గణనాథునికి వీడ్కోలు: భక్తులకు అశ్విన్ పటేల్ శుభాకాంక్షలు..

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-06T124854.915.wav?_=1

 

గణనాథునికి వీడ్కోలు: భక్తులకు అశ్విన్ పటేల్ శుభాకాంక్షలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం మండల కాంగ్రెస్ పార్టీ యువనాయకులు అశ్విన్ పటేల్ , వినాయక నవరాత్రి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించిన భక్తులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. పదకొండవ రోజుల పాటు ఆనందం, ఉత్సాహం, ఐక్యతను నింపిన గణనాథుడికి నిమజ్జనోత్సవం ద్వారా ఘనంగా వీడ్కోలు పలుకుతున్నామని, ఆయన జీవితంలోని విఘ్నాలను తొలగించి, సుఖశాంతులు, ఐశ్వర్యం, ఆరోగ్యం, సిరిసంపదలను ప్రసాదించాలని ఆకాంక్షించారు.ఝరాసంగం మండల ఆయా గ్రామ ప్రాంతంలో ఈ ఉత్సవాలు జరిగాయి.

గణేష్ మండపాలను దర్శించిన చల్ల నారాయణ రెడ్డి…

మహాదేవపూర్ లో పలు గణేష్ మండపలను దర్శించుకున్న బీజేపీ రాష్ట్ర నాయకులు చల్ల నారాయణ రెడ్డీ గారు*

** మహాదేవపూర్ సెప్టెంబర్ 5 నేటి ధాత్రి * *

 

మహాదేవపూర్ మండల కేంద్రంలోని గణేష్ నవరాత్రుల సందర్బంగా పలు గణపతి మండపాలను దర్శించుకొని,ప్రత్యేక పూజలు చేసిన బీజేపీ రాష్ట్ర నాయకులు చల్ల నారాయణ రెడ్డీ అనంతరం మాట్లాడుతూ ప్రజలంతా సుఖశాంతోషాలతో, ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవిoచాలని,పాడి పంటలు సమృద్ధిగా పండాలని,ప్రజలందరికి గణేష్షుడు తోడై,నీడై ఉండాలని కోరడం జరిగింది, ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ నెంబర్ ఆకుల శ్రీధర్,మాజీ మండల అధ్యక్షులు సిరిపురం శ్రీమన్నారాయణ,మండల ప్రధాన కార్యదర్శులు బల్ల శ్రావణ్, లింగంపల్లి వంశీ, మండల నాయకులు కన్నెబోయిన ఐలయ్య యాదవ్,కొక్కు శ్రీనివాస్, దాడిగేలా వెంకటేష్,కొక్కు రాకేష్ పాల్గొన్నారు

21 రకాల నైవేద్యాలతో గణపతికి పూజలు…

21 రకాల నైవేద్యాలతో గణపతికి పూజలు

జైపూర్,నేటి ధాత్రి:

 

జైపూర్ మండలం ముదిగుంట గ్రామంలోని వీర హనుమాన్ గణేష్ మండలి వద్ద గురువారం రాత్రి మహిళలు గణేశునికి పూలతో అలంకరించి 21 రకాల నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అలాగే స్వస్తిక్ ఆకారంలో దీపాలను వెలిగించి మహిళలు గణపతి దేవుని ఆశీర్వాదం పొందారు.పూజ అనంతరం మహిళలు గ్రామ ప్రజలు ఎల్లవేళలా ఆయురారోగ్యాలతో ఉండాలని గణపతి దీవెనలు ఎల్లప్పుడూ తమపై ఉండాలని కోరారు.

మినరల్ డవలప్మెంట్ నిధులు వినియోగించుకోవాలి…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-04T171900.110.wav?_=2

 

మినరల్ డవలప్మెంట్ నిధులు వినియోగించుకోవాలి

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

జిల్లా ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం జిల్లా మినరల్ డవలప్మెంట్ నిధులు సమర్థవంతంగా వినియోగించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.
గురువారం ఐడిఓసి కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో పలు శాఖల జిల్లా స్థాయి అధికారులతో ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో డిఎంఎఫ్టి మేనేజింగ్ కమిటి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాధాన్యత కలిగిన రంగాలకు డిఎంఎఫ్టి నిధులు సమర్థవంతంగా వినియోగించాల్సిన అవసరం ఉందని అన్నారు.
పారిశ్రామికీకరణ వల్ల ప్రభావితం అవుతున్న ప్రాంతాలలో
ప్రజలకు మౌలిక సదుపాయాలైన ఆరోగ్యం, విద్య, తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్య, వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణ వంటి రంగాలను ప్రధానంగా దృష్టిలో ఉంచుకుని నిధులు వినియోగించాలని తెలిపారు. ప్రభావిత ప్రాంతాల్లో ప్రతి రూపాయి ప్రజలకు ఉపయోగపడేలా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసి, పారదర్శకతతో అమలు చేయాలని సూచించారు.
ప్రతి మూడు నెలలకు ఒకసారి డి.ఎం.ఎఫ్.టి మేనేజింగ్ కమిటి సమావేశాలు నిర్వహించాలని
అలాగే, ఇప్పటికే మంజూరైన పనుల పురోగతిని వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. చేపట్టిన పనులలో నాణ్యత ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని అధికారు లను ఆదేశించారు. నిధుల వినియోగంలో ఎలాంటి నిర్లక్ష్యం చోటు చేసుకోరాదని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి నవీన్ రెడ్డి, రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, సీపీఓ బాబూరావు, మైనింగ్, సంక్షేమ, వ్యవసాయ, విద్యా, వైద్య తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

పరామర్శించిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం..

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-04T151324.521.wav?_=3

పరామర్శించిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఇటీవల అనారోగ్యానికి గురి అయి ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న జాహిరాబాద్ పట్టణం పస్తాపూర్ గ్రామం కొత్త గురునాథ్ రెడ్డి గారిని ఈ రోజు వారీ ఇంటికి వెళ్లి పరామర్శించిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం,ఈ కార్యక్రమంలో సి.యం విష్ణువర్ధన్ రెడ్డి,శికారి గోపాల్, యం.జైపాల్, తదితరులు ఉన్నారు

భక్తిశ్రద్ధలతో గణనాథునికి పూజలు..

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-30T134222.335.wav?_=4

భక్తిశ్రద్ధలతో గణనాథునికి పూజలు

శ్రీరాంపూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

 

శ్రీరాంపూర్ ప్రాంతం వాటర్ ట్యాంక్ ఏరియా 9వ వార్డులో శ్రీ శివ సాయి గణేష్ మండలి ఆధ్వర్యంలో కొలువుదీరిన గణనాథునికి భారీ సంఖ్యలో ఆ ప్రాంత మహిళలు ఎంతో భక్తిశ్రద్ధలతో కుంకుమ పూజ అర్చనలు చేశారు.ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గణనాధునికి భక్తిశ్రద్ధలతో పూజ కార్యక్రమాలు చేయడం ఎంతో సంతృప్తిగా ఉందన్నారు.గణనాధుని ఆశీస్సులతో దేశ ప్రజలు ఆయురారోగ్యాలతో,సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు.

భారీ వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూం సేవలు వినియోగించుకోవాలి…

భారీ వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూం సేవలు వినియోగించుకోవాలి

24/7అందుబాటులో వివిధ శాఖల అధికారులు ఉండాలి

ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు

కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1800 233 1495

వరద, వర్షం ప్రభావిత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

కంట్రోల్ రూమ్ వాట్సాప్ సెల్ నెంబర్ 9398684240

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

సిరిసిల్ల టౌన్:(నేటిధాత్రి)

 

 

రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో గతంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ సేవలు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించిన నేపథ్యంలో సంబంధిత అన్ని శాఖలను అప్రమత్తం చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. లోతట్టు ప్రాంతాలలో లో లెవెల్ కాజ్ వేల వద్ద అప్రమత్త చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.రెవెన్యూ, పోలీస్, విద్యుత్, వ్యవసాయ, హెల్త్, పి.ఆర్, మిషన్ భగీరథ ఇతర శాఖల అధికారులు కంట్రోల్ రూంలో సేవలు అందిస్తున్నారని తెలిపారు.వివిధ అధికారులు అందుబాటులో ఉండి, వర్షాలు, వరదలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు తగిన సమాచారం అందిస్తారు. సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని, వరద ప్రభావిత ప్రజలకు సహాయం చేసేలా సేవలు అందిస్తారు. 24 గంటలు ఆయా శాఖల అధికారులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు.భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశామని, ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నట్లయితే కంట్రోల్ రూమ్ నెంబర్లు టోల్ ఫ్రీ నెంబర్ 1800 233 1495, వాట్సాప్ సెల్ నెంబర్ 9398684240 లను వర్షం, వరద ప్రభావిత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రజలకు సూచించారు.జిల్లా, మండల స్థాయి అధికారులు తమ, తమ హెడ్ క్వార్టర్స్ , క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలన్నారు. వర్షాల కారణంగా ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నట్లయితే అధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని, ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని ఈ ప్రకటనలో పేర్కొన్నారు.

ములుగు మండల సమస్యలపై బిజెపి నేతల వినతి పత్రం.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-25T154148.715-1.wav?_=5

 

ములుగు మండల సమస్యలపై తహశీల్దార్ కు బిజెపి నాయకుల వినతి పత్రం

ములుగు టౌన్ నేటి ధాత్రి

 

ములుగు మండలంలోని పలు సమస్యలపై బిజెపి నాయకులు తహశీల్దార్ గారికి వినతి పత్రం సమర్పించారు. ఈ రోజు మండల అధ్యక్షులు రాయంచు నాగరాజు గారి ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వగా, ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు సిరికొండ బలరాం గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
మండలంలోని గ్రామాల్లో ఎక్కడా వీధి దీపాలు వెలగడం లేదని
డ్రైనేజీ సక్రమంగా లేకపోవడం వలన నీరు నిలిచి, పారిశుద్ధ్యం లోపించి, డెంగ్యూ, మలేరియా వంటి జ్వరాలు వ్యాపిస్తున్నాయని
గ్రామాలలో తాగునీరు, విద్యుత్ సమస్యలు, గుంతల రహదారులు కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని
ములుగు పట్టణంలోని 200 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన సిబ్బంది, సౌకర్యాలు లేకపోవడం వలన రోగులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు
అదేవిధంగా, పట్టణంలోని పలు వీధుల్లో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు లేకపోవడం వలన రవాణా కష్టాలు ఏర్పడుతున్నాయని, ములుగు పట్టణానికి వచ్చే ప్రజలకు విశ్రాంతి కోసం పబ్లిక్ గార్డెన్ ఏర్పాటు చేయాలని సూచించారు
తద్వారా ఆయన ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు రాజీవ్ యువ వికాస్ కింద లోన్లు,
గృహలక్ష్మి పథకం కింద ప్రతి గృహిణికి ₹2500,
ఆరు గ్యారెంటీలు, 420 హామీలు —
తప్పనిసరిగా అమలు చేయాలని, లేకుంటే బిజెపి మండల & జిల్లా ఆధ్వర్యంలో భారీ ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతలపూడి భాస్కర్ రెడ్డి, రాష్ట్ర ఎస్టీ మోర్చా ప్రధాన కార్యదర్శి కొత్త సురేందర్, రాష్ట్ర ప్రతినిధి స్వరూప, జిల్లా ప్రధాన కార్యదర్శి శీలమంతుల రవీంద్రాచారి, ఉపాధ్యక్షులు జినుకల కృష్ణారావు, జిల్లా ప్రతినిధి సూర్యదేవర విశ్వనాథ్, కోశాధికారి గంగిశెట్టి రాజ్ కుమార్, కార్యాలయ కార్యదర్శి దొంతి రవి రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు ఇమ్మడి రాకేష్ యాదవ్, జిల్లా నాయకులు లవన్ కుమార్, నగరపు రమేష్, ఎలుకతుర్తి శ్రీహరి, యాద సంపత్, ప్రమోద్, మండల ప్రధాన కార్యదర్శులు లకావత్ రాజ్ కుమార్, కుక్కల పవన్, ఉపాధ్యక్షుడు ఏరువ పాపిరెడ్డి, నాయకులు ఒజ్జల కిరణ్, ఆకుల రాజేందర్, బండి రవీందర్ తదితరులు పాల్గొన్నారు

గిరిజన మహిళలు చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయండి…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-25T123130.070.wav?_=6

 

గిరిజన మహిళలు చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయండి

ఐటీడీఏ మరియు ఐటిసి అండగా ఉంటుంది

భద్రాచలం పీవో బి రాహుల్

నేటి ధాత్రి చర్ల

 

స్వసక్తితో చిన్న తరహా పరిశ్రమలు నెలకొల్పుకొని జీవనోపాధి పెంపొందించుకొని ఉపాధి పొందుతున్న గిరిజన మహిళలకు ఐటీడీఏ మరియు ఐటీసీ ద్వారా చేయూత అందించి వారి పరిశ్రమలను అభివృద్ధి దిశగా తీసుకువెళ్లడానికి

 

ప్రయత్నిస్తున్నామని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ అన్నారు శనివారం నాడు చర్ల మండలం సున్నం గుంపు గ్రామంలోని ముత్యాలమ్మ జాయింట్ లియబిలిటి గిరిజన మహిళలు తయారు చేస్తున్న వివిధ రకాల తినుబండారాల పదార్థాలను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడవులలో దొరికే అటవీ

 

ఉత్పత్తులను సేకరించి నిత్యవసరాలకు వాడుకొనడమే కాక సహజంగా దొరికే ఇప్ప పప్పుతో మంచి ఆరోగ్యానికి సంబంధించిన ఆహార పదార్థాలు తయారు చేసి వాటిని అమ్మకాలు జరుపుకొని జీవనోపాధి పొందుతున్నరని ఇప్పపువ్వుతో మంచి సహజ గుణాలు కలిగిన డ్రై ఫ్రూట్స్ మిక్స్ చేసి ఇప్పపువ్వు లడ్డులు బర్ఫీ చాక్లెట్లు మరియు ఔషధ గుణాలు కలిగిన వనమూలికలతో వివిధ రకాల కారంపొడి పచ్చళ్ళు తయారుచేసి అమ్మకాలు జరుపుకుంటున్నారని అన్నారు వీరు తయారు చేసే ప్రతి తినుబండారాలు నాణ్యతగా ఉంటూ పిల్లలకు పెద్దలకు వారి అభిరుచికి తగ్గట్లు మంచి రుచికరంగా తయారు చేస్తున్నారని ఈ మహిళలు ఎవరి మీద ఆధారపడకుండా స్వశక్తితో తయారు చేసుకొని జీవనోపాధి కల్పించుకుంటున్నారని అన్నారు ఈ మహిళలు తయారు చేస్తున్న ఆహార పదార్థాల ప్రొడక్ట్స్ మరియు బ్రాండింగ్ ప్యాకింగ్ విషయంలో మహిళలకు చేయూత అందించడానికి ఐటిడిఏ మరియు ఐటిసి ద్వారా సపోర్ట్ చేయడానికి ఒక నాలుగు సంఘాలను గుర్తించామని వారు తయారు చేసే వస్తువులను పరిశీలించిన తర్వాత వారి చిన్న తరహా పరిశ్రమలను మరింత అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం కల్పించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు గ్రామాలలో నివసించే కుటుంబాలు మరియు చిన్నారుల తల్లిదండ్రులు వీరు తయారు చేసే ప్రతి వస్తువు ఆరోగ్యానికి మరియు నాణ్యతగా రుచికి తగ్గట్లు ఉన్నందున అందరూ కొనుగోలు చేసి ఈ పరిశ్రమలను అభివృద్ధి బాటలో తీసుకెళ్లడానికి మీ వంతు సహకారం అందించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్ ఐ టి సి మేనేజర్ చంగల్ రావు ప్యాకింగ్ మరియు డిజైనింగ్ కోఆర్డినేటర్ బేగ్ మహిళా సభ్యులు సమ్మక్క మునెమ్మ శ్రీదేవి రమాదేవి శిరీష ఈశ్వరి స్వాతి తదితరులు పాల్గొన్నారు
ముందుగా చర్ల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను పరిశీలించారు
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగుల తో మాట్లాడుతూ వారికి అందుతున్న వైద్య సేవల గురించి తెలుసుకున్నారు u
ఉంజుపల్లి వసతి గృహంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని సూచించారు
బోదనెల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని చింతగుప్ప జీపీఎస్ పాఠశాల ను సందర్శించారు

మన ఆరోగ్యం…!

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-13-2.wav?_=7

మన ఆరోగ్యం…!

వంటగదే ఒక ఔషధ నిలయం:

జహీరాబాద్ నేటి ధాత్రి:

మాములుగా వచ్చే జలుబూ జ్వరాల నుండి తీవ్రంగా వుండే ఆస్తమా, మధుమేహం వరకూ కూడా మన వంటిట్లో ఉన్న వస్తువులతో తగ్గించుకోవచ్చు. మరీ తీవ్రంగా ఉంటే డాక్టర్ వద్దకు వెళ్ళాలి.

1) పసుపు:

▪️పసుపుని పై పూతగా మరియూ లోపలికి కూడా తీసుకుంటారు.

▪️నీళ్లతో కలిపి పాదాలకు పూయడం వలన ఫంగస్ వ్యాధులు,గజ్జి మరియూ ఇతర బాక్టీరియా వ్యాధులు తగ్గిపోతాయి. కాళ్ళ పగుళ్లు కూడా రాకుండా ఉంటాయి.

▪️పసుపుని కొద్దిగా నూనెతో కలిపి కాలి వేళ్ళ మధ్య పూస్తే నీళ్లలో నానడం ద్వారా వచ్చే ఎలర్జీ తగ్గి పాదాలకి అందం కూడా వస్తుంది.

▪️ముఖానికి పూస్తే నల్ల మచ్చలు, మొటిమలు పూర్తిగా తగ్గిపోతాయి.

▪️పసుపులో బెల్లం కలిపి తింటే కడుపులో మంట, అల్సర్లు తగ్గుతాయి.

▪️పసుపు పూయడం వల్ల శరీరం మీద వచ్చే ఎర్రని దద్దుర్లు (రషేర్) తగ్గుతాయి.

▪️బాలింతలకు ఇస్తే పాలు బాగా పడుతాయి.

▪️వేడి పాలలో ఒక గ్రాము పసుపు కలిపి ఇస్తే జలుబు, దగ్గు, తగ్గిపోతాయి.

▪️ 5 గ్రాముల పసుపు, 5 గ్రాముల ఉసిరి పొడి కలిపి ఉదయం పరకడుపున తీసుకుంటే మధుమేహం క్రమేణా తగ్గుతుంది.

▪️పసుపు నిత్యం తీసుకునే వారిలో జీర్ణవ్యవస్ధ కి సంబంధించిన క్యాన్సర్ లు రాకుండా ఉంటాయి.

2) ధనియాలు:-

▪️కాచి చల్లార్చిన నీటిలో నాలుగో వంతు దంచిన పచ్చి ధనియాలను రెండు గంటల పాటు నానబెట్టి అందులో చక్కెర కలిపి ఆ నీటిని త్రాగితే జ్వరం వెంటనే తగ్గుతుంది.

▪️దప్పిక, మంట పూర్తిగా పోతుంది. చెమట బాగా పడుతుంది.

▪️పారాసిటమోల్ టాబ్లెట్ కంటే చాలా త్వరగా పని చేస్తుంది.

▪️కళ్ళ కలకలకు ఈ నీటిని వడగట్టి కళ్ళలో వేస్తే దురద, మంట మరియు ఎరుపు రంగు తగ్గిపోతాయి.

▪️పచ్చి ధనియాలను నూరి కడితే ఎలాంటి తలనొప్పి అయినా తగ్గిపోతుంది.

▪️మూలవ్యాధి లో, చక్కెర కలిపిన పొడి లేక ధనియాల నీళ్లను ఇస్తే దురద, రక్తస్రావం తగ్గిపోతాయి.

▪️మోతాదు: 5 నుండి 10 గ్రా పొడి కి 50 నుండి 100 మి లీ నీరు కలపాలి.

3) సోంపు:

▪️సోంపు ని దంచి నీళ్లలో ఒక గంట నానబెట్టి ఆ తరవాత ఆ నీళ్ళని బాగా కలబెట్టి తాగితే కడుపు నొప్పి, గాస్ట్రీక్ సమస్య తగ్గుతుంది.

▪️విరేచనం సాఫీగా అవుతుంది.

▪️నులిపురుగులు కూడా పడి పోతాయి.

▪️కఫం అడ్డగించి ఆయాసపడే వ్యక్తులకు ఇది వెంటనే శ్వాశ నాళాలను తెరిపించి శ్వాశ బాగా ఆడేటట్లు చేస్తుంది.

▪️అతిసార వ్యాధి ఉన్నవారికి మెంతుల పొడితో కలిపి ఈ పొడిని ఇవ్వవచ్చు.

▪️సోంపుకి కొన్ని నీళ్ళు కలిపి నూరి మెత్తని పేస్టులా చేసి ఎముకల నొప్పి ఎక్కడ ఉందో అక్కడ పట్టిస్తే ఎముకల నొప్పి తగ్గుతుంది.

▪️మూత్రంలో వచ్చే మంటకు సోంపు చాలా బాగా పని చేస్తుంది.

kitchen remedies

 

4). అల్లం మరియూ శొంఠి:

▪️అజీర్ణ వ్యాధితో బాధపడేవారు భోజనానికి ముందు చిన్న అల్లం ముక్కను ఒక ఉప్పుతో కలిపి నమిలి తింటే ఆకలి పెరుగుతుంది.

▪️నాలుక, కంఠం శుభ్రపడి రుచి బాగా తెలుస్తుంది.

▪️తేనెతో కలిపి అల్లం రసం తాగితే దగ్గు, ఆయాసం తగ్గుతాయి.

▪️నీరుల్లితో కలిపి అల్లం రసం తీసుకుంటే వాంతులు ఆగిపోతాయి.

▪️ప్రయాణాల్లో వాంతులు వచ్చేవారు రెండు స్ఫూన్ల అల్లం రసం కానీ లేక ఒక స్పూన్ శొంఠి పొడి కానీ తీసుకుంటే 12గంటల వరకు వాంతులు రావు.

▪️అమీబియాసిస్ వ్యాధికి శొంఠి చాలా మంచిది.

▪️కీళ్ల నొప్పులకు శొంఠి పొడి రోజూ తీసుకుంటే వాపు తగ్గి కీళ్లు బాగా వంగుతాయు.

5). జీలకర్ర:

▪️జీలకర్ర వాడటం వలన జీర్ణాశయంలో వచ్చే అల్సర్లు తగ్గుతాయి.

▪️లివర్ పనిచేయడం మెరుగుపడుతుంది.

▪️నెలల తరబడి బాధించే రక్త విరేచనాలు పూర్తిగా తగ్గిపోతాయి.

▪️అతిసారంతో బాధపడే వారికి మజ్జిగ లేక పెరుగుతో కలిపి ఇస్తే గంటలో తగ్గిపోతాయి. మూత్రం కూడా సాఫీగా వస్తుంది.

▪️బాలింతలకు పాలు బాగా పడుతాయి.

▪️మూలవ్యాధితో ఉన్నవారికి రక్తస్రావం తగ్గుతుంది.

▪️నిద్ర బాగా వస్తుంది.

▪️శరీరంలో ఏ కండరము నొప్పి అయినా సరే కొన్ని గంటల్లో తగ్గిస్తుంది.

6). లవంగాలు:

▪️ఇవి పళ్ళకి, కంఠానికి సంబంధించిన వ్యాధులలో చాలా బాగా పని చేస్తుంది.

▪️చిగుళ్ల నుండి రక్తం కారే వారు ఒక లవంగం బుగ్గన పెట్టుకోవడం అలవాటు చేసుకుంటే చిగుళ్ళు గట్టిపడుతాయి.

▪️నోటి దుర్వాసన దూరం అవుతుంది.

▪️పిప్పి పన్ను మొదటి దశలో లవంగాన్ని మెత్తటి పొడి చేసి పన్ను భాగంలో నింపి ఒక గంటసేపు అలాగే ఉంచగలిగితే వెంటనే పోటు తగ్గి దంతక్షయం కలుగకుండా ఉంటుంది.

▪️వేడి నీళ్లలో నాలుగు లవంగాలు వేసి ఆ నీళ్లను ఒక్కో స్పూన్ తాగుతూ ఉంటే కలరా,అతిసారం వంటి వ్యాధుల కారణంగా వచ్చే దప్పిక తగ్గుతుంది.

▪️అజీర్ణం, కడుపులో గ్యాస్ చేరడం వంటి సమస్యలకు లవంగాలు చూర్ణం (500mg) 10 నిమిషాలలో ఫలితం చూపుతుంది.

7). యాలకులు:

▪️అతిసారం వల్ల జీర్ణ వ్యవస్థ సక్రమంగా లేని వారికి ఒక గ్లాస్ పాలలో రెండు గ్రాముల యాలకుల పొడిని కలిపి ఇస్తే బలం చేకూరుతుంది.

▪️యాలకుల కి కిడ్నీల మీద పని చేసే ప్రభావం కలిగి ఉంటుంది.

▪️ప్రతిరోజూ యాలకుల పొడిని తీసుకుంటే మూత్రం అధికంగా వచ్చి మూత్రంలో రాళ్లు పోతాయి.

▪️గుండె దడ వచ్చే వ్యక్తుల్లో యాలకుల పొడి వలన గుండె దడ తగ్గుతుంది.

▪️మాటమాటకి తల తిరిగే వ్యక్తులకు యాలకులను చక్కెర పొడి మరియూ నేతితో కలిపి తీసుకోవడం ద్వారా ఈ సమస్య పోతుంది.

9). దాల్చిని చెక్క:

▪️ఇది పళ్లకు, చిగుళ్ల కు సంబంధించిన సమస్యలకు బాగా పని చేస్తుంది.

▪️దీని వలన ఆహారం జీర్ణం బాగా అవుతుంది.

▪️తినే ఆహారంలో దాల్చిని చెక్క చేర్చడం వల్ల కాన్సర్, అల్సర్లు రాకుండా ఉంటాయి.

▪️టైఫాయిడ్ జ్వరం ఉన్నపుడు ఈ పొడిని వేడి నీళ్లలో కాసేపు ఉంచి ఆ నీటిని వేడి చేసి ఇస్తే జ్వరం తగ్గుతుంది.

▪️సూక్ష్మజీవుల వలన కలిగే విషప్రభావం తగ్గుతుంది.

▪️రక్త స్రావం కాకుండా ఆపుతుంది.

▪️చీటికీ మాటికీ నోటిలో పుండ్లు వచ్చే వారికి ఈ దాల్చిని చెక్క చూర్ణం చాలా మంచిగా పని చేస్తుంది.

10). గసగసాలు:

▪️వీటిని ఒక గ్లాస్ వేడి నీళ్లలో ఒక గంటసేపు ఉంచి ఆ తర్వాత తాగితే తలనొప్పి తగ్గుతుంది.

▪️అలసట వల్ల కలిగిన వంటి నొప్పులు కూడా తగ్గుతాయి.

▪️వీటి పొడి మజ్జిగలో కలిపి తాగితే నీళ్ల విరేచనాలు అరగంటలో తగ్గిపోతాయి.

▪️అరగ్రాము పొడి పాలతో కలిపి తాగితే నిద్ర బాగా పడుతుంది.

▪️గొంతు వాచి నొప్పిగా ఉన్నప్పుడు వీటి కషాయం తో పుక్కిలిస్తే నొప్పి తగ్గుతుంది.

చికెన్ ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా?

చికెన్ ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా?

చికెన్‌ను పవర్ హౌస్ అని అంటారు. దీనిని తింటే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ‘చికెన్ తింటే ఎముకలు, కండరాల దృఢత్వంతోపాటు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మానసిక స్థితిని సమతుల్యంగా ఉంచుతుంది. దీనిని అతిగా తింటే కొలెస్ట్రాల్ స్థాయులు, బరువు పెరుగుతారు. అలర్జీ, ఇన్ఫెక్షన్, హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది’ అని హెచ్చరిస్తున్నారు.

ఆరోగ్యమే మహా భాగ్యం జిల్లా ప్రధాన.!

ఆరోగ్యమే మహా భాగ్యం జిల్లా ప్రధాన న్యాయమూర్తి రమేష్ బాబు

భూపాలపల్లి నేటిధాత్రి

కోర్టులో పనిచేసే న్యాయవాదులు, ఉద్యోగులు ఆరోగ్యంపట్ల శ్రద్ధ వహించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.హెచ్.రమేష్ బాబు అన్నారు. అడ్వొకేట్స్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు ప్రాంగణంలో శనివారం హెల్త్ క్యాంపు నిర్వహించారు. కార్యక్రమాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ప్రధాన న్యాయమూర్తిగారు మాట్లాడుతూ ఆధునిక యుగంలో బిజీ జీవితాలను గడుపుతున్న తరుణంలో ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. బి.పి, షుగర్, ఈ.సి.జి కంటి పరీక్షలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ సివిల్ జడ్జి, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఏ. నాగరాజ్ అడ్వొకేట్స్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వి. శ్రీనివాస చారి ప్రధాన కార్యదర్శి వి. శ్రవణ్ రావు చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అనితావని మేడికవర్ హాస్పిటల్, శరత్ కంటి హాస్పిటల్ డాక్టర్లు వారి సిబ్బంది, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, కోర్టు కాన్స్టేబుళ్లు పాల్గొన్నారు.

వైద్యులు లేని ఆరోగ్య శిబిరాలు ఎందుకు…?

వైద్యులు లేని ఆరోగ్య శిబిరాలు ఎందుకు…?

ఆరోపిస్తున్న ప్రజలు…

వైద్యులు లేని శిబిరాలకు రావడానికి విముఖత వ్యక్తం చేస్తున్న ప్రజలు…

కింది స్థాయి ఆరోగ్య కార్యకర్తల చేత మాత్రల పంపిణీతో ఆరోగ్యం కుదుటపడటం లేదని వాపోతున్న ప్రజలు…

రాకపోకలు సాగిస్తూ స్థానికంగా నివాసం ఉండకుండానే అలవెన్స్ తీసుకుంటున్న వైనం…

సమయపాలన పాటించని వైద్య ఆరోగ్య సిబ్బంది…

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-29T122412.265.wav?_=8

నేటి ధాత్రి-గార్ల:-

ముల్కనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని చిన్నకిష్టాపురం, పెద్దకిష్ట పురం,గుంపెళ్ళగూడెం తదితర గ్రామాలలో వైద్యులు లేకుండానే అర్థం-పర్థం లేని ఆరోగ్య శిబిరాలు కొనసాగుతున్నాయి. వైద్యులు లేని ఆరోగ్య శిబిరాలు ఎందుకు…? అని ఆరోపిస్తున్న అనారోగ్య పీడితులు.వర్షాకాల సీజన్ లో సీజనల్ వ్యాధులు తరుముకొస్తున్న వేళ స్థానికంగా ఉండి ప్రజలకు అందుబాటులో ఉంటూ,వైద్య సేవలు అందించవలసిన వైద్యులు,వైద్య సిబ్బంది సుదూర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తూ స్థానికంగా ఉండకుండానే ఏజెన్సీ అలవెన్సులు తీసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ సుదూర పట్టణ ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తూ, సకాలంలో వైద్యం అందించకపోవడంతో అనారోగ్య బాధితులు మంచాలు పట్టారు.గ్రామాల్లో నిర్వహిస్తున్న వైద్య శిబిరాలకు వైద్యులు రాకుండానే క్రింది స్థాయి ఆరోగ్య కార్యకర్తల చేత మాత్రలు పంపిణీ చేయడంతో ప్రజల ఆరోగ్యం కుదుటపడటం లేదని వాపోతున్నారు.సమయపాలన సైతం పాటించని వైద్య ఆరోగ్య సిబ్బంది పట్ల ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.డి ఎం హెచ్ ఓ,జిల్లా ఉన్నత అధికారులు చొరవ తీసుకొని ముల్కనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పై దృష్టి సారించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

జమ్మికుంటలో వికాస తరంగిణి మహిళా ఆరోగ్య

 

జమ్మికుంటలో వికాస తరంగిణి మహిళా ఆరోగ్య వికాస్ కార్యక్రమం

జమ్మికుంట (నేటిధాత్రి)

ఈరోజు జమ్మికుంట లో అమ్మ ఆరోగ్యమే సమాజ సౌభాగ్యం అనే నిదానంతో వికాస తరంగిణి ఆరోగ్య వికాస్ ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించడం జరిగింది డాక్టర్ ఎం మౌనిక పద్మ సారిక గారి ఆధ్వర్యంలో 108 మందికి గర్భాశయ ముఖ ద్వారం మరియు మహిళల ఛాతి పరీక్షలు 108 మందికి ఉచిత పరీక్షలు చేసి మందులు ఇవ్వడం జరిగింది . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు గౌతమ్ రావు. బచ్చు వీర లింగం. పుల్లూరి ప్రభాకర్. హరికృష్ణమాచార్యులు. కొల్లూరు శ్రీనివాస్.అంతం రాజిరెడ్డి.ఎదులాపురం వెంకటేష్. శీలం శ్రీనివాస్.ఎలివేణి సమ్మయ్య. మహిళా వికాస అధ్యక్షులు కర్ర రజిత దేవి. వికాస తరంగిణి జమ్మికుంట శాఖ సభ్యులు మహిళా సభ్యులు పాల్గొని విజయవంతం చేశారు.

మున్సిపల్ సిబ్బందికి సీజనల్ మరియు హెల్త్ కిట్స్ పంపిణీ.

మున్సిపల్ సిబ్బందికి సీజనల్ మరియు హెల్త్ కిట్స్ పంపిణీ

.వర్షాకాలంలో 16వ డివిజన్ ను పరిశుభ్రంగా ఉంచాలి.

సుంకరి మనిషా శివకుమార్.
16వ డివిజన్ కార్పొరేటర్

కాశిబుగ్గ నేటిధాత్రి.

వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధి 16వ డివిజన్ లోని పారిశుద్య పనులు నిర్వహిస్తున్న మున్సిపల్ సిబ్బందికి స్థానిక 16వ డివిజన్ కార్పొరేటర్ సుంకరి మనీషా శివకుమార్ సీజనల్ మరియు హెల్త్ కిట్స్ అందచేయడం జరిగింది.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ నిరంతం డివిజన్ ను పరిశుభ్రంగా ఉంచేందుకు ఎంతగానో శ్రమిస్తున్న సిబ్బంది అనారోగ్య ఇబ్బందులకు గురి కాకుండా ఉండేందుకు కార్పొరేషన్ హెల్త్ కిట్స్ అందించడం ద్వారా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని అన్నారు.అదే విధంగా వర్షా కాలాన్ని దృష్టిలో పెట్టుకొని సీజనల్ కిట్స్ అందించడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపాలిటీ సిబ్బంది కార్పొరేటర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ జవాన్ లు సిబ్బంది పాల్గొన్నారు.

అయినా.. పన్ను ప్రయోజనాలున్నాయ్‌..

 

అయినా.. పన్ను ప్రయోజనాలున్నాయ్‌

ఏ వ్యక్తికైనా ఆరోగ్య బీమా తప్పనిసరి. దేశంలో హెల్త్‌కేర్‌ వ్యయాలు ఏటా 14ు వంతున పెరుగుతున్నాయని అంచనా. అయితే వయోవృద్ధులు లేదా సీనియర్‌ సిటిజన్లు పెరుగుతున్న వయసు, ముందు నుంచి ఉన్న వ్యాధుల కారణంగా…

ఆరోగ్య బీమా లేదా..?

ఏ వ్యక్తికైనా ఆరోగ్య బీమా తప్పనిసరి. దేశంలో హెల్త్‌కేర్‌ వ్యయాలు ఏటా 14ు వంతున పెరుగుతున్నాయని అంచనా. అయితే వయోవృద్ధులు లేదా సీనియర్‌ సిటిజన్లు పెరుగుతున్న వయసు, ముందు నుంచి ఉన్న వ్యాధుల కారణంగా అందుబాటు ప్రీమియంలలో ఆరోగ్య బీమా పొందలేక పోతున్నారు. ఈ కారణంగా ఆస్పత్రి, వైద్య పరీక్షలు, డాక్టర్‌ కన్సల్టేషన్‌ వ్యయాలన్నీ తాము పొదుపు చేసుకున్న సొమ్ము నుంచే చెల్లించాల్సి వస్తోంది. ఇలాంటి అంశాలన్నీ దృష్టిలో ఉంచుకునే ఆదాయపు పన్ను చట్టం 80డి సెక్షన్‌.. 60 సంవత్సరాల వయసు పైబడిన వారందరికీ ఆరోగ్య సంబంధిత వ్యయాలపై కొన్ని రాయితీలు అందిస్తోంది. పాత ఆదాయపు పన్ను విధానాన్ని ఎంపిక చేసుకున్న వారికి మాత్రమే ఈ ప్రయోజనాలు పరిమితం. దీని కింద ఆరోగ్య బీమా పాలసీ లేకపోయినా సీనియర్‌ సిటిజన్లు ఆరోగ్య సంబంధిత వ్యయాలపై పన్ను మినహాయింపులు కోరవచ్చు.
80డి సెక్షన్‌ ఏమిటి?

పన్ను చెల్లింపుదారుల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన ఈ సెక్షన్‌ ఆరోగ్య బీమా లేదా ఆరోగ్య సంబంధిత వ్యయాలపై రాయితీలు, మినహాయింపులు అందిస్తుంది. తద్వారా పన్ను చెల్లింపు మొత్తం ఆదా చేస్తుంది.

  • ఈ సెక్షన్‌ కింద పన్ను చెల్లింపుదారు తనతో పాటుగా కుటుంబ సభ్యుల (భార్య లేదా భర్త, తనపై ఆధారపడిన సంతానం) ఆరోగ్య సంరక్షణకు చేసిన వ్యయాలపై లేదా ఆరోగ్య బీమా ప్రీమియంపై ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్ఠంగా రూ.25,000 వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు.
  • దీనికి తోడు వయోవృద్ధులైన తల్లిదండ్రుల కోసం చేసిన ఆరోగ్య సంబంధిత వ్యయాలు, ఆరోగ్య బీమా ప్రీమియంపై మరో రూ.25,000 పన్ను మినహాయింపు క్లెయిమ్‌ చేయవచ్చు.
  • అలాగే ప్రీమియం చెల్లిస్తున్న వ్యక్తి (స్వయంగా లేదా కుటుంబ సభ్యుల కోసం) సీనియర్‌ సిటిజన్‌ అయినట్టయితే ఈ మినహాయింపు పరిమితి గరిష్ఠంగా రూ.50,000 వరకు ఉంటుంది. అంటే మీరు సీనియర్‌ సిటిజన్‌ అయి ఉండి మీ కోసం, మీ తల్లిదండ్రుల కోసం కూడా ప్రీమియం చెల్లిస్తున్నట్టయితే రూ.1 లక్ష వరకు ఆదాయపు పన్ను మినహాయింపునకు క్లెయిమ్‌ చేసుకోవచ్చు.
  • ప్రివెంటివ్‌ హెల్త్‌ చెకప్‌ చెల్లింపుల (గరిష్ఠంగా రూ.5,000) కోసం చేసే వ్యయాలైతే నగదు రూపంలో చెల్లించవచ్చు. మిగతా వ్యయాలేవైనా నగదేతర రూపంలోనే చెల్లించాల్సి ఉంటుంది.

బీమా కవరేజీ లేని వారి మాటేమిటి?

ఆరోగ్య బీమా కవరేజీ లేని సీనియర్‌ సిటిజన్లకు కూడా ఈ సెక్షన్‌ రాయితీలు కల్పిస్తోంది. అలాంటి వారు వైద్య వ్యయాలపై ఏడాదికి గరిష్ఠంగా రూ.50,000 వరకు మినహాయింపులు క్లెయిమ్‌ చేసుకోవచ్చు. ఈ వ్యయాలను మీ పిల్లలు భరించినట్టయితే వారు కూడా పన్ను మినహాయింపులు పొందేందుకు అర్హులవుతారు. కేవలం 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు మాత్రమే ఈ ప్రయోజనాలు పరిమితం అన్న విషయం గుర్తుంచుకోవాలి. అంతే కాదు…నూతన, సరళీకృత ఆదాయపు పన్ను విధానం ఎంచుకున్న వారికి ఇది వర్తించదు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన డాక్టర్ రవీంద్ర నాయక్

గణపురం నేటి ధాత్రి

గణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డాక్టర్ రవీంద్రా నాయక్ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఆకస్మిక తనిఖీ చేశారుడైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ రవీంద్ర నాయక్ ని భూపాలపల్లి జిల్లా టీఎన్జీవో అధ్యక్షుడు బూరుగు రవి కలిశారు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ రవీంద్ర నాయక్ ని సన్మానించినారు
రాష్ట్రంలో ఉన్న హెల్త్ అసిస్టెంట్ అందరినీ ఫార్మసిస్టులను ల్యాబ్ టెక్నీషియన్లను రెగ్యులర్ అయిన వారందరినీ సర్వీస్ రెగ్యులరైజేషన్ గురించి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ
రెగ్యులర్ చేయాలని
సకాలంలో జీతాలు ఇవ్వాలని వారిని కోరడం జరిగింది మెమోరండం ఇవ్వడం జరిగినది ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా టీఎన్జీవో అధ్యక్షుడు బూరుగు రవి టీఎన్జీవో జిల్లా కార్యదర్శి దశరధ రామారావు మురళీధర్ రెడ్డి టి సత్యనారాయణ శ్రీదేవి జమాలుద్దీన్ హెల్త్ అసిస్టెంట్లు కాపర్తి రాజు పరమేశ్వర్ గోపి సుధీర్ సతీష్ వేణు ల్యాబ్ టెక్నీషియన్ రజిత పాల్గొన్నారు

ఆరోగ్య సేవలు సద్వినియోగం చేసుకోండి..

‘ఆరోగ్య సేవలు సద్వినియోగం చేసుకోండి’

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ పట్టణంలోని సన్ రోహి ఆసుపత్రికి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం ద్వారా సేవలు అందించేందుకు అనుమతి లభించిందని ఆసుపత్రి ఎండీ డా. సంజీవ్ కుమార్ శుక్రవారం తెలిపారు. వారు మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకంలో ఉన్న రోగాలన్నింటికి ఫ్రీగా తమ హాస్పిటల్ లో నాణ్యమైన చికిత్సలు అందిస్తామన్నారు. త్వరలో తమ ఆసుపత్రికి కేంద్ర ఆరోగ్యశాఖ నుండి ఎన్ఏబీఎస్ గుర్తింపు లభించిందన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య బృందం, తదితరులు పాల్గొన్నారు.

లేబర్ కోడ్ లను రద్దు చేయాలని మెడికల్ .!

లేబర్ కోడ్ లను రద్దు చేయాలని మెడికల్ అండ్ హెల్త్ ఉద్యోగుల నిరసన.

చిట్యాల, నేటిధాత్రి :

దేశ వ్యాప్తగా వామపక్షాల సమ్మెపిలుపు కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయడంతో పాటు, ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులందరినీ పర్మినెంట్ చేయాలి, ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు కనీస వేతనం 26,000 తక్షణమే చెల్లించాలని, ఏజెన్సీ వ్వవస్థను రద్దు పరచాలి కార్పొరేష ఏర్పాటు చెయ్యాలని పలు డిమాండ్లతో ఆల్ రికగ్నైజ్డ్ యూనియన్సు సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగముగా చిట్యాల హాస్పిటల్ ల్లో మద్దతు తెలుపుతూ నిరసన కార్యక్రమం చెయ్యడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలంగాణ మెడికల్ &హెల్త్ ఔట్సోరింగ్ కాంట్రాక్టు రాష్ట్ర ఆర్గనైసింగ్ సెక్రటరీ కట్కూరి నరేందర్ రాష్ట్ర నాయకులు కిషోర్. ఉద్యోగస్థులు రమణ. స్వామి. రఘు. సంధ్య. శ్రీకాంత్. మహేందర్. కళ్యాణ్. రాజేష్ .కుమార్. భిక్షపతి. శంకర్. శశి కుమార్. శారదా. కోమల.తదితరులు పాల్గొన్నారు.

అనేక సమస్యలకు తక్షణ పరిష్కారం.!

అనేక సమస్యలకు తక్షణ పరిష్కారం.! 

 

ఉల్లిపాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. ఇంకా, ఉల్లిపాయలలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి వివిధ వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడతాయి. అయితే, ఉల్లిపాయలే కాదు.. దాని రసం కూడా అనేక ప్రయోజనాలను కలిగిస్తుందని మీకు తెలుసా? ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

 

 

ఉల్లిపాయ రసం అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. జుట్టు పెరుగుదల, చర్మ సంరక్షణ, రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. ఇది యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంది. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. 

 

 

చర్మ సంరక్షణ:

ఉల్లిపాయ రసం చర్మం టోన్‌ను మెరుగుపరుస్తుంది. మచ్చలు, మొటిమలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది చర్మం యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.  

రోగనిరోధక శక్తి:

ఉల్లిపాయ రసం రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఇది ఇన్ఫెక్షన్లు, వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది. ఇది విటమిన్లు, ఖనిజాలకు మంచి మూలం.

జుట్టు పెరుగుదల:

ఉల్లిపాయ రసం జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇది చుండ్రును నివారిస్తుంది. జుట్టు పెరుగుదలకు అవసరమైన సల్ఫర్‌ను అందిస్తుంది. జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.  

 

గుండె ఆరోగ్యం:

ఉల్లిపాయ రసం రక్తపోటును తగ్గించడానికి, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి, రక్తం గడ్డకట్టడాన్ని నివారించడానికి సహాయపడుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. 

రక్తంలో చక్కెర స్థాయిలు:

ఉల్లిపాయ రసం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది మధుమేహం ఉన్నవారికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

జీర్ణక్రియ:

ఉల్లిపాయ రసం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది.  ఉల్లిపాయ రసం శ్వాసకోశ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version