వన్య ప్రాణుల దాహార్తి కోసం నీటివసతి ఏర్పాటు-టీజీ ఎఫ్ డీసీ
జైపూర్, నేటి ధాత్రి :
ఎండలు మండి పోతున్న ఈ వేసవిలో అడవులు,ప్లాంటేషన్ లలో సంచరించే వన్య ప్రాణుల దాహం తీర్చ డానికి తెలంగాణా అటవీ అభివృద్ధి సంస్థ (టీజీ ఎఫ్ డీసీ ) ఆధ్వర్యంలో నీరు నిల్వ ఉండేలా వసతి సౌకర్యం ఏర్పాటు చేశారు.వివరాలు ఇలా ఉన్నాయి.మంచిర్యాల రేంజ్ పరిధిలోని జైపూర్ మండలం ముదిగుంట అటవీప్రాంతం లో టీజీ ఎఫ్ డీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్లాంటేషన్ లలో ఒక కాలువ లో ఒక చోట నీటి ఊటను ప్లాంటేషన్ వాచర్ శంకర్ గమనించారు.ఈ సమాచారం తెలిసిన వెంటనే టీజీ ఎఫ్ డీసీ మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేష్ కుమార్ దీనికి ఒక కార్య రూపం దాల్చారు.గురువారం ప్లాంటేషన్ వాచర్ శంకర్,కొంత మంది కూలీల సహాయం తో జంతువులు తాగడానికి వీలుగా నీటి ఊట నీరు వృధాగా పోకుండా కొంత మేరకు మట్టి పూడిక తీయించి అడ్డు కట్ట వేయడం తో నీరు నిల్వ గా ఆగిపోయింది.ఈ సందర్బంగా ప్లాంటేషన్ మేనేజర్ సురేష్ కుమార్ మాట్లాడుతూ మూగ జీవాలైన వన్య ప్రాణులు వేసవిలో తాగు నీరు దొరకక చాలా ఇబ్బందులు పడుతుంటాయని, వాటి దాహర్తి తీర్చడం కోసం చిరు ప్రయత్నం చేసినట్లు తెలిపారు.
