శ్రీ చైతన్య స్కూల్లో గ్రాడ్యుయేట్ డే.

శ్రీ చైతన్య స్కూల్లో గ్రాడ్యుయేట్ డే

ముఖ్య అతిథులుగా పాల్గొన్న మహబూబాబాద్ ఎమ్మెల్యే డా” భూక్య మురళి నాయక్, డి సి సి అధ్యక్షులు జన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి

పిల్లలని దయచేసి బెట్టింగ్ యాప్ లకు దూరంగా ఉంచండి…

సెల్ ఫోన్ లకు పిల్లలని దూరంగా ఉంచండి

విద్యార్థులు తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు

కేసముద్రం/ మహబూబాబాద్: నేటి ధాత్రి

 

విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచి క్రమశిక్షణ పాటిస్తూ భవిష్యత్తులో అత్యున్నత శిఖరాలను అధిరోహించాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్ ఆకాంక్షించారు. స్థానిక శ్రీ చైతన్య పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన ఐ ఎన్ టి ఎస్ ఓ బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. నేషనల్ టాలెంట్ టెస్ట్ ఒలంపియాడ్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులను ఆయన అభినందించారు విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ఆయన బహుమతి ప్రధానం చేశారు. ఈ పరీక్షలో ప్రథమ స్థానంలో నిలిచిన మూడవ తరగతి విద్యార్థిని ఏ లాస్య ఫిరోజ్ ఖాన్ అద్వైత రోషిత విక్రం ములకు గోల్డ్ మెడల్ సర్టిఫికెట్లు అందజేశారు లాస్యకు లాప్టాప్ అందజేసి ప్రత్యేకంగా అభినందించారు. తొమ్మిదవ తరగతిలో అత్యున్నత ప్రదర్శన కనపరిచిన అల్లం పైవ్యశ్రీ వచన పల్లి చేత్రాలకు గోల్డ్ మెడల్ ప్రశంస పత్రాలు అందజేశారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో క్రమశిక్షణ లోపిస్తే అది తల్లిదండ్రుల బాధ్యత అన్నారు. విద్యార్థులు సెల్ఫోన్లకు దూరంగా ఉండాలని ఆయన కోరారు సెల్ఫోన్లకు అలవాటు పడిన విద్యార్థులు భవిష్యత్తులో బెట్టింగులకు పాల్పడే ప్రమాదం ఉందన్నారు. తను కూడా విద్యార్థి దశలో ఇలాంటి పరీక్షల్లో 12,000 స్కాలర్షిప్ ను పొందిన విషయాన్ని గుర్తు చేశారు. తన విద్యార్థి జీవితాన్ని నెమరు వేసుకున్నారు పోటీ పరీక్షలకు వంద మంది విద్యార్థులు హాజరైతే 85 మంది విద్యార్థులు విజయం సాధించడం అభినందనీయం అన్నారు ప్రిన్సిపాల్ కోలా రామదాసు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ డిసిసి అధ్యక్షులు జన్నారెడ్డి భరత్ చంద్రారెడ్డి, మార్కెట్ చైర్మన్ గంటా సంజీవరెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వరరావు, డిసిసి ఉపాధ్యక్షులు అంబటి మహేందర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి బండారి వెంకన్న , మాజీ టి పి సి సి సభ్యులు దాసురు నాయక్, ఆయుఃఖాన్, వేముల శ్రీనివాస్ రెడ్డి,సుధాకర్ కోమల వెంకట్ రెడ్డి రాజేష్ కుమార్ సుమన్ అర్చన మౌనిక నూర్జహాన్ శ్రావణి ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.

కులం మతం పేరుతో చేసే రాజకీయాలు నమ్మొద్దు

— కులం మతం పేరుతో చేసే రాజకీయాలు నమ్మొద్దు
• యువత కాంగ్రేస్ కు ప్రాధాన్యత ఇవ్వాలి

నిజాంపేట: నేటి ధాత్రి

కులం, మతం పేరుతో రాజకీయం చేసే బీజేపీ పార్టీని పట్టభద్రులు నమ్మవద్దనీ మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రేస్ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంత రావు అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో పట్టభద్రుల సమావేశానికి హయారై మాట్లాడారు.. బీజేపీ పార్టీ నీ నమ్మి పట్టభద్రులు మోసపోవద్దని కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని పట్టభద్రులకు పిలుపునిచ్చారు. నరేందర్ రెడ్డి గెలిచిన వెంటనే నిరుద్యోగుల కోసం ఉచిత కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తానని తెలపడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు అంజయ్య, సరాఫ్ యాదగిరి, చెప్పేట ముత్యం రెడ్డి, బెజవాడ నాగరాజు, బక్కన్న గారి లింగంగౌడ్, వెంకట్ గౌడ్, సత్యనారాయణ, గుమ్ముల అజయ్, బాజా రమేష్, రాంచందర్ నాయక్, అందె స్వామి, మ్యాదరి నర్సిములు, కుమార్ లు ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version