వైద్యులు లేని ఆరోగ్య శిబిరాలు ఎందుకు…?

వైద్యులు లేని ఆరోగ్య శిబిరాలు ఎందుకు…?

ఆరోపిస్తున్న ప్రజలు…

వైద్యులు లేని శిబిరాలకు రావడానికి విముఖత వ్యక్తం చేస్తున్న ప్రజలు…

కింది స్థాయి ఆరోగ్య కార్యకర్తల చేత మాత్రల పంపిణీతో ఆరోగ్యం కుదుటపడటం లేదని వాపోతున్న ప్రజలు…

రాకపోకలు సాగిస్తూ స్థానికంగా నివాసం ఉండకుండానే అలవెన్స్ తీసుకుంటున్న వైనం…

సమయపాలన పాటించని వైద్య ఆరోగ్య సిబ్బంది…

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-29T122412.265.wav?_=1

నేటి ధాత్రి-గార్ల:-

ముల్కనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని చిన్నకిష్టాపురం, పెద్దకిష్ట పురం,గుంపెళ్ళగూడెం తదితర గ్రామాలలో వైద్యులు లేకుండానే అర్థం-పర్థం లేని ఆరోగ్య శిబిరాలు కొనసాగుతున్నాయి. వైద్యులు లేని ఆరోగ్య శిబిరాలు ఎందుకు…? అని ఆరోపిస్తున్న అనారోగ్య పీడితులు.వర్షాకాల సీజన్ లో సీజనల్ వ్యాధులు తరుముకొస్తున్న వేళ స్థానికంగా ఉండి ప్రజలకు అందుబాటులో ఉంటూ,వైద్య సేవలు అందించవలసిన వైద్యులు,వైద్య సిబ్బంది సుదూర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తూ స్థానికంగా ఉండకుండానే ఏజెన్సీ అలవెన్సులు తీసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ సుదూర పట్టణ ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తూ, సకాలంలో వైద్యం అందించకపోవడంతో అనారోగ్య బాధితులు మంచాలు పట్టారు.గ్రామాల్లో నిర్వహిస్తున్న వైద్య శిబిరాలకు వైద్యులు రాకుండానే క్రింది స్థాయి ఆరోగ్య కార్యకర్తల చేత మాత్రలు పంపిణీ చేయడంతో ప్రజల ఆరోగ్యం కుదుటపడటం లేదని వాపోతున్నారు.సమయపాలన సైతం పాటించని వైద్య ఆరోగ్య సిబ్బంది పట్ల ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.డి ఎం హెచ్ ఓ,జిల్లా ఉన్నత అధికారులు చొరవ తీసుకొని ముల్కనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పై దృష్టి సారించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

జమ్మికుంటలో వికాస తరంగిణి మహిళా ఆరోగ్య

 

జమ్మికుంటలో వికాస తరంగిణి మహిళా ఆరోగ్య వికాస్ కార్యక్రమం

జమ్మికుంట (నేటిధాత్రి)

ఈరోజు జమ్మికుంట లో అమ్మ ఆరోగ్యమే సమాజ సౌభాగ్యం అనే నిదానంతో వికాస తరంగిణి ఆరోగ్య వికాస్ ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించడం జరిగింది డాక్టర్ ఎం మౌనిక పద్మ సారిక గారి ఆధ్వర్యంలో 108 మందికి గర్భాశయ ముఖ ద్వారం మరియు మహిళల ఛాతి పరీక్షలు 108 మందికి ఉచిత పరీక్షలు చేసి మందులు ఇవ్వడం జరిగింది . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు గౌతమ్ రావు. బచ్చు వీర లింగం. పుల్లూరి ప్రభాకర్. హరికృష్ణమాచార్యులు. కొల్లూరు శ్రీనివాస్.అంతం రాజిరెడ్డి.ఎదులాపురం వెంకటేష్. శీలం శ్రీనివాస్.ఎలివేణి సమ్మయ్య. మహిళా వికాస అధ్యక్షులు కర్ర రజిత దేవి. వికాస తరంగిణి జమ్మికుంట శాఖ సభ్యులు మహిళా సభ్యులు పాల్గొని విజయవంతం చేశారు.

మున్సిపల్ సిబ్బందికి సీజనల్ మరియు హెల్త్ కిట్స్ పంపిణీ.

మున్సిపల్ సిబ్బందికి సీజనల్ మరియు హెల్త్ కిట్స్ పంపిణీ

.వర్షాకాలంలో 16వ డివిజన్ ను పరిశుభ్రంగా ఉంచాలి.

సుంకరి మనిషా శివకుమార్.
16వ డివిజన్ కార్పొరేటర్

కాశిబుగ్గ నేటిధాత్రి.

వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధి 16వ డివిజన్ లోని పారిశుద్య పనులు నిర్వహిస్తున్న మున్సిపల్ సిబ్బందికి స్థానిక 16వ డివిజన్ కార్పొరేటర్ సుంకరి మనీషా శివకుమార్ సీజనల్ మరియు హెల్త్ కిట్స్ అందచేయడం జరిగింది.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ నిరంతం డివిజన్ ను పరిశుభ్రంగా ఉంచేందుకు ఎంతగానో శ్రమిస్తున్న సిబ్బంది అనారోగ్య ఇబ్బందులకు గురి కాకుండా ఉండేందుకు కార్పొరేషన్ హెల్త్ కిట్స్ అందించడం ద్వారా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని అన్నారు.అదే విధంగా వర్షా కాలాన్ని దృష్టిలో పెట్టుకొని సీజనల్ కిట్స్ అందించడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపాలిటీ సిబ్బంది కార్పొరేటర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ జవాన్ లు సిబ్బంది పాల్గొన్నారు.

అయినా.. పన్ను ప్రయోజనాలున్నాయ్‌..

 

అయినా.. పన్ను ప్రయోజనాలున్నాయ్‌

ఏ వ్యక్తికైనా ఆరోగ్య బీమా తప్పనిసరి. దేశంలో హెల్త్‌కేర్‌ వ్యయాలు ఏటా 14ు వంతున పెరుగుతున్నాయని అంచనా. అయితే వయోవృద్ధులు లేదా సీనియర్‌ సిటిజన్లు పెరుగుతున్న వయసు, ముందు నుంచి ఉన్న వ్యాధుల కారణంగా…

ఆరోగ్య బీమా లేదా..?

ఏ వ్యక్తికైనా ఆరోగ్య బీమా తప్పనిసరి. దేశంలో హెల్త్‌కేర్‌ వ్యయాలు ఏటా 14ు వంతున పెరుగుతున్నాయని అంచనా. అయితే వయోవృద్ధులు లేదా సీనియర్‌ సిటిజన్లు పెరుగుతున్న వయసు, ముందు నుంచి ఉన్న వ్యాధుల కారణంగా అందుబాటు ప్రీమియంలలో ఆరోగ్య బీమా పొందలేక పోతున్నారు. ఈ కారణంగా ఆస్పత్రి, వైద్య పరీక్షలు, డాక్టర్‌ కన్సల్టేషన్‌ వ్యయాలన్నీ తాము పొదుపు చేసుకున్న సొమ్ము నుంచే చెల్లించాల్సి వస్తోంది. ఇలాంటి అంశాలన్నీ దృష్టిలో ఉంచుకునే ఆదాయపు పన్ను చట్టం 80డి సెక్షన్‌.. 60 సంవత్సరాల వయసు పైబడిన వారందరికీ ఆరోగ్య సంబంధిత వ్యయాలపై కొన్ని రాయితీలు అందిస్తోంది. పాత ఆదాయపు పన్ను విధానాన్ని ఎంపిక చేసుకున్న వారికి మాత్రమే ఈ ప్రయోజనాలు పరిమితం. దీని కింద ఆరోగ్య బీమా పాలసీ లేకపోయినా సీనియర్‌ సిటిజన్లు ఆరోగ్య సంబంధిత వ్యయాలపై పన్ను మినహాయింపులు కోరవచ్చు.
80డి సెక్షన్‌ ఏమిటి?

పన్ను చెల్లింపుదారుల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన ఈ సెక్షన్‌ ఆరోగ్య బీమా లేదా ఆరోగ్య సంబంధిత వ్యయాలపై రాయితీలు, మినహాయింపులు అందిస్తుంది. తద్వారా పన్ను చెల్లింపు మొత్తం ఆదా చేస్తుంది.

  • ఈ సెక్షన్‌ కింద పన్ను చెల్లింపుదారు తనతో పాటుగా కుటుంబ సభ్యుల (భార్య లేదా భర్త, తనపై ఆధారపడిన సంతానం) ఆరోగ్య సంరక్షణకు చేసిన వ్యయాలపై లేదా ఆరోగ్య బీమా ప్రీమియంపై ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్ఠంగా రూ.25,000 వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు.
  • దీనికి తోడు వయోవృద్ధులైన తల్లిదండ్రుల కోసం చేసిన ఆరోగ్య సంబంధిత వ్యయాలు, ఆరోగ్య బీమా ప్రీమియంపై మరో రూ.25,000 పన్ను మినహాయింపు క్లెయిమ్‌ చేయవచ్చు.
  • అలాగే ప్రీమియం చెల్లిస్తున్న వ్యక్తి (స్వయంగా లేదా కుటుంబ సభ్యుల కోసం) సీనియర్‌ సిటిజన్‌ అయినట్టయితే ఈ మినహాయింపు పరిమితి గరిష్ఠంగా రూ.50,000 వరకు ఉంటుంది. అంటే మీరు సీనియర్‌ సిటిజన్‌ అయి ఉండి మీ కోసం, మీ తల్లిదండ్రుల కోసం కూడా ప్రీమియం చెల్లిస్తున్నట్టయితే రూ.1 లక్ష వరకు ఆదాయపు పన్ను మినహాయింపునకు క్లెయిమ్‌ చేసుకోవచ్చు.
  • ప్రివెంటివ్‌ హెల్త్‌ చెకప్‌ చెల్లింపుల (గరిష్ఠంగా రూ.5,000) కోసం చేసే వ్యయాలైతే నగదు రూపంలో చెల్లించవచ్చు. మిగతా వ్యయాలేవైనా నగదేతర రూపంలోనే చెల్లించాల్సి ఉంటుంది.

బీమా కవరేజీ లేని వారి మాటేమిటి?

ఆరోగ్య బీమా కవరేజీ లేని సీనియర్‌ సిటిజన్లకు కూడా ఈ సెక్షన్‌ రాయితీలు కల్పిస్తోంది. అలాంటి వారు వైద్య వ్యయాలపై ఏడాదికి గరిష్ఠంగా రూ.50,000 వరకు మినహాయింపులు క్లెయిమ్‌ చేసుకోవచ్చు. ఈ వ్యయాలను మీ పిల్లలు భరించినట్టయితే వారు కూడా పన్ను మినహాయింపులు పొందేందుకు అర్హులవుతారు. కేవలం 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు మాత్రమే ఈ ప్రయోజనాలు పరిమితం అన్న విషయం గుర్తుంచుకోవాలి. అంతే కాదు…నూతన, సరళీకృత ఆదాయపు పన్ను విధానం ఎంచుకున్న వారికి ఇది వర్తించదు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన డాక్టర్ రవీంద్ర నాయక్

గణపురం నేటి ధాత్రి

గణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డాక్టర్ రవీంద్రా నాయక్ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఆకస్మిక తనిఖీ చేశారుడైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ రవీంద్ర నాయక్ ని భూపాలపల్లి జిల్లా టీఎన్జీవో అధ్యక్షుడు బూరుగు రవి కలిశారు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ రవీంద్ర నాయక్ ని సన్మానించినారు
రాష్ట్రంలో ఉన్న హెల్త్ అసిస్టెంట్ అందరినీ ఫార్మసిస్టులను ల్యాబ్ టెక్నీషియన్లను రెగ్యులర్ అయిన వారందరినీ సర్వీస్ రెగ్యులరైజేషన్ గురించి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ
రెగ్యులర్ చేయాలని
సకాలంలో జీతాలు ఇవ్వాలని వారిని కోరడం జరిగింది మెమోరండం ఇవ్వడం జరిగినది ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా టీఎన్జీవో అధ్యక్షుడు బూరుగు రవి టీఎన్జీవో జిల్లా కార్యదర్శి దశరధ రామారావు మురళీధర్ రెడ్డి టి సత్యనారాయణ శ్రీదేవి జమాలుద్దీన్ హెల్త్ అసిస్టెంట్లు కాపర్తి రాజు పరమేశ్వర్ గోపి సుధీర్ సతీష్ వేణు ల్యాబ్ టెక్నీషియన్ రజిత పాల్గొన్నారు

ఆరోగ్య సేవలు సద్వినియోగం చేసుకోండి..

‘ఆరోగ్య సేవలు సద్వినియోగం చేసుకోండి’

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ పట్టణంలోని సన్ రోహి ఆసుపత్రికి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం ద్వారా సేవలు అందించేందుకు అనుమతి లభించిందని ఆసుపత్రి ఎండీ డా. సంజీవ్ కుమార్ శుక్రవారం తెలిపారు. వారు మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకంలో ఉన్న రోగాలన్నింటికి ఫ్రీగా తమ హాస్పిటల్ లో నాణ్యమైన చికిత్సలు అందిస్తామన్నారు. త్వరలో తమ ఆసుపత్రికి కేంద్ర ఆరోగ్యశాఖ నుండి ఎన్ఏబీఎస్ గుర్తింపు లభించిందన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య బృందం, తదితరులు పాల్గొన్నారు.

లేబర్ కోడ్ లను రద్దు చేయాలని మెడికల్ .!

లేబర్ కోడ్ లను రద్దు చేయాలని మెడికల్ అండ్ హెల్త్ ఉద్యోగుల నిరసన.

చిట్యాల, నేటిధాత్రి :

దేశ వ్యాప్తగా వామపక్షాల సమ్మెపిలుపు కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయడంతో పాటు, ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులందరినీ పర్మినెంట్ చేయాలి, ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు కనీస వేతనం 26,000 తక్షణమే చెల్లించాలని, ఏజెన్సీ వ్వవస్థను రద్దు పరచాలి కార్పొరేష ఏర్పాటు చెయ్యాలని పలు డిమాండ్లతో ఆల్ రికగ్నైజ్డ్ యూనియన్సు సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగముగా చిట్యాల హాస్పిటల్ ల్లో మద్దతు తెలుపుతూ నిరసన కార్యక్రమం చెయ్యడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలంగాణ మెడికల్ &హెల్త్ ఔట్సోరింగ్ కాంట్రాక్టు రాష్ట్ర ఆర్గనైసింగ్ సెక్రటరీ కట్కూరి నరేందర్ రాష్ట్ర నాయకులు కిషోర్. ఉద్యోగస్థులు రమణ. స్వామి. రఘు. సంధ్య. శ్రీకాంత్. మహేందర్. కళ్యాణ్. రాజేష్ .కుమార్. భిక్షపతి. శంకర్. శశి కుమార్. శారదా. కోమల.తదితరులు పాల్గొన్నారు.

అనేక సమస్యలకు తక్షణ పరిష్కారం.!

అనేక సమస్యలకు తక్షణ పరిష్కారం.! 

 

ఉల్లిపాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. ఇంకా, ఉల్లిపాయలలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి వివిధ వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడతాయి. అయితే, ఉల్లిపాయలే కాదు.. దాని రసం కూడా అనేక ప్రయోజనాలను కలిగిస్తుందని మీకు తెలుసా? ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

 

 

ఉల్లిపాయ రసం అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. జుట్టు పెరుగుదల, చర్మ సంరక్షణ, రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. ఇది యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంది. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. 

 

 

చర్మ సంరక్షణ:

ఉల్లిపాయ రసం చర్మం టోన్‌ను మెరుగుపరుస్తుంది. మచ్చలు, మొటిమలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది చర్మం యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.  

రోగనిరోధక శక్తి:

ఉల్లిపాయ రసం రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఇది ఇన్ఫెక్షన్లు, వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది. ఇది విటమిన్లు, ఖనిజాలకు మంచి మూలం.

జుట్టు పెరుగుదల:

ఉల్లిపాయ రసం జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇది చుండ్రును నివారిస్తుంది. జుట్టు పెరుగుదలకు అవసరమైన సల్ఫర్‌ను అందిస్తుంది. జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.  

 

గుండె ఆరోగ్యం:

ఉల్లిపాయ రసం రక్తపోటును తగ్గించడానికి, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి, రక్తం గడ్డకట్టడాన్ని నివారించడానికి సహాయపడుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. 

రక్తంలో చక్కెర స్థాయిలు:

ఉల్లిపాయ రసం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది మధుమేహం ఉన్నవారికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

జీర్ణక్రియ:

ఉల్లిపాయ రసం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది.  ఉల్లిపాయ రసం శ్వాసకోశ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.

ఎక్కిళ్ళు ఎందుకు వస్తాయో తెలుసా..

 

ఎక్కిళ్ళు ఎందుకు వస్తాయో తెలుసా..

 

మనకు ఎక్కిళ్ళు ఎందుకు వస్తాయి? ఎక్కిళ్ళు తీవ్రమైన వ్యాధికి సంకేతంగా ఉంటాయా? ఈ విషయంపై ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం..

 

 

ఎక్కిళ్ళు అనేది అందరికీ ఏదో ఒక సమయంలో వచ్చే ఒక సాధారణ సమస్య. ఇది అకస్మాత్తుగా ప్రారంభమై కొన్నిసార్లు దానంతట అదే ఆగిపోతుంది. కానీ అది పదే పదే వస్తే ఇబ్బందిగా ఉంటుంది. అయితే, ఎక్కిళ్ళు ఎందుకు వస్తాయో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇది సాధారణ శారీరక ప్రతిచర్యనా లేదా ఇది తీవ్రమైన అనారోగ్యానికి లక్షణమా? దానికి కారణాలు ఏంటి? ఎలా నివారించాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

 

 

 

ఎక్కిళ్ళు ఎందుకు వస్తాయి?

ఎక్కిళ్ళు రావడానికి ప్రధాన కారణం ఇది ఊపిరితిత్తులు, కడుపు మధ్య ఉండే కండరం. ఇది శ్వాస తీసుకోవడంలో సహాయపడుతుంది. ఈ కండరం చికాకు కలిగితే అది అసంకల్పితంగా సంకోచించి ఎక్కిళ్ళకు దారితీస్తుంది. 

 

 

 

ఎక్కిళ్లకు సాధారణ కారణాలు

ఎక్కిళ్లు అనేది ఒక సాధారణ శారీరక ప్రతిచర్య. ఇది అనేక కారణాల వల్ల వస్తుంది. అతిగా తినడం లేదా తొందరపడి తినడం దీనికి ప్రధాన కారణం. ముఖ్యంగా కారంగా ఉండే ఆహారం తినడం వల్ల కడుపులో గ్యాస్ ఏర్పడుతుంది. ఇది డయాఫ్రాగమ్‌ను ప్రేరేపించి ఎక్కిళ్లకు కారణమవుతుంది. దీనితో పాటు సోడా, శీతల పానీయాలు లేదా ఆల్కహాల్ వంటి కార్బోనేటేడ్ పానీయాల వినియోగం కూడా కడుపులో వాపుకు కారణమవుతుంది. ఇది ఎక్కిళ్లకు కారణమవుతుంది. భావోద్వేగ ఒత్తిడి, భయము లేదా వేడి-చల్లని ఉష్ణోగ్రతలో ఆకస్మిక మార్పు కూడా ఎక్కిళ్లకు కారణమవుతుంది.

 

 

 

తేలికపాటి ఎక్కిళ్లను ఆపడానికి సులభమైన మార్గాలు

ఎక్కిళ్లను ఆపడానికి కొన్ని సరళమైన, ప్రభావవంతమైన మార్గాలు ఉన్నాయి. ఎక్కిళ్లు వచ్చినప్పుడు నీళ్లు తాగితే తగ్గిపోతంది. దీనితో పాటు, ఒక టీస్పూన్ చక్కెర లేదా తేనెను నాలుక కింద ఉంచడం వల్ల నరాలు ఉత్తేజమవుతాయి. ఇది ఎక్కిళ్లను తగ్గించడంలో సహాయపడుతుంది.

 

 

ఎక్కిళ్ళు తీవ్రమైన వ్యాధికి సంకేతమా?

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఎక్కిళ్ళు వ్యాధి కాదు. కానీ ఎక్కిళ్ళు ఎక్కువ కాలం కొనసాగితే దానిని నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు. ఎందుకంటే, ఎక్కిళ్ళు అదే పనిగా రావడం అంతర్లీన సమస్యకు సంకేతం కావచ్చు, దీనిని సకాలంలో పరిష్కరించాల్సిన అవసరం ఉంది. దీర్ఘకాలిక ఎక్కిళ్లకు కారణం వాగస్ లేదా ఫ్రెనిక్ నరాలు దెబ్బతినడం లేదా చికాకు కలిగించడం కావచ్చు. డయాఫ్రాగమ్ కండరాలు సజావుగా పనిచేయడానికి ఈ నరాలు అవసరం. కొన్నిసార్లు మెడలో ఉన్న థైరాయిడ్ గ్రంథికి సంబంధించిన సమస్య ఈ నరాలను ప్రభావితం చేయవచ్చు. కాబట్టి, మీకు అదే పనిగా ఎక్కిళ్లు వస్తుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించి సరైన చికిత్స తీసుకోవడం మంచిది.

హెల్త్ హబ్ గా పేరుగాంచిన వరంగల్ జిల్లాలో..

 

హెల్త్ హబ్ గా పేరుగాంచిన వరంగల్ జిల్లాలో వ్యాధులను నిర్మూలించాలి

రోగనిర్ధారణ పరీక్షల లక్ష్యాలను అధిగమించాలి.

వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:

వరంగల్ జిల్లా హెల్త్ హబ్ గా పేరుగాంచిన జిల్లాలో టి బి,తదితర 8 రకాల వ్యాధులను నిర్మూలించుటకు జిల్లా వైద్యశాఖ కృషి చేస్తుందని,టీబీ రహిత జిల్లాగా మార్చుటకు తగిన చర్యలు తీసుకుంటామన్నారని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలుపుతూ భారత ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, అదనపు కార్యదర్శి – అరుంధతి పట్నాయక్ ఎం.డీ (ఎన్ హెచ్ ఎం) ఢిల్లీ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా టి.బి ముక్త్ భారత్ అభియాన్ 100 రోజుల ఇంటెన్సిఫైడ్ క్యాంపెయిన్ పై సమీక్షించారు.వరంగల్ కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ నుండి జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద,అదనపు కలెక్టర్ జి.సంధ్యరాణితో పాటు జిల్లా వైద్యశాఖ అధికారులతో కలిసి పాల్గొన్నారు.జిల్లాలో 8 రకాల వ్యాధి కారకాల బారిన పడే వ్యాధిగ్రస్తుల సంఖ్య 2,04,979 మంది ఉన్నారని వారికి 3,794 మందికి జూన్ 3 నుండి రెండో విడత టిబి,మరియు 8 రకాల వ్యాధి గ్రాస్తులకి స్క్రీనింగ్ పరీక్షలు చేయడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు.

Warangal District Collector Dr. Satya Sarada

వరంగల్ జిల్లా హెల్త్ హబ్ గా పేరుగాంచిన జిల్లాలో టి బి, తదితర 8 రకాల వ్యాధులను నిర్మూలించుటకు జిల్లా వైద్యశాఖ కృషి చేస్తున్న నేపథ్యంలో టీబీ రహిత జిల్లాగా మార్చుటకు మరింత తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సాంబశివరావు సంబంధిత వైద్య అధికారులు ,సిబ్బంది  పాల్గొన్నారు.

రోజుకో ఆపిల్.. నిజంగా మంచిదేనా..

రోజుకో ఆపిల్.. నిజంగా మంచిదేనా..

 

 

రోజుకో ఆపిల్ తినడం వల్ల నిజంగా ఆరోగ్యంగా ఉంటారా? అయితే, ఏ సమయంలో తినడం ఆరోగ్యానికి మంచిది? దీని వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

 

 

‘రోజుకు ఒక యాపిల్ తింటే.. డాక్టర్ అవసరం లేదు’ అనేది ఒక సాధారణ సామెత. ఇది యాపిల్ లోని పోషక విలువలు, ఆరోగ్యానికి కలిగే మేలును సూచిస్తుంది. యాపిల్ తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రోజుకో యాపిల్ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. అల్పాహారం తిన్న ఒక గంట తర్వాత యాపిల్ తింటే ప్రయోజనం ఉంటుంది. యాపిల్‌లో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అయితే, రోజుకో యాపిల్ తింటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..

 

 

యాపిల్ ఆరోగ్య ప్రయోజనాలు

  • యాపిల్‌లో ఉండే ఫైబర్, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి.
  • దీనిలోని ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది మధుమేహం ఉన్నవారికి ఉపయోగపడుతుంది.
  • యాపిల్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంలో సహాయపడతాయి.
  • యాపిల్‌లోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
  • దీనిలోని యాంటీఆక్సిడెంట్లు చర్మ కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి. చర్మం ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి.
  • యాపిల్‌లో విటమిన్ సి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.
  • యాపిల్‌ నమలడం వల్ల దవడ, దంతాలు బలంగా మారతాయి. అలాగే, నోటిలో లాలాజలం ఉత్పత్తిని పెంచి, నోటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
  • కాబట్టి, రోజుకు ఒక ఆపిల్ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. అయితే, సమతుల్య ఆహారంలో భాగంగా రోజుకు ఒకటి లేదా రెండు ఆపిల్స్ తినడం మంచిదని ఆహార నిపుణులు సూచిస్తున్నారు.

ఆరోగ్య బీమా జాగ్రత్తలతో మరింత ధీమా

ఆరోగ్య బీమా జాగ్రత్తలతో మరింత ధీమా…

 

వయసుతో పాటు ఆరోగ్య సమస్యలూ పెరిగిపోతున్నాయి. ఈ ఖర్చుల భారం తప్పించుకోవాలంటే ఆరోగ్య బీమానే గతి. లేకపోతే ఇల్లూ,ఒళ్లూ గుల్లే. అలా అని ఏజెంట్లు చెప్పే మాటలు నమ్మి ఎడాపెడా…

వయసుతో పాటు ఆరోగ్య సమస్యలూ పెరిగిపోతున్నాయి. ఈ ఖర్చుల భారం తప్పించుకోవాలంటే ఆరోగ్య బీమానే గతి. లేకపోతే ఇల్లూ,ఒళ్లూ గుల్లే. అలా అని ఏజెంట్లు చెప్పే మాటలు నమ్మి ఎడాపెడా ఆరోగ్య బీమా పాలసీలు తీసుకోకూడదు. అలా చేస్తే కష్ట సమయాల్లో అక్కరకు రాకపోగా మన జేబుకే చిల్లు పడే ప్రమాదం ఉంది.

దీంతో చాలా మంది స్విగ్గీ, జొమాటాలో బిర్యానీ లేదా ఇతర తినుబండారాలు ఆర్డర్‌ చేసినంత ఈజీగా ఆరోగ్య బీమా పాలసీలు కొనేస్తున్నారు. ఆ పాలసీ షరతులు ఏంటి? కవరేజీ పరిమితులు, మినహాయింపుల గురించి ఏమాత్రం అర్థం చేసుకోవడం లేదు. దీంతో ఆరోగ్యం దెబ్బతిని ఆస్పత్రిలో చేరేటప్పుడు అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ పరిమితులు, మినహాయింపులను అడ్డుపెట్టుకుని బీమా కంపెనీలూ క్లెయిమ్స్‌కు సారీ చెబుతున్నాయి. ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేటప్పుడే జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి. అవేమిటంటే..

అవగాహన

ఆరోగ్య బీమా అనేది ఒక భరోసా. అయితే వ్యాపారం పెంచుకునేందుకు కంపెనీల ఏజెంట్లు ఇప్పుడు దీన్ని కూడా వస్తువులను అమ్మినట్టు అమ్మేస్తున్నారు. పాలసీ తీసుకునే వ్యక్తికి పెద్దగా అవగాహన లేకపోతే లేని ప్రయోజనాలను ఉన్నట్టు చెప్పి మరీ అంటగడుతున్నారు. కాబట్టి కొత్తగా ఆరోగ్య బీమా తీసుకునే వ్యక్తి లేదా వ్యక్తులు పాలసీ గురించి పూర్తిగా అవగాహన చేసుకున్నాకే పాలసీ తీసుకోవడం మంచిది. ఇందుకోసం పాలసీ షరతులు, కవరేజీ పరిమితులు, మినహాయింపులను ఒకటికి రెండు సార్లు చదివి అర్థం చేసుకోవాలి. ఒకవేళ అర్థంగాకపోతే ఎవరైనా ఆర్థిక సలహాదారుని సంప్రదించడం మంచిది.

ఇప్పటికే ఉన్న వ్యాధులు

దాదాపు అన్ని బీమా కంపెనీలు ఇప్పటికే ఉన్న వ్యాధులకు వెంటనే కవరేజీ అనుమతించవు. కనీసం రెండు మూడేళ్ల తర్వాతే ఇందుకు అనుమతిస్తాయి. ఒకవేళ ఇప్పటికే ఉన్న ఆరోగ్య సమస్యలకు కూడా వెంటనే కవరేజీ కావాలంటే ప్రీమియం కొద్దిగా ఎక్కువ చెల్లించాలి.

మెటర్నిటీ ట్రీట్‌మెంట్లు

ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేటప్పుడే మెటర్నిటీ ట్రీట్‌మెంట్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. లేకపోతే బీమా కంపెనీలు ఇందుకు అనుమతించవు. ఒకవేళ అనుమతించినా అందుకు సవాలక్ష పరిమితులు, ఆంక్షలు పెడుతుంటాయి.

ఆధునిక ట్రీట్‌మెంట్లు

ఆరోగ్య సమస్యలతో పాటు ట్రీట్‌మెంట్లు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. టెక్నాలజీ అభివృద్ధితో ఇప్పుడు అధునాతన రోబోటిక్‌ సర్జరీలు, జన్యు (జెనెటిక్‌) పరీక్షలూ అందుబాటులోకి వచ్చాయి. పాలసీ తీసుకునేటప్పుడే ఇవి కూడా కవరయ్యేలా జాగ్రత్త పడాలి.

మానసిక రుగ్మతలు

మానసిక రుగ్మతలకు కూడా ఆరోగ్య బీమా వర్తింప చేయాలని బీమా నియంత్రణ, అభివృద్ధి మండలి (ఐఆర్‌డీఏఐ) ఆదేశాలు జారీ చేసింది. అయినా ఈ ఆప్షన్‌ ఒకటి ఉందనే విషయాన్ని బీమా కంపెనీలు పెద్దగా పాలసీదారులకు చెప్పడం లేదు. మానసిక ఒత్లిళ్లు పెరిగిపోతున్న ఈ రోజుల్లో ఆరోగ్య బీమా పాలసీ కింద ఈ రుగ్మతలకు కూడా కవరేజీ ఉండేలా చూసుకోవాలి.

గదుల అద్దె

కొన్ని ఆరోగ్య సమస్యలకు ఆస్పత్రుల్లో ఇన్‌పేషెంట్‌గా చేరక తప్పదు. అయితే ఇందుకు అయ్యే రూమ్‌ రెంట్‌పై బీమా కంపెనీలు అనేక పరిమితులు పెడుతుంటాయి. ఆ పరిమితికి మించి రూమ్‌ రెంట్‌ ఉంటే ఆ అదనపు మొత్తాన్ని పాలసీదారులే భరించాలి. కొన్ని బీమా కంపెనీలు రూమ్‌ రెంట్‌ ఎంత ఉన్నా, అది పాలసీ కవరేజీకి లోబడి ఉంటే చాలని చెబుతున్నాయి. పాలసీ తీసుకునేటప్పుడే పాలసీదారులు ఈ విషయంలో జాగ్రత్త పడాలి. లేకపోతే జేబుకు చిల్లు పడుతుంది.

ఓపీడీ, వ్యాధి నిర్ధారణ

ఇవాళ ఔట్‌ పేషెంట్‌ సేవలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు కూడా పెద్దభారంగా మారాయి. పెద్దపెద్ద ఆస్పత్రుల్లో డాక్టర్‌ కన్సల్టేషన్‌, వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం వేలకు వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేటప్పుడే ఈ ఖర్చులకూ కవరేజీ ఉండేలా జాగ్రత్త పడాలి. అయితే బీమా కంపెనీలు ఒక పరిమితి వరకే ఈ ఖర్చులను అనుమతిస్తాయి.

ఇతర జాగ్రత్తలు

  • పాలసీ తీసుకునే ముందే పాలసీ బ్రోచర్‌ను కాకుండా పాలసీ పూర్తి డాక్యుమెంట్‌ తీసుకుని చదివి పూర్తిగా అర్థం చేసుకోవాలి.
  • పాలసీ ద్వారా ఏయే సమస్యలకు కవరేజీ లభించదో ముందుగానే పూర్తిగా తెలుసుకోవాలి.
  • బీమా కంపెనీల పరిభాష అందరికీ అర్థం కాదు. పాలసీలో పేర్కొనే సబ్‌ లిమిట్స్‌, కో-పే, వెయిటింగ్‌ పీరియడ్‌ అంటే ఏమిటో క్షుణ్ణంగా తెలుసుకోవాలి.
  • వివాహం, పిల్లలు పుట్టినప్పుడు, వృద్ధులైన తల్లిదండ్రులు ఉన్నప్పుడు మీరు తీసుకున్న ఆరోగ్య బీమా పాలసీ మీ అవసరాలకు సరిపోతుందా? లేదా? అనే విషయాన్ని సమీక్షించుకోవాలి.
  • మీ ఆరోగ్య బీమా పాలసీ కంపెనీ, పాలసీ వివరాలపై కుటుంబసభ్యులకు ముందుగానే పూర్తిగా తెలియజేయాలి. ఎందుకంటే ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే అన్ని విషయాలు చక్కబెట్టాల్సిందే వారే.

ఆరోగ్య బీమా పాలసీ తీసుకునే ముందే ఈ జాగ్రత్తలు తీసుకుంటే, అవసరమైనప్పుడు జేబులో పైసా ఖర్చు చేయకుండా ఆరోగ్య సమస్యల నుంచి తేలిగ్గా గట్టెక్కవచ్చు. లేకపోతే ఆరోగ్య పరంగానే కాకుండా ఆర్థికంగానూ దెబ్బతినే ప్రమాదం ఉంది

నేషనల్ ఫ్యామిలీ హెల్త్ స్కీ మ్ నుప్రజలందరు సద్వినియోగం చేసుకోవాలి.

నేషనల్ ఫ్యామిలీ హెల్త్ స్కీ మ్ నుప్రజలందరు సద్వినియోగం చేసుకోవాలి.

తహసిల్దార్ ఇమాం బాబా షేక్.

చిట్యాల నేటిధాత్రి:

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండల తహశీల్దార్ ఇమామ్ బాబా షేకు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ స్కీ మ్ కింద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టినటువంటి స్కీం లో మండల ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కుటుంబంలో ఎవరైనా పెద్ద ఏదైనా కారణం చేత మరణించిన చో అతని వయసు 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వరకు ఉండవలెను మరియు మరణ ధ్రువీకరణ పత్రము ఆధార్ కార్డు రేషన్ కార్డు తీసుకువచ్చి రెవెన్యూ కార్యాలయంలో ఇవ్వగలరు దీని ద్వారా 20వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేయడం జరుగుతుందని చిట్యాల తహసిల్దారు తెలియజేశారు అవకాశాన్ని చిట్యాల మండల ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం.

‘యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలి’

◆ యోగాతో సంపూర్ణ ఆరోగ్యం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

అంతర్జాతీయ 11వ యోగా దినోత్సవం పురస్కరించుకుని శనివారం జహీరాబాద్ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఆదర్శ విద్యాలయంలో పతాంజలి యోగా పీఠం ఆధ్వర్యంలో యోగాసనాలు వేశారు. వేడుకల్లో పోలీసు, ప్రభుత్వ ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. యోగా ప్రాముఖ్యతను
వశిష్ట యోగా ప్రతినిధులు, క్రీడాకారులు ఇతర ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల విద్యార్థినిలు వ్యాయామ ఉపాధ్యాయులు గురువులు వివరిస్తూ దినచర్యలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

ఆరోగ్యశాఖ మంత్రి నియోజకవర్గంలో నాణ్యతలోపం.

ఆరోగ్యశాఖ మంత్రి నియోజకవర్గంలో నాణ్యతలోపం

◆ ఏడాది గడవకుండానే రోడ్ కు మరమ్మ త్తులు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల కేంద్రం నుంచి ఝరాసంగం మండలం కప్పాడు గ్రామం వరకు నిర్మించిన తారు రోడ్డు ఏడాది గడవకుండానే పాడవటం పై బిఎస్పి జిల్లా ఇంచార్జి మోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సిహ్మ ఇలాకాలో సంబంధిత అధికారులు నాణ్యత ప్రమాణం పాటించకపోవడంపై బీఎస్పీ ఇంచార్జి మోహన్ ఎద్దేవా చేశారు.. పాడైన రోడ్డు ను, ప్యాచ్ వేసేందుకు చేపట్టిన పనులను గురువారం అయన పరిశీలించారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ అధికారులు రోడ్డు నిర్మాణ సమయం లో నిర్లక్షంగా వ్యవహరించడం వల్లనే మూన్నాలకే రోడ్డు పై తారు లేచిపోయి గుంతల మాయంగా మారిపోయిందని, దీంతో ప్రయాణికుల, వాహన దారుల కష్టాలు పునరావృతం అయ్యయన్నారు. రోడ్ లు, భావనలు నిర్మాణ క్రమంలోనే సంబంధిత ఇంజనీర్ లు తగిన విధులు నిబద్దతతో నిర్వహిస్తే ప్రజలకు ఇబ్బందులు ఉండవన్నారు. ఇప్పటికైనా అధికారులు, తారు, సీసీ రోడ్డు లు, భవనాలను ఎస్టిమేషన్ లకు తగ్గట్లు నిర్మించి తమ విధులను సక్రమంగా నిర్వహించాలని కోరారు. రోడ్ లు, భవనాల నిర్మాణం లో మరోసారి నిర్లక్ష్యం వహిస్తే జిల్లా, రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులకు పిర్యాదు చేసి నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరానున్నట్లు తెలిపారు. కొన్ని రోజుల క్రితం వర్షంలో చెర్ల రాయిపల్లి లోని వంతెన నిర్మాణాన్ని కొనసాగించిన అంశం, పలు గ్రామాల్లో నాసిరకం ఇసుకతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు. నిబంధనల మేరకు అధికారులు నడుచుకోకపోతే ప్రజలతో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.

ప్రతి రోజు యోగా సాధనతో ఆరోగ్యం.

ప్రతి రోజు యోగా సాధనతో ఆరోగ్యం

కలెక్టరేట్ కార్యాలయ అధికారులతో యోగా శిక్షణ

ఐడీఓసీలో దశాబ్ది ఉత్సవాలు

యోగా శిక్షకులు శ్రీనివాస్, స్వప్న

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలో ని జిల్లా సమీకృత కార్యాలయంలో ప్రభుత్వ అధికారులకు, యోగ శిక్షణలో భాగంగా నిత్యం యోగా సాధనతో ఆరోగ్యంగా ఉంటారని ఆయుష్ యునాని డిస్పెన్సరీ యోగా శిక్షకులు బీ.శ్రీనివాస్,టీ.స్వప్న
పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగ దశాబ్ది ఉత్సవాలు కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉదయం జిల్లా కలెక్టరేట్ అధికారులకు యోగా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా యోగా ఆసనాలు, ప్రాణాయామం ముద్రలు ధ్యానము తదితర అంశాలపై వివరిస్తూ..చేయించారుప్రతి రోజు యోగా చేయడం వలన కలిగే లాభాలు, ఆరోగ్యం ఆనందం ఎలా పొందవచ్చు వంటి వివరాలు వివరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు , సిబ్బంది, కలెక్టరేట్ కార్యాలయ ఏవో.రామ్ రెడ్డి, ఆయుష్ జిల్లా నోడల్ అధికారి డాక్టర్ శశి ప్రభ, డాక్టర్ సౌమిని, డాక్టర్ శ్వేత, డాక్టర్ స్వరూప ,డాక్టర్ కళ్యాణి, డీపీఎం తిరుపతి ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

అంబేద్కర్ నగర్ ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ రక్తదాన దినోత్సవ శిబిరం.

సిరిసిల్ల అంబేద్కర్ నగర్ ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ రక్తదాన దినోత్సవ శిబిరం

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):

సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ రోజు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రజిత ఆధ్వర్యంలో అంబేద్కర్ నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ రక్తదాతల దినోత్సవం జూన్ 14 సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయనైనది. ఈ రక్తదాన శిబిరం ఉద్దేశించి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో తో సమానమని, మనం ఇచ్చే రక్తం వేరొకరి నిండు ప్రాణాలను కాపాడాలని సంకల్పంతో రక్తదానం చేస్తున్న రక్తదాతల స్ఫూర్తి ఎంతో గొప్పదని , తెలియజేస్తూ రక్తదానం తో ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని గుండె సంబంధిత వ్యాధులు, గొంతు, పెద్ద పేగు క్యాన్సర్లు, సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుందని, మన ఆరోగ్య స్థితిని తెలుసుకునే అవకాశం కూడా లభిస్తుందని ఈ సందర్భంగా తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ సంపత్ కుమార్, డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ అనిత, డాక్టర్ అభినయ్ మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ ‌. ‌

రోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్.

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి ‌

 

 

భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ ఆకస్మిక తనిఖీ చేశారు సీజన్ వ్యాధుల గురించి వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించడం జరిగింది హాజరు పట్టికను పరిశీలి ంచి సిబ్బంది సమయ పాలన పాటించాలని సూచించారు మందుల కొరత లేకుండా చూసుకోవాలని ప్రతి శుక్రవారం డే )డేసర్వే చేయాలని మెడికల్ క్యాంపులు నిర్వహించాలని ఆదేశించడం జరిగింది అదే రంగాపురం పిఢిసిల్ల మోట్ల పెళ్లి నూతన సబ్ సెంటర్ లను (పల్లె దవఖానాలను) పరిశీలించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల వైద్య అధికారి డాక్టర్ నాగరాణి డాక్టర్ నవత ఏఎన్ఎంలు వైద్య సిబ్బంది పాల్గొన్నారు

పొగాకు వాడకం ఆరోగ్యానికి హానికరం.

పొగాకు వాడకం ఆరోగ్యానికి హానికరం

ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి దిలీప్ కుమార్ నాయక్

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

 

 

కుటుంబ సభ్యులు, స్నేహితులు తెలిసిన వారితో పొగాకు వాడటం మాన్పించాలని ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్.ఆర్.దిలీప్ కుమార్ నాయక్ అన్నారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్బంగా కోర్టు ప్రాంగణంలో ప్రతిజ్ఞ చేశారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్.ఆర్.దిలీప్ కుమార్ నాయక్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ పొగాకు వాడటం వలన కాన్సర్ బారిన పడుతారని, మెదడు, గుండె ఊపితిత్తులకు చాలా ప్రమాదం అన్నారు. ఈ కార్యక్రమంలో కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి.

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

 

తంగళ్ళపల్లి మండలంలో. తంగళ్ళపల్లి. ఓబులాపూర్ ఆరోగ్య ఉప కేంద్రం ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి డాక్టర్ రజిత. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి డాక్టర్ రజిత ఆకస్మికంగా తనిఖీ చేసి తనిఖీలలోభాగంగా వ్యాధి నిరోధక టీకాలను రికార్డులను వ్యాక్స్ యొక్క కోల్డ్ చైన్ ను. పరిశీలించి సకాలంలో గర్భిణీలకు ఐదు సంవత్సరాల లోపు చిన్నపిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు అందించాలని. లక్ష్యాలు సాధించాలని సూచించారు. అకాల వర్షాలతో వైరస్ ప్రజలకు సుజనల్ వ్యాధులు వాటికప్పుడు అందజేయాలని విష జ్వరాలు ప్రజలకు సోకే అవకాశం ఉన్నందున దోమలు పుట్టకుండా కుట్టకుండా నివారణ జాగ్రత్తలు వహించాల్సిందిగా తెలియజేస్తూ వైద్య సిబ్బందికి తగిన సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ సంపత్ కుమార్ డాక్టర్ ఆసిఫా వైద్య సిబ్బంది హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version