్రీమతి తాళ్లపల్లి బాలవ్వలను ఆత్మీయతతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కవయిత్రి నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేశారు.