పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాస్కు ఎస్పీ ప్రశంసా పత్రం ఇచ్చారు
భూపాలపల్లి నేటిధాత్రి
సమర్థవంతమైన వాదనలతో కేసుల్లో దోష నిర్ధారణ సాధించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎదులాపురం శ్రీనివాస్కు ప్రశంసా పత్రం
తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ బి. శివధర్ రెడ్డి మాట్లాడుతూ, క్రిమినల్ కేసుల్లో సమర్థవంతమైన వాదనలు వినిపించి న్యాయం జరిగేలా కృషి చేస్తున్న అధికారులను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా భూపాలపల్లి జిల్లా ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్గా విధులు నిర్వహిస్తున్న ఎదులాపురం శ్రీనివాస్ ని ప్రశంసించారు. ఎదులాపురం శ్రీనివాస్ సమర్థవంతమైన వాదనలు న్యాయపరమైన కృషి ద్వారా మొత్తం 12 కేసుల్లో దోష నిర్ధారణ సాధించారు. అందులో 7 కేసుల్లో నిందితులకు జీవిత ఖైదు శిక్ష విధించగా, మిగిలిన కేసుల్లో కనీసం 10 సంవత్సరాల కారాగార శిక్ష విధించబడింది. క్రిమినల్ కేసుల్లో నిందితులకు తగిన శిక్షలు పడేలా కృషి చేసి న్యాయం సాధించడంలో విశేష పాత్ర పోషించినందుకు భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ చేతుల మీదుగా ఎదులాపురం శ్రీనివాస్ ప్రశంస పత్రం అందుకోవడం జరిగింది.
◆-: ఐ.ఎన్.హెచ్.ఆర్.పి.సి తెలంగాణ రాష్ట్ర చైర్మన్ నవోదయ సిద్దు
జహీరాబాద్ నేటి ధాత్రి:
హైదరాబాద్:సమాజంలో ప్రతి వ్యక్తి గౌరవంగా జీవించే హక్కు మానవ హక్కుల మూల సూత్రమని, వాటిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఇండియన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ (ఐ.ఎన్.హెచ్.ఆర్.పి.సి) తెలంగాణ రాష్ట్ర చైర్మన్ నవోదయ సిద్దు అన్నారు. ఆదివారం హైదరాబాద్ లోని బషీరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఇండియన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ 2026 క్యాలెండర్ ను ఆయన ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశంలో ప్రజాస్వామ్యం నిలకడగా కొనసాగాలంటే మానవ హక్కుల పరిరక్షణ అత్యంత కీలకమని పేర్కొన్నారు.ప్రతి పౌరుడికి జీవించే హక్కు, స్వేచ్ఛ, సమానత్వం, విద్య, ఆరోగ్యం, ఉపాధి, న్యాయం పొందే హక్కులు రాజ్యాంగం ద్వారా కల్పించబడ్డాయని ఆయన గుర్తు చేశారు. అయితే సమాజంలో ఇప్పటికీ పేదలు, మహిళలు, బాలలు, దళితులు, గిరిజనులు, కార్మికులు, వృద్ధులు అనేక సందర్భాల్లో హక్కుల ఉల్లంఘనలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మానవ హక్కులు కేవలం చట్టపరమైన అంశం మాత్రమే కాదని, అవి మానవత్వానికి ప్రతీకలని అన్నారు. ఇతరుల హక్కులను గౌరవించడం ద్వారా మాత్రమే నిజమైన సామాజిక న్యాయం సాధ్యమవుతుందన్నారు. మానవ హక్కులపై అవగాహన లేకపోవడం వల్లనే అనేక అన్యాయాలు జరుగుతున్నాయని, అందుకే గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇండియన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ సంస్థ దేశవ్యాప్తంగా హక్కుల ఉల్లంఘనలపై పోరాటం చేస్తూ, బాధితులకు న్యాయం అందించేందుకు కృషి చేస్తోందని వివరించారు. పోలీస్ స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలు, న్యాయ వ్యవస్థల వద్ద బాధితులకు సహాయం అందిస్తూ, వారి సమస్యలను పరిష్కరించడమే సంస్థ ప్రధాన లక్ష్యమని తెలిపారు.ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, మీడియా, యువత అందరూ కలిసి మానవ హక్కుల పరిరక్షణకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి పౌరుడు తన హక్కులపై అవగాహన పెంచుకోవడంతో పాటు, ఇతరుల హక్కులను కూడా గౌరవించే సంస్కృతి అలవర్చుకోవాలని సూచించారు.న్యాలకల్ మండలం మల్గి గ్రామంలో ప్రజలకు నష్టం కలిగించే కంపెనీ ఏర్పాటు జరగకుండా సంస్థ తరపున గట్టి పోరాటం చేశామని , గ్రామ ప్రజల భద్రత, జీవనాధారాలను కాపాడాలనే ఉద్దేశంతో సంస్థ ఆధ్వర్యంలో ఉద్యమం చేపట్టినట్లు తెలిపారు.అలాగే సిగచి కంపెనీ ప్రమాదంలో గాయపడిన 53 మంది బాధితులకు న్యాయం చేయాలనే లక్ష్యంతో సంస్థ పోరాటం చేసిందని, ఆ క్రమంలో ప్రతి బాధిత కుటుంబానికి రూ. లక్ష చొప్పున పరిహారం అందించేలా చర్యలు తీసుకున్నామని గుర్తు చేశారు.భవిష్యత్తులో కూడా ప్రజా ప్రయోజనాలకు భంగం కలిగించే ఏ అంశమైనా ఎదురైతే సంస్థ తరపున పోరాటం కొనసాగిస్తామని, ప్రజల పక్షాన నిలబడి హక్కుల సాధన కోసం ముందుండి పోరాడతామని వారు స్పష్టం చేశారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పని చేయాలని నవోదయ సిద్దు కోరారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన రిటైర్డ్ హైకోర్టు జడ్జి జస్టిస్ చంద్ర కుమార్ మాట్లాడుతూ సమాజంలోని ప్రతి పౌరుడు చట్టాలపై అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. చట్టాలపై సరైన అవగాహన ఉంటేనే హక్కులను కాపాడుకోవడంతో పాటు బాధ్యతలను సక్రమంగా నిర్వహించగలమని తెలిపారు. ప్రత్యేకంగా ప్రజలు తమ హక్కులు, విధులు తెలుసుకొని న్యాయ వ్యవస్థను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. చట్టాలపై అవగాహన కార్యక్రమాలు గ్రామ స్థాయి వరకు విస్తరించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయవాది చీఫ్ అడ్వైజర్ పుట్ట పద్మారావు, జేఎన్జీఓయూ యూనివర్సిటీ ప్రొఫెసర్లు బిట్ల ప్రభాకర్, బి. క్రాంతి కిరణ్, ప్రొఫెసర్ ఉస్మానియా యూనివర్సిటీ చీఫ్ అడ్వైసర్ వెంకట్ దాస్, ప్రొఫెసర్ సీబీఐటి చీఫ్ అడ్వైసర్ ఎం. స్వామి దాస్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సంస్థ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ డిగ్గే బాబు, రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు వి మోహన్ రావు, రాష్ట్ర కార్యదర్శులు దత్తా రెడ్డి, ఆనంద్, రాష్ట్ర ఉపాధ్యక్షులు తలారి కుమార్, రాష్ట్ర అడ్వైజర్ ప్రశాంత్ గాంధీ, రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ ఫెరోజ్, సహాయ కార్యదర్శులు ఏ. ప్రదీప్ కుమార్, ఆందోల్ మల్లేశం, జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఓంప్రకాష్, బోరంచ సాయిలు, సంగారెడ్డి జిల్లా కార్యదర్శి ఎం.ఏ ఖైసర్ తదితరులు పాల్గొన్నారు
బాధిత కుటుంబానికి అండగా నిలిచిన కాంగ్రెస్ నేత శ్రీరాం రాజేష్
నేటిధాత్రి వరంగల్
ఖిలా వరంగల్ చిల్డ్రన్స్ పార్క్లో ఇటీవల గుర్రం దాడిలో ప్రమాదవశాత్తు మృతి చెందిన బాధిత కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు శ్రీరాం రాజేష్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఇప్పటికే ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన ఆయన, స్థానిక మంత్రి కొండా సురేఖ ద్వారా మరింత సహాయం అందేలా చేస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం శుక్రవారం అటవీ, పర్యావరణం, దేవాదాయ శాఖల మంత్రి శ్రీమతి కొండా సురేఖ మురళీధర్ రావును బాధిత కుటుంబ సభ్యులతో శ్రీరాం రాజేష్ కలిపించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ బాధిత కుటుంబాన్ని ఓదార్చి, ధైర్యంగా ఉండాలని సూచించారు. కొండా దంపతులు ఎల్లవేళలా మీకు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని, అలాగే బాధిత కుటుంబానికి నివాసంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు శ్రీరాం రాజేష్ తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక మీల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ సీఐని పిలిపించి, గుర్రం యజమానులను గుర్తించి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పగడాల సతీష్, బత్తుల నవీన్ కుమార్, అక్షిత్ పటేల్, ప్రియదర్శిని, శ్రీలత, లతతో పాటు బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
మందమర్రి పట్టణంలో మానవ హక్కుల అవగాహనకై పాఠశాల విద్యార్థులచే ర్యాలీమందమర్రి పట్టణంలో ఈరోజు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మదర్ తెరిసా పాఠశాల విద్యార్థులచే మానవ హక్కుల పై అవగాహన కలిగించేందుకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థ మహిళా మదర్ తెరిసా ఎడ్యుకేషనల్ సొసైటీ సర్వీస్ సెక్యూరిటీ మందమరి కే భువనేశ్వరి ప్రిన్సిపల్ ఎన్జీవో మాట్లాడుతూ రాజ్యాంగం ప్రజలకు సమాజంలో స్వేచ్ఛ స్వాతంత్ర్యాలతో జీవించడానికి హక్కులను విధులను ఏర్పాటు చేయడం జరిగిందని మానవ హక్కులను మనమంతా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని కుల మత భేదాలు లేకుండా సమానత్వంగా జీవించడానికి మానవ హక్కుల గురించి విద్యార్థులకు తెలియజేసేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. రాజ్యాంగం మనకు హక్కులతో పాటు విధులను కూడా ఏర్పాటు చేసిందని వాటిని అనుసరిస్తూ రాజ్యాంగబద్ధంగా విధానం ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మదర్ తెరిసా పాఠశాల విద్యార్థులు స్వచ్ఛంద సంస్థ సభ్యులు పాల్గొన్నారు.
జహీరాబాద్/ఝరాసంగం: అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా ఝరాసంగం మండల పరిధిలోని కమాల్ పల్లి గ్రామంలో అంబేడ్కర్ యువజన సంఘం యువకుల ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ యువజన సంఘం నాయకుడు ఏ.రాజు మాట్లాడుతూ భారత రాజ్యాంగ ప్రధాన నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ డిసెంబర్ 6న మరణించారు. ఆయన గొప్ప న్యాయనిపుణుడు మాత్రమే కాదు, ఆర్థికవేత్త, సామాజిక సంస్కర్త మరియు రాజకీయ నాయకుడు కూడా, భారతదేశంలోని వెనుకబడిన తరగతుల హక్కులు మరియు అభ్యున్నతి కోసం అవిశ్రాంతంగా కృషి చేశారు. ఆయన జీవితం అసమానతలతో పోరాడటానికి మరియు న్యాయం మరియు సమానత్వం ఆధారంగా సమాజాన్ని సృష్టించడానికి అంకితం చేశారు అని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం యువకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ అంబేద్కర్ సంఘం మంగపేట మండల కమిటీ (184/85) ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవం.
మంగపేట నేటిధాత్రి
తెలంగాణ అంబేద్కర్ సంఘం మంగపేట మండల అధ్యక్షులు యెంపెల్లి వీరస్వామి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు మరియు మంగపేట మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించుకుని సంవత్సరం పూర్తి అయినా సందర్బంగా మంగపేట మండలకేంద్రంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర అంబేద్కర్ విగ్రహానికి పూలమాలతో ఘనమైన నివాళులు అర్పించి, కేక్ కట్ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమం లో పాల్గొన్నవారు అంబేద్కర్ సంఘం మంగపేట మండల వ్యవస్థాపకులు పగిడిడిపల్లి వెంకటేశ్వర్లు, విగ్రహ ధాత చెట్టుపెల్లి వెంకటేశ్వర్లు,అంబేద్కర్ సంఘం గౌరవ సలహాదర్లు ఎర్రం స్వామి, పూజారి సురేందర్ బాబు,సీనియర్ నాయకులు గుళ్లగట్టు విజయరావు ఉపాధ్యాయ సంఘం జిల్లా నాయకులు వెంకటస్వామి,అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు ఎడ్ల నరేష్, జిల్లా నాయకులు ముత్యాలు,మహిళా నాయకురాలు కాటూరి సుగుణ ఏటూరునాగారం డివిజన్ అధ్యక్షులు బసరికాని హరికృష్ణ,మంగపేట మండల ప్రధాన కార్యదర్శి బోడ రామచంద్రం మంగపేట మండల కమిటీ నాయకులు, బసరికాని నాగార్జున దాసరి ఎల్లయ్య బూర్గుల సతీష్, జాడి సంబశివరావు, lp రవి, నరంహారావు, రామటెంకి మాణిక్యం కమలాపురం గ్రామ కమిటీ అధ్యక్షులు దాసరి బుజ్జి,యెంపెల్లి దేవందర్, తిమ్మంపేట గ్రామ అధ్యక్షులు దుర్గం శివప్రసాద్, ప్రధాన కార్యదర్శి బోడ శివయ్య,బోడ సతీష్, గోమాస్ నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.
మహాకవి కాళోజీ గారి వర్ధంతి సభను ఘనంగా నిర్వహించిన వరంగల్ బార్ అసోసియేషన్:-
వరంగల్, నేటిధాత్రి (లీగల్):-
తెలంగాణ ప్రజాకవి మహాకవి కాళోజీ నారాయణరావు గారి వర్ధంతి సందర్భంగా వరంగల్ బార్ అసోసియేషన్ హాల్ (అంబేద్కర్ హాల్)లో గురువారం స్మారక సభను వరంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు వలస సుధీర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు, ఇట్టి కార్యక్రమంలో అధ్యక్షులు సుధీర్ మాట్లాడుతూ “తెలంగాణ తొలిపొద్దు కాళోజీయని అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి, అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి. అన్యాయాన్నెదిరించిన వాడే నాకారాధ్యుడు” అని సగర్వంగా ప్రకటించి ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాళోజీ గారంటూ, అదేవిధంగా అన్నపు రాశులు ఒకచోట – ఆకలికేకలు ఒకచోట అంటూ సమాజంలోని అసమానతలను అక్షర యోధుడై దునుమాడి సమసమాజం కోసం పోరాడారని,ప్రజల ఆవేదనను బడిపలుకులతో గాక, పలుకుబడుల భాషలో పలికించిన నిజమైన ప్రజా కవి కాళోజీ గారిని స్మరించుకోవడం మనందరికీ స్పూర్తిదాయకం అంటూ వారి ఆశయాల వెలుగులో ప్రతి పౌరుడు సామాజిక బాధ్యతతో ముందుకు సాగి అసమానతలు లేని సమాజాన్ని సాధించాలని బార్ అసోసియేషన్ తరఫున పిలుపునిచ్చారు
ఈ సందర్భంగా న్యాయవాదులు కాళోజీ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
కార్యక్రమంలో బార్ ఉపాధ్యక్షుడు మైదం జయపాల్, ప్రధాన కార్యదర్శి డి. రమాకాంత్, సంయుక్త కార్యదర్శి ముసిపట్ల శ్రీధర్ గౌడ్, కోశాధికారి సిరుమళ్ల అరుణ, సీనియర్ ఈసి సభ్యుడు ఇజ్జేగిరి సురేష్, మహిళా ఈసి సభ్యురాలు తోట అరుణ, బార్ కౌన్సిల్ సభ్యుడు బైరపాక జయాకర్, అలాగే సీనియర్ న్యాయవాదులు తీగల జీవన్ గౌడ్, ఎలుకుర్తి ఆనంద్ మోహన్, రాచకట్ల కృష్ణ, గంధం శివ, ఓరుగంటి కోటేశ్వర్, సిద్దం యుగేందర్,గురుమిళ్ల రాజు మరియు ఇతర పలువురు న్యాయవాదులు పాల్గొని నివాళులర్పించారు.
◆:- పడవచ్చు జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి
◆:- ఎస్సై క్రాంతి కుమార్ పాటేల్
జహీరాబాద్ నేటి ధాత్రి:
రాజీ పడడానికి అవకాశం ఉన్న అన్ని కేసుల్లో కక్షిదారులు రాజీపడవచ్చు క్షణికావేశంలో జరిగిన తప్పులను సరిదిద్దు కోవడానికి రాజీమార్గమే రాజమార్గం కనుక నవంబర్ 15న శనివారం జరగనున్న జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని ఝరాసంగం మండల ఎస్సై క్రాంతి కుమార్ పాటేల్ ఓ ప్రకటన ద్వారా తెలిపారు. జాతీయ లోక్ అదాలత్ ను ఉద్దేశించి ఝరాసంగం మండల ఎస్సై క్రాంతి కుమార్ పాటేల్ మాట్లాడుతూ క్షణికావేశంలో చేసే తప్పులను సరిదిద్దుకోవాడానికి అదాలత్ అనేది ఒక మంచి అవకాశం అని, అనవసర గొడవలకు, పట్టింపులకు పోయి జీవితాలను ఇబ్బందులపాలు చేసుకోకూడదని మండల వ్యాప్తంగా నమోదైన, చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న రాజీ కుదుర్చుకోవడానికి అవకాశం ఉన్న అన్ని కేసులలో కక్షిదారులు రాజీ పడుటకు జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.రాజీపడదగిన కేసుల్లో ఇరువర్గాల మధ్య పరస్పర అవగాహనతో పరిష్కారం కనుక్కోవడం వల్ల సమయం, ధనం, శ్రమ ఆదావుతుందని తెలిపారు. రాజీ ద్వారా అందరికీ న్యాయం లభిస్తుందని పేర్కొన్నారు. కానిస్టేబుల్ నుండి అధికారుల వరకు ప్రతి ఒక్కరు భాధ్యతగా వ్యవహరించి, రాజీ పడదగిన కేసులలో ఇరువర్గాలకు కౌన్సిలింగ్ నిర్వహించి, వీలైనన్ని ఎక్కువ కేసులు రాజీ పడేలా చేసుకోవాలన్నారు. జాతీయ లోక్ అదాలత్ ద్వారా సత్వర పరిష్కారం జరుగుతుందని తెలిపారు.
లోక్ ఆదాలత్ ను మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.
#రాజీ పడటమే రాజమార్గం
#ఎస్సై వి గోవర్ధన్.
నల్లబెల్లి, నేటి ధాత్రి:
మండలంలో పలు కేసులలో సతమతమవుతున్న బాధితులు రాజీ పడడం వలన వారి భవిష్యత్తుకు లోక్ అదాలత్ దోహద పడుతుందని ఎస్సై వి గోవర్ధన్ అన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ఈనెల15న నర్సంపేట కోర్టులో నిర్వహించే లోక్ అదాలత్ ను మండల పరిధిలో ఉన్న పలువురు పలు కేసులలో ఇబ్బంది పడుతున్న బాధితులు సద్వినియోగం చేసుకోవాలని. అలాగే క్రిమినల్, సివిల్ ఆస్తి తగాదాలు, కుటుంబ పరమైన వైవాహిక జీవితానికి సంబంధించిన పలు కేసులలో ఇబ్బంది పడుతున్న బాధితులు సత్వర పరిష్కారం లభించే అవకాశం లోక్ అదాలత్ లో దొరుకుతుందని అలాగే ఇరువర్గాల వారు రాజీ పడడంతో సమస్య పరిష్కారం కావడమే కాకుండా కక్షిదారుల విలువైన సమయం డబ్బు ఆదా అవుతుందని ఆయన తెలిపారు.
మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని బోడ జానంపేట గ్రామ రెవెన్యూ శివారులో ఎస్.ఆర్. పి కంపెనీ తమ భూమిని ఆక్రమించారని బాధిత రైతులు ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి గురువారం తెలిపారు. ఈ సందర్భంగా బాధిత రైతులు మాట్లాడుతూ.. గ్రామ శివారులోని సర్వే నెంబర్ 87 లో 3.14 గుంటల భూమిని ఓ కంపెనీ అక్రమంగా ఆక్రమించి, తమ భూమిని ఎందుకు ఆక్రమించారని అడిగితే తమపై కేసులు నమోదు చేసి ఇబ్బందులు గురిచేస్తున్నారని ఎమ్మెల్యేకు విన్నవించారు. ఎమ్మెల్యే స్పందించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని రైతులు తెలిపారు.
రాష్ట్రవ్యాప్త బీసీ బందులో పాల్గొన్న మోకుదెబ్బ నాయకులు.
దుగ్గొండి,నేటిధాత్రి:
42 శాతం బీసీ రిజర్వేషన్ అమలు పట్ల బీసీ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన రాష్ట్ర బంద్ కార్యక్రమం దుగ్గొండి మండలం గిర్నిబావి గ్రామంలో గల ప్రధాన రహదారిపై నిరసన,ధర్నా కార్యక్రమం చేపట్టగా గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ మండల అధ్యక్షుడు తడుక కొమురయ్య గౌడ్ అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిథిగా నర్సంపేట డివిజన్ అధ్యక్షుడు కందుల శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు.విద్య, ఉపాధి తోపాటు అన్ని విధాల బీసీ కులస్తులకు న్యాయం జరగాలంటే 42 శాతం రిజర్వేషన్ ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు గుండెబోయిన రమేష్ గౌడ్, జిల్లా నాయకులు మోడెం విద్యాసాగర్ గౌడ్, మహేష్ గౌడ్, కాసగాని చందూగౌడ్, సుధీర్ గౌడ్, తడుక కాంత్రి కుమార్ గౌడ్ వివిధ గ్రామాల గౌడ కులస్తులు పాల్గొన్నారు.
శ్రీనివాసపురం చెరువు తూము నిర్మాణంపై విచారణ జరపాలి
బీజేపీ రాష్ట్ర నేత సీనియర్ న్యాయవాది మున్నూర్ రవీందర్
వనపర్తి నేటిదాత్రి
వనపర్తి జిల్లా శ్రీనివాసపురం దగ్గర తూము నిర్మాణం చేపట్టడము వల్ల అక్కడ మున్సిపల్ అనుమతులు తీసుకొని ఇండ్ల నిర్మాణం చేసుకున్నారని తూము నిర్మాణం చేపట్టడం వల్ల నివాసంలో ఉండే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ రాష్ట్ర నేత సీనియర్ న్యాయవాది మున్నూర్ రవీందర్ విలేకరుల సమావేశంలో తెలిపారు జిల్లా కలెక్టర్ విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు న్యాయం చేయకుంటే కోర్టును ఆశ్రయిస్తామని మున్నూర్ రవీందర్ చెప్పారు
జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఐడిఎస్ఎంటి కాలనీ 158 సర్వే నెంబర్ లో పేదలు కట్టుకున్న ఇండ్లను కూల్చడం వెంటనే ఆపివేయాలని, తమ ప్లాట్లకు రక్షణ కావాలని డిమాండ్ చేస్తూ బాధితులకు అండగా మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు… పేదలకు న్యాయం పేదలకు న్యాయం చేసే వరకు జరిగే వరకు ఈ పోరాటం ఆగదు…
తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివ చరణ్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బట్టు కర్ణాకర్ ఆధ్వర్యంలో ఆనందాజీ పై లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఆర్ఎస్ఎస్ నాయకుల దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. అనంతరం యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బట్టు కర్ణాకర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ కేరళకు చెందిన యువ సాఫ్ట్వేర్ ఆనందా ఆజీ పై చిన్న వయసు నుంచే కొంతమంది ఆర్ఎస్ఎస్ వాదులు లైంగిక వేధింపులకు గురిచేస్తూ మానసిక వేదనకు, శారీరకంగా వేదనకు గురిచేసి ఆయనను ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించి.. అతని చావుకు కారణమైన ఆర్ఎస్ఎస్ వాదుల దిష్టిబొమ్మను దహనం చేసినామన్నారు
ఆనందా ఆజీ తన ఇంస్టాగ్రామ్ లో స్వయంగా నాకు ప్రేమ వ్యవహరాలలో జోక్యం లేదు ఆర్థిక ఇబ్బందులు లేవు కేవలం ఆర్ఎస్ఎస్ నాయకులు చేసిన లైంగిక వేధింపులకే మానసిక ఇబ్బందుల వల్లనే నేను చనిపోతున్నాను అని వారు స్పష్టంగా తెలియజేయడం జరిగింది
యువ సాఫ్ట్వేర్ ఆనంద్ ఆజిపై లైంగిక వేధింపులు చేసిన ఆర్ఎస్ఎస్ నాయకులపై కేరళ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి వారి కుటుంబానికి కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపి ఎవరైతే దోషులు ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలని వారు అన్నారు ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర జిల్లా నాయకులు ప్రసాద్ అఖిల్ తిలక్ ప్రేమ్ కుమార్ అఖిల్ భాస్కర్ రిజ్వాన్ వినోద్ శేఖర్ శ్రీకాంత్ సాగర్ రేవంత్ రవీందర్ మల్లేష్ సంపత్ నదీమ్ సురేష్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు
జాతీయ మాల మహానాడు సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో ప్రెస్ మీట్
సిరిసిల్ల టౌన్:(నేటిధాత్రి)
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జాతీయ మాల మహానాడు సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ క్లబ్ లోని మొన్న జరిగినటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ (గవాయ్) దళితడి ఫై దాడి చేసిన ఆర్ఎస్ఎస్ నేత లాయర్ రాకేష్ కిషోర్ కుమార్ ని వెంటనే అరెస్ట్ చేసి చట్ట రీత్యా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాము. అని అంతేకాకుండా మన తెలుగువాడైన దళిత బిడ్డ ఏ.డి.జీ.పి పురణ్ కుమార్ అధికారల ఒత్తిడితో తాను ఎనిమిది పేజీల లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడని ఒక దళిత అధికారిని హింసించి పైన ఉన్నటువంటి అగ్రకుల వర్ణాలు అనగదొక్కడానికి చూస్తున్నాయని అలాంటి వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఒక ఐపీఎస్ అధికారిని అగ్రకుల వర్ణ అధికారులు హింసించడం ద్వారా ఒక దళిత తెలుగు బిడ్డ ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం వీరిపై వెంటనే ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని సిరిసిల్ల జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు నీరటి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గుడే బాబు, సిరిసిల్ల జిల్లా దళితనియోజకవర్గ ఇన్చార్జ్ రాజ్ కుమార్, దళిత నాయకులు రామచందర్, పండుగ శేఖర్, బాలరాజు తదితరులు నాయకులు పాల్గొన్నారు.
సుప్రీం చీఫ్ జస్టిస్ గవాయి పై దాడి చేసిన వ్యక్తి పై చర్యలు తీసుకోవాలి
మందమర్రి నేటి ధాత్రి
Vaibhavalaxmi Shopping Mall
భారత అత్యున్నత పదవిలో ఉన్న సుప్రీం చీఫ్ జస్టిస్… జస్టిస్ గవాయి పై జరిగిన దాడి.. యావత్ న్యాయ వ్యవస్థ, ప్రజాస్వామ్యంపై దాడి జరిగినట్లు అని సామాజిక ఉద్యమ నాయకుడు గుడికందుల రమేశ్ అన్నారు. బుధవారం మందమర్రిలో మాట్లాడుతూ…..సుప్రీంకోర్టులో భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ దాడికి యత్నించిన వ్యక్తి వ్యక్తిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఒక కేసు విచారణ సందర్భంగా వాదనలు వినిపిస్తున్న లాయర్ రాకేష్ ఏకంగా చీఫ్ జస్టీస్ బీఆర్ గవాయ్ పై దాడి చేసేందుకు యత్నించాడు. తన షూను తీసి సీజేపై విసిరేందుకు ప్రయత్నించగా అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, తోటి లాయర్లు అప్రమత్తమై తనను అడ్డుకున్నారు.భారత దేశ న్యాయవ్యవస్థలో అత్యున్నత స్థానంలో ఉన్న బీఆర్ గవాయ్ పై జరిగిన దాడి దేశ ప్రజలను కలచివేసింది. ఈ ఘటనను పలు పార్టీల నేతలు, ప్రముఖులు ఖండించాలని కోరుతూ, మన దేశ న్యాయవ్యవస్థలో అత్యున్నత స్థానంలో ఉన్న గౌరవనీయులపై దాడి చేసి భయపెట్టే ఈ నీచమైన ఘటనను ఖండించడానికి మాటలు సరి పోవని అన్నారు. ఇది మన దేశ చరిత్రలో ఒక చీకటి రోజని ఇలాంటి పిరికిపంద దాడులతో తాను వెనక్కి తగ్గబోనని ధైర్యంగా ప్రకటించిన మన అజేయమైన భారత ప్రధాన న్యాయమూర్తి బీ.ఆర్.గవాయ్ కు ప్రజాస్వామ్యవాదుల మద్దతు ఎల్లప్పుడు ఉంటుందని తెలిపారు.
సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ పై దాడికి నిరసనగా న్యాయవాదుల విధుల భహిష్కరణ.
హన్మకొండ/వరంగల్, నేటిధాత్రి (లీగల్)
Vaibhavalaxmi Shopping Mall
హన్మకొండ మరియు వరంగల్ కోర్టు న్యాయవాదులు, గౌరవ సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ B.R. గవాయ్ పైన సోమవారం నాడు జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ,మంగళవారం నాడు కోర్టు గేట్లకు తాళాలు వేసి గేట్ల ముందు కూర్చొని తమ నిరసనను తెలియజేస్తూ తమ విధులను భహిష్కరించారు.
హన్మకొండ బార్ అసోసియేషన్ అధ్యక్షులు పులి సత్యనారాయణ మాట్లాడుతూ దేశ సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయి పై జరిగిన దాడి, న్యాయ దేవతపై జరిగిన దాడిగా అభివర్ణించారు. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు వలుస సుధీర్ ప్రసంగిస్తూ. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గౌరవనీయులు B.R. గవాయ్ పై జరిగిన అవమానకర దాడి పట్ల వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ చర్యను ఖండిస్తున్నాం అని తెలిపారు.
Hanamkonda
ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాదులు మాట్లాడుతూ భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద బౌతిక దాడికి ప్రయత్నం అనేది ఉన్మాద చర్య, ఇది కేవలం వ్యక్తిపై దాడి కాదు — దేశ న్యాయ వ్యవస్థ గౌరవం పై జరిగిన దాడిగా చూడాలి అన్నారు. న్యాయమూర్తుల పై గానీ, న్యాయవాదులపై గానీ భౌతికంగా జరిగే దాడులను ప్రతి న్యాయవాది, ప్రతి న్యాయమూర్తి న్యాయ వ్యవస్థ రక్షణ కోసం డిమాండ్ చేస్తూ, ఇటువంటి చర్యలను ముక్త కంఠంతో ఖండించాలని అన్నారు. ప్రస్తుతం న్యాయవాదుల రక్షణ చట్టం (Advocates Protection Act) బిల్లును వెంటనే తీసుకురావాలని అదే పరిధిలో న్యాయమూర్తుల రక్షణను కూడా చేర్చడం అత్యవసరం అని భావిస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ వైస్ ప్రెసిడెంట్ ఎం.జైపాల్ ఇరు బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిలు, డి.రమాకాంత్, రవి, కోశాధికారి సిరుమళ్ల అరుణ, గ్రంథాలయ కార్యదర్శి గుండ కిషోర్,సీనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఇజ్జిగిరి సురేష్ ,ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ మాచర్ల మేఘనాథ్ , మడిపెల్లి మహేందర్ , బార్ కౌన్సిల్ మెంబర్ భైరపాక జయకర్ , సీనియర్ న్యాయవాదులు కె అంబరీష్ రావు,జీవన్ గౌడ్, వద్దిరాజు గణేష్, వి.వెంకట రత్నం, అబ్దుల్ నబి తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.
సింగరేణి కార్మికుల లాభాల వాటా పై యాజమాన్యం పునరాలోచించాలి
ఏఐటియుసి కేంద్ర కార్యదర్శి అక్బర్ అలీ
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
సింగరేణి వ్యాప్తంగా లాభాల వాటా ప్రకటనపై ప్రతి కార్మికుడికి అసంతృప్తి ఉందని, వాస్తవ లాభాలు ప్రకటించాలని ఏఐటీయూసీ గత ఆరు నెలలుగా డిమాండ్ చేస్తుందని ఏఐటియుసి కేంద్ర కార్యదర్శి అక్బర్ అలీ అన్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. లాభాల వాటా పై రకరకాల చర్చలు, కామెంట్లు వస్తున్న నేపధ్యంలో వాస్తవ లాభాలను ప్రకటించకుండా ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం గోప్యతతో లాభాలను ప్రకటించడం కార్మికులు జీర్ణించుకోలేకపోతున్నారని, ఇప్పటికైనా వాస్తవిక లాభాలను ప్రకటించాలని ఏఐటియుసి డిమాండ్ చేస్తుందని అన్నారు. లాభాలను సింగరేణి ప్రాంతంలో అభివృద్ధికై కేటాయిస్తున్నామని ప్రకటిస్తున్న ప్రభుత్వం,యాజమాన్యం సింగరేణి ప్రాంతాలలో ఏం అభివృద్ధి చేశారో తెలియచేయాలని అన్నారు. ప్రభుత్వం నుండి సింగరేణికి ఇప్పటికే 40 వేల కోట్ల బకాయిలు రావాల్సింది ఉందని గుర్తు చేశారు. లాభాలు ఎన్ని వచ్చాయో యాజమాన్యం ప్రకటించకుండా ఇన్ని రోజులు నాన్చుతూ వచ్చి చివరకు కేవలం 34% లాభాల వాటా మాత్రమే అందించడంతో కార్మిక లోకం తీవ్ర అసంతృప్తికి లోనైందని అన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు సైతం సరైన లాభాలు ప్రకటించకపోవడంతో వారు కూడా నిరాశ చెందుతున్నారని తెలిపారు. ఏఐటియుసి సంఘం తరఫున లాభాల వాటపై ప్రభుత్వం పై,యాజమాన్యం పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నామని పేర్కొన్నారు. కార్మికులు కష్టపడి సంపాదించిన డబ్బులు ప్రతి కార్మికుడికి చెందాల్సిందేనని డిమాండ్ చేశారు. లాభాల వాటాపై యాజమాన్యం పునరాలోచించి కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.
మానవత్వానికి హితుడు (స) పుట్టినప్పటి నుండి ప్రపంచంలో విప్లవాలు జరిగాయి.
జహీరాబాద్ నేటి ధాత్రి:
మౌలానా ఇజాజ్ మొహియుద్దీన్ వసీం తదితరులు జహీరాబాద్లో జమాతే ఇస్లామీ సభలో ప్రసంగించారు మానవత్వం అంతరించిపోయిన, అణచివేత మరియు అమానవీయ చర్యలు మాత్రమే ఉన్న యుగంలో మానవత్వం యొక్క గొప్ప బోధకుడు హజ్రత్ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) సంతోషంగా జన్మించారు. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) యొక్క మొదటి విప్లవం ఏమిటంటే అల్లాహ్ తప్ప వేరే దేవుడు లేడు మరియు ప్రయోజనం మరియు హాని తప్ప ప్రతిదానికీ ఆయన ఏకైక మరియు ఏకైక యజమాని.
భూమిపై భయం లేదా ప్రమాదం లేని చోట మనిషి స్వేచ్ఛగా ఉన్నాడనే సీరత్ తయ్యబా యొక్క మొదటి సైద్ధాంతిక విప్లవం ఇది. ఇది మొదట మానవాళికి ఇవ్వబడింది. రెండవ విప్లవం ఏమిటంటే, ప్రపంచంలో మనిషి ఒక పురుషుడు మరియు స్త్రీ నుండి సృష్టించబడ్డాడు మరియు గౌరవం మరియు ఔన్నత్యం ఆదాముకు ప్రసాదించబడ్డాయి, దీనిలో దేవదూతలు అతనికి జ్ఞానాన్ని నేర్పించారు మరియు అతను అన్ని సృష్టిలలో ఉత్తముడిగా చేయబడ్డాడు. జహీరాబాద్లోని ఇస్లామిక్ సెంటర్ శాంతి నగర్లో జమాతే ఇస్లామీ హింద్ సౌత్ ఆధ్వర్యంలో “సీరత్-ఇ-నబీ (సల్లల్లాహు అలైహి వసల్లం) విప్లవం సందేశం” అనే అంశంపై జరిగిన బహిరంగ సభలో మౌలానా ఇజాజ్ మొహియుద్దీన్ వసీం హైదరాబాద్ ప్రసంగిస్తూ ఇలా అన్నారు: నేడు మానవులు ఒకరి రక్తానికి ఒకరు దాహం వేస్తున్నారని, అమాయక పిల్లలు మరియు మానవులు అధికారం మరియు బలం యొక్క అహంకారం కారణంగా ఊచకోత కోయబడుతున్నారని, మానవత్వాన్ని తొక్కిపెడుతున్నారని, పాలస్తీనా ప్రజల సంఘటనలు మరియు దృశ్యాలు ప్రతి కన్ను తడిపేస్తున్నాయని మరియు హృదయాలను కలచివేస్తున్నాయని ఆయన అన్నారు. దురదృష్టవశాత్తు, మానవ హక్కులను బిగ్గరగా ప్రకటించే మరియు మానవ హక్కులను ప్రకటించే మానవ హక్కుల సంస్థలు వాటిని ప్రకటించే వారి కళ్ళకు గంతలు కట్టాయి, అయితే విప్లవం కోసం ప్రవక్త జీవిత చరిత్ర సందేశం ఏమిటంటే, ఒక మానవుడిని చంపడం మొత్తం మానవాళిని చంపడమే, మరియు నల్లజాతీయుల కంటే తెల్లవారికి, అరబ్ లేదా విదేశీయుడు కానివారికి, లేదా రంగు, జాతి లేదా ప్రపంచంలోని ఏ ప్రాంతానికి చెందినవారికి ఉన్న ఆధిపత్యం లేదు. దీని పవిత్రత ఏమిటంటే మానవులందరూ ఒక్కటే. హజ్రత్ ఉమర్ (రజి) జీవిత చరిత్రను ప్రస్తావిస్తూ, ఆ కాలపు ఖలీఫాను బెడౌయిన్ ప్రశ్నించిన సంఘటనను ఆయన చెప్పారు మరియు పాలకులు ప్రజలకు జవాబుదారీగా ఉంటారు, వారు కోరుకున్నది చేయగలరని కాదు అనే జవాబుదారీతనం భావనను ప్రస్తుతించారు. ఇది విప్లవ భావన. ప్రపంచంలో శాంతి మరియు శాంతిభద్రతలు నెలకొల్పబడటానికి ఈ గొప్ప విప్లవాత్మక సందేశాన్ని దేవుని సేవకులకు తెలియజేయాలని ఆయన నొక్కి చెప్పారు. మౌలానా ముఫ్తీ ముహమ్మద్ నజీర్ అహ్మద్ హసామి ఫిర్దౌస్ మసీదు శాంతి నగర్ ఖతీబ్ మరియు ఇమామ్ తన ప్రసంగంలో సీరత్ తయ్యబా యొక్క గొప్పతనం మరియు ప్రాముఖ్యత యొక్క అంశాలను హైలైట్ చేసి వాటిని అనుసరించాలని సూచించారు. జమాతే ఇస్లామీ హింద్ , నజీమ్ పాశ్చాత్య జిల్లా సంగారెడ్డి, ముహమ్మద్ నజీముద్దీన్ ఘోరీ కూడా మాట్లాడారు. సోదరుడు రెహాన్ఖురాన్ పవిత్ర ఖురాన్ పారాయణం మరియు వివరణ ద్వారా మరియు అమీర్ స్థానిక సయ్యద్ అబ్దుల్ రౌఫ్ సౌత్ పారాయణం మరియు వివరణతో కార్యక్రమం ప్రారంభమైంది మరియు అతిథులను స్వాగతించారు, ప్రోగ్రామ్ చర్య ముహమ్మద్ ఖ్వాజా నిజాముద్దీన్ నిర్వహించారు. సోదరుడు ముహమ్మద్ యాకూబ్ ధన్యవాదాలతో కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో ముహమ్మద్ మొయినుద్దీన్ అసిస్టెంట్ నజీమ్ డిస్ట్రిక్ట్ సంగారెడ్డి, ముహమ్మద్ ఖైసర్ ఘోరి, అమీర్ లోకల్ నార్త్, సభ్యులు, కార్మికులు మరియు ఇతరులు పాల్గొన్నారు.
రాజి మార్గాన్ని ఎంచుకొని వివాదాలు లేని జీవితాలను గడపాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తి న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ సి.హెచ్.రమేష్ బాబు అన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కోర్టు ప్రాంగణాల్లో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ చిన్న చిన్న విషయాల్లో పంతాలకు పోయి గొడవలు పెట్టుకుంటే నష్టమే తప్ప లాభం ఉండదన్నారు. జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకొని రాజి పడి కేసుల్లో నుండి బయటపడాలని జడ్జి తెలిపారు. సీనియర్ సివిల్ జడ్జి న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాజ్ మాట్లాడుతూ క్షమా గుణాన్ని కలిగివుండడం గొప్ప విషయం అన్నారు. ప్రతిఒక్కరు సోదరభావంతో మెలగాలని వారు తెలిపారు. ఈ జాతీయ లోక్ అదాలత్ లో పెద్ద ఎత్తున కేసులు పరిష్కారం అయ్యాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్.ఆర్. దిలీప్ కుమార్ నాయక్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అఖిల అడిషనల్ ఎస్.పి. నరేష్ కుమార్ జిల్లావైద్య ఆరోగ్య శాఖ అధికారి మధుసూదన్ లేబర్ కమీషనర్ వినోద గవర్నమెంట్ ప్లీడర్ బోట్ల సుధాకర్ అడ్వొకేట్స్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ వి. శ్రీనివాస చారి ప్రధాన కార్యదర్శి వి. శ్రావణ్ రావు బెంచి మెంబర్లు ఎం.డి. లతీఫ్ అబ్దుల్ కలాం మంగళపల్లి రాజ్ కుమార్ రావుల రమేష్ కనపర్తి కవిత మొయినుద్దీన్ సంధ్య నాగవత్ తిరుమల పోలీసు అధికారులు పి.కుమార్ ఏ.నరేష్ కుమార్ కర్ణాకర్ రావు వెంకటేశ్వర్లు బ్యాంకు ప్రతినిధులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.’
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.