ఉబికి వస్తున్న గంగమ్మ ..

ఉబికి వస్తున్న గంగమ్మ .. !

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం : భారీ వర్షాల కారణంగా పాతాళ
గంగమ్మ పైకి వచ్చింది. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల కేంద్రంలోని ఇండియన్ పెట్రోల్ పంప్ వెనుక భాగంలో ఉన్న వ్యవసాయ బోరు నుంచి కరెంట్ లేకుండానే నీరు బయటకు రావడంతో, ఆ బోరులో నేరుగా పైపును అమర్చారు. నీటి ఒత్తిడితో నీరు నేరుగా నల్లాలకు చేరుతోంది.

ఇంటి గోడ కూలి మహిళ మృతి…

ఇంటి గోడ కూలి మహిళ మృతి
* పది వేలు ఆర్థిక సహాయం చేసిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు

మహాదేవపూర్ సెప్టెంబర్ 26 (నేటి ధాత్రి)

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపురం మండలం బెగుళూరు గ్రామంలో ఇంటి గోడ కూలి మహిళ మృతి చెందిన సంఘటన శుక్రవారం రోజున చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ప్రకారం రెండు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు ఇంటి గోడ పూర్తిగా నానడం తో గోడ కూలి మంద లక్ష్మి అనే మహిళ పై పడడంతో అక్కడికక్కడే మృతి చెందగా మహిళ భర్త మంద దుర్గయ్య కు గాయాలయ్యాయి అని గ్రామస్థులు తెలిపారు. విషయం తెలుసుకొని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అశోక్ ఈ సంఘటనను మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు కు తెలుపగా వెంటనే స్పందించి బాదిత కుటుంబానికి మంత్రి ఆదేశాల మేరకు మహిళా భర్తకు నగదు గా పదివేల రూపాయలు ఇస్తూ దశ దిన కర్మ అనంతరం మంద దుర్గయ్య ఆరోగ్యా నిమిత్తం మెరుగైన వైద్యం ఇప్పిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, ప్రజలు పాల్గొన్నారు.

చెరువులు, కుంటలు నిండాయి…..

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-24T142146.202.wav?_=1

 

చెరువులు, కుంటలు నిండాయి..
• ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
• ఎస్సై రాజేష్.

నిజాంపేట: నేటి ధాత్రి

గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలకు చెరువులు, కుంటలు నిండుకుండల మారాయని బతుకమ్మ, దేవి శరన్నవరాత్రులను పురస్కరించుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక ఎస్సై రాజేష్ సూచించారు. ఈ సందర్భంగా నిజాంపేటలో మాట్లాడుతూ.. భారీ వర్షాలకు చెరువులు కుంటలు అధికంగా నిండడంతో రాబోయే బతుకమ్మ, దేవి నవరాత్రి ఉత్సవాలకు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఉత్సవాల సమయంలో మహిళలు, చిన్నపిల్లలు చెరువుల వద్దకు గుమి గూడి వెళ్ళవద్దన్నారు. చిన్నపిల్లలు చెరువుల వద్ద ఇష్టానుసారంగా తిరగకుండా తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక నిఘ పెట్టాలన్నారు. ప్రజలు ఆనందంగా పండగలు జరుపుకోవడమే కాకుండా.. సురక్షితంగా ఉండడం కూడా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.

రైతులను ముంచిన భారీ వర్షాలు…

రైతులను ముంచిన భారీ వర్షాలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

పూర్తిగా దెబ్బతిన్న పత్తి పంటప్రభుత్వం పంట నష్టపరిహారం అందించాలి:మలా మహానడు ఝరాసగం మండలు అధ్యక్షులు బాబు సంగారెడ్డి జిల్లా ఝరసంగం మండల ప్రజలు భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని గంగాపూర్ మలా మహానాడు సీనియర్ నాయకులు బాబు అన్నారు.ఎడతెరిపి లేకుంట కురుస్తున్న వర్షాల వల్ల ప్రజలు బయటికి రావొద్దని, ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులు దాటి ప్రాణాలను రిస్క్ లో పెట్టొద్దని అన్నారు. సాధ్యమైనంత వరకు వాగుల ప్రవాహం ఆగిన తర్వాతనే దాటాలని కోరారు. అదేవిదంగా నిలకడ లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల మండలంలోని పంటలు అన్ని పూర్తిగా పాడయ్యాయని,రైతులు చాలా నష్టపోయారని,కౌలు రైతుల పరిస్థితి ఇంకా దారుణమని అన్నారు.ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 30000అందించాలని, కౌలు రైతులకు ఎకరాకు 50000 నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.

రైతులను ముంచిన భారీ వర్షాలు…

రైతులను ముంచిన భారీ వర్షాలు

◆:- పూర్తిగా దెబ్బతిన్న పత్తి పంట

◆:- ప్రభుత్వం పంట నష్టపరిహారం అందించాలి:

◆:- బిఆర్ఎస్ నాయకులు ఈదులపల్లి మహమ్మద్ సుల్తాన్ సలావుద్దీన్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ప్రజలు భారీ వర్షాల నేపథ్యంలో అప్రమ త్తంగా ఉండాలని సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల ఈదులపల్లి బిఆర్ఎస్ సీనియర్ నాయకులు మహమ్మద్ సుల్తాన్ సలావుద్దీన్ అన్నారు. ఎడతెరిపి లేకుంట కురుస్తున్న వర్షాల వల్ల ప్రజలు బయటికి రావొద్దని, ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులు దాటి ప్రాణాలను రిస్క్ లో పెట్టొద్దని అన్నారు. సాధ్యమైనంత వరకు వాగుల ప్రవాహం ఆగిన తర్వాతనే దాటాలని కోరారు. అదేవిదంగా నిలకడ లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల మండలంలోని పంటలు అన్ని పూర్తిగా పాడయ్యాయని, రైతులు చాలా నష్ట పోయారని, కౌలు రైతుల పరిస్థితి ఇంకా దారుణమని అన్నారు. ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.30 వేలు అందించాలని, కౌలు రైతులకు ఎకరాకు రూ.50 వేలు నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.

రోడ్డు పక్కనే అతి పెద్ద గుంతలు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-19T135203.980.wav?_=2

 

రోడ్డు పక్కనే అతి పెద్ద గుంతలు
అదుపు తప్పితే ప్రమాదమే

రాయికల్, సెప్టెంబర్ 19, నేటి ధాత్రి,:

 

రాయికల్ మండలంలోని కట్క పూర్ నుండి జగిత్యాల వెళ్లే రోడ్డు మార్గంలో విరాపూర్ గ్రామ పరిధిలో రోడ్లు కు గుంతలు ఏర్పడ్డాయి ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గతంలో ఉన్న దానికంటే అతిపెద్దగా గుంతలు రోడ్డుకు పక్కనే ఏర్పడడంతో వాహన చోదకులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది గతంలో ఇదే ప్రదేశంలో ఓ వాహన ప్రమాదం జరిగి మృతి చెందిన సంగతి అందరికీ తెలిసింది అలాంటి దారణలు మళ్లీ పున వృతం కాకూడదు అంటే రోడ్డు రవాణా అధికారులు సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకొని వాహన చోదకు లకు ప్రమాదంగా మారిన ఈ గుంతలను తక్షణమే పూడ్చ వలసిందిగా ప్రజలు కోరుతున్నారు
ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి ఈ సమస్యలు తీర్చాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు

దిగులు చెందుతున్న పత్తి రైతన్నలు…..

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-15T120400.188.wav?_=3

 

దిగులు చెందుతున్న పత్తి రైతన్నలు…..!

◆:- భారీ వర్షాలకు పంటకు నష్టం…..

◆:- ఎర్రబారుతున్న పత్తి…..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

భారీ వర్షాలకు పత్తి రైతులు నష్టపోతున్నారు. వేల రూపాయలు పెట్టి సాగు చేసిన పత్తి పంట చేతికి వచ్చే సమయంలో దెబ్బ తిన్నది. ప్రారంభంలో పత్తి పంట ఆశాజనకంగా ఉండడంతో రైతులకు సంబరపడ్డారు. కానీ పంట ఏర్పుగా పెరిగే సమ యంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు పత్తి పంట దెబ్బతినడంతో పత్తి రైతన్నలు దిగులు
చెందుతున్నారు.

మండల పరిధిలో..

 

 

 

నుంచి మండలంలో కొన్ని సంవత్సరాల రైతులు అధిక విస్తీర్ణంలో పత్తి సాగు చేస్తున్నారు. మండలంలో 33 వేల ఎకరాల్లో పత్తి సాగైనట్లు అధికారులు తెలిపారు. వర్షం ఎక్కువైనా కొంతమేర పంట తట్టుకుంటుందని ఉద్దేశంతో అన్నదాతలు పత్తి పంట సాగుకు మొగ్గు చూపారు. వర్షాలు
అశజనకంగా ఉండటంతో ప్రారంభంలో ప్రతి చేనుకు ఆశ జనకంగా ఉండేది. పంట ఎక్కువగా పెరగడంతో దిగుబడులపై ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల గత 15 రోజుల నుంచి భారీ వర్షాలు కురవడంతో అంత బాగా దెబ్బతిన్నది. మండలం లోని పత్తి పంటలు ఎక్కువగా నష్టం వాటిల్లింది.

ఎర్రబారిన పత్తి పంట

భారీ వర్షాల వల్ల పంట ఎరుపు రంగ మారుతుంది. పొలాల్లో నీరు చేరి పంట దెబ్బతింటుంది. ఇప్పటికే ఎకరాకు 15 వేల రూపాయలు ఖర్చు చేసిన రైతులు ఉన్న పంటను కాపాడుకునేందుకు అదనంగా రూ.10 వేలు ఖర్చు చేయాల్సిన పరిస్థితిలో ఏర్పడ్డాయి. మొక్కల్లో బలం లేక దిగుబడి పూర్తిగా తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. కౌలు రైతులు చేతి నుంచి డబ్బులు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

ఎకరానికి రూ.15వేలు ఖర్చు చేశాం

◆:- మొహమ్మద్ సుల్తాన్ సలావుద్దీన్, పత్తి రైతు

ఏడెకరాల్లో పత్తి సాగు చేశా. పంట కోసం భారీగా పెట్టుబ డులు పెట్టి ఎకరానికి రూ.15 వేలు చొప్పున ఖర్చు చేశాను. ఇంకా రసాయన మందులను పిచికారి చేయాలి, కలుపు తీయడం చేయాల్సి ఉంది. ఎకరాకు ఇంకా రూపాయలు 10వేల వరకు ఖర్చు చేయాల్సి ఉంది. పెట్టుబడులు పెట్టిన తిరిగి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఎకరానికి కనీసం 10శాతం దిగుబడి వస్తాయి అనుకున్నాము. కానీ సగం కూడా వచ్చే అవకాశాలు లేవు. ప్రభుత్వం పత్తి పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి.

పిడుగుపాటుకు ఎద్దు మృత్యువాత…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-12T134110.894.wav?_=4

 

పిడుగుపాటుకు ఎద్దు మృత్యువాత

 

నడికూడ,నేటిధాత్రి:

 

https://youtu.be/P-tFvsSUVDg?si=l59BVy67t8lI2R8x

 

మండలంలోని కౌకొండ గ్రామంలో గురువారం సాయంత్రం ఉరుములు, మెరుపుల వర్షంతో పిడుగు పడి ఓ ఎద్దు మృత్యువాత పడింది,మరో ఎద్దు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది.స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి,కౌకొండ గ్రామానికి చెందిన రైతు ఓదెల భాస్కర్ తన రెండు ఎడ్లను వర్షం కురుస్తుందని రాత్రి సమయంలో పశువులకు మేత వేసి పాకలో కట్టేశారు, ఈదురు గాలులతో కూడిన వర్షం ప్రారంభమైంది, ఉరుముల మెరుపులతో పెద్ద శబ్దంతో ఎడ్ల సమీపంలో పిడుగు పడింది.ఈ ప్రమాదంలో ఒక ఎద్దు అక్కడికక్కడే మృత్యువాత పడింది, మరో ఎద్దు తృటిలో ప్రాణాపాయం తప్పింది.కాగా మృత్యు వాద పడిన ఎద్దు విలువ రూ.95వేలు ఉంటుందని మాజీ సర్పంచ్ అల్లె శ్రీను తెలిపారు. పేద కుటుంబానికి చెందిన రైతు భాస్కర్ ను ప్రభుత్వం ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని కోరారు.

ఝాన్సీ లింగాపూర్‌లో టార్ప్లిన్ పంపిణీ..

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-12T124555.486.wav?_=5

 

ఝాన్సీ లింగాపూర్‌లో టార్ప్లిన్ పంపిణీ..

వర్షంలో ఇల్లు కూలి ఇబ్బందులు..

రామాయంపేట సెప్టెంబర్ 12 నేటి ధాత్రి (మెదక్)

 

https://youtu.be/P-tFvsSUVDg?si=1meRL81t9whuSFKi

 

 

రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ గ్రామానికి చెందిన తుడుం జీవన్ కుమార్ కుటుంబం ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఇల్లు కూలిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. నిన్న రాత్రి మరోసారి వర్షం కురవడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ఇది తెలుసుకున్న
సానీక్ష ఫౌండేషన్ ముందడుగు
పేద కుటుంబం పరిస్థితిని గమనించిన సానీక్ష ఫౌండేషన్ అధ్యక్షుడు శివ తక్షణమే స్పందించారు. కుటుంబ అవసరాలపై స్థానికులు సమాచారం అందించగా, శివ స్వయంగా ముందుకు వచ్చి సహాయం కల్పించే ప్రయత్నం ప్రారంభించారు.
ఈ సందర్భంగా హైదరాబాద్‌కు చెందిన దాతలు రాజశేఖర్ రెడ్డి, మేఘన నండూరి (ఇక్షణ ఫౌండేషన్) సానుభూతితో స్పందించారు. వారి సహకారంతో శుక్రవారం టార్ప్లిన్ పంపిణీ చేసి బాధిత కుటుంబానికి అందజేశారు.
ఈ కార్యక్రమంలో సానీక్ష ఫౌండేషన్ అధ్యక్షుడు శివతో పాటు కాంగ్రెస్ యువ నాయకుడు నవీన్ రెడ్డి, సభ్యులు శ్రీకాంత్, బాధితుడు తుడుం జీవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
గ్రామ ప్రజలు మాట్లాడుతూ ఈ సహాయం పేదలకు నిజమైన అండగా నిలుస్తుంది. ఇలాంటి సమయంలో దాతలు ముందుకు రావడం అభినందనీయం అని తెలిపారు.

వరద,ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మాజీ మున్సిపల్ వైస్ చైర్మన…

వరద,ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మాజీ మున్సిపల్ వైస్ చైర్మన
.
వనపర్తి నేటిదాత్రి .

 

 

మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ భారీవర్షాలకు వరదతో ముంపుకు గురైన లోతట్టు రాజీవ్ గృహ కల్ప ఎస్. సి,ఎస్.టి వసతి గృహాలు,జంగిడిపురం,భగీరథ కాలనీ వెంగల్ రావు కాలనీ తదితర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మర్రికుంట చెరువు అలుగు పారడం,పీర్లగుట్ట నుంచి వచ్చిన వరదలతో రాజీవ్ గృహ కల్పలో మోకాళవరకు నీళ్లు చేరడంతో ప్రజలను అప్రమత్తం చేసి మిగతా ప్రాంతాలంలో నిలిచిన నీటిని మున్సిపల్ సిబ్బందితో సహాయక చర్యలు చేపట్టడం జరిగిందని వివరించారు. ఈ రోజు అతిభారీ వర్షాలు ఉండడం వల్ల పట్టణంలోని లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు అదేవిధంగా రాజీవ్ గృహ కల్పలో ఫస్ట్ ఫ్లోర్ ఇళ్ల లో కి వరద నీరు రావడంతో వార్డు ప్రజలు మాజీ వైస్ చైర్మన్ దృష్టి కి తెచ్చారు వెంటనే అధికారులు లోతట్టు ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. వైస్ చైర్మన్ వెంట బీ ఆర్ ఎస్ కార్యకర్తలు ప్రజలు ఉన్నారు ఈసందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ బారి వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వనపర్తి పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు

33 వ వార్డు లోబారి వర్షానికి ఒరిగిన కరెంటు స్థంభం…

33 వ వార్డు లోబారి వర్షానికి ఒరిగిన కరెంటు స్థంభం

వెంటనే స్పందించిన మాజీ కౌన్సిలర్ తిరిమాల్
తప్పిన ప్రమాదం
వనపర్తి నేటిదాత్రి .

 

 

 

జిల్లా కేంద్రంలోని వల్లభ నగర్ రాష్ట్ర ప్రణాళిక సంఘము వైస్ చైర్మన్ జి చిన్నారెడ్డి ఇంటి దగ్గర 33 వ వార్డులో కుండపోతగా కురిసిన వర్షానికి కారెంట్ స్తంభం ఒరిగి ప్రమాదానికి గురై కిందికి ఒరగడం చూసిన వార్డు ప్రజలు మాజీ కౌన్సిలర్ ఉంగ్లo తిరుమల్ కి సమాచారం ఇచ్చారు వెంటనే విద్యుత్ అధికారులను అప్రమంత్తo చేసి జె సి బి తో కరెంట్ స్థంభం ప్రమాదానికి గురికాకుండా సహాయం అందించారు ఈమేరకు విద్యుత్ అధికారుల కు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ తిరిమాల్ కు ఒక ప్రకటన లో కృతజ్ఞతలు తెలిపారు

భారీ వర్షాలతో జహీరాబాద్లో పంట నష్టం, ప్రజల ఆవేదన…

భారీ వర్షాలతో జహీరాబాద్లో పంట నష్టం, ప్రజల ఆవేదన

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ఆగస్టులో కురిసిన భారీ వర్షాలతో రాష్ట్రంలో ఆస్తి, ప్రాణ నష్టం జరిగిన నేపథ్యంలో, బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో జహీరాబాద్లో నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలు జనాలను విసుగు చెందిస్తున్నాయి. గురువారం ఝరాసంగం మండలంలో ఉదయం 8 గంటల నుంచే వర్షం కురుస్తుండటంతో, కోతకు వచ్చిన పంటలను ధాన్యంగా మార్చే ప్రక్రియకు అంతరాయం కలిగి, చేతికొచ్చిన పంట కళ్ళముందే నాశనం అవుతుంటే చూసి భరించలేమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వినాయక నిమజ్జనానికి భద్రతా సూచనలు – ఎస్సై రాజేష్..

నిమజ్జన సమయాల్లో జాగ్రత్తలు పాటించాలి..

ఎస్సై రాజేష్

నిజాంపేట: నేటి ధాత్రి

వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని నిజాంపేట స్థానిక ఎస్సై రాజేష్ పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారీ వర్షాల కారణంగా గ్రామాల్లో చెరువులు, కుంటలు అధికంగా నిండాయని నిమజ్జన సమయంలో మండప నిర్వహకులు అప్రమత్తంగా ఉండాలన్నారు. కరెంటు వైర్ల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. చిన్నపిల్లలను చెరువులు కుంటల వద్దకు తీసుకువెళ్లొద్దన్నారు. శాంతియుత వాతావరణం లో పండగలు నిర్వహించుకోవాలని సూచించారు. అత్యవసర సమయంలో 100 కు డయల్ చేయాలన్నారు

భారీ వర్షాల తర్వాత రైతులకు నష్టపరిహారం మాణిక్ రావు…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-02T135416.170-1.wav?_=6

కరువు మండలంగా ప్రకటించాలి’

◆:- టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నుల్క మానిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండలంలో వివిధ

 గ్రామాలలో గత కొన్ని రోజుల నుండి భారి నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పెసర మినుము, పత్తి, సోయా, మొక్కజొన్న చాలావరకు నీట మునిగాయి. వర్షాల ప్రభావంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీర్ఘకాల సగటులో 109% వర్షపాతం నమోదయింది. ఆగస్టులోనే రికార్డు స్థాయిలో వానలు కురిశాయి.

TRS party senior leader Nulka Manik Rao

సాధారణం కంటే 75% వర్షపాతం నమోదయింది .కావున తెలంగాణ ప్రభుత్వం మండలంలోని ప్రతి గ్రామాన్ని ఏ.ఈ.ఓ, ద్వారా సర్వే చేయించి అన్ని పంటలకు నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని, మాణిక్ రావు డిమాండ్ చేశారు.

పోలీసుల సేవలకు సలామ్..

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-30T122317.302.wav?_=7

పోలీసుల సేవలకు సలామ్..!!

◆:- ప్రజల క్షేమమే ఎస్ఐ క్రాంతి కుమార్ పటేల్ లక్ష్యం

◆:- వరుణుడి బీభత్సం.. సహాయ కార్యక్రమాలలో పోలీసుల కృషి

◆:- మండలంలో సుడిగాలి పర్యటన, ప్రజలకు సలహాలు తగు సూచనలు

◆:- ముందస్తు చర్యల్లో ఎస్ఐ సేవలు అభినందనీయం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ఒక్కసారిగా వరుణుడు బీభత్సం సృష్టించడంతో ప్రజలు, రైతులు అతలాకు తలమయ్యారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి ఇటు వరద నీటిలో మునిగిపోయిన పంట పొలాలు, అటు వర్షానికి కూలిన ఇండ్లు దీంతో భారీ నష్టానికి గురైన ప్రజలు, రైతులు.

 

అదేవిధంగా చెరువు కుంటలు నిండి రోడ్లపై ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ క్రమంలో ఝరాసంగం ఎస్ఐ క్రాంతి కుమార్ పటేల్ తన సిబ్బందితో కలిసి మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. వరద నీటిలో చిక్కుకున్న ప్రజలను కాపాడటమే కాకుండా భారీ వర్షానికి ఇండ్లలోకి ప్రవహిస్తున్న నీటిని చూసి భయాందోళన చెందుతున్న ప్రజలకు ధైర్యాన్ని కల్పిస్తూ..

 

 

వారిని కూడా కాపాడి ముందస్తు చర్యలు చేపట్టారు. అంతేకాకుండా చెరువు, కుంటలు నిండి రోడ్లపై భారీగా నీరు వరదల ప్రవహించడంతో విషయం తెలుసుకున్న ఎస్ఐ సంఘటన స్థలానికి చేరుకొని ప్రజలకు, రైతులకు తగు సూచనలు,సలహాలు ఇస్తూ రాకపోకలను నిలిపివేశారు. ప్రజల క్షేమమే తన బాధ్యతగా తీసుకొని ఎస్ఐ క్రాంతి కుమార్ పటేల్ ఝరాసంగం మండల జిర్లాపల్లి ప్యాలారం దేవరంపల్లి ఎల్గోయి కృష్ణాపూర్ పోటీపల్లి గ్రామాలలో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పర్య టించారు. ప్రజలు భారీ వర్షాలు ఉండడంవల్ల అప్ర మత్తంగా ఉండాలని తగు జాగ్రత్తలు పాటించాలని ఇటు రైతులను అటు ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్య పరుస్తూ ఎలాంటి భయాందోళన చెందవద్దని పోలీసుల కృషి, అండ ఉంటుందని ధైర్యాన్ని ఇస్తూ ఎస్ఐ క్రాంతి కుమార్ పటేల్ చేస్తున్న సేవలకు హాట్సాఫ్ అంటూ పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. మహిళా అని లెక్కచేయకుండా తన విధి నిర్వహణ బాధ్యతగా నిర్వహిస్తూ ప్రజలకు అండగా నిలిచిన ఎస్ఐ క్రాంతి కుమార్ పటేల్ సలాం కొడుతున్నారు.

 

 

ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు : ఎస్ఐ క్రాంతి కుమార్ పటేల్

భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని ఎస్ఐ క్రాంతి కుమార్ పటేల్ అన్నారు.ఈ క్రమంలో లోతట్టు ప్రాంతాలకు ప్రజలు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు చెరువు కుంటలు నిండి రోడ్లపై ప్రవహిస్తున్న వరదనీటి ప్రమాదం ఉన్నందున రాకపోకలు నిలిపివేశామని అదేవిధంగా అత్యవసర సమయాల్లో ప్రజలు బయటకు వెళ్లాలని ప్రజలకు ఎప్పటికప్పుడు తగు సూచనలు సలహాలు ఇస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండేల చర్యలు చేపడుతున్నా మని అన్నారు.

నిజాంపేటలో సుమారు వెయ్యి…

నిజాంపేటలో సుమారు వెయ్యి
ఎకరాలు పంట నష్టం..
• మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి

నిజాంపేట: నేటి ధాత్రి

గత రెండు రోజుల కురిసిన భారీ వర్షాలకు నిజాంపేట మండల వ్యాప్తంగా సుమారు 1000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని బచ్చురాజుపల్లి, రజక్ పల్లి, నందిగామ, జడ్చర్ల తాండ గ్రామాల్లో పంటను పరిశీలించడం జరిగిందన్నారు. మౌనిక శ్రీలత, రమ్య ఉన్నారు.

రోడ్డు మరమ్మత్తులు చేపట్టిన బిజెపి నాయకులు…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-29T150239.383.wav?_=8

 

రోడ్డు మరమ్మత్తులు చేపట్టిన బిజెపి నాయకులు

బీజేపీ మండల అధ్యక్షుడు ఊర నవీన్ రావు

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండల లో ఊర నవీన్ రావు అధ్యక్షుడి ఆధ్వర్యంలో రోడ్డు పైనా గుంతలు పుడ్చడం కార్యక్రమం
బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షం కు ఓసి-3బాధిత గ్రామాలు నగరంపల్లి గ్రామం లోని ముసళ్ల కుంట గండి పడి నగరంపల్లి అప్పయ్యపల్లి గ్రామాల మధ్య రాకపోకలకు ఇబ్బంది కలిగి సీతారాంపూర్, బంగ్లాపల్లి, అప్పయ్య పల్లి నుండీ మండల కేంద్రం లోని పాఠశాలల కు వెళ్లే విద్యార్థులు మరియు వ్యవసాయా పనులకు వెళ్లే రైతులు ఇబ్బందులకు గురి అవుతున్న కారణం గా బీజేపీ కార్యకర్తలు స్వచ్చ భారత్ కార్యక్రమం లో భాగంగా రోడ్డు పై ఏర్పడ్డ గుంతలను పుడ్చారు అనంతరం నవీన్ రావు మాట్లాడుతు సింగరేణి యాజమాన్యం యుద్ధ ప్రతిపదికన రోడ్డు మరమ్మత్తు చర్యలు చేపట్టి ఆయా గ్రామాల మధ్య రాకపోకలు ఇబ్బంది లేకుండా చూడాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమం లో బూత్ అధ్యక్షులు భూక్యా హరిలాల్, ఇనుగాలా మొగిలి నాయకులుమామిడిపల్లి మల్లన్న, మైదాం శంకర్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు

అధికారుల నిర్లక్ష్యంతో జలమయం అయిన రోడ్లు…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-29T122912.268.wav?_=9

అధికారుల నిర్లక్ష్యం/ జలమయం అయిన నివాస ప్రాంతాలు రోడ్లు — ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం

◆:- విచ్చల విడిగా వ్యర్థాలను వదులుతున్న అల్లనా

◆:- దుర్గంధం వాసన వదిలిన అల్లనా

◆:- చెరువులను తలపిస్తున్న వెంచర్లు,రోడ్లు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జాహిరాబాద్ నియోజకవరగంలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం తిరిగి పరిశీలించడం జరిగింది ,బారి వర్షాలకు రోడ్లు,వెంచర్ లు అన్ని జలమయం అయ్యాయి వాగులు వంకలు బోర్లి పోతున్నాయి ప్రతిసారి వర్షాలు కురుస్తున్న సమయంలో ఇదే అదనుగా భావించి అల్లనా పశువదశాల వ్యర్థాలను నాళాలో ప్రవహిస్తున్న నీటిలో వదులుతున్నాడు దింతో చుట్టూ ప్రక్కల దుర్గంధంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు ప్రజలు అనారోగ్యానికి గురి అయ్యే అవకాశాలున్నాయి అల్లనా వ్యర్టాలను వదులుతున్న ప్రదేశాన్ని స్వయంగా పరిశీలించడం జరిగింది

Negligence Leads to Flooded Roads

ఈ వ్యర్థాలు మొత్తం నారింజలో కలిసి నారింజ నీరు మొత్తం కలుషితమవుతున్నది ఈ విషయమై గత జూన్ మాసంలో పొల్యూస్యన్ కంట్రోల్ బోర్డ్ అధికారులకు, ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేసిన నాటి నుండి నేటి వరకు చర్యలు తీసుకున్నది లేదు,అధికారులు అల్లనా యాజమాన్యంతో కుమ్ముక్కై ఏ చర్యలు తీసుకోవడం లేదు,మరియు నాళాలు కాలువలు మళ్లించి,చిన్నవిగా చేసి అధికార పార్టీ నాయకులు వ్యాపారులు అక్రమంగా వెంచర్ లు ఏర్పాటు చేయడం జరిగింది ఆ అక్రమ వెంచర్ ల లో మొత్తం నీరు నిలబడి చేరువులను తలపిస్తున్నాయి గతంలోనే అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది వారు స్పందిస్తే ఇలా జరిగేదికాదు ప్లాట్లు కొనే వారు క్షుణ్ణంగా పరిశీలించి కొనుగోలు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి దీనికి కారణం ఇరిగేషన్ అధికారుల అసమర్థతే, మరియు

Negligence Leads to Flooded Roads

ఈ బారి వర్షాలకు రోడ్లపై బారి లోతుగా నీరు నిలబడి అల్గోల్,మరియు రాయిపల్లి డి గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి,నారింజ పూర్తిగా నిండుకొని గేట్లు చేడిపోయి సరిగ్గా తెరుచుకోనందున నీరు వెనక భాగాన నిలబడి పంటపొలాల్లో నీరు నిలబడి పంట నష్టం జరుగుతున్నది గేట్లపై నుండి నిరంత వృధాగా కర్ణాటకకు తరలిపోతున్నది అధికారులు,ప్రభుత్వం చర్యలు తీసుకొని ఉంటే నీటిని కపడుకోనేవారం,ఇప్పటి కైనా అధికారులు,ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్,ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శంకర్,శికారి గోపాల్,చల్లా శ్రీనివాస్ రెడ్డి,సి.యం. విష్ణువర్ధన్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు,

వరద బాధిత కుటుంబానికి ఆర్ఐ సాయం…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-29T122050.539-1.wav?_=10

వరద బాధిత కుటుంబానికి ఆర్ఐ సాయం

జహీరాబాద్ నేటి ధాత్రి:

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-29T122050.539.wav?_=11

ఈ విషయాన్ని తెలుసుకున్న న్యాల్కల్ తహశీల్దార్ ప్రభు ఆదేశాల మేరకు రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్యామ్ రావు బాధిత కుటుంబాన్ని పరిశీలించారు. వారిని తాత్కాలికంగా గ్రామ పంచాయతీ కార్యాలయానికి తరలించారు. అంతేకాకుండా, ఆహారం, కొంత నగదు సహాయం అందజేసి ఆదుకున్నారు

బిజెపి ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్…

బిజెపి ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్

బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు ఊర నవీన్ రావు

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండల కేంద్రంలోని భూలక్ష్మి వద్ద బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు ఊర నవీన్ రావ్ ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహిచి దారి వెంట ఉన్న పిచ్చి మొక్కలను తొలగించడం జరిగింది
అలాగే నిన్న విపరీతంగా కురిసిన భారీ వర్షానికి గణపురం మండల కేంద్రంలోని గుడివాడ ప్రాంతాల్లో చాలా ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరుకోవడం జరిగింది ఇది కేవలం ఊర కాలువను శుభ్రం చేయకుండా చెత్తాచెదారం పిచ్చి మొక్కలు పేరుకోవడం వల్ల వచ్చిన వరద నీరు కిందకు పోకపోవడం వలన ఇళ్లలోకి చొరబడడం జరిగింది అది తెలుసుకున్న బిజెపి పార్టీ బృందం ఆ ప్రాంతాన్ని సందర్శించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారితో ఫోన్లో మాట్లాడి సమస్యను మళ్ళీ పునరావృతం కాకుండా త్వరితగతిన పరిష్కరించాలని కోరడం జరిగింది లేనిపక్షంలో నిరసన కార్యక్రమం చేస్తామని చెప్పడం జరిగిందిఈ కార్యక్రమంలో బీజేవైఎం కలాశాలాల విభాగం రాష్ట్ర కన్వీనర్ మంద మహేష్, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి చెలుమల్ల ప్రవీణ్ కుమార్, బిజెపి మండల ఉపాధ్యక్షులు మధాసు మొగిలి, డాకురి కృష్ణ రెడ్డి,బిజెపి జిల్లా నాయకులు,దుగ్గుషెట్టి.పూర్ణ చందర్ , మండల మహిళా నాయకురాలు బొల్లం అరుణ,బిజెపి మండల నాయకులు మంధల రాజు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version