పోచమ్మ తల్లి దేవాలయానికి విరాళం.

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-67.wav?_=1

పోచమ్మ తల్లి దేవాలయానికి విరాళం.

కల్వకుర్తి/ నేటి ధాత్రి :

కల్వకుర్తి పట్టణంలోని హనుమాన్ నగర్ కాలనీలో పోచమ్మ దేవాలయం నిర్మాణానికి విశ్రాంతి ఉపాధ్యాయుడు నాగులపల్లి యాదగిరి రూ 46,116 విరాళాన్ని శనివారం దేవాలయం నిర్వాహలకు అందజేశారు. ఈ విరాళంతో దేవాలయం గోపురం పైన ఉన్న కలశం చేయించినట్లు నిర్వాహకులు తెలిపారు. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడానికి దాతలు విరాళాలు అందజేయాలని నిర్వాహకులు కోరారు.

మెట్పల్లిలో ప్రత్యేక వినాయక పూజ…

మెట్పల్లిలో ప్రత్యేక వినాయక పూజ

మెట్ పల్లి సెప్టెంబర్ 5 నేటి దాత్రి
మెట్ పల్లి పట్టణ బాలకిషన్ నగర్ వినాయక సొసైటీ వారి ఆధ్వర్యంలో పురోహితులు రమణ చారి వేద మంత్రాలతో వినాయక స్వామి వారికి రాత్రి ప్రత్యేక పూజలు అనంతరం 51. ప్రసాదల నైవేద్యం కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో సొసైటీ తోట ప్రవీణ్ వినాయక కమిటీ అధ్యక్షులు తోట ప్రసాద్ సాంబారు శ్రీనివాస్ చందనగిరి రమేష్ డొల్ల నాగేశ్వర్ తాడూరి యాదగిరి బోయిని ప్రవీణ్ కుమార్ పర్రి శంకర్ మహేష్ చొప్పరి శ్రీనివాస్ కోరే రమేష్ మనోహర్ శ్రీనివాస తులసీదాస్ మర్రి మహేష్ తదితరులు మహిళలు కాలనీవాసులు పాల్గొన్నారు.

వద్దిరాజు కుటుంబం ప్రత్యేక గణేశ్ పూజ…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-61.wav?_=2

ఎంపీ వద్దిరాజు ధర్మపత్ని విజయలక్ష్మీ, కూతురు గంగాభవాని, కుమారుడు నిఖిల్ చంద్రలు విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు
Date 05/09/2025

నేటిధాత్రి:

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ధర్మపత్ని విజయలక్ష్మీ, కూతురు డాక్టర్ గంగుల గంగాభవాని, కుమారుడు నిఖిల్ చంద్రలు విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఎంపీ రవిచంద్ర నివాసం వద్ద వీఆర్సీ యూత్ అసోసియేషన్ సభ్యులు గణనాథుడిని ప్రతిష్ఠించి నవరాత్రోత్సవాలు ఘనంగా నిర్వహించారు.నిమజ్జనానికి బయలుదేరడానికి ముందు వినాయకుడికి శుక్రవారం విజయలక్ష్మీ, నిఖిల్ చంద్రలు పూలమాల వేసి,హారతినిచ్చి గోత్ర నామంతో ప్రత్యేక పూజలు చేశారు.

Vigneshwara

ఈ సందర్భంగా గంగాభవాని తన కుమారులు సౌరవ్,సనవ్ లతో కలిసి గణనాథుడికి కొబ్బరికాయలు కొట్టి గోత్ర నామంతో ప్రత్యేక పూజలు చేశారు.వేద పండితులు వారికి ఆశీర్వచనాలు పలికి తీర్థప్రసాదాలు అందజేశారు.

 

Vigneshwara

వీఆర్సీ యూత్ అసోసియేషన్ సభ్యులు ముడ్డంగుల కృష్ణ,గగులోతు నవీన్ నాయక్,యరగాని పృథ్వీ గౌడ్,ముకుంద అనిల్ పటేల్,అనంతుల శ్రీనివాస్ గౌడ్, మల్యాల శేఖర్, నాగిరెడ్డి, ముకరా దుర్గాప్రసాద్, దండు రాజు ధూదిగామ సాత్విక్,జ్యోతి, సంతోష్ తదితరులు విజయలక్ష్మీ, గంగాభవాని, నిఖిల్ చంద్ర, స్థానిక ప్రముఖులను శాలువాలతో సత్కరించి వినాయకుడి చిత్రపటాలను బహుకరించారు.

Vigneshwara

వీఆర్సీ యూత్ అసోసియేషన్ సభ్యులు అందజేసిన విఘ్నేశ్వరుడి లడ్డూ ప్రసాదాన్ని నిఖిల్ చంద్ర భక్తిప్రపత్తులతో స్వీకరించి తలపై పెట్టుకుని తన నివాసంలోకి తీసుకెళ్లారు.ఈ సందర్భంగా వీఆర్సీ యూత్ అసోసియేషన్ సభ్యులు”జై గణేశ జైజై గణేశ” అంటూ నినాదాలు చేశారు.

నిమజ్జనానికి ముస్తాబైన మట్టి గణపతి…

నిమజ్జనానికి ముస్తాబైన మట్టి గణపతి

ఆదర్శవంతంగా నిలిచిన మల్టీ వర్కర్ గట్టయ్య

జైపూర్,నేటి ధాత్రి:

జైపూర్ మండలం టేకుమట్ల గ్రామంలో మల్టీ వర్కర్ గా విధులు నిర్వహిస్తున్న జల్లంపల్లి గట్టయ్య గణేష్ నవరాత్రి లో భాగంగా తన కుమారుడితో మూడున్నర ఫీట్ల గణపతి విగ్రహం తయారు చేపించి తొమ్మిది రోజులు మట్టి గణపతికి అంగరంగ వైభవంగా పూజలు జరిపించారు.అలాగే గణపతి వద్ద అన్నదాత కార్యక్రమం నిర్వహించారు.అనేక రకాల కెమికల్స్ కలిపి తయారు చేసిన విగ్రహాలు ఏర్పాటు చేయడం వల్ల కాలుష్యం వెదజల్లి పర్యావరణం కలుషితం అవుతుందని అన్నారు.మట్టి గణేష్ విగ్రహాన్ని తయారు చేసుకొని పూజలు చేయడం చాలా సంతోషంగా ఉందని వారు తెలిపారు.

శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయ కమిటీ సన్మానము..

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-03T124445.869-1.wav?_=3

శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయ కమిటీ సన్మానము

వనపర్తి నేటిదాత్రి .

వనపర్తి జిల్లా కేంద్రంశంకర్ గంజ్ లో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వినాయక పూజల సందర్భంగా వర్తక సంగం అధ్యక్షులు పాలాది సుమన్ ను ఆలయ కమిటీ నిర్వహికులు ఆహ్వానించారు ఈమేరకు సుమన్ దంపతులను సన్మానం చేశారు ఈసందర్భంగా ఆలయ కమిటీ నిర్వహికులను సుమన్ అభినందించారు ఈకార్యక్రమంలో చిట్యాల నాగరాజు దాచ లక్ష్మినారాయణ గోనూర్ రామకృష్ణ దాచశివ తదితరులు పాల్గొన్నారు

కొల్లూరులో బాల గణేష్ నిమజ్జనం…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-03T121958.700-1.wav?_=4

కొల్లూరులో బాల గణేష్ నిమజ్జనం

జహీరాబాద్ నేటి ధాత్రి:

హనుమాన్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు సి హెచ్ సంగమేష్ సాయిగౌడ్ కాశీ రామ్ లక్ష్మణ్ డి శేఖర్ పాండు హరి శ్రీనివాస్ పాటిల్ మల్లేష్ విష్ణువర్ధన్ రెడ్డి శ్రీశైలం మరియు యుత్ సభ్యులు కొల్లూరు అధ్వర్యం లో ఏర్పటు చేసిన గణేష్ నిమజ్జనం కార్యక్రమంలో పాలుగొన్న గ్రామ పెద్దలు నాయకులు.ఇట్టి కార్యక్రమములో కొల్లూరు మాజీ ఎంపీటీసీ సీ హెచ్ రాజ్ కుమార్ కొల్లూరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డప్పూరు సంగమేష్,మాజీ వార్డు సభ్యులు వై నగేష్ ఎం విష్ణు యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఝరాసంగం చింతలగట్టు శివరాజ్, సంగారెడ్డి నర్సింహారెడ్డి,దేవేందర్ దారా గోరఖ్ కాశీనాథ్ ఉమాకాంత్ సి ప్రకాష్ మరియు గ్రామ ప్రజలు పాల్గోని బాల గణేశునికి పూజలు చేసి నిమజ్జనం కార్యక్రమన్ని విజయవంతంగా పూర్తి చేసారు.

పోత్కపల్లిలో గణపతి నవరాత్రి మహా అన్నదానం…

గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం

ఓదెల(పెద్దపల్లి జిల్లా) నేటిధాత్రి:

ఓదెల మండలం పోత్కపల్లి గ్రామంలో గోపికృష్ణ పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. గ్రామ గణపతి మండపంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించగా అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేపట్టారు.సంఘం అధ్యక్షుడు డబ్బేట మల్లేశం మాట్లాడుతూ, గణపతి నవరాత్రులు గ్రామ ప్రజల ఐక్యతకు ప్రతీక. ఇలాంటి సమయాల్లో అన్నప్రసాద వితరణ వంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా భక్తి, సేవ, సౌహార్దం పెంపొందుతుంది. గ్రామంలో సామాజిక స్ఫూర్తిని పెంచడం గోపికృష్ణ పద్మశాలి సంఘం ప్రధాన ధ్యేయం అని పేర్కొన్నారు. మహా అన్నదానంలో గ్రామస్తులు, చిన్నలు పెద్దలు, పరిసర ప్రాంతాల భక్తులు పాల్గొన్నారు.

ఓం శ్రీ సాయి అగ్ని గణేష్ వద్ద మహా అన్నదానం.

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-02T130836.794-1.wav?_=5

ఘనంగా ఓం శ్రీ సాయి అగ్ని గణేష్ యూత్ ఆధ్వర్యంలో మహా అన్న ప్రసాద వితరణ

* శివరాజ్ యాదవ్ కుటుంబ సభ్యులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్, నియోజకవర్గ పట్టణ పరిధిలో కాంతా రెడ్డి కాలనీ బాలాజీ నగర్ సమీపంలో గల ఓం శ్రీ సాయిఅగ్ని గణేష్ యూత్ ఆధ్వర్యంలో గణేష్ మండపం దగ్గర మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కాంతారెడ్డి కాలనీకి చెందిన శివరాజ్ యాదవ్ వారి కుటుంబ సభ్యులతో నిర్వహించారు. శివరాజ్ యాదవ్ మాట్లాడుతూ ఈ అన్నదానం కేవలం ఆహారం అందించడం కాదు, ఇది ఒక గొప్ప పుణ్య కార్యమని, అన్నదానం ద్వారా మనం ఇతరులకు సహాయం చేసినప్పుడు మనకు ఒక గొప్ప సంతృప్తి లభిస్తుంది. అన్నదానం చేయడం ద్వారా, మన గత కర్మలను తొలగించవచ్చని అదేవిధంగా అన్నదానం స్వీకరించిన వారి ఆశీర్వాదాలు మన జీవితంలో సాను కూలతను తీసుకు వస్తాయి. అన్నదానం ద్వారా ఇతరులకు ఆహారం అందించడం ద్వారా వారి జీవితాన్ని ఇచ్చే అవకాశం లభిస్తుంది అన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయ వంతం చేశారు. ఈ కార్యక్రమంలో గణేష్ కమిటీ సభ్యులు తలారి సందీప్, ఉప్పరి మహేందర్, బి. సంతోష్, తరుణ్, ధనరాజ్, వినయ్ కుమార్, ఉప్పరి దత్తు, సాయి కుమార్, సాయి చరణ్, ప్రణీత్ కుమార్, లడ్డు, తదితరులు కాలనీవాసులు పాల్గొన్నారు.

కథలాపూర్‌లో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం…

యంగ్ స్టార్ యూత్ వారి ఆధ్వర్యంలో ఘనంగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం

నేటి ధాత్రి కథలాపూర్

కథలాపూర్ మండల కేంద్రంలోని యంగ్ స్టార్స్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి 25 వసంతాల గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పార్వతీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగా వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పురోహితులు పులికాంత ప్రమోద్ గారు, యూత్ సభ్యులు, గ్రామ ప్రజలందరూ పాల్గొన్నారు…

కుంకుమ పూజ చేసిన మహిళలు….

కుంకుమ పూజ చేసిన మహిళలు

భూపాలపల్లి నేటిధాత్రి

జయశంకర్ జిల్లా భూపాలపల్లి కేంద్రంలోని రెడ్డి కాలనీలో గణనాథుడి మండపంలో శుక్రవారం కుంకుమ పూజలో ఇంటింటి నుండి మహిళలు భారీగా పూజకు బయలుదేరి ఘనంగా గణనాధుని ముందు కూర్చొని తమ ఇంటి యొక్క ఆరోగ్యాల గురించి తమ భర్త యొక్క ఆరోగ్యాల గురించి తన పిల్లల చదువు గణనాథుడి ముందు గట్టిగా పూజలు చేసినారు తమ యొక్క మొక్కులను సమర్పించుకున్నారు.
ఈ కార్యక్రమంలో రెడ్డి కాలనీ మహిళలు పురుషులు మారం కొమురయ్య మంజునాథ్ శ్రీను దయ్యాల రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

బెల్లంపల్లిలో అంగరంగ వైభవంగా గణేశ్ వేడుకలు..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-95.wav?_=6

భక్తిశ్రద్ధలతో కొలువుతీరిన బొజ్జ గణపయ్య

బాబు క్యాంప్ సంఘమిత్ర ఆధ్వర్యంలో.కొలువుదీరిన బొజ్జ గణపయ్య.

 

బెల్లంపల్లి నేటిధాత్రి :

బెల్లంపల్లి పట్టణంలోని బాబు క్యాంప్ సంఘమిత్ర యూత్ క్లబ్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా భక్తిశ్రద్ధలతో వినాయకచవితి వేడుకలు జరిగాయి గణపతి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు.

పూజారి గణేష్ విగ్రహాన్ని ప్రతిష్టించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి ప్రసాదాలు తీసుకొచ్చి భక్తిశ్రద్ధలతో పూలు పండ్లతో పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సంఘమిత్ర యూత్ క్లబ్ కమిటీ సభ్యులు బస్తీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మట్టి గణపతులతో పర్యావరణానికి మేలు చేస్తున్న శంకర్.

సంకల్పం ఉంటే ఏదైనా సాధించొచ్చు

భారీ మట్టి గణపతులను తయారు చేస్తూ తన ప్రతిభను చాటుకుంటున్న ఊట్కురి శంకర్

పర్యావరణాన్ని కాపాడుదాం… మట్టి గణపతులను పూజిద్దాం

కేసముద్రం/ నేటి ధాత్రి

కేసముద్రం మున్సిపాలిటీ లోని కేసముద్రం విలేజ్ గ్రామానికి చెందిన ఊట్కూరి శంకర్ తన చిన్న వయసు నుండే మట్టి గణపతులను తయారు చేస్తూ అందరి మన్ననలు పొందాడు అప్పటినుండి మొదలైన తన మట్టి గణనాధుల ప్రతిమల తయారీ ప్రయాణం కొనసాగిస్తూ తనలోని నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటూ పర్యావరణ ప్రేమికులకు ఆదర్శంగా నిలుస్తూ కే సముద్రం ప్రజల మనసు గెలుచుకుంటూ అబ్బుర పరుస్తున్నారు ఊట్కూరి శంకర్, కేసముద్రం విలేజ్ బస్టాండ్ సెంటర్లో శ్రీ మట్టి గణపతి ఉత్సవ కమిటీలో ఊట్కూరి శంకర్ ఎం ఎస్ సి చదువుకొని మహబూబాబాద్ నలంద డిగ్రీ ప్రైవేట్ కళాశాలలో బోటనీ లెక్చరర్ గా విధులు నిర్వహించుకుంటూ ఉత్సవ కమిటీలో ఒక సభ్యునిగా కొనసాగుతూ గత కొన్ని సంవత్సరాలుగా తాను సొంతంగా తయారు చేసిన మట్టి గణపతిని ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసుకున్న మండపంలో పూజలు నిర్వహిస్తామని వివరించారు. సాక్షాత్తు శ్రీ పార్వతీదేవి తన స్వా హస్తాలతో మట్టి గణపతిని చేసి ప్రాణప్రతిష్ట చేసిందని పురాణాలు చెబుతున్నాయి, మనుషులను సృష్టించిన దేవతల ప్రతిమల్ని మనం కూడా మట్టితోనే వినాయకుడి రూపు ప్రతిమ విగ్రహాన్ని తయారు చేసుకుని పూజించడం మన సనాతన ధర్మ ఆచారం అని వినాయకుని భక్తితో పూజించే ప్రజలు అందరూ ఈ ధర్మాన్ని పాటిస్తూ పర్యావరణాన్ని కాపాడుకోవాలని వివరించారు. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయకుని పూజిద్దాం… పర్యావరణహిత ప్రేమికులమవుతాం అనే ఈ సందేశం నన్ను కదిలించిందని అప్పటినుంచి నేను మట్టి వినాయక విగ్రహాల ప్రతిమలను తయారు చేస్తూ మన వంతు కృషిగా పర్యావరణాన్ని కాపాడుకోవాలని పర్యావరణ నిపుణులు రెండవ సందర్భాలలో పలు సూచనలు చేస్తూ వస్తున్నారని అన్నారు. ఇప్పటికే గణపతిని ఆరాధించే ప్రజలు 25% శాతం వరకు మట్టి గణపతిని పూజిస్తున్నారని ఇలాగే ప్రతి వినాయకుని మండపాల నిర్వాహకులు మట్టి గణపతి లనే మండపాలలో నెలకొల్పి పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాలని పి ఓ పి తో తయారు చేసిన గణపతి విగ్రహాల ప్రతిమలనే పూజించరాదని పిఓపి విగ్రహాల వల్ల కలిగే నష్టం నీటిని కాలుష్యం చేస్తుందని నీటి జీవరాశులకు ముప్పు వాటిల్లుతుందని అందుకే మన వంతు కృషిగా పర్యావరణాన్ని కాపాడుకునేందుకు మట్టి వినాయకు లే ఉత్తమమైనదని తెలిపారు. వినాయకుడు అంటేనే “ప్రకృతి” ప్రకృతిని ఆరాధించే సంస్కృతి మన తెలంగాణ ప్రజల ఆనవాయితీ అని మట్టి విగ్రహాలను సహజ రంగులను వాడటం వల్ల పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని ఊట్కూరి శంకర్ ప్రజలకు విన్నవించుకుంటున్నారు. రానున్న రోజులలో పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయక విగ్రహాల తయారు చేసుకునేందుకు ఉత్సాహవంతులు ముందుకు రావాలని మీలో ఉన్న ప్రతిభను చాటుకోవాలని కోరారు. నేను కూడా ఇంకా కష్టపడి మట్టి గణపతి విగ్రహాల తయారీలో ఉత్సవ కమిటీ సభ్యులు నాకు ఎంతగానో సహకరిస్తున్నారని తన తోటి ఉత్సవ కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు.సామర్థ్యాన్ని సాధ్యమైనంతవరకు మెరుగుపరుచుకుంటూ ఉత్సాహం ఉన్న వారికి మట్టి గణపతి విగ్రహాల తయారీలో భాగస్వాములను చేస్తానని వారిలో ఉన్న నైపుణ్యాన్ని పెంపొందించేలా సహకారం అందిస్తానని అన్నారు.

జిల్లా కలెక్టర్ వినాయక చవితి శుభాకాంక్షలు…

ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు జిల్లా కలెక్టర్

భూపాలపల్లి నేటిధాత్రి

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ వినాయక చవితి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక చవితి పండుగను శాంతి, సమన్వయ వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. ప్రతిష్ఠించిన విగ్రహాల వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారని జిల్లా యంత్రాంగం అన్ని పకడ్బందీ పర్యవేక్షణ చేయాలని సూచించారు.
విగ్రహాల ప్రతిష్ఠాపన నుండి నిమజ్జనాల వరకు ఎటువంటి అంతరాయం కలగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని, నిర్దేశించిన ప్రాంతాల్లోనే నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా భక్తులకు సూచించారు.
ప్రజలందరూ యంత్రాంగం సలహాలు, సూచనలు పాటిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా వినాయక చవితి పండుగను, నవరాత్రులను దిగ్విజయంగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. ముఖ్యంగా విగ్రహాలు ప్రతిష్ఠ లో విద్యుత్ ప్రమాదాలు వాటిల్లకుండా రక్షణ చర్యలు పాటించాలన్నారు. వర్షం వల్ల విద్యుత్తు ప్రమాదాలు వాటిల్లే అవకాశం ఉందని, ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి…

వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ డివిజన్లో వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని డి.ఎస్.పి సైదా సూచించారు. మంగళవారం జహీరాబాద్ లో నిర్వహించిన శాంతి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రతి వినాయక మండపం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, డిజె సౌండ్ వాడవద్దని పేర్కొన్నారు. ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

వినాయక మండపాలకు పర్మిషన్ తప్పనిసరి

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-81-2.wav?_=7

 

వినాయక మండపాలకు పర్మిషన్ తప్పనిసరి

దుగ్గొండి ఎస్సై రావుల రణధీర్ రెడ్డి

నర్సంపేట,నేటిధాత్రి:

 

వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా దుగ్గొండి మండలంలో మండపాల పట్ల అన్ లైన్ ద్వారా పర్మిషన్ తప్పనిసరి అని ఎస్సై రావుల రణధీర్ రెడ్డి తెలిపారు.అందుకు తీసుకోవలసిన ప్రత్యేక జాగ్రత్తల పట్ల వివరిస్తూ వినాయక నవరాత్రుల పట్ల పర్మిషన్ తీసుకున్న వారు ప్రతి విగ్రహానికి ఒక ఆర్గనైజర్ 24/7 ప్రత్యేకంగా ఉండాలని తెలిపారు.అలాగే విద్యుత్ కనెక్షన్ సంబంధించి ఆ శాఖతో అనుమతి పొందాలన్నారు. డి.జేలు ఉపయోగించకుండా స్కూల్స్, హాస్పిటల్స్ ప్రదేశాల్లో 50 డెసిమల్ సౌండ్ ఉపయోగిస్తూ సాధారణ ప్రదేశంలో 55 డెసిమల్ సౌండ్ వాడాలని చెప్పారు.విగ్రహ ప్రదేశాలలో మద్యం సేవించి,అసాంఘిక కార్యక్రమాలు చేపట్టకూడదని అలాగే కమ్యూనిటీ,పార్టీలకు విరుద్ధంగా పాటలు పెట్టకూడదని ఎస్సై హెచ్చరించారు.అగ్నిప్రమాదాలు జరుగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.లా అండ్ ఆర్డర్ కు ఇబ్బంది కలిగించకుండా నవరాత్రుల ఉత్సవాలు జరుపుకోవాలని ఎస్సై రణధీర్ రెడ్డి మండల ప్రజలకు సూచించారు.

మరిపెడలో గణేష్ మండపాలకు ఆన్లైన్ అనుమతులు..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-85.wav?_=8

శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రులు జరుపుకోవాలి

తొర్రూరు డిఎస్పి కృష్ణ కిషోర్

భద్రత,బందోబస్తు కొరకే గణేష్ ఆన్లైన్ నమోదు విధానం

సి ఐ రాజ్ కుమార్ గౌడ్,ఎస్సై సతీష్ గౌడ్

మరిపెడ నేటిధాత్రి

మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణం మరియు మండలంలో గణేష్ మండపాల ఏర్పాటు,నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు తెలంగాణ పోలీసు శాఖ వారు రూపొందించిన పోర్టల్ పోలీస్ పోట్రల్.టిఎస్ పోలీస్.గౌట్.ఇన్ (https://policeportal.tspolice.gov.in/)నందు ధరఖాస్తు చేసుకోవాలని తొర్రూరు డిఎస్పి కృష్ణ కిషోర్ సీఐ.రాజ్ కుమార్ గౌడ్, ఎస్సై సతీష్ గౌడ్, తెలిపారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఆన్లైన్ నందు అనుమతులు తీసుకోవడం వల్ల మండపాల ఎక్కడ ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారనే పూర్తి సమాచారం పోలీసు శాఖ వద్ద ఉంటుందని నవరాత్రి ఉత్సవాలు ముగిసే వరకు పోలీసు భద్రత కల్పించడం సులభంగా ఉంటుందన్నారు.మండపం నిర్వహణ,మండపంనకు సంబంధించిన సమాచారం సులభతరం అవుతుందని తద్వారా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత మరియు బందోబస్తు ఏర్పాటు చేయడానికి పోలీసులకు సులువుగా ఉంటుందన్నారు.పోలీస్ శాఖ ఆన్లైన్ ద్వారానే అనుమతి మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ దయనంద్, తాసిల్దార్ కృష్ణవేణి, మండలంలోని పలు గ్రామాల్లో నీ మండపాల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

మట్టి గణపతులనే పూజిద్దాం – గోకా రామస్వామి…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-73-3.wav?_=9

బుజ్జి మట్టి గణపతులనే పూజిద్దాం.

వనప్రేమి గోకా రామస్వామి

నర్సంపేట,నేటిధాత్రి:

రాబోయే గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మట్టి గణపతులనే పూజిద్దాం పర్యావరణాన్ని పరి రక్షిద్దాం అని వన ప్రేమి గోకా రామస్వామి ఒక ప్రకటనలో పిలుపు నిచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుజ్జి బుజ్జి మట్టి గణపతులనే పూజిద్దామని మనల్ని దేవుడు పుట్టిస్తే మనం భగవంతుడిని పుట్టించే ఒక మహా పండుగ వినాయక నవరాత్రుల వేడుక అని పేర్కొన్నారు.

Ganpati Navratri

పార్వతి మట్టి గణపతిని చేసి ప్రాణప్రతిష్ట చేసిన ఒక మహా పండుగ వినాయకచవితి అని మట్టి గణపతులతో పూజిస్తూ నవరాత్రి ఉత్సవాలను పర్యావరణహితంగా జరుపుకుందామని తెలియజేశారు.
ధ్వని,రంగులు,నీటి,వాయు,వాతావరణాన్ని కలుషితం చేయకుండా జాగ్రత్త లు పాటిద్దామని వనప్రేమి, పర్యావరణ వేత్త గోకా రామస్వామి తెలియజేశారు.

ఏకదంత: గణపతి యొక్క ఒక దంత రూపం వెనుక కథ..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-25T115445.212.wav?_=10

 

ఏకదంత: గణపతి యొక్క ఒక దంత రూపం వెనుక కథ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

గణేష్ గురించి మనందరికీ తెలుసు. ఆయన ఉల్లాసభరితమైన ప్రవర్తన, ఆయన స్వచ్ఛమైన ఆత్మ, మరియు ముఖ్యంగా, ఆయన దయగల హృదయం మనల్ని ఆయనను ప్రేమించేలా చేస్తాయి. గణేష్ పార్వతి దేవి మరియు శివుడి కుమారుడు. ప్రతి పూజలో మొదట పూజించబడేది గణేష్ అనే వరం లేదా ఆశీర్వాదంతో కూడా ఆయన ఆశీర్వదించబడ్డాడు. గణేష్‌ను అనేక పేర్లతో పిలుస్తారు. వాటిలో కొన్ని గజానన్, గణపతి మరియు ఏకదంత వంటి పేర్లు ఉన్నాయి.

గజానన్ మరియు గణపతి అనే పేర్లు అతని ఏనుగు తలతో సంబంధం కలిగి ఉన్నాయి. అయితే, ఏకదంత అనే పేరు గురించి మీకు తెలుసా? ఏక్ దంత్ అంటే ఏమిటి? ఏకదంత అనే పేరు ఒకే ఒక దంతం ఉన్న వ్యక్తి యొక్క అర్థాన్ని సూచిస్తుంది. ఇది గణేష్ కు ఒకే ఒక దంతం ఉందనే వాస్తవానికి సంబంధించినది.

 

గణేశుడు ఏకదంతుడు కావడం గురించిన కథలు

గణేశుడి దంతాలను ఎవరు విరిచారనే దాని గురించి ఆంగ్లంలో మూడు ప్రాథమిక పౌరాణిక గణేష్ కథలు ఉన్నాయి మరియు గణేశుడిని ఏకదంత అని ఎందుకు పిలుస్తారు? గణేశుడి ఒకే దంతానికి సంబంధించిన పురాణాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి మీకు ఉంటే, దాని కోసం మొత్తం బ్లాగును చదవండి. అంతేకాకుండా, మీరు మన ప్రభువుల గురించి ఇలాంటి ఆసక్తికరమైన కథలను చదవాలనుకుంటే, ఇన్‌స్టాఆస్ట్రో వెబ్‌సైట్‌ను తనిఖీ చేయండి లేదా వాటి కోసం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. అక్కడ, మీరు దేవుళ్ల గురించి మరియు ఇతర అంశాల గురించి ఇలాంటి అద్భుతమైన కథలను చదవవచ్చు. ఇప్పుడు, గణేశునికి ఒకే ఒక దంతం ఎందుకు ఉందో తెలుసుకుందాం. 

ఏకదంత: ఋషి పరశురాముని కోపం

గణేశుడిని ఏకదంత లేదా ఒక దంతము కలిగినవాడు అని పిలుస్తారు మరియు దీనికి సంబంధించిన అనేక జానపద కథలు ఉన్నాయి. జానపద కథలలో మరియు గణపతి విగ్రహాలలో చిత్రీకరించినట్లుగా, ఎల్లప్పుడూ కనిపించని ఒక దంతము ఉంది. మొదటిది పరశురాముని కోపం, ఇది ఈ ప్రమాదానికి కారణమైంది. ఒక రోజు, శివుడు తన మధ్యవర్తిత్వ గదిలోకి వెళ్లి, చిన్న గణేశుడిని తన సంరక్షకుడిగా చేసుకున్నాడు. దేవుడు తన సమావేశం ముగిసే వరకు ఎవరినీ లోపలికి అనుమతించవద్దని అతనిని కోరాడు. ఇంతలో, పరశురాముడు శివుని ఆశీర్వాదం కోసం వచ్చాడు.

అతను దేవుని ధ్యాన గదుల తలుపు వైపు ముందుకు సాగుతుండగా, గణేశుడు జోక్యం చేసుకుని లోపలికి అడుగు పెట్టకుండా ఆపాడు. ఇది ఋషిని కోపగించుకుంది, మరియు అతను తన గొడ్డలిని గణేశుడిపై విసిరాడు. దైవిక దృష్టి ద్వారా, ఆ చిన్న దేవుడు ఆ గొడ్డలి తన తండ్రి ఇచ్చిన బహుమతి అని మరియు దాని శక్తులు గౌరవాన్ని కోరుతున్నాయని తెలుసుకున్నాడు. అందువల్ల, ఆయుధాన్ని తప్పించుకునే బదులు, అతను గొడ్డలిని అతనిని కొట్టనిచ్చాడు. ఆ దెబ్బ అతని దంతానికి తగిలింది, అది విరిగిపోయింది మరియు అప్పటి నుండి, గణేశుడు ‘ఏక్దంత’ అని పిలువబడ్డాడు.

ఏకదంత: చంద్ర దేవ్‌పై గణపతికి కోపం

విరిగిన దంతం గురించి రెండవ కథ ఇలా ఉంది. ఒక రోజు, బొద్దుగా ఉన్న ఆ గణపతి చంద్ర దేవ్ (చంద్ర దేవుడు) ఇచ్చిన విందు నుండి తిరిగి వస్తున్నాడు. అతను చాలా తిని పూర్తిగా నిండిపోయాడు. దారిలో, ఒక పాము పొదల్లో నుండి బయటకు వచ్చింది, దీని వలన గణపతి తన వాహనం నుండి పడిపోయాడు. అతను పడిపోతుండగా, అతని కడుపు విరిగి, అతని విలాసవంతమైన విందులో ఉన్న వస్తువులు చెల్లాచెదురుగా పడిపోయాయి. చంద్ర దేవ్ దీనిని చూసి పగలబడి నవ్వాడు.

ఆ నవ్వు చూసి కోపగించిన గణేశుడు తన దంతాన్ని విరిచి కోపంతో అతనిపైకి విసిరాడు, దాని ముఖం మీద పెద్ద గుర్తు పెట్టాడు. చంద్రుడు ఎప్పటికీ ప్రకాశించకూడదని శపించాడు. దీని వల్ల ప్రపంచం మొత్తం చీకటిలో మునిగిపోయింది. ఇది చూసిన చాలా మంది దేవతలు మరియు దేవతలు గణేశుడిని శాంతింపజేయడానికి మరియు అతనితో తర్కించడానికి ప్రయత్నించారు. చివరగా, ఒక దంత దేవుడు చీకటి నుండి లేవడానికి అనుమతించడం ద్వారా అతని శాపాన్ని తగ్గించడానికి అంగీకరించాడు. ఇప్పుడు చంద్రుడు ప్రతి 28 రోజులకు ఒకసారి క్షీణిస్తున్న మరియు క్షీణిస్తున్న దశను దాటవలసి ఉంటుందని ఆయన అన్నారు. ఆ విధంగా గణేశుడు ‘ఏకాదంత’ అని పిలువబడ్డాడు.

ఏకదంత: మహాభారతం రాయడం

గణేశుడి నమ్మకం తెగిపోవడంతో ముడిపడి ఉన్న మరో ప్రసిద్ధ కథ మహాభారత రచనకు సంబంధించినది. వేద వ్యాసుడు సహాయం కోరుతూ శివుడి వద్దకు వెళ్ళాడు. వేద వ్యాసుడు తన మాటలతో మహాభారతాన్ని ఎవరైనా రాయాలని కోరుకున్నాడు. అయితే, ఆ వ్యక్తి దానిని రాయడం ఆపకూడదని మరియు సాహిత్యం ఒకే స్రవంతిలో పూర్తవుతుందని ఒక షరతు ఉంది. మొదట శివుడు అయోమయంలో పడ్డాడు, కానీ తరువాత గణేశుడు ఈ పనిని చేయగలడని సూచించాడు. గణేశుడు దీనిని అంగీకరించి, ఇతిహాసాన్ని నిరంతరం రాశాడు.

అయితే, అతను ఇతిహాసం రాస్తున్నప్పుడు, దానిని రాయడానికి ఉపయోగించిన ఈక విరిగిపోయింది. గణేశుడు దానిని ప్రవాహంలో వ్రాసే పరిస్థితిని గుర్తుచేసుకున్నాడు. అందువలన, అతను తన దంతాలలో ఒకదాన్ని విరిచి, ఇతిహాసాన్ని పూర్తి చేయడానికి దానితో ఉపయోగించాడు. పురాణాల ప్రకారం, గణేశుడు మరియు వేద వ్యాసుడు ఇతిహాసాన్ని పూర్తి చేయడానికి దాదాపు 3 సంవత్సరాలు పట్టిందని చెప్పబడింది. అందువలన, అతను ఏక్ దంత్ గణేష్ అని పిలువబడ్డాడు. 

ముగింపు

గణేశుడి దంతానికి సంబంధించిన ఈ 3 కథలు పురాతన గ్రంథాలు మరియు పవిత్ర గ్రంథాలలో ప్రస్తావించబడ్డాయి. అయితే, గణేశుడి ఒకే దంతానికి కారణం ఏది అనేది ఇప్పటికీ చర్చనీయాంశమే. అయితే, మరోవైపు, ఈ కథలు మనకు గణేశుడి నుండి ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతాయి. వీటిలో పెద్దలను గౌరవించడం మరియు పూర్తి భక్తి మరియు దృష్టితో ఒకరి విధిని నిర్వర్తించడం ఉన్నాయి. మీరు ఈ బ్లాగును ఇష్టపడితే మరియు ఇలాంటి మరిన్ని ఉత్తేజకరమైన బ్లాగులను చదవాలనుకుంటే, ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా ఇన్‌స్టాఆస్ట్రో వెబ్‌సైట్‌ను తనిఖీ చేయండి లేదా దాని కోసం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. అక్కడ, మీరు భారతదేశంలోని ఉత్తమ జ్యోతిష్కులతో కూడా మాట్లాడవచ్చు, వారు మీ అన్ని ప్రశ్నలు మరియు సమస్యలకు పరిష్కారాలు మరియు సమాధానాలను అందిస్తారు. 

1. గణేశుడు రచించిన ఇతిహాసం ఏది?

మహాభారతాన్ని గణేష్ రాశాడు. వేద వ్యారుడు మహాభారత కథను చెప్పాడు, మరియు గణేశుడు దానిని రాశాడు. రాసేటప్పుడు, గణేశుడు తన దంతాన్ని ఉపయోగించి ఇతిహాసాన్ని పూర్తి చేశాడని నమ్ముతారు.

2. గణేశుడు పరశురాముడిని ఎందుకు లోపలికి అనుమతించలేదు?

గణేష్ కథ ప్రకారం, అతని తండ్రి శివుడు, ధ్యానం కోసం లోపలికి వెళుతుండగా తలుపును కాపలాగా ఉంచమని అడిగాడు. గణేష్ అలా వెళుతుండగా, పరశురాముడు శివుని ఆశీర్వాదం కోసం లోపలికి వచ్చాడు. అయితే, ఎవరినీ లోపలికి రానివ్వవద్దని అతని తండ్రి కోరడంతో, అతను పరశురాముడిని ఆపాడు.

3. గణేష్ కు ఏనుగు తల ఎందుకు ఉంటుంది?

పార్వతి మాత గణేశుడిని తయారు చేసింది. ఆమె స్నానం చేస్తుండగా తలుపుకు కాపలాగా ఉండమని కోరింది. అయితే, శివుడు వచ్చాడు, గణేశుడు అతన్ని లోపలికి రానివ్వలేదు. కోపంతో, శివుడు గణేశుడి తలను నరికివేశాడు. అయితే, తరువాత తన తప్పును గ్రహించి, అతను ఏనుగు తలను కనుగొని, దానిని తిరిగి కలిపి గణేశుడిని బ్రతికించాడు.

4. గణేశుడి భార్య ఎవరు?

చాలా చోట్ల గణేశుడిని బ్రహ్మచారిగా చిత్రీకరించారు. అయితే, కొన్ని ప్రదేశాలలో అతనికి ఇద్దరు భార్యలు ఉన్నారని చూపించారు. వీరిలో రిద్ధి మరియు సిద్ధి ఉన్నారు. రిద్ధి మరియు సిద్ధి బ్రహ్మ దేవుని కుమార్తెలుగా చెబుతారు.

5. గణపతి అసలు తల ఇప్పుడు ఎక్కడ ఉంది?

గణేశుడి అసలు తల చంద్ర మండలంలో ఉందని నమ్ముతారు.

6. గణేశుడి పిల్లలు ఎవరు?

గణేశుడిని వివాహితుడిగా చూపించే కొన్ని సంప్రదాయాల ప్రకారం, అతనికి ముగ్గురు పిల్లలు ఉన్నారని చెబుతారు. వీరిలో ఆయన కుమారులు శుభ్ మరియు లాభ్ మరియు ఆయన కుమార్తె మాతా సంతోషి ఉన్నారు.

గణేష్ మండపాల నిర్వాహకులు పోలీస్ పోర్టల్లో వివరాలు నమోదు చేసుకోవాలి

గణేష్ మండపాల నిర్వాహకులు పోలీస్ పోర్టల్లో వివరాలు నమోదు చేసుకోవాలి
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

మండలంలో ఈనెల 27 నుండి ప్రారంభం కానున్న గణపతి నవరాత్రుల ఉత్సవాలను నిర్వహించేటటువంటి నిర్వాహకులు తప్పనిసరిగా రాష్ట్ర పోలీస్ వెబ్సైట్లో తప్పనిసరిగా తమ వివరాలను నమోదు చేసుకోవాలని మొగుళ్ళపల్లి ఎస్సై బొరగల అశోక్ అన్నారు. ఆయన స్థానిక పోలీస్ స్టేషన్ లో మాట్లాడుతూ. మండలంలోని వివిధ ప్రదేశాలలో గణేష్ మండపాలను ఏర్పాటు చేసేవారు మావద్ద ముందస్తుగా సమాచారం తీసుకుంటే మానిటరింగ్ చేయడం చాలా సులభం అవుతుందని ఇందుకోసం ప్రత్యేకంగా http://policeportal.tspolice.gov.in/index.htm వివరాలు కచ్చితంగా ఆన్లైన్లో ఉండాలని అన్నారు. గణేష్ నవరాత్రుల ఉత్సవాలలో డీజే లకు ఇలాంటి అనుమతి లేదని అందుకు నిర్వాహకులు పోలీస్ వారికి సహకరించాలని మండపాల వద్ద విద్యుత్ వినియోగం కోసం విద్యుత్ శాఖ అధికారుల వద్ద తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు మండపాల వద్ద మైక్ సౌండ్ సిస్టమ్ ఉపయోగించ కూడదని మండపాల వద్ద మద్యం సేవించిన అసభ్యకరమైన నృత్యాలు చేసిన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని. మండపాల వద్ద వీలైనంతవరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని గణేష్ శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎలాంటి సందేహం వచ్చిన పోలీస్ శాఖను సంప్రదించాలని మొగుళ్లపల్లి ఎస్సై బొరగల అశోక్ అన్నారు.

ఐలోని మల్లన్న ఆలయ ఈవో గా కే సుధాకర్ నియామకం

ఐలోని మల్లన్న ఆలయ ఈవో గా కే సుధాకర్ నియామకం
ఇన్నాళ్లు ఇన్చార్జి ఈవో గా బాధ్యతలు నిర్వర్తించిన అద్దంకి నాగేశ్వరరావు

నేటి ధాత్రి ఐనవోలు :-

 

ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం నూతన ఈవోగా కే.సుధాకర్ ను నియమిస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆలయ కార్యనిర్వహణాధికారిగా ఇన్నాళ్లు అదనపు విధులు నిర్వహిస్తున్న అద్దంకి నాగేశ్వర్ రావుని అదనపు బాధ్యతల నుండి తొలగించి, కె.సుధాకర్ కి గురువారం అదనపు బాధ్యతలు శ్రీయుత కమిషనర్ దేవాదాయ ధర్మాదాయ శాఖ, బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వుల జారీచేయనైనది. గ్రేడ్ – I కార్యనిర్వహణాధికారిగా నూతనంగా నియమితులైన కే సుధాకర్ గురువారం బాధ్యతలు తీసుకున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version