ఈ నేల 23 న శ్రీ మహంకాళి దేవలయం 26 వ వార్షికోత్సవం..

ఈ నేల 23 న శ్రీ మహంకాళి దేవలయం 26 వ వార్షికోత్సవం

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఈ నేల 23 వ తేదీన జహీరాబాద్ పట్టణంలోని మొగుడంపల్లి చౌరస్తా వద్ద గల శ్రీ మాహకాళి దేవాలయం 26 వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించ తలపెట్టినట్లు ఆలయ ప్రదాన అర్చకులు రాజన్న తెలిపారు.
మహంకాళి దేవలయము 26 వార్షికోత్సవం సందర్బంగా ఈ నేల 22 మంగళవారం బోనాలు, రంగము, 23 వ తేదీ బుధవారం నాడు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అమ్మవారి బలిపూజ, అభిషేకం, తీర్థ ప్రసాద వితరణ మరియు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈనేల 23 తేదీ నాటికి శ్రీ మహంకాళి దేవలయం స్థాపించి 25 సంవత్సరాలు గడిచినట్లు తెలిపారు. 26 వార్షికోత్సవం సందర్బంగా అమ్మవారకి బోనాలు, రంగము, అభిషేకం, భక్తీ గీతా ఆలపనాలు, భజనలు, వివిధ రకలైన సంస్కృత కార్యక్రమాలు అతివైభవంగా జరుప నిశ్చయించినట్లు తెలిపారు. కావున ఇట్టి కార్యక్రమంలో జహీరాబాద్ ప్రాంత భక్తజనులందరు అధిక సంఖ్యలో పాల్గొని తన, మన, ధనములతో సేవచేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించి మకాళి మాత కృపకు పాత్రులు కాగలరని కోరారు.

ఆలయ చరిత్ర:-

మన దేశానికి స్వాతంత్ర్యం రాక పూర్వము బ్రిటిష్ పరిపాలన కాలంలో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం హైదరాబాద్ నుండి జహీరాబాద్ పట్టణం మీదుగా కర్నాటక, మాహరాష్ట్రలకు రైల్వే లైన్ ఎర్పాటు చేశారు. ఆ సందర్భంలో జహీరాబాద్ పట్టణంలో రైల్వే లైన్ నిర్మాణం కోనసాగుతుండగా శ్రీ మహంకాళి ఆలయం వద్దకు రాగనే అట్టి పనులు అర్ధాంతరంగా ఆగిపోయి ముందుకు సాగలేదు. అప్పట్లో ఓ పూజరి అక్కడికి‌ వచ్చి మొగుడంపల్లి చౌరస్తా వద్ద శ్రీ మహంకాళి ఆలయం నిర్మించాలని ఇక్కడ అమ్మవారి నివాస స్థాలమని రైల్వే ఉన్నత అధికారులకు ఆదేశించారు. పూజరి ఆదేశం మేరకు ఆ ప్రాంతంలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఆలయం సమీపంలో నుండి రైల్వే లైన్ పనులు కోనసాగించి పూర్తి చేశారు. 25 సంవత్సరాల క్రితం జహీరాబాద్ పట్టణం గడి మాహీలకు చేందిన ప్రదాన అర్చకులు రాజన్న జహీరాబాద్ పట్టణ పెద్దలు శ్యాం రావు, మాజీ మున్సిపల్ చైర్మన్ మంకాల్ సుబాష్, జహీరాబాద్ మాజీ ఎంపిపి అధ్యక్షులు విజయ్ కుమార్, తదితరుల సహయ సకారలతో శ్రీ మహంకాళి మాత ఆలయని నిర్మించినట్లు తెలిపారు. ఈ ఆలయనికి వచ్చిన భక్తులు కోరుకున్న కోరికలు నేరవేరడంతో మన తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్ కర్నాటక, మాహరాష్ట్రల నుండి భక్తులు తరలి వచ్చి దైవదర్శనాలు చేసుకుంటున్నారు. ఈ ఆలయం జహీరాబాద్ పట్టణంలోని మొగుడంపల్లి చౌరస్తా వద్ద గల 65 వ నంబర్ జాతీయ రహదారి ప్రక్కనే ఉండటంతో ప్రతి రోజు వందల సంఖ్యలో భక్తులు తరలి వచ్చి దైవ దర్శనాలు చేసుకుంటారు. ఇక్కడికి వచ్చే భక్తుల సహయ సహకారలతో దిన దనానికి మహంకాళి ఆలయం అభివృద్ది చేందుతు వస్తుంది..

బీజేపీ పార్టీ బలోపేతానికి కృషి

“బీజేపీ పార్టీ బలోపేతానికి కృషి”

బాలానగర్ నేటి ధాత్రి

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలో భవానిమాత దేవాలయంలో సోమవారం మండల బీజేవైఎం నూతన కమిటీని ఎన్నుకున్నారు. మండల బీజేవైఎం అధ్యక్షులుగా కుమార్ నాయక్, ఉపాధ్యక్షులుగా శ్రీరామ్, నవీన్ కుమార్ ప్రధాన కార్యదర్శిగా భరత సింహాచారి, సందీప్ కుమార్, ఈ కార్యక్రమంలో మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు గోపాల్ నాయక్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుమార్ నాయక్ మాట్లాడుతూ.. బీజేపీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. వచ్చే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బిజెపి పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటామన్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

శ్రీ ఆదర్శవాణి పాఠశాలలో ఘనంగా బోనాల పండుగ..

*శ్రీ ఆదర్శవాణి పాఠశాలలో ఘనంగా
బోనాల పండుగ*

నర్సంపేట,నేటిధాత్రి:

బోనాల పండుగ సందర్భాన్ని పురస్కరించుకొని దుగ్గొండి మండల కేంద్రంలోని శ్రీ ఆదర్శవాణి విద్యానికేతన్ పాఠశాలలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.వేడుకలలో భాగంగా అధ్యాపకుల బృందం ఆధ్వర్యంలో ప్రత్యేక బోనాలు తయారు చేసి సంబరాలకు ముస్తాబు చేశారు.అలాగే విద్యార్థులు పోతురాజుల వేషధారణ నృత్యాలతో బ్యాండ్ మేళాలతో అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీ ఆదర్శవాణి విద్యాసంస్థల చైర్మన్ నాగనబోయిన రవి, డైరెక్టర్ బత్తిని బిక్షపతి బోనాల విశిష్టత గూర్చి తెలియజేశారు. చైర్మన్ రవి మాట్లాడుతూ వర్షాకాలంలో చేసుకునే గొప్ప పండుగ బోనాల పండుగ అని, ప్రతి ఒక్కరూ జరుపుకునే పండుగ బోనాల పండుగ పట్ల సంస్కృతి సాంప్రదాయాలను ముందు తరాలకు తెలియజేయాలని కోరారు.ప్రిన్సిపల్ స్రవంతి మాట్లాడుతూ ఆడపడుచులు అమ్మవారికి ఉపవాసం ఉండి భక్తితో బోనం ఎత్తుకొని ఆడంబరంగా బోనాన్ని సమర్పిస్తారని అన్నారు. అందరూ ఆయురారోగ్యాలు, పాడిపంటలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు నృత్యాలు పాటలతో ఎంతగానో అలరించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

అయ్యప్ప దేవాలయం అభివృద్ధికి రూ. లక్ష విరాళం.

అయ్యప్ప దేవాలయం అభివృద్ధికి రూ. లక్ష విరాళం

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట పట్టణంలోని శ్రీ ధర్మ శాస్తా అయ్యప్పస్వామి దేవాలయం అభివృద్ధి కోసం ఎన్నారై దాత ఒక లక్ష రూపాయల విరాళాన్ని దేవాలయం అధ్యక్షుడు సైపా సురేష్ కు అందజేశారు.ఈ సందర్భంగా శ్రీ ధర్మ శాస్తా అయ్యప్పస్వామి దేవాలయం సేవా చారిటబుల్ ట్రస్టు అధ్యక్షుడు సైపా సురేష్ మాట్లాడుతూ నర్సంపేట పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త బండారి వైకుంఠం కూతురు అల్లుడు ఎన్నారై యూఎస్ఏ రాపాక స్వాతి నర్సింగరావు దేవాలయ పున నిర్మాణంలో భాగంగా ఒక లక్ష ఒక వెయ్యి 116 దేవాలయ కమిటీకి అందజేసినట్లు తెలిపారు.ఈ సందర్భంగా దాత ఎన్నారై యూఎస్ఏ రాపాక స్వాతి నర్సింగరావు,ప్రముఖ వ్యాపార వేత్త బండారి వైకుంఠం లను అయ్యప్పస్వామి దేవాలయంలో ఘనంగా సన్మానించారు.ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి కమలాకర్ రెడ్డి,కోశాధికారి రవీందర్,దొడ్డ వేణు,బండారి చంచారావు,దేవాలయ ప్రధాన అర్చకులు దేవేశ్ మిశ్రా,దాత కుటుంబ సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.

అంగరంగ వైభవంగా బోనాల పండుగ…..

అంగరంగ వైభవంగా బోనాల పండుగ…..

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-58.wav?_=1

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం గ్రామ పరిధిలోని ఆదివారం బోనాల పండుగ పోచమ్మ తల్లి ఆలయ కమిటీ నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. పోతురాజుల విన్యాసాలతో మహిళలు బోనాలు ఊరేగింపుగా తీసుకొని ఝరాసంగం కాలనీలోని పోచమ్మ మందిరానికి తీసుకువచ్చారు.

Bonala festival

గ్రామ పెద్దలు గ్రామంలో ఉన్న అందరూ కలిసిమెలిసి ఆయా కాలనీ వాసులు అమ్మవారికి బోనాలు సమర్పించారు.ఈ బోనాల కార్యక్రమానికి ఝరాసంగం ప్రాంత వాసులే కాకుండా చుట్టుపక ప్రాంత ప్రజలు కూడా భారీ ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం భక్తులకు అన్నదనా కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పోచమ్మ తల్లి ఆలయ కమిటీ సభ్యులు వివిధ ప్రాంతాల చెందిన భక్తులు పాల్గొన్నారు.

అనుమతి లేకుండా ఇళ్ల నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు.

అనుమతి లేకుండా ఇళ్ల నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-57.wav?_=2

జహీరాబాద్ నియోజకవర్గం న్యాల్కల్ మండలంలో
అనుమతు లేకుండా ఇళ్ల నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని న్యాల్కల్ ఎంపీడీవో గూడెం శ్రీనివాస్ హెచ్చరించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణాల కోసం పంచాయతీ కార్యదర్శుల వద్ద అనుమతులు తీసుకోవాలని చెప్పారు. అన్ని గ్రామాల్లో పారిశుధ్య వ్యవస్థ మెరుగుపరిచేలా చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. ఇలాంటి సమస్యలు ఉన్న నేరుగా ఎంపీడీవో కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు.

సంగమేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు..

సంగమేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు

 

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-56.wav?_=3

జహీరాబాద్ నేతి ధాత్రి:

దక్షిణ కాశీగా పిలిచే ఝరాసంగంలోని శ్రీ కేతకి సంగమేశ్వర దేవాలయంలో సంగమేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆషాఢ మాసం కృష్ణపక్షం, బహుళ దశమి పురస్కరించుకొని పార్వతి సహిత సంగమేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేశారు. సహస్రనామాలు, కుంకుమార్చన, బిల్వార్చన తదితర పూజలతో మంగళహారతి చేశారు. సోమవారం కావడంతో దూరప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులను చెల్లించుకున్నారు.

కలకాలం సల్లంగ చూడమ్మా గాంధారి మైసమ్మ…

కలకాలం సల్లంగ చూడమ్మా గాంధారి మైసమ్మ…

బోనంతో మొక్కలు చెల్లించిన మంత్రి వివేక్..

మైసమ్మ దీవెనలు అందరిపై ఉండాలి….

రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి..

మొక్కలు చెల్లించుకున్న ప్రముఖులు..

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-52.wav?_=4

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

ఆషాఢ మాసం చివరి ఆదివారం క్యాతనపల్లి మున్సిపాలిటీ బొక్కలగుట్ట జాతీయ రహదారి సమీపంలో గాంధారి మైసమ్మ బోనాల జాతర అంగరంగ వైభవంగా జరిగింది. పలువురు ప్రముఖులు పాలవాగు ఒడ్డున అమ్మవారి బోనంను నెత్తిన ఎత్తుకొని మైసమ్మ ఆలయంలో సమర్పించారు. పోతురాజుల విన్యాసాలు చేస్తుండగా జోగినిలు భక్తి పారవశ్యంతో అమ్మవారికి బోనం సమర్పించారు. డబ్బు చప్పుళ్ళు వాయిద్యాల నడుమ సుమారు 250 బోనాలతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బోనం సమర్పించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేశారు నిర్వాహకులు.కలకాలం సల్లంగ చూడమ్మా మైసమ్మ అని భక్తులు తల్లిని వేడుకొని మొక్కలు చెల్లించుకున్నారు.


బోనంతో మొక్కులు చెల్లించిన మంత్రి వివేక్‌…

రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ముందుకు వె ళ్లాలని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి వివేక్‌ వెంకటస్వామి అమ్మవారికి బోనం నెత్తిన పెట్టుకొని మొక్కులు చెల్లించి రాష్ట్ర ప్రజల సుభిక్షంగా ఉండాలని మొక్కులు చెల్లించారు. మంత్రి మాట్లాడుతూ మైసమ్మ తల్లి దీవెనలు అందరిపై ఉండాలన్నారు. నియోజకవర్గ అ భివృద్ధితో పాటు బొక్కలగుట్ట, గాంధారీ మైసమ్మ ఆలయ అభివృ ద్ధికి కృషి చేయనున్నట్లు తెలిపారు. అనంతరం ఆలయంలో అమ్మ వారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేశారు. ఆలయ ప్రాంగణంలో కాంగ్రెస్‌ ప్రజా ప్రతినిధులు, జిల్లా నియోజకవర్గ నాయకులు అమ్మ వారికి మొక్కులు చెల్లించుకున్నారు. మంచిర్యాల డీసీపీ భాస్కర్‌, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్‌, ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వ హించగా మందమర్రి సీఐ శశిధర్‌ రెడ్డి, రామకృష్ణాపూర్‌ ఎస్‌ఐ రాజశేఖర్‌, సర్కిల్‌ పరిధిలో ఉన్నటువంటి ఎస్‌ఐలు ఆయాశాఖల అధికారులు క్యాతన్‌పల్లి మున్సిపాలిటి, బొక్కలగుట్టపంచాయతీ అధికా రులు ఆలయ ప్రాంగణంలో ఏర్పాట్లు చేపట్టారు.

గాయకుడికి నగదు పురస్కారం.. 

గాయకుడికి నగదు పురస్కారం..  సీఎం మాట నిలబెట్టుకున్నారు 

సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలబెట్టుకున్నారు. బోనాల పండగ సందర్భంగా కోటి రూపాయల నగదు పురస్కారాన్ని ప్రభుత్వం ప్రకటించింది.

సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కు (Rahul Sipligunj) ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) నిలబెట్టుకున్నారు. బోనాల పండగ సందర్భంగా కోటి రూపాయల నగదు పురస్కారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. గత ఎన్నికలకు ముందు జరిగిన ఓ కార్యక్రమంలో అప్పటి పీసీసీ అధ్యక్షుడి హోదాలో రాహుల్ సిప్లిగంజ్ కు పది లక్షల ఆర్థిక సాయం ప్రకటిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కోటి రూపాయల నగదు పురస్కారం ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. ఇటీవల గద్దర్ అవార్డుల  సందర్భంగా కూడా ప్రత్యేకంగా రాహుల్ సిప్లిగంజ్ ను ప్రస్తావిస్తూ త్వరలోనే ప్రభుత్వ ప్రకటన ఉంటుందని ముఖ్యమంత్రి చెప్పారు.

ఆ మేరకు ఆదివారం పాతబస్తీ బోనాల పండగ సందర్భంగా రాహుల్ కు నజరానా ప్రకటించారు.  సొంత కృషితో ఎదిగిన  రాహుల్  తెలంగాణ యువతకు మార్గదర్శకుడు అని ముఖ్యమంత్రి ప్రకటించారు. పాతబస్తీ కుర్రోడిగా మొదలైన రాహుల్ ప్రస్థానం ఆర్.ఆర్.ఆర్ సినిమాలో ‘నాటు నాటు’ పాట ద్వారా అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. కాల భైరవ తో కలిసి అతను పాడిన నాటు నాటు ఆస్కార్ అవార్డు అందుకుంది. 

త్రిశక్తి అష్టలక్ష్మి కామాఖ్య దేవి ఆలయంలో.!

త్రిశక్తి అష్టలక్ష్మి కామాఖ్య దేవి ఆలయంలో బోనాల జాతర

మందమర్రి నేటి ధాత్రి

మందమర్రి పట్టణ బురద గూడెంలో మహంకాళి బోనాల జాతర….
మంచిర్యాల జిల్లా మందమర్రి బుర్రగూడెంలోని త్రిశక్తి అష్టలక్ష్మి కామాఖ్య దేవి ఆలయంలో బోనాల జాతర ఉంటుందని భక్తులందరూ పాల్గొని బోనాలను విజయవంతం చేయాలని ఆలయ అర్చకులు సతీష్ భవాని తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆషాడ మాసాన్ని పురస్కరించుకుని రేపు ఆదివారం మందమర్రి కామాఖ్య ఆలయం లో మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించడం జరుగుతుందని ఈ బోనాల జాతరకు ప్రతి ఇంటి నుండి బోనాలతో రావాలని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు అర్చకులు సతీష్ భవన్ తెలిపారు

సురభిలో బోనాల సంబరాలు..

సురభిలో బోనాల సంబరాలు

కరీంనగర్, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలోని సురభి పాఠశాలలో బోనాల సంబరాలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు సంప్రదాయ వస్త్రధారణతో హాజరయ్యారు. అమ్మవారికి బోనాలను సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొలాటం, తెలంగాణ జానపద నృత్యాలు, పాటలతో కార్యక్రమం చాలా రంజుగా సాగింది. విద్యార్థులందరూ ఉత్సాహంగా పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. ఈవేడుకలు మన సంస్కృతిని, సంప్రదాయాలను గుర్తు చేస్తూ అందరికి ఆనందాన్ని కలిగించాయి. ఈకార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ చిప్ప వీరేశం, డైరెక్టర్ చిప్ప వీర నర్సయ్య, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థులు, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

అన్యమత ఉద్యోగులని సస్పెండ్ చేసిన టీటీడీ.

అన్యమత ఉద్యోగులని సస్పెండ్ చేసిన టీటీడీ

నలుగురు అన్యమత ఉద్యోగులని తిరుమల తిరుపతి దేవస్థానం సస్పెండ్ చేసింది. ఈ మేరకు శనివారం టీటీడీ ప్రకటన విడుదల చేసింది. వీరు టీటీడీ ప్రవర్తనా నియమావళిని పాటించకపోవడంతోనే సస్పెండ్ చేశామని టీటీడీ అధికారులు తెలిపారు.

తిరుపతి: నలుగురు అన్యమత ఉద్యోగులని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఇవాళ(శనివారం) టీటీడీ ప్రకటన విడుదల చేసింది. టీటీడీలో పనిచేస్తున్న బి.ఎలిజర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (క్వాలిటీ కంట్రోల్), ఎస్. రోసి, స్టాప్‌నర్స్(బర్డ్ ఆస్పత్రి), ఎం.ప్రేమావతి, గ్రేడ్ -1 ఫార్మసిస్ట్ (బర్డ్ ఆస్పత్రి), అదేవిధంగా డా.జి.అసుంత. ఎస్వీ ఆయుర్వేద ఫార్మసీల్లో విధులు నిర్వహిస్తున్న ఈ నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

సదరు నలుగురు ఉద్యోగులు క్రిస్టియన్ మతాన్ని అనుసరిస్తున్నారని.. అందుకు సంబంధించిన ఆధారాలు, వీరిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సస్పెండ్ చేశామని టీటీడీ అధికారులు చెప్పుకొచ్చారు. వీరు టీటీడీ ప్రవర్తనా నియమావళిని పాటించలేదని అన్నారు. హిందూ ధార్మిక సంస్థకు ప్రాతినిధ్యం వహించే ఉద్యోగులుగా విధులు నిర్వర్తిస్తూ బాధ్యతారహితంగా వ్యవహరించారని చెప్పారు. ఈ క్రమంలో టీటీడీ విజిలెన్స్ విభాగం సమర్పించిన నివేదికను, ఇతర ఆధారాలను పరిశీలించిన అనంతరం నిబంధనల ప్రకారం వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు సదరు నలుగురు ఉద్యోగులను తక్షణమే సస్పెండ్ చేశామని టీటీడీ అధికారులు పేర్కొన్నారు.

మహోదయ పాఠశాలలో బోనాల పండుగ సంబరాలు.

మహోదయ పాఠశాలలో బోనాల పండుగ సంబరాలు

చందుర్తి, నేటిధాత్రి:

తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలలో గొప్పదైన ఆషాడ మాస బోనాల సందర్భంగా మండలంలోని లింగంపేట గ్రామంలో గల మహోదయ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు గురువారం పోచమ్మ బోనాల కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ ఏనుగుల కృష్ణ మాట్లాడుతూ పాఠశాలలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల విద్యార్థినీ విద్యార్థులకు చిన్ననాటి నుండే మన సంస్కృతి సంప్రదాయాలపై అవగాహన కలుగుతుందని అన్నారు. కార్యక్రమంలో భాగంగా చిన్నారులు బోనం నెత్తిన పెట్టుకొని, పోతరాజుల వేషధారణలో గ్రామ విధుల వెంట ఆటలాడుతూ పాటలు పాడుతూ పోచమ్మ ఆలయానికి చేరుకొని అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఏనుగుల రేణుక, మింగలి కవిత, ఇందూరి సౌమ్య, కముటం స్వప్న, పహిమ, మున్నిర విద్యార్థులు పాల్గొన్నారు.

సల్లంగ సూడు గాంధారి మైసమ్మ తల్లీ….

సల్లంగ సూడు గాంధారి మైసమ్మ తల్లీ….

ఆదివారం గాంధారి మైసమ్మ ఆషాఢ మాస బోనాల జాతర….

జాతరకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్న పోలీసులు

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-10.wav?_=5

రామకృష్ణాపూర్‌, నేటిధాత్రి:

మందమర్రి మండలం బొక్కలగుట్ట గ్రామ పంచాయతీ, క్యాతనపల్లి మున్సిపాలిటీ 9వ వార్డు పరిధిలోని జాతీయ రహదారి పక్కన గల గాంధారి మైసమ్మ,సంతాన నాగదేవతలు కొలువై ఉన్నారు.ఈ నెల 20 ఆదివారం రోజున అంగరంగ వైభవంగా జాతర నిర్వహించేందుకు ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. టెంట్లువేసి బారికేడ్లు ఏర్పాటు చేసింది. జంతుబలుల కోసం ప్రత్యేక ప్లాట్‌ఫామ్‌ నిర్మించింది. జిల్లా నలుమూలలతో పాటు ఆసిఫాబాద్‌ జిల్లా నుండి కోల్ బెల్ట్‌ ప్రాంతాల నుండి కార్మిక కుటుంబాలు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశమున్నది.భక్తులు మేకలు, కోళ్లు బలి ఇచ్చి సల్లంగ సూడు గాంధారి మైసమ్మ తల్లీ అని బోనాలతో మొక్కులు చెల్లించుకోనున్నారు. మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ పర్యవేక్షణలో బెల్లంపల్లి ఏసిపి రవికుమార్,మందమర్రి సిఐ శశిధర్ రెడ్డి, ఆర్కేపి ఎస్ఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించనున్నారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.

Gandhari Maisamma Ashada month Bonala

20 ఏండ్ల క్రితం మైసమ్మ ఆలయం ఏర్పాటు…

మంచిర్యాల నుండి మందమర్రి మీదుగా చంద్రపూర్‌ వెళ్లే జాతీయ రహదారిపై బొక్కలగుట్ట అటవీ సమీపంలోని పాలవాగు వంతెన వద్ద తరుచూ రోడ్డు ప్రమాదాలు జరిగేవి. అనేక మంది ప్రాణాలు కోల్పోయేవారు. దీంతో బొక్కలగుట్ట, పులిమడుగు గ్రామస్తులు చారిత్రక గాంధారి కోటలోని మైసమ్మ దేవతకు పూజలు చేసి 20 ఏండ్ల క్రితం ప్రతిష్ఠించారు. అనంతరం గుడి నిర్మించి పూజలు చేయడం ప్రారంభించారు.అప్పటి నుండి రోడ్డు ప్రమాదాలు తగ్గిపోయాయి. ఆనాటి నుండి ఆషాఢమాసంలో గాంధారి మైసమ్మ ఆలయానికి వచ్చి బోనాలతో మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తల్లికి నూటొక్క బోనాలతో జాతర నిర్వహించి మొక్కులు చెల్లించుకోవడం ఆచారంగా వస్తుంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా 20వ తేది ఆదివారం గాంధారి మైసమ్మ బోనాల జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసినట్లు ఆలయ కమిటీ తెలిపింది.

జాతరకు వచ్చే భక్తులు పోలీసులకు సహకరించండి

Gandhari Maisamma Ashada month Bonala

ఏసిపి రవికుమార్, సిఐ శశిధర్ రెడ్డి, ఎస్ఐ రాజశేఖర్

ఈనెల 20 ఆదివారం రోజున గాంధారి మైసమ్మ బోనాల జాతర జరిగే ప్రదేశం జాతీయ రహదారి కావడంతో మంచిర్యాల,రామకృష్ణాపూర్ నుండి వచ్చే భక్తులు కుర్మపల్లి స్టేజ్ వద్ద నుండి వాహనదారులు ఎట్టి పరిస్థిటీలో రాకూడదని, పులిమడుగు వద్ద నుండి యూ టర్న్ తీసుకుని ఆలయం సమీపంలో ఏర్పాటుచేసిన పార్కింగ్ ప్రదేశంకు చేరుకొని పోలీసులకు సహకరించాలని, ఆలయం వద్ద ఏర్పాటుచేసిన క్యూలైన్లో భక్తులు వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవాలని బెల్లంపల్లి ఏసిపి రవికుమార్, మందమర్రి సిఐ శశిధర్ రెడ్డి, రామకృష్ణాపూర్ ఎస్సై రాజశేఖర్ లు తెలిపారు.

తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ని కలిసి..

*తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ని కలిసి

వేద ఆశీర్వచనం అందజేసిన టిటిడి కాంట్రాక్ట్ అర్చకులు…

తిరుపతి(నేటి ధాత్రి) జూలై 16:

తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్, టిటిడి ఎక్స్ ఆపిషియో సభ్యులు డాలర్స్ దివాకర్ రెడ్డి ని తిరుమల తిరుపతి దేవస్థానములలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అర్చకులు మర్యాదపూర్వకంగా కలిసి స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేసి వేద ఆశీర్వచనం అందించారు.. మంచి మనసున్న డాలర్స్ దివాకర్ రెడ్డి శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. వందమందికి పైగా టిటిడిలో కాంట్రాక్ట్ ఆర్చకులు పనిచేస్తున్నామని తమకు గుర్తింపు కార్డులు,లడ్డు కార్డు, హెల్త్ కార్డులు అందించాలని అర్చకులు దివాకర్ రెడ్డి ని కోరారు. ఈ సందర్భంగా దివాకర్ రెడ్డి మాట్లాడుతూ కాంట్రాక్ట్ అర్చకుల విన్నపాలను టిటిడి పాలకమండలిలో చర్చించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు..

వర్షం సమృద్ధిగాకురవాలని రామాలయంలో..

వర్షం సమృద్ధిగాకురవాలని రామాలయంలో వరుణ దేవుని పూజా

గణపురం రైతులు గ్రామోత్సవంగా కప్పతల్లి ఆట

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ పట్టాభి సీతారామచంద్రస్వామి ఆలయంలో ఆలయ అర్చకులు ముసునూరి నరేష్ ఉదయం 6:00 గంటలకు వర్షాలు సమృద్ధిగా పడాలని వరుణ దేవునిపూజాకార్యక్రమంనిర్వహించారు.అనంతరం వర్షాలు బాగా కురవాలని సమృద్ధిగా పంటలు పండాలని గణపురం గ్రామ రైతులు కప్పతల్లి ఆటను యువకులతో కలిసి గణపురం పురవీధులలో శ్రీ పట్టాభి సీతారామచంద్ర స్వామిని డప్పు సప్పులతో, బింద నిండా నీరుతో వరుణదేవుని పూజిస్తూ వర్షాలు బాగా కురవాలని గణపురం పెద్దలు కప్పతల్లి ఆటను గ్రామోత్సవంగా గణపురం పురవీధులలో ఊరేగింపుగా మొదట గ్రామ దేవతలు భూలక్ష్మి అమ్మవారికి అభిషేకం నిర్వహించి, తదుపరి పోచమ్మ తల్లికిఅభిషేకంనిర్వహించి కప్పతల్లిఆటగణపసముద్రంచెరువుకట్టపైగలదక్షిణముఖఆంజనేయస్వామి దేవాలయం వరకు కొనసాగించి మరల రామాలయంవరకుకప్పతల్లి ఆటను కొనసాగించారు.ఈపూజాకార్యక్రమంలో శ్రీరామ భక్తులు, ప్రజలు, రైతులు, మహిళలు సంతోషంగా పాల్గొని వర్షాలు సమృద్ధిగా పడిపంటదిగుబడిసమృద్ధిగా ఉండాలని వరుణ దేవునికి పూజలు నిర్వహించారు.

ఘనంగా పోచమ్మ తల్లి బోనాల జాతర.

ఘనంగా పోచమ్మ తల్లి బోనాల జాతర

నస్పూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలంలోని 23వ వార్డులో ఆదివారం ఘనంగా పోచమ్మ తల్లి బోనాలు అమ్మవారికి సమర్పించినట్లు ఆలయ కమిటీ వారు తెలియజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ వేడుకలు జరపడం తృతీయ సంవత్సరమని ప్రతి సంవత్సరం అమ్మవారిని అలంకరించి బోనాలతో అమ్మవారికి మొక్కలు చెల్లిస్తామని అన్నారు.అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అమ్మవారి వద్ద పెద్ద ఎత్తున బోనాల సందడి నెల కోవడం జరిగింది.నస్పూర్ లోని తెలంగాణ తల్లి విగ్రహం నుండి పోచమ్మ దేవాలయం వరకు మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో అక్కడికి చేరుకొని, భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించి మొక్కులు సమర్పించుకున్నారు.డప్పు చప్పుళ్ళు తీన్మార్ దరువులతో ఆ ప్రాంతమంతా మారు మోగింది.శివ సత్తుల ఆటలతో జాతర శోభ సంతరించుకుంది.ప్రతి సంవత్సరం ఆషాడ మాసంలో అమ్మవారికి బోనాలు సమర్పించడం చాలా సంతోషంగా ఉందని,అమ్మవారి ఆశీస్సులు ప్రజల అందరిపై ఉండి సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో చల్లగా చూడాలని అమ్మవారికి ఆలయ కమిటీ వారు ప్రత్యేక పూజలు సమర్పించారు.

గిరిజన సంస్కృతికి ప్రతీక తీజ్ పండుగ…

గిరిజన సంస్కృతికి ప్రతీక తీజ్ పండుగ…

నేటి ధాత్రి -మహబూబాబాద్ -గార్ల :-

బంజారాల సంస్కృతి, సాంప్రదాయానికి చాటి చెప్పే పండుగలలో అతి ముఖ్యమైనది తీజ్ పండుగ. ఈ పండుగ బంజారాల జీవన విధానాన్ని వారి సాంస్కృతిక వారసత్వాన్ని తెలియజేస్తుంది.బంజారాల కట్టు,బొట్టు,సంస్కృతి, సాంప్రదాయాలకు తీజ్ పండుగ ప్రతికగా నిలుస్తుంది. ఒక ప్రాంత ప్రత్యేకతను అక్కడి ప్రజల జీవన విధానాన్ని పండుగలు చాటి చెబుతాయి.వారి సంస్కృతి, చారిత్రక నేపథ్యం, వారసత్వాలకు,సంప్రదాయ, జానపద నృత్యాలు ప్రతీకగా నిలుస్తాయి. ఇలా ప్రత్యేకమైన అహార్యం, కళలు, పండుగలు తమ పూర్వికులు ఇచ్చిన ఆస్తిగా అవి అంతరించిపోకుండా చూసుకుంటున్నారు గిరిజన ప్రజలు.తరతరాల నుండి వస్తున్న బంజారా సంస్కృతి, సాంప్రదాయాలను రక్షించడం తీజ్ పండుగ ఉద్దేశం.తండాలో వర్షాలు బాగా కురిసి,ప్రతి తండా ప్రకృతి,పచ్చదనంతో కలకలలాడుతూ ఎల్లప్పుడూ పచ్చగా హరిత భరితంగా ఉండాలనే ఉద్దేశంతో జరుపుకుంటారు.ముఖ్యంగా పెళ్లి కాని ఆడపిల్లలు శ్రావణమాసంలో భక్తిశ్రద్ధలతో 9 రోజులు అత్యంత వైభవంగా తీజ్ పండుగను జరుపుకుంటారు.ఈ పండుగను తెలంగాణ రాష్ట్రం తో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర,గోవా, కర్ణాటక, దక్షిణ భారతదేశం,ఉత్తర భారత దేశంలోని ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్,ఛత్తీస్గడ్,రాజస్థాన్, గుజరాత్ మొదలైన రాష్ట్రాల్లో చాలా గొప్పగా జరుపుకుంటారు.వెదురు బుట్టలోనే కాకుండా మోదుగు ఆకులతో గుల్లగా చేసి అందులో మట్టిని పోసి గోధుమలను చల్లుతారు. పెళ్లి కానీ ఆడపిల్లలు ప్రతిరోజు మూడు పూటలు అందంగా ముస్తాబై వెదురు బుట్టలో ఉన్న గోధుమలకు నీళ్లు జల్లుతారు.ఆడపిల్లలు పులియాగొన్నో- పూర్ణకుంభం తలపై పెట్టుకుని బావినీళ్లు, బోరింగ్ నీళ్లు గాని,చెరువు నీళ్లు కానీ తీసుకువచ్చి తీజ్ కి పోస్తారు.గోధుమ మొలకలను తీజ్ గా పిలుస్తారు.తొమ్మిది రోజులపాటు ఎంతో నిష్టతో ఆడపిల్లలు ఉపవాసం ఉండి భక్తిశ్రద్ధలతో తీజ్ పండుగను జరుపుతారు.పాటలు పాడుతూ నృత్యాలు చేస్తారు. ఊరి ప్రజలు ప్రతిరోజు సాయంత్రం ఏడు గంటల సమయంలో తిజ్ వద్దకు చేరుకుంటారు.

 

లాంబీ లాంబి ఏ లాంబడి ఏ కేరియో,దొకా కేరియే లాంబడి ఏ కెరియ, తోనకున బోరయో తీజ పావ్ లేనా,సేవా భయా బోరయో తిజ బయిరో పావ్ లేనా అంటూ పాటలు పాడుతారు. 9 రోజుల తీజ్ పండుగ సందర్భంగా ఆడపిల్లలకు కఠినమైన నియమాలు ఉంటాయి.ఉప్పు, కారం లేని భోజనం తినాలి. అత్యంత పవిత్రంగా ఉండాలి. భక్తితో దేవతలను పూజించాలి. తండా నుంచి బయటికి వెళ్ళకూడదు. మాంసం నిషేధం. బావి నుంచి నీటిని తెచ్చే బిందెను నేలపై పెట్టకుండా నేరుగా పందిరిపై నీరు పోయాల్సిందే.నృత్యాలు చేసినంత సేపు బిందెను నెత్తిపై పెట్టుకుని నిలబడాల్సిందే.నానబెట్టిన శనగలను రేగి మూళ్లను గుచ్చే ఒక విలక్షణమైన ఆచారాన్ని బోరడి ఝాస్కెరో పేరుతో పిలుస్తారు.చివరి రోజు నిమజ్జనం కనుల పండువగా బంజారా వేషధారణలో నిర్వహిస్తారు.నిమజ్జన కార్యక్రమంలో తండా పెద్దలు, మహిళలు,యువతీ, యువకులు, ఉద్యోగస్తులు, పెద్ద ఎత్తున పాల్గొంటారు.తీజ్ పండుగను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.

భక్తి శ్రద్ధలతో సంకష్ట చతుర్థి పూజలు..

న్యాల్కల్: భక్తి శ్రద్ధలతో సంకష్ట చతుర్థి పూజలు..

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంకష్ట చతుర్థి పర్వదినం సందర్భంగా సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రేజింతల్ గ్రామ శివారులో ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక ఆలయంలో సోమవారం భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి మూలమూర్తికి అభిషేకాలు, సింధూర లేపనం, అలంకరణ గావించి అష్టోత్తర శతనామ స్తోత్ర యుక్తముగా పూజలు జరిపారు. తొలి మొక్కల దేవుడిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.

స్థానిక మంజీరా విద్యాలయంలో వనమహోత్సవాన్ని.

స్థానిక మంజీరా విద్యాలయంలో వనమహోత్సవాన్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

రామంపేట జూలై 14 నేటి ధాత్రి (మెదక్)

ఈ కార్యక్రమంలో భాగంగా ఎఫ్.ఆర్.ఓ అంబర్ సింగ్ గారు, వనమహోత్సవం మరియు చెట్ల ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. చెట్లు లేకపోతే మానవ మనుగడ లేదని ,చెట్లు మాత్రమే చెడును తీసుకొని మంచిని ఇస్తాయని. మానవులు వదిలేటటువంటి కార్బన్డయాక్సైడ్ ను తీసుకొని ,ఆక్సిజన్ మానవులకు ఉపయోగపడేటటువంటి ఆక్సిజన్ ఇస్తాయని ఇనుము ఎలా అయితే అయస్కాంతాన్ని ఆకర్షిస్తుందో ఆ విధంగా చెట్లు మేఘాలను ఆకర్షించే వర్షాలను కురిపింప చేస్తాయని ప్రతిరోజు మానవుడికి మూడు సిలిండర్ల ఆక్సిజన్ అవసరం ఉంటుందని ఒక సిలిండర్ విలువ 700 రూపాయలు అయినట్లయితే రోజుకి 2100 ఖర్చు అవుతుందని సంవత్సరానికి 7,66,500 అలాంటి ఆక్సిజన్ ని మనం ఉచితంగా తీసుకోగలుగుతున్నాం. అందరికీ ఆక్సిజన్ సిలిండర్ల అవసరము పడితే సిలిండర్లు దొరకక ఏ విధమైనటువంటి క్లిష్ట పరిస్థితి ఏర్పడుతుందో కరోనా సమయంలో అందరం చూసినటువంటిదే కాబట్టి చెట్లను నాటడం వాటిని సంరక్షించడం చెట్లతో పాటుగా అడవిని, జంతువులను ,నీటిని పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రతి విద్యార్థి అమ్మ పేరు పైన ఒక చెట్టును నాటాలని అమ్మను ఏ విధంగా చూసుకుంటారో ఆ చెట్టుని ఆ విధంగా చూసుకోవాలని విద్యార్థులకు వివరించడం జరిగింది. అమ్మ పేరు పైన చెట్టు నాటడం అనేది ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడి గారు చెప్పినటువంటి నినాదం. క్రమం తప్పకుండా మనం అందరం పాటించాలని చెప్పడం జరిగింది.

Forest Festival

మంజీరా పాఠశాలలో ఎఫ్ఆర్ఓ అంబర్ సింగ్ గారు, డిప్యూటీfro శ్రీనివాస్ గారు ,గీత ,కృష్ణ గారు చెట్లను నాటడం జరిగింది .విద్యార్థుల చేత మొక్కలు నాటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ జితేందర్ రెడ్డి వాసవి, ప్రిన్సిపల్ సురేష్ ,అనిల్ ,శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version