మొగిలిపేటలో గొర్రెల, మేకల ఉచిత నట్టల మందుల పంపిణీ

మొగిలిపేట గ్రామంలో గొర్రెలకు మేకలకు నట్టల మందు పంపిణీ
మల్లాపూర్ డిసెంబర్ 30 నేటి ధాత్రి

పశు వైద్య పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఈనెల 22 నుండి 31 వరకు జరుగుతున్నటువంటి ఉచిత గొర్రెల మేకల నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మల్లాపూర్ మండలంలోని మొగిలిపేట గ్రామంలో 3100 గొర్రెలకు 450 మేకలకు నట్టల మందుల పంపిణీ చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి సర్పంచ్ గోల్కొండ కళా. ఉప సర్పంచ్ దండవేణి రాజేందర్ వార్డ్ సభ్యులు ప్రణయ్ కాంగ్రెస్ నాయకులు ఎలేటి జలపతి రెడ్డి గోల్కొండ రమేష్ లైవ్ స్టాక్ ఆఫీసర్ సుజాత వెటర్నరీ అసిస్టెంట్ రవీందర్ ఆఫీస్ సబార్డినేట్ రాజేందర్ గొల్ల కుర్మా యాదవ రైతులు ముక్కెర రాజేందర్. ముక్కెర లక్ష్మీనరసయ్య . మల్లయ్య. బాస రమేష్ తదితరులు పాల్గొన్నారు

చిట్టాపూర్ గ్రామంలో గొర్రెలు, మేకల ఉచిత నట్టల నివారణ కార్యక్రమం

చిట్టాపూర్ గ్రామంలో పశు వైద్య పశు సంవర్ధక శాఖ వారి ఆధ్వర్యంలో నట్టల మందు నివారణ మల్లాపూర్ డిసెంబర్ 30 నేటిధాత్రి

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటివంటి పశువైద్య పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో గొర్రెలు మేకలలో ఉచిత నట్టల నివారణ మందుల కార్యక్రమంలో మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామంలో సర్పంచ్ సంపాతి శంకరమ్మ ప్రారంభించారు .ఇట్టి కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి డాక్టర్ అశోక్,సహాయక సిబ్బంది రవీందర్, ఇక్బాల్, మహేష్ పంచాయతీ కార్యదర్శి అశోక్,ఉపసర్పంచ్ బాల్సని ప్రణయ్,సంపాతి ఆశలు,బార్ల మల్లేష్, బొల్లపెల్లి శ్రీనివాస్, పెసరి రాకేష్, హన్మండ్లు,మల్లేష్,సింగరపు అశోక్ తదితరులు పాల్గొన్నారు.

భక్తులతో పోటెత్తిన దేవాలయాలు

భక్తులతో పోటెత్తిన దేవాలయాలు
* వివిధ ఆలయాలను దర్శించుకున్న ఎంపీ ఈటెల, డిసిసి ప్రెసిడెంట్ వజ్రేష్ యాదవ్

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి 30 :

 

 

వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులతో దేవాలయాలు కిటకిటలాడాయి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని జిహెచ్ఎంసి ఘట్కేసర్, మూడు చింతలపల్లి మున్సిపల్ పరిధిలోని ఉద్దేమర్రి శ్రీ శివాలయంలో ఎంపీ ఈటెల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, డిసిసి అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్, డిసిసి మాజీ అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి, నక్క ప్రభాకర్ గౌడ్, బీజేపీ జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్, మాజీ అధ్యక్షులు విక్రమ్ రెడ్డి, ఏనుగు సుదర్శన్ రెడ్డి,

 

డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, మాజీ సర్పంచులు జాము రవి, విష్ణువర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దోసకాయల వెంకటేష్, ఆలయ కమిటీ చైర్మన్, డైరెక్టర్లు, వివిధ పార్టీలకు చెందిన నేతలు, భక్తులు స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకున్నారు.

శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ప్రత్యేక పూజలు

శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలుబీ

వనపర్తి నేటిధాత్రి .

 

 

వనపర్తి జిల్లా కేంద్రంలో శంకర్ గంజ్ లో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు మంగళవారం ఉదయం ఉత్తర ద్వారా దర్శనం భక్తులకు ఆలయ కమిటీ నిర్వాహకులు కల్పించారు .ఈ సందర్భంగా ప్రత్యేక పూజలో ఆలయ కమిటీ నిర్వాహకులు దాచ లక్ష్మీనారాయణ దాచ శివకుమార్ న్యాయవాది దార వెంకటేష్ క్రాంతి ట్రాన్స్పోర్ట్ విజయ్ నూకల రామకృష్ణ లగిశెట్టి శ్రీకాంత్ ఈపూరి వెంకటేష్ గోనూర్ రాజు నుకల నాగరాజు 33 వ వార్డు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ జర్నలిస్ట్ పొలిశెట్టి సురేష్ తిరుమల్ శంకర్ గంజ్ ఆలయ కమిటీ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఆలయ పూజారి చల్ల వెంకటేశ్వర్ల శర్మ భక్తులకు అర్చనలు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులు మాట్లాడుతూ శ్రీ లక్ష్మీనరసింహ ఆలయంలో ప్రతినెల స్వాతి నక్షత్రం లో ప్రత్యేక పూజలు పల్లకి సేవ రాత్రి ఉంటుందని వారు పేర్కొన్నారు శంకర్ గంజ్ శ్రీలక్ష్మి నరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి కృపకు పాత్రులు కావాలని వారు కోరారు

ఘనంగా ముక్కోటి వైకుంఠ ఏకాదశి వేడుకలు

ఘనంగా ముక్కోటి వైకుంఠ ఏకాదశి వేడుకలు

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండల కేంద్రం లోని అతి పురాతనమైన ఆరు శతాబ్దాల చరిత్ర గలిగిన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాల యంలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారా దర్శన ఏర్పాట్లను వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా దేవాలయ అర్చ కులు ఆరుట్ల కృష్ణమాచార్య ప్రత్యేక పూజలు చేసినారు అర్చకులు మాట్లాడుతూ నెలకు రెండు చొప్పున ఒక సంవత్సరంలో 24 ఏకాదశిలు వస్తాయని అందులో అత్యంత ముఖ్యమైనది వైకుంఠ ఏకాదశి అని ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశి లతో సమాన మని అందుకోసమే ఈ పర్వది నాన్ని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారని అన్నారు. ఈ పూజా కార్యక్రమంలో కార్య క్రమంలో దేవాలయ చైర్మన్ గురుస్వామి సామల బిక్షపతి చిందంరవి, వినుకొండ శంక రాచారి,సామల శంకర్ స్వా ములు కందగట్లరమేష్ సామలనాగరాజు,వనం విశాల్ నామనిశివ,కొత్తపెళ్లి రవీందర్ భాసని బాలకృష్ణ మామిడి రాజు మార్తసుమన్ గట్టు కిషన్ సురేష్ గన్నువేణు, కాంబత్తుల ప్రకాష్, బెరుగు రాజు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

రాజనగరంలో అయ్యప్పస్వామి మండల పూజ ఊరేగింపు

అయ్యప్పస్వామి మండల పూజ సందర్భంగా స్వాములు ఊరేగింపు

వనపర్తి నేటిధాత్రి .

 

రాజనగరం అయ్యప్పస్వామి ఆలయంలోకి శుక్రవారం మండల పూజ సందర్భంగా అయ్యప్ప స్వాములు ఊరేగింపు నిర్వహించారుమండల పూజ
ఉత్సవంలో స్వామి వారి ఆభరణాలు అయ్యప్పస్వామి ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి చీర్ల.కృష్ణ సాగర్ గురుస్వామి అద్యర్యము లో ఊరేగింపు నిర్వహించారు అయ్యప్ప స్వాములు,భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఆలయ కమిటీ అధ్యక్షులు ముత్తు కృష్ణ గురుస్వామి,కోశాధికారి పాపిరెడ్డి,ప్రచార కార్యదర్శి అమర వాది చిట్యాల నరేందర్ గురుస్వామి మాట్లాడుతూ అయ్యప్ప స్వామి మండల పూజ భక్తిశ్రద్ధలత జెరుగుతున్నాయని అన్నారు ఈ కార్యక్రమములో ఆలయ అర్చకులు అచ్చితాపురం రమేష్ బాబు ,బీచుపల్లి యాదవ్ ,వాకిటి.శ్రీధర్ నందిమల్ల.అశోక్, యాదగిరి,ఆవుల.రమేష్ ,భక్తులు పాల్గొన్నారు

“నర్సంపేటలో వైభవమైన పల్లివేట”

వైభవంగా అయ్యప్పస్వామి పల్లీవేట కార్యక్రమం

పల్లివేట దాతగా డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి

అయ్యప్పస్వామి నామస్మరణతో మారుమ్రోగిన నర్సంపేట

కార్యక్రమం నిర్వహణ శబరిమలై దేవాలయ మేల్ శాంతి,తాంత్రికవేత్త శంకరన్ నంబూద్రి

నర్సంపేట, నేటిధాత్రి:

 

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయం సిల్వర్ జూబ్లీ మండల పూజల మహోత్సవాల్లో భాగంగా సోమవారం అయ్యప్ప స్వామి పల్లి వేట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. పల్లివేట,మహా అన్నదానదాతగా భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి వ్యవహరించగా అయ్యప్ప స్వామి సర్వ సైన్యాధ్యక్షునిగా రాణా ప్రతాప్ రెడ్డి శిష్యుడు బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి అచ్చ దయాకర్ వ్యవహరించారు. నర్సంపేట శ్రీ ధర్మశాస్త అయ్యప్పదేవాలయ సేవా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సింగరికొండ మాధవ శంకర్, అధ్యక్షులు సైఫా సురేష్,ప్రధాన కార్యదర్శి చింతల కమలాకర్ రెడ్డి,కోశాధికారి దొడ్డ రవీందర్ గుప్తా

ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి పల్లివేట కార్యక్రమం నిర్వహించగా కార్యక్రమ నిర్వహణ శబరిమలై దేవాలయ మేల్ శాంతి,తాంత్రికవేత్త శ్రీమాన్ బ్రహ్మశ్రీ, శంకరన్ నంబూద్రి, హైదరాబాద్ మహా శాస్త్ర సేవ సంఘం ట్రస్ట్ బాధ్యులు,గురుస్వామి డాక్టర్ సుధగాని రాజుగౌడ్, నర్సంపేట దేవాలయ ప్రధాన అర్చకులు దేవేశ్ మిశ్రా వేదమంత్రాలతో చేశారు. ముందుగా దేవా ట్రస్టు ఆధ్వర్యంలో గణపతి హోమం తోపాటు పలు ప్రత్యేక పూజలను నిర్వహించారు.ముఖ్య అతిథిగా జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ జాటోత్ హుస్సేన్ నాయక్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం రాణా ప్రతాప్ రెడ్డి అనుచరుడు బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి అచ్చ దయాకర్ అయ్యప్ప స్వామి విగ్రహాన్ని తలపై ఎత్తుకొని అలంకరణ చేసిన ఊరేగింపు ప్రత్యేక వాహనాల్లో కూర్చోబెట్టారు. ఈ సందర్భంగా శబరిమలై నుండి హాజరైన వాయిద్య కళాకారులు, మనిషి వివిధ వేషాదారణలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.

అయ్యప్పస్వామి ఊరేగింపుగా పట్టణంలోని మున్సిపాలిటీ ఆదరణ పార్క్ వద్ద పూంగివనంలో తాంత్రిక వేత్త మేల్ శాంతి శంకరన్ నంబూత్రి ప్రత్యేక పూజలు చేశారు. అయ్యప్ప స్వామి పల్లివేటలో భాగంగా మున్సిపాలిటీ ప్రాంగణం ఏర్పాటుచేసిన ప్రత్యేక సెట్టులో అచ్చ దయాకర్ అయ్యప్ప విగ్రహాన్ని తలపై ఎత్తుకొని వేటకు వెళ్లే విధానాన్ని ప్రదర్శించారు.నర్సంపేట పట్టణంలో ఎక్కడ చూసినా కాషాయ జెండాలే ఆగుపడ్డాయి.ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి మాలదారులు భక్తులు చేపట్టిన అయ్యప్పస్వామి శరణు ఘోషతో పట్టణం మారుమ్రోగింది.

 

డాక్టర్ గోగుల రాణా ప్రతాపరెడ్డి మాట్లాడుతూ నర్సంపేట నియోజకవర్గం ప్రజలు రైతులు అన్ని వర్గాలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కోరుకున్నట్లు తెలిపారు. ధర్మాన్ని కాపాడడం వల్ల అదే ధర్మం మనల్ని కాపాడుతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కమిషనర్ కాట భాస్కర్, పలువురు అధికారులు,రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ వడ్డేపల్లి నరసింహ రాములు , జిల్లా ఉపాధ్యక్షులు రేసు శ్రీనివాస్ ,పార్లమెంట్ కో కన్వీనర్ కట్ల రామచంద్ర రెడ్డి,రాష్ట్ర ఓబిసి మోర్చ అధికార ప్రతినిధి గడ్డం ఆంజనేయులు,ములుగు జిల్లా నాయకులు కృష్ణవేణి,మండలాల అధ్యక్షులు, జిల్లా కౌన్సిల్ మెంబర్స్,ప్రధాన కార్యదర్శులు,ఉపాధ్యక్షులు, యువ మోర్చ జిల్లా,నియోజకవర్గ నాయకులు , దేవాలయ గురు స్వాములు,ట్రస్ట్ సభ్యులు, అయ్యప్ప మాలదారులు, భక్తులు, పాల్గొన్నారు.

మహారాష్ట్రలో వైభవమైన చండీ యాగం ప్రారంభం

మహారాష్ట్ర బీవండిలో చండీ యాగం….

 

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

తంగళ్ళపల్లి మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన శ్రీ సద్గురు బోడభూమయ్య స్వామి ఆధ్వర్యంలో ఈనెల 29. 30. డిసెంబర్ .1 .వరకు మూడు రోజులపాటు చండీయాగం కొనసాగుతుందని తెలియజేస్తూ. ఈ సందర్భంగా. మహారాష్ట్రలోని నవకుండాఆత్మక రుద్ర సహిత చండీయాగం ఈనెల 29 నుంచి డిసెంబర్ 31 వరకు గీత జయంతి రజత్సవం పురస్కరించుకొని యాగం నిర్వహిస్తారని. జిల్లా నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వెళ్తారని నవంబర్ 28నమా రాష్ట్ర బివండీలోఈనెల29. నవకుండాత్మకరుద్రసహిత చండీయాగం తంగళ్ళపల్లి మండలo బస్వాపూర్.గ్రామానికి చెందిన శ్రీ సద్గురు భూమయ్య స్వామి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహిస్తారని ఈ చండీయాగంలో .101.జంటలు పాల్గొంటారని డిసెంబర్ ఒకటో తారీఖున గీతా జయంతి పురస్కరించుకొని చండీయాగం తెలంగాణకు చెందిన ప్రముఖ భక్త టీవీ దీపోత్సవ పురోహితులు చండీయాగృత్వికులు శ్రీ బ్రహ్మశ్రీ రేవల్లి రాజుశర్మ బృందంతో చండీయాగం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అలాగే బస్వాపూర్ నుంచి మహారాష్ట్రకు తంగళ్ళపల్లి మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన శ్రీ సద్గురు బోడ భూమయ్య స్వామి ఉన్నత విద్యాభ్యాసంచేసి ఉపాధి కోసం మహారాష్ట్రలోని ముంబాయికి వెళ్లారు అక్కడ వస్తా పరిశ్రమను నిర్వహిస్తూ ఎంతో మందికి ఉపాధి కల్పించారు కాలక్రమేనా ఆధ్యాత్మికత వైపు పయనించారు. వస్తా పరిశ్రమ నిర్వహిస్తూనే గీతా జయంతిలోపాల్గొనేవారు. అక్కడ శ్రీ సద్గురు శ్రీ శ్రీ మాధవస్వామితోఉంటూ ఆయనప్రియ.శిష్యుడుగా మారాడు తర్వాత ముంబై నుంచి భివండీచేరుకొని బివoడిలోనిలోనినార్ పోలీలలోబాలాజీనగర్ గంగారం బాడీలో శ్రీమద్భగవద్గీత భక్త మండలి స్థాపించారు ఈ ఆశ్రమంలో గీతా ప్రచారం. పారాయణం నిర్వహిస్తూ నే టితో20 సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో 25వ గీతా జయంతిని వైభవంగా నిర్వహిస్తున్నారని. మూడు రోజులపాటు రథోత్సవం నిర్వహిస్తారని. జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఈ నెల 29. నుంచి డిసెంబర్ 31 .వరకు నవకుండాత్మకతరుద్రసాహిత చండీయాగం జరుగుతుందని ఈనెల 29న. యాగం ప్రారంభమవుతుందని 101 జంటలతో యాగం నిర్వహిస్తారని మూడు రోజుల పాటు జరిగిన తర్వాత మూడో రోజు గీత జయంతి నా యాగం ముగిస్తుందనిశ్రీమద్భగవ గీత భక్తమండలిఆధ్వర్యంలో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారని తెలంగాణలో పలు జిల్లాల నుంచి అధికంగా భక్తులు తరలి వస్తారని ఈ సందర్భంగా తెలియజేశారు

లక్ష్మీ దేవి అమ్మవారిని దర్శించిన ఎమ్మెల్యే మాణిక్ రావు

లక్ష్మీ దేవి అమ్మ వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

మొగుడంపల్లి మండలం మాడిగి గ్రామంలో ఆలయ కమిటీ వారి ఆహ్వానం మేరకు లక్ష్మీ దేవి అమ్మ వారి ఆలయ 5వ వార్షికోత్సవ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమలలో పాల్గొని , తీర్థ ప్రసాదాలు స్వీకరించిన శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆ అమ్మ వారి దయతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో సుభాష్ రెడ్డి ,నారాయణ, ఉద్యమకారుడు సీనియర్ నాయకులు షకీల్, వార్డ్ మెంబర్ రాజు, మచేందర్,పార్టీ ప్రెసిడెంట్ రాజు ,నాయకులు ఏ.నారాయణ, సుభాష్,విశ్వనాథ్,గోపాల్ , భద్రనాథ్,హరికాంత్ రెడ్డి,రవి, శరణప్ప , గ్రామ పెద్దలు ,బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

మల్గి మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు

మల్గి మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు మాజీ సర్పంచ్ జట్గొండ మారుతి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

న్యాల్కల్ మండలం లోని మల్గి మల్లన్నస్వామి జాతర మహోత్సవంలో భాగంగా మాజీ సర్పంచ్ దంపతులు జట్గొండ మారుతి శిరీష ప్రత్యేక పూజలు చేశారు ఆలయంలో బుధవారం స్వామివారికి అభిషేకం హారతి పూజా కార్యక్రమ నిర్వహించినారు పరిసర గ్రామాలకు చెందిన భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలుచేసి దర్శించుకున్నారు అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదనం చేశారు,

సుభ్రహ్మణ్య షష్టి ఉత్సవాలు వైభవంగా

వైభవంగా సుబ్రహ్మణ్య స్వామి షష్టి పూజలు….

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

రామకృష్ణాపూర్ పట్టణంలోని కోదండ రామాలయం గుడి ఆవరణలో గల అయ్యప్ప దేవాలయంలో సుబ్రహ్మణ్య షష్టి పూజలు వైభవంగా సాగాయి. అయ్యప్ప దీక్ష పరులు సుబ్రహ్మణ్య స్వామి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. గణపతి అభిషేకం, సుబ్రహ్మణ్య స్వామి పూజ అయ్యప్ప పూజ, నాగ దేవత లకు అభిషేకాలు నిర్వహించారు. ఈ మాసంలో శుక్ల పక్ష షష్టి రోజు సుబ్రహ్మణ్య షష్టిని భక్తులు జరుపుకుంటారు. సుబ్రహ్మణ్య షష్టిని స్కంద షష్టి అని కూడా అంటారు.శివ పార్వతుల తనయుడైన సుబ్రహ్మణ్యస్వామి తారకాసురుడిని సంహరించడానికి ఆవిర్భవించినట్లు చరిత్రలు చెబుతున్నాయి. భక్తిశ్రద్ధలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధిస్తే కోరికలు నెరవేరుతాయని అంటారు. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తే పెళ్లి కాని వారికి వివాహం జరిగి సత్ సంతాన సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తే జీవితంలోని అనేక సమస్యల నుండి బయటపడొచ్చని వేద పండితులు చెబుతున్నారు. అంబ ప్రసాద్, శరత్ అయ్యగారు, గురు స్వాములు గడ్డం రమేష్,కట్కూరి శ్రీనివాస్,లంక రామస్వామి, నట రాజ్,వెంకటేశ్వర్లు, అమర్నాథ్ రెడ్డి, కన్నె స్వాములు, కత్తి స్వాములు,గంట స్వాములు, గద స్వాములు,భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ 7వ వార్షిక బ్రహ్మోత్సవం..

హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్‌లో నవంబర్ 14 – 19 వరకు వైభవంగా జరగనున్న 7వ వార్షిక బ్రహ్మోత్సవాలు

హైదరాబాద్, నేటిధాత్రి:

హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్, హైదరాబాద్‌లో ఏడవ వార్షిక శ్రీ బ్రహ్మోత్సవాలు నవంబర్ 14 నుంచి 19, 2025 వరకు ఘనంగా జరగనున్నాయి.

2018లో ఆరంభమైన స్వర్ణ దేవాలయంలో స్వయంభూ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి, శ్రీ శ్రీ రాధాగోవింద ప్రధాన విగ్రహాలుగా వెలసి నిత్యం పూజలు అందుకుంటున్నారు. వీరితో పాటు పాంచజన్యేశ్వర స్వామి, జలగర్భ శాలిగ్రామ శిల, శ్రీ జప ఆంజనేయ స్వామి మరియు ఆచార్య పరంపరా ప్రతిష్ఠించబడ్డాయి.

బ్రహ్మోత్సవం అనేది ఆలయ ప్రతిష్ఠ మరియు విగ్రహాల మహా సంప్రోక్షణను చేసుకునే వార్షిక వేడుక. స్వయంగా బ్రహ్మదేవుడే శ్రీమన్నారాయణునికి మొదటగా నిర్వహించిన ఈ ఉత్సవం పేరే బ్రహ్మోత్సవం. ఆధ్యాత్మిక సంప్రదాయంగా కొనసాగుతూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆలయాలన్నింటిలోనూ ప్రతి సంవత్సరం నిర్వహించే ఆచారంగా జరపబడుతుంది. ఈ పవిత్ర సంప్రదాయాన్ని కొనసాగిస్తూ హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్ ప్రతి సంవత్సరం ఘనంగా శ్రీ బ్రహ్మోత్సవాన్ని నిర్వహిస్తోంది.

ఈ ఏడాది ఉత్సవాలు నవంబర్ 14న శ్రీ లక్ష్మీనరసింహ స్వామి మూలవరు మరియు ఉత్సవమూర్తుల అభిషేకంతో ప్రారంభమవుతాయి. నవంబర్ 17 మరియు 19 తేదీల్లో శ్రీ భూసమేత నరసింహ స్వామి కళ్యాణోత్సవం, శ్రీ శ్రీ రాధాగోవింద దేవుల 108 కలశ మహాచూర్ణాభిషేకం మరియు మహాసంప్రోక్షణ వంటి ప్రధాన కార్యక్రమాలు జరగనున్నాయి. ప్రతిరోజూ దేవతామూర్తులకు విశేషాలంకారాలు, పుష్పాలంకరణలు, నూతన వస్త్రాలు, ఆభరణాలతో అలంకరించి, హరినామ సంకీర్తనాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక ఉత్సాహంతో మార్మోగనుంది.

ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా, బ్రహ్మోత్సవ ఆహ్వాన పోస్టర్ మరియు కార్యక్రమ వివరాలను హరేకృష్ణ మూవ్ మెంట్ , హైదరాబాద్ అధ్యక్షులు శ్రీమాన్ సత్యగౌర చంద్రదాస ప్రభూజీ (ఎంటెక్, ఐఐటీ మద్రాస్) గారు విడుదల చేశారు.
ఉత్సవాలు మరియు వైభవమైన కార్యక్రమాలు.

నవంబర్ 14, శుక్రవారం
ఉదయం 5:15 – శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి మూలవర మరియు ఉత్సవర అభిషేకం
సాయంత్రం 6:30 – భూ వరాహ పూజ, వైనతేయ ప్రతిష్ఠ, అంకురార్పణ

నవంబర్ 15, శనివారం
ఉదయం 8:30 – ధ్వజారోహణం
ఉదయం 10:00 – ఉత్సవ హోమం
సాయంత్రం 5:00 – దేవత ఆవాహన
సాయంత్రం 6:00 – శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఊంజల సేవ

నవంబర్ 16, ఆదివారం
ఉదయం 9:30 – మహా సుదర్శన హోమం
సాయంత్రం 6:00 – ఉత్సవ హోమం, హనుమద్ వాహన సేవ, శ్రీ రాధా గోవింద ఝూలన్ ఉత్సవం

నవంబర్ 17, సోమవారం
ఉదయం 9:30 – శ్రీ రాధా గోవింద మూలవర ప్రతిష్ఠ , ఉత్సవ హోమం
ఉదయం 11:30 – చప్పన్ భోగ్ సేవా
సాయంత్రం 6:00 – ఉత్సవ హోమం
సాయంత్రం 6:45 – కార్తీక సోమవారం, శ్రీ భూ సమేత నరసింహ స్వామి కల్యాణోత్సవం

నవంబర్ 18, మంగళవారం
ఉదయం 9:30 – ఉత్సవ హోమం
సాయంత్రం 6:00 – ఉత్సవ హోమం, గరుడ వాహన సేవ, శ్రీ రాధా గోవింద ఝూలన్ ఉత్సవం

నవంబర్ 19, బుధవారం
ఉదయం 8:30 – ఉత్సవ హోమం
ఉదయం 9:30 – మహా పూర్ణాహుతి
ఉదయం 10:30 – ఉత్సవార అభిషేకం & చక్ర స్నానం
సాయంత్రం 6:00 – దేవత ఉద్వాసనం & శ్రీ పుష్ప యాగం
సాయంత్రం 6:45 – శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి, శ్రీ రాధా గోవింద, శ్రీ నితాయి గౌరాంగ, శ్రీల ప్రభుపాదుల వారికి మహా చూర్ణాభిషేకం
రాత్రి 9:00 – మహా సంప్రోక్షణం

ఈ సందర్భంగా ప్రభూజీ మాట్లాడుతూ, “తెలంగాణ తొలి గోల్డెన్ టెంపుల్‌లో 7వ శ్రీ బ్రహ్మోత్సవాన్ని ఆరు రోజులపాటు భక్తి భావంతో జరుపుకుంటున్నాము. ఈ ఉత్సవాలు మన సంప్రదాయాన్ని, దైవారాధనను, కీర్తనలతో, సేవలతో, అర్చనలతో స్మరింపజేస్తాయి. అందరూ ఈ పవిత్ర ఉత్సవాల్లో పాల్గొని పరమాత్ముని దివ్య కృపను పొందాలని కోరుతున్నాము” అని అన్నారు. అన్ని కార్యక్రమాలు శ్రీమాన్ సత్యగౌర చంద్రదాస ప్రభూజీ ఆధ్వర్యంలో జరుగుతాయి. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా భక్తులు, యువకులు, సంఘ సభ్యులు పాల్గొననున్నారు. భక్తుల సౌకర్యార్థం ప్రసాద పంపిణీ, వసతి, రవాణా వంటి అన్ని ఏర్పాట్లు సమగ్రంగా చేయబడ్డాయి.

ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు,
ప్రజా సంబంధాల అధికారి (PRO)
హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ – స్వయంభూ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం,
హరే కృష్ణ మూవ్‌మెంట్ – హైదరాబాద్, రోడ్ నెం. 12, బంజారాహిల్స్, హైదరాబాద్.
ఫోన్: 96400 86664 / 93964 16341 .

7th Brahmotsavam at Hare Krishna Golden Temple from Nov 14–19.

https://youtu.be/5VGpnrPf-_0?si=LbCpxN92n79tnBtb


Sri Brahmotsavam Celebrations at Hare Krishna Golden Temple from Nov 14th to Nov 19th 2025

NethiDhatri, Hyderabad:

Hare Krishna Golden Temple, Hyderabad, is all set to celebrate its 7th Annual Brahmotsavam from November 14th to 19th, 2025.

The Golden Temple, which was inaugurated in the year 2018, is presided by main Deities of an ancient Swayambhu Sri Lakshmi Narasimha Swamy and Sri Sri Radha Govinda, along with parivara devatas- Panchajanyeswara swamy, a unique Jalagarbha Saligrama shila, Sri Japa Anjaneya Swamy and other revered deities of the Acharya parampara.

Brahmotsavam is a sacred annual festival commemorating the consecration of the temple and its Deities. Originally performed by Lord Sri Brahma for the Supreme Lord Sri Narayana, this ritual has become an enduring tradition in temples worldwide, and since then, it has become a customary practice in all temples to celebrate the consecration ceremony of the temple Deities as Brahmotsavam.

In continuance of these ancient traditions, we are annually celebrating this auspicious event.
The festivities would begin on Nov 14th with Sri Lakshmi Narasimha Swamy Moolavar & Utsavar Abhishekam. On Nov 17th and Nov 19th, the most auspicious events are the sacred Sri Bhu Sametha Narasimha Swamy Kalyanotsavam, Sri Sri Radha Govinda Maha Churnabhishekam with 108 Kalashas, concluding with Maha Samprokshana.

The Celebrations on all days would witness Vishesha alankara of their Lordships, adorned with beautiful floral-decorations, Nava vastras and specially designed jewellery and ecstatic Harinama sankirtana would be conducted for the pleasure of their Lordships.

The celebrations begin on Nov 14th with the most auspicious ceremony of Abhishekam to Sri Lakshmi Narasimha Swamy Moolavar & Utsavar in the early morning hours, followed by Vainatheya Prathista and Ankurarpana in the evening. Dwaja Arohanam and other important rituals will be conducted on Nov 15th, and there shall be Sri Lakshmi Narasimha Swamy Unjala Seva in the evening. Maha Sudarshana Homa, Hanumad Vahanam, and Sri Radha Govinda Jhulan Utsav are scheduled on Nov 16th. Chappan Bhogh will be held on Nov 17th, in the morning, and the sacred Sri Bhu Sametha Narasimha Swamy Kalyanotsavam in the evening. Garuda Vahanam and Jhulan Utsav will be conducted on Nov 18th.

The most auspicious festivities of the Brahmotsavam celebrations will be conducted on Nov 19th, beginning with Maha Purnahuthi and Utsavar Abhisekam and Chakra Snanam in the morning and followed by an elaborate grand 108 Kalasha Maha Churnabhisekam to Sri Sri Radha Govinda, Sri Lakshmi Narasimha Swamy, Sri Nitai Gauranga, and Srila Prabhupada Utsavar Deities, and the festivities will conclude with a Maha Samprokshana in the evening.

At a specially convened program, Sri Satya Gaura Chandra Dasa Prabhu (M.Tech, IIT, Madras), President of the Hare Krishna Movement, Hyderabad, released the invitation poster and program details of the upcoming Brahmotsavam.

Speaking about the ceremony, Prabhuji said, “We are joyfully celebrating the 7th Sri Brahmotsavam at Telangana’s First Golden Temple, with six days of divine festivities. The celebrations continue the ancient tradition of honoring the Lord through elaborate rituals, kirtans and devotional services. He also invited each and every one to attend and actively participate in these auspicious celebrations and receive the blessings of the Supreme Lord.”

All celebrations will be presided over by His Grace Sri Satya Gaura Chandra Dasa Prabhuji, President of the Hare Krishna Movement, Hyderabad.

The event will host esteemed governing body members, temple presidents, congregation members, youth, and devotees from across the country.

Elaborate arrangements for Prasadam distribution and visitor convenience have been planned at the temple.

Thanks and Regards,
Public Relations Officer (PRO)
Hare Krishna Golden Temple Swayambhu Sri Lakshmi Narasimha Swamy Kshetram,
Hare Krishna Movement – Hyderabad, Road No. 12, Banjara Hills, Hyderabad, Phone: 96400 86664 / 93964 16341.

17నవంబర్ న మహారుద్రయాగ మహోత్సవం

17నవంబర్ న మహారుద్రయాగ మహోత్సవం

కుంకుమేశ్వర ఆలయంలో ఘనంగాబిల్వార్చన కార్యక్రమం

పరకాల,నేటిధాత్రి

 

పట్టణంలోని కుంకుమేశ్వర ఆలయంలో కార్తీకమాస మహా రుద్రయాగా మహోత్సవం 17నవంబర్ సోమవారం రోజున ప్రముఖ పండితులు కోమాళ్ళపల్లి సంపత్ కుమార్ శర్మ ఆచార్యత్వమున అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్టు మహారుద్రయాగ సమితి సభ్యులు తెలిపారు.ఈ సందర్బంగా రుద్రయాగ సమితి మరియు ఆలయ ధర్మకర్తల మండలి,దాతల సహకారంతో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని ఈ యాగంలో ప్రాసాద ప్రదక్షిణ,ఉత్సవ అనుజ్ఞ, ప్రత్యాహ్నికపూజా,గోపూజా, గణేశపూజన,పుణ్యాహవాచ,పంచగవ్యప్రాశన,అగ్ని ప్రతిష్టాపన,మహారుద్రయాగము,మహాపూర్ణాహుతి,మహదాశీర్వచనము,తీర్థ ప్రసాద వితరణ,మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించబడునని పేర్కొన్నారు.

ఆలయంలో లక్ష బిల్వార్చన కార్యక్రమం

కుంకుమేశ్వర స్వామి దేవాలయంలో లక్ష బిల్వార్చన కార్యక్రమం దాతలు గందే సదానందం జగత్ లక్ష్మీ మరియు ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ కోమల్లపల్లి సంపత్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ స్వామీవారిని స్మరిస్తూ అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కుంకుమేశ్వర స్వామి దేవాలయ కమిటీ చైర్మన్ కొలువురి రాజేశ్వరరావు,మహా రుద్రయాగ సమితి అధ్యక్షులు ఎర్ర లక్ష్మణ్,మహా రుద్రయాగ సమితి కన్వీనర్ గంధ రవి,కో కన్వీనర్ ఆముదాల పెళ్లి అశోక్,పోచురాజు వెంకట్ రెడ్డి మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

పెరుగుతున్న అయ్యప్పస్వామి మలాదారులు

పెరుగుతున్న అయ్యప్పస్వామి మలాదారులు

ఒక్కరోజే 86 మంది అయ్యప్పస్వామి దీక్షా

ఈ నెల 5 న కార్తీక పౌర్ణమి వేడుకలు,పడిపూజ,సామూహిక సత్యనారాయణ వ్రతం

నర్సంపేట,నేటిధాత్రి:

 

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని శ్రీ ధర్మశాస్త అయ్యప్పస్వామి దేవాలయంలో అయ్యప్పస్వామి దీక్షా చెప్పట్టే మాలాదారులు రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్నది.కార్తీక సోమవారం ఒక్కరోజే 86 మంది స్వాములు అయ్యప్పదీక్షా చేపట్టారు.ఐతే అయ్యప్పస్వామి సేవా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సింగిరికొండ మాధవశంకర్ గుప్తా,అధ్యక్షుడు సైపా సురేష్ ఆధ్వర్యంలో దేవాలయ సిల్వర్ జూబ్లీ మహోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు.మాలధారణ చేపట్టిన స్వాములకు దీక్షా నియమాలను దేవాలయ ప్రధాన అర్చకులు దేవేష్ మిశ్రా వివరించారు.

ఈ నెల 5 న కార్తీక పౌర్ణమి వేడుకలు,పడిపూజ,సామూహిక సత్యనారాయణ వ్రతం

శ్రీ ధర్మశాస్త అయ్యప్పస్వామి దేవాలయంలో 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ మండల పూజల మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అయ్యప్పస్వామి దేవాలయ సేవా చారిటబుల్ ట్రస్టు చైర్మన్ సింగిరికొండ మాధవశంకర్ గుప్తా తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల 5 కార్తీక పౌర్ణమి వేడుకలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.ఈ సందర్భంగా దేవాలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతం చేపడుతున్నామని పేర్కొన్నారు.అదే రోజు కార్తీక దీపోత్సవం,అయ్యప్పస్వామి మహాదివ్య పడిపూజ కార్యక్రమం చేపడుతున్నట్లు ట్రస్టు అధ్యక్షుడు సైపా సురేష్ తెలిపారు.

హరే కృష్ణ హెరిటేజ్ టవర్ ప్రాజెక్ట్‌కు శ్రీ నర్సింగ్ క్లాత్ ఎంపోరియం వారి రూ. 50 లక్షల విరాళం

హైదరాబాద్, అక్టోబర్ 31, 2025:

హరేకృష్ణ మూవ్‌మెంట్ – హైదరాబాద్ (HKM-H) ఆధ్వర్యంలో నిర్మాణంలో ఉన్న ప్రతిష్ఠాత్మక హరే కృష్ణ హెరిటేజ్ టవర్ ప్రాజెక్ట్‌కు ప్రముఖ వ్యాపార సంస్థ శ్రీ నర్సింగ్ క్లాత్ ఎంపోరియం ప్రైవేట్ లిమిటెడ్ నుంచి రూ. 50 లక్షల విరాళం లభించింది.

ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ నర్సింగ్ క్లాత్ ఎంపోరియం మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సంజయ్ సింగానియా మరియు డైరెక్టర్ శ్రీ రవికాంత్ సింగానియా ఆధ్వర్యంలో ఈ విరాళాన్ని అందజేశారు. ఈ విరాళ చెక్కును హరే కృష్ణ మూవ్‌మెంట్ హైదరాబాద్ అధ్యక్షులు శ్రీ సత్య గౌర చంద్రదాస ప్రభూజీ (ఎం.టెక్, IIT చెన్నై) గారికి అందజేశారు.
దీంతో శ్రీ నర్సింగ్ క్లాత్ ఎంపోరియం ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి హరే కృష్ణ హెరిటేజ్ టవర్ (HKHT) ప్రాజెక్ట్‌కు మొత్తం విరాళంగా రూ. 1.14 కోట్లు అందించబడ్డాయి. అదే విధంగా, ఈ సంస్థ 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ. 300 కోట్ల టర్నోవర్ లక్ష్యాన్ని కూడా నిర్ణయించింది.

ఈ మేరకు శ్రీ సత్యగౌర చంద్రదాస ప్రభూజీ గారు, మాట్లాడుతూ – నర్సింగ్ క్లాత్ ఎంపోరియం సంస్థ దాతృత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. “సమాజంలో ఇలాంటి సేవా దృక్పథం కలిగిన వ్యాపార సంస్థల సహకారం వల్లే భారతదేశం యొక్క ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వం, భవిష్యత్ తరాలకు సురక్షితంగా అందుతుంది” అని కొనియాడారు.

ఘనంగా పల్లకి సేవ

ఘనంగా పల్లకి సేవ

జహీరాబాద్ నేటి ధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

సంగారెడ్డి: జహీరాబాద్ మండలం హోతికే గ్రామ శివారులోని భవానీ మాత, మహేశ్వరి మాత మందిరంలో పౌర్ణమి సందర్భంగా పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. ఉదయం పూజా కార్యక్రమాల తర్వాత నిర్వహించిన పల్లకి సేవలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో అధికారులు, ప్రముఖులు పాల్గొని దేవీ ఆశీస్సులు పొందారు.

కోటగుళ్ళు, ఆంజనేయ స్వామి దేవాలయంలో భూపాలపల్లి సిఐ పూజలు

కోటగుళ్ళు, ఆంజనేయ స్వామి దేవాలయంలో భూపాలపల్లి సిఐ పూజలు

గణపురం నేటి ధాత్రి

Vaibhavalaxmi Shopping Mall

గణపురం మండల కేంద్రంలోని శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లు, శ్రీ దక్షిణముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో భూపాలపల్లి సిఐ దొమ్మాటి నరేష్ కుమార్ గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాల అర్చకులు గోవర్ధన వేణుగోపాలాచార్యులు, జూలపల్లి నాగరాజు లు సిఐని సాదరంగా ఆహ్వానించి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం శాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించి ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలను అందజేశారు.

పోచమ్మ తల్లి దేవాలయానికి విరాళం.

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-67.wav?_=1

పోచమ్మ తల్లి దేవాలయానికి విరాళం.

కల్వకుర్తి/ నేటి ధాత్రి :

కల్వకుర్తి పట్టణంలోని హనుమాన్ నగర్ కాలనీలో పోచమ్మ దేవాలయం నిర్మాణానికి విశ్రాంతి ఉపాధ్యాయుడు నాగులపల్లి యాదగిరి రూ 46,116 విరాళాన్ని శనివారం దేవాలయం నిర్వాహలకు అందజేశారు. ఈ విరాళంతో దేవాలయం గోపురం పైన ఉన్న కలశం చేయించినట్లు నిర్వాహకులు తెలిపారు. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడానికి దాతలు విరాళాలు అందజేయాలని నిర్వాహకులు కోరారు.

మెట్పల్లిలో ప్రత్యేక వినాయక పూజ…

మెట్పల్లిలో ప్రత్యేక వినాయక పూజ

మెట్ పల్లి సెప్టెంబర్ 5 నేటి దాత్రి
మెట్ పల్లి పట్టణ బాలకిషన్ నగర్ వినాయక సొసైటీ వారి ఆధ్వర్యంలో పురోహితులు రమణ చారి వేద మంత్రాలతో వినాయక స్వామి వారికి రాత్రి ప్రత్యేక పూజలు అనంతరం 51. ప్రసాదల నైవేద్యం కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో సొసైటీ తోట ప్రవీణ్ వినాయక కమిటీ అధ్యక్షులు తోట ప్రసాద్ సాంబారు శ్రీనివాస్ చందనగిరి రమేష్ డొల్ల నాగేశ్వర్ తాడూరి యాదగిరి బోయిని ప్రవీణ్ కుమార్ పర్రి శంకర్ మహేష్ చొప్పరి శ్రీనివాస్ కోరే రమేష్ మనోహర్ శ్రీనివాస తులసీదాస్ మర్రి మహేష్ తదితరులు మహిళలు కాలనీవాసులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version