నిమ్జ్ డిప్యూటీ కలెక్టర్గా విశాలాక్షి…

నిమ్జ్ డిప్యూటీ కలెక్టర్గా విశాలాక్షి

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ నిమ్జ్ డిప్యూటీ కలెక్టర్గా విశాలాక్షి విధుల్లో చేరారు. హైదరాబాద్ మహిళా శిశు సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్గా పనిచేస్తున్న విశాలాక్షిని ఇక్కడకు బదిలీ చేశారు. నూతన డిప్యూటీ కలెక్టరు కార్యాలయ సిబ్బంది ఘనంగా సన్మానించారు. విశాలాక్షి మాట్లాడుతూ.. నిమ్జ్ రైతుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు.

మెట్పల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంగా బోర్డు ఏర్పాటు చేయండి..

మెట్పల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంగా బోర్డు ఏర్పాటు చేయండి

మెట్ పల్లి సెప్టెంబర్ 12 నేటి దాత్రి

మెట్పల్లి నియోజకవర్గ సాధన కమిటీ సభ్యులు తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాలు రెవెన్యూ డివిజన్ మండల ఏర్పాటు చేశారు ఈ సందర్భంలో మెట్పల్లి గత చరిత్ర ఆధారంగా చేసుకుని మేము చేసిన ఉద్యమాలను పరిగణములోకి తీసుకొని ప్రభుత్వం 2017 సంవత్సరంలో మెట్పల్లిని రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయడం జరిగింది మరింత పరిపాలన అందించడానికి ఆగస్టు 2019 సబ్ కలెక్టర్ కార్యాలయం గా అభివృద్ధి చేశారు కానీ ప్రస్తుతం మెట్పల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం బోర్డును తొలగించి రెవెన్యూ డివిజన్ కార్యాలయంగా బోర్డును ఏర్పాటు చేశారు ఇట్టి విషయమై మెట్పల్లి
సబ్ కలెక్టర్ కార్యాలయంగా బోర్డును పునర్దించి మరియు మెట్పల్లిలో ఐఏఎస్ అధికారులను ఏర్పాటు చేయాలని ప్రధాన డిమాండ్ తో మెట్పల్లి డివిజన్ ప్రజల మనో భావాలను కాపాడాలని కోరుతూ మెట్పల్లి రెవిన్యూ డివిజన్ ఏవో అధికారి విజయ లలితాకి వినతి పత్రం సమర్పించడం జరిగింది
ఈ కార్యక్రమంలో
మెట్పల్లి నియోజకవర్గ సాధన కమిటీ అధ్యక్షులు తోకల సత్యనారాయణ, గౌరవ అధ్యక్షులు గట్టయ్య, గోరుమంతుల సురేందర్, ఫోట్ట ప్రేమ్, దేశరాజ్ దేవలింగం, పుల్ల రాజా గౌడ్, గుంజేటి రాజరత్నాకర్, నీరటి రాజేందర్, అచ్చ లింగం, గంప శ్రీనివాస్, గుర్రాల విక్రమ్, సజ్జన పవన్ కుమార్, అరవింద్, పాల్గొన్నారు.

నారింజ ప్రాజెక్ట్‌ను అదనపు కలెక్టర్ సందర్శించారు….

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-03T153927.000.wav?_=1

నారింజ ప్రాజెక్ట్ ను అదనపు కలెక్టర్ సందర్శించారు

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కొత్తూర్ బి గ్రామ శివారులో గల నారింజ ప్రాజెక్ట్ ను జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ బుధవారం మధ్యాహ్నం స్వయంగా సందర్శించారు. వినాయక నిమజ్జనం కోసం చేసిన అన్ని ఏర్పాట్ల వివరాలను పురపాలక సంఘం కమిషనర్ డి. సుబాష్ రావు దేశ్ముఖ్ అదనపు కలెక్టర్ కు వివరించారు. ఇలాంటి అంచనా జరగకుండా చూడాలని అధికారులను సూచించారు,

సెప్టెంబర్ 2న తుది ఓటర్ జాబితా…..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-29T125657.684-1.wav?_=2

గ్రామపంచాయతీ ఎన్నికలకు అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష

పోలింగ్ కేంద్రాల జాబితా ప్రచురణ

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సెప్టెంబర్ 2న గ్రామ పంచాయతీ తుది ఓటర్ జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితా ప్రచురించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ గ్రామ పంచాయతీ ఓటర్ లిస్ట్, పోలింగ్ కేంద్రాల లిస్ట్ పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితా అప్ డేట్ చేయడం జరుగుతుందని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 12 మండలాల పరిధిలో 260 గ్రామ పంచాయతీ లలోని 2268 వార్డులలో 3,52,134 ఓటర్లతో డ్రాఫ్ట్ ఓటర్ జాబితా ఆగస్టు 28న విడుదల చేసి గ్రామపంచాయతీ కార్యాలయాలలో అంటించడం జరిగిందని అన్నారు.

District Collector Sandeep Kumar Jha

జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీ వారిగా డ్రాఫ్ట్ ఓటర్ జాబితా తయారు చేశామని, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజలు ఈ జాబితా పరిశీలించి ఏదైనా అభ్యంతరాలు ఉంటే ఆగస్టు 30 లోపు తెలియజేయాలని , ఆగస్టు 31 లోపు వచ్చిన అభ్యంతరాలను పరిష్కరించి సెప్టెంబర్ 2న తుది ఓటర్ జాబితా ప్రచురించడం జరుగుతుందని అన్నారు.ప్రతి మండలం పరిధిలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు 2268 డ్రాఫ్ట్ పోలింగ్ కేంద్రాల జాబితా ఎంపీడీవో ఆగస్టు 28న తయారు చేశారని, వీటిపై అభ్యంతరాలను ఆగస్టు 30 లోపు ఎంపిడిఓ కార్యాలయంలోఅందించాలని అన్నారు. సెప్టెంబర్ 2న తుది పోలింగ్ కేంద్రాల జాబితా తయారు చేయడం జరుగుతుందని అన్నారు. 600 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం చొప్పున ఏర్పాటు చేస్తున్నామని ,జిల్లాలో ఎక్కడైనా అదనపు పోలింగ్ కేంద్రం అవసరమంటే వివరాలు అందిస్తే పరిశీలించి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి షరీపుద్దిన్, డివిజనల్ పంచాయతీ అధికారి నరేష్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గోన్నారు.

ట్రాన్స్ జెండర్లు ఆత్మగౌరవంతో జీవించాలి…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-29T124959.968.wav?_=3

ట్రాన్స్ జెండర్లు ఆత్మగౌరవంతో జీవించాలి

జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

ప్రభుత్వం నుండి సంపూర్ణ సహకారం ఉంటుంది

వరంగల్ జిల్లా ప్రతినిధి/నర్సంపేట,నేటిధాత్రి:

ట్రాన్స్ జెండర్లు ఆత్మగౌరవంతో జీవించేందుకు సంపూర్ణ సహకారం అందిస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు.కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ సంధ్యారాణి తో కలిసి టెండర్లతో కలెక్టర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ట్రాన్స్ జెండర్ ల సంక్షేమానికి చర్యలు చేపడతామన్నారు. ఆధార్ కార్డు లేని వారికి ఆధార్ కార్డు జారీతో పాటు ఆధార్ కార్డులో పేరు, జెండర్ మార్చుటకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ట్రాన్స్ జెండర్ లందరికీ గుర్తింపు కార్డులను, రేషన్ కార్డులను అందజేస్తామన్నారు. ట్రాన్స్ జెండాలలో వికలాంగులకు దివ్యాంగుల పెన్షన్ మంజూరు కి చర్యలు చేపడతామన్నారు.ట్రాన్స్ జెండర్లకు కార్మిక శాఖ ద్వారా లేబర్ కార్డులను అందిస్తామన్నారు.ఎంజిఎం ఆసుపత్రిలో ట్రాన్స్ జెండర్ లకు వారంలో ఒకసారి చికిత్స జరిగేలా ప్రత్యేక ఓపిని కూడా ఏర్పాటు చేస్తామని కలెక్టర్ ఈ సందర్భంగా ట్రాన్స్ జెండర్ లకు తెలిపారు. స్వశక్తి మహిళా తరహాలో ట్రాన్స్ జెండర్లు సంఘాలు ఏర్పడితే వ్యాపార యూనిట్లకు ఏర్పాటు రుణాలు అందిస్తామన్నారు.ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి విజయలక్ష్మి, జడ్పీ సీఈఓ, డి ఆర్ డి ఓ రామిరెడ్డి, డి డబ్ల్యు ఓ రాజమణి, ట్రాన్స్ జెండర్ల కమ్యూనిటీ అడ్వైజర్ ఈవి శ్రీనివాసరావు, ట్రాన్స్ జెండర్ ల రాష్ట్ర అధ్యక్షురాలు ఓరుగంటి లైలా, సభ్యులు అశ్విని, రీమిష, పూర్ణిమ రెడ్డి, నక్షత్ర, త్రిపుర,శాస్త్రి,జాహ్నవి, తదితరులు పాల్గొన్నారు.

ఝరాసంగం గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్యలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-96-1.wav?_=4

పారిశుధ్య లోపం.. ప్రజలకు శాపం

◆:- కనీస సౌకర్యాలకు నోచుకోని గ్రామాలు

◆:- పర్యవేక్షణ లోపంతో నిత్యం ప్రజల అవస్థలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం:ఇక్కడ పారిశుధ్య లోపంతో ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు.నిధుల కొరత పేరుతో గ్రామాల్లో ప్రజలకు కనీస సౌకర్యాలు కూడా కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు.

ముఖ్యంగా ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటంతో
ఇక్కడి కార్యదర్శులు ఆడిందే ఆట పాడిందే పాట సాగుతుంది.

అందుకు నిదర్శనంగా ఝరాసంగం మండలంలోని బిడకన్నె,కంబాలపల్లి,కృష్ణాపూర్ గ్రామాల దుస్థితి గురించి చెప్పవచ్చు.ఈ గ్రామాలలో కనీసం పారిశుద్ధ్య కార్యక్రమాలు కూడా సక్రమంగా చేపట్టకపోవడంతో నిత్యం అవస్థలు పడుతున్నట్లు ఆ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.ఈ గ్రామాల్లో విధిగా మురికి కాలువలు శుభ్రం చేయకపోవడంతో చెత్తాచెదారం నుండి దుర్గంధం వెదజల్లుతుంది.

దీంతో ఈగలు,దోమలు,బ్యాక్టీరియా వెదజల్లి రోగాల బారిన పడుతున్నట్లు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం వర్షాకాలంలోనైనా బ్లీచింగ్ పౌడర్ నైనా సరిగా చల్లడం లేదని వారు వివరించారు.నిధుల కొరత పేరుతో ప్రజల కనీస అవసరాలు తీర్చ తీర్చకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. అదేవిధంగా తాగునీటి బోర్లు,మంచినీటి కుళాయిలు ఇతర నీటి పథకాల వద్ద మురుగునీరు నిలుచుని పిచ్చిగడ్డి మొలవడంతో పారిశుద్ధ్యం కొరవడి ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు.కనీసం గ్రామాలలో వీధి బల్బులు కూడా సక్రమంగా బిగించకపోవడంతో రాత్రిపూట అంధకారం నెలకొని ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.ఈ ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్నత అధికారుల పర్యవేక్షణ కొరవడిందని, కనీసం మండల స్థాయి అధికారులైన గ్రామాలను సందర్శించకుండా నిర్లక్ష్యం చేయడంతో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని పలువురు ఆరోపించారు.

Suffer Due to Poor Sanitation

కాగా తమ గ్రామ సమస్యలను కార్యదర్శి ఏమాత్రం పట్టించుకోవడంలేదని మంగళవారం బిడకన్నె గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు.సీపీఎం కార్యదర్శి చంద్రన్న ఆధ్వర్యంలో ఆ గ్రామస్తులు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్యదర్శికి వినతి పత్రం అందజేశారు.చెత్త చెదారం నిండి దుర్గంధం వెదజల్లుతున్న మురికి కాలువలను శుభ్రం చేసి బ్లీచింగ్ పౌడర్ చల్లారని వారు కోరారు.మంచినీటి పథకాలు పనిచేయకపోవడంతో పాటు మిషన్ భగీరథ నీళ్లు సరఫరా కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లు వారు తెలిపారు.వీధి బలుపులు లేక రాత్రి వేళలో ఇబ్బందులు పడుతున్నట్లు వారు తెలియజేశారు.ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నత అధికారులు తగిన చర్యలు తీసుకుని తమ గ్రామాల సమస్యలను పరిష్కరించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

భూ భారతి దరఖాస్తులపై జిల్లా కలెక్టర్ తనిఖీలు…

భూ భారతి దరఖాస్తులపై జిల్లా కలెక్టర్ తనిఖీలు

జిల్లా కలెక్టర్ స్నేహ శబరీ ష్

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండలం కేంద్రంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఎలాంటి సమాచారం లేకుండా రావడంతో అధికారులు పరుగులు పెట్టారు. పరిష్కా రంలో అధికారులు జాప్యం చేయొద్దని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు.

భూభారతి దరఖాస్తులు ఎన్ని వచ్చాయో,వాటిని గురించి అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా కార్యాలయం ఎదుట ఉన్న భూభారతి కానీ ప్రజల సమస్యలను అడిగి తెలుసు కుని స్థానిక తాసిల్దార్ కు ఆదేశించారు అనంతరం మహాత్మ జ్యోతిరావు పూలే పాఠశాలను సందర్శించారు. ఈ కార్యక్రమంలో శాయంపేట తహసిల్దార్ సత్యనారాయణ, అన్ని శాఖల ప్రభుత్వ అధి కారులు, ఎస్సై పరమేష్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

రాబోయే 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-26T154258.504-1.wav?_=5

రాబోయే 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం

జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

జిల్లాలో మంగళవారం సహా రాబోయే కొన్ని రోజులపాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు, జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
సూచించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
వర్షాలు కొనసాగుతున్న సమయంలో ఎలాంటి నిర్లక్ష్యం చూపకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. తక్కువ ప్రదేశాలు, వంతెనలు, వాగులు, చెరువులు వంటి నీటిమునిగే ప్రాంతాలకు ప్రజలు వెళ్లకుండా జాగ్రత్త వహించాలన్నారు. విద్యుత్ తీగలు, కరెంట్ స్తంభాల దగ్గరికి వెళ్లరాదని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని కలెక్టర్ వివరించారు. మండల, గ్రామ స్థాయి అధికార యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ప్రజల నుండి వచ్చే సమాచారం పై వెంటనే స్పందించాలని ఆయన ఆదేశించారు. సహాయక చర్యల కోసం తహసీల్దార్లు, ఎమర్జెన్సీ టీములు సిద్ధంగా ఉంచాలని సూచించారు. వాతావరణ శాఖ ముందస్తు ఇస్తున్న సమాచారం ప్రకారం ప్రజలు, యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

గణేష్ ఉత్సవాలకు పటిష్ట భద్రత…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-88-1.wav?_=6

నవరాత్రి ఉత్సవాలకు పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలి

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

వినాయక చవితి వేడుకల సందర్భంగా విగ్రహాల ప్రతిష్ఠాపన నుండి నవరాత్రుల అనంతరం నిమజ్జనాల వరకు ఎటువంటి అంతరాయం కలగకుండా పటిష్ఠమైన భద్రతా చర్యలు చేపట్టాలని
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
అధికారులను ఆదేశించారు.
ఈ నెల 27వ తేదీ వినాయక చవితి పండుగను పురస్కరించుకుని విగ్రహాలు ఏర్పాటు, నిమజ్జన కార్యక్రమాలపై ఐడిఓసి కార్యాలయంలో
రెవెన్యూ, పోలీస్, పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బి, వైద్య, దేవాదాయ, అగ్నిమాపక, విద్యుత్, ఎక్సైజ్ తదితర శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతి విభాగం సమన్వయంతో పనిచేసి పండుగ వేడుకలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. మండపాలకు విద్యుత్తు సరఫరాకు, మైకు ఏర్పాట్లుకు తప్పనిసరి అనుమతి తీసుకోవాలని సూచించారు. లూజు విద్యుత్తు వైర్లు వాడరాదని, ఎంసిబి వేయాలని, వేలాడే విద్యుత్తు తీగల నుండి వైర్లు ఏర్పాటు ద్వారా ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని తెలిపారు. మండపాల వద్ద వ్యర్థాలు వేసేందుకు అనువుగా డస్ట్ బిన్స్ ఏర్పాటు చేయాలని తెలిపారు. విద్యుత్తు తీగల క్రింద విగ్రహాలు ఏర్పాటు వల్ల విద్యుత్తు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని జాగ్రత్తలు పాటించాలని స్పష్టం చేశారు. శాంతియుత వాతావరణంలో గణేష్ విగ్రహాలు ఏర్పాటు, నిమజ్జన ఉత్సవాలు జరగాలని అన్నారు. నిమజ్జన రోజున అత్యవసర వైద్య కేంద్రాలు ఏర్పాటుతో. పాటు మహాదేవపూర్, జిల్లా ప్రధాన ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది అందుబా ఉండాలని తెలిపారు. అత్యవసర సేవలకు అంబులెన్స్ సేవలు వినియోగించడానికి సిద్ధంగా ఉంచాలన్నారు. ముఖ్యంగా కాళేశ్వరం వద్ద విగ్రహాలు నిమజ్జనం జరుగుతుందని తెలిపారు. అన్ని మండలాలలో నిమజ్జనానికి నీటి వనరులను గుర్తించాలని, నిమజ్జనం చేయడానికి అనుమతి ఉన్న ప్రదేశంలో నిమజ్జనం చేయాలని తెలిపారు. గణేష్ శోభా యాత్ర సందర్భంగా క్రమ సంఖ్యలో వెళ్ళడానికి అనువుగా నంబర్లు కేటాయించాలన్నారు. మండపాల ఏర్పాటును పోలీస్ రిజిస్టర్ చేసుకోవాలని తెలిపారు.
ఉత్సవాల నిర్వహణకు జిల్లా యంత్రాంగం తరపున పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. శోభాయాత్ర సందర్భంగా రహదారుల పై గుంతలకు మరమ్మతులు చేపట్టాలని తెలిపారు.
జిల్లాలో గతంలో కూడా సహృద్భావ వాతావరణంలో ఈ వేడుకలు జరుగాయని, ఈ దఫా అదే స్ఫూర్తితో మత సామరస్యంతో గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలని ఆయన సూచించారు.
నిమజ్జన ప్రాంతాల్లో విద్యుత్తు, క్రేన్లు, మంచినీరు ఏర్పాటు చేయాలని, పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వేడుకల నిర్వహణ సజావుగా జరిగేలా అధికారులు పర్యవేక్షణ చేయాలని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, డిపిఓ శ్రీలత, అగ్నిమాపక అధికారి శ్రీనివాస్, ఆర్డిఓ రవి, అన్ని శాఖల అధికారు లు తదితరులు పాల్గొన్నారు.

ఎరువుల దుకాణాల తనిఖీ చేసిన కలెక్టర్…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-52-4.wav?_=7

రైతులు అవసరానికే యూరియా కొనుగోలు చేయాలి…

జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

కేసముద్రం/ నేటి ధాత్రి

గురువారం జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ కేసముద్రం మండలంలో ఫర్టిలైజర్ దుకాణాలను, పాలిటెక్నిక్, జిల్లా పరిషత్ ఉన్నత పతశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా కలెక్టర్ కేసముద్రం మండలం కాట్రపల్లి గ్రామంలోని ఫర్టిలైజర్ దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్బంగా కలెక్టర్ స్టాక్ నిలవలను రైతు వారీగా యూరియా కొనుగోలు వివరాలను పరిశీలించారు. యూరియా పంపిణీపై రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీస్, యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని యూరియా గురించి రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని, రైతులు ప్రస్తుత అవసరం మేరకే యూరియా కొనుగోలు చేయాలని, జిల్లాలో యూరియా నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ తెలిపారు. క్కువ రద్దీ కాకుండా.. ఉదయాన్నే షాప్ లను తెరవాలని…రైతులను ఇబ్బంది పెట్టకుండా యూరియా అమ్మకం జరగాలని కలెక్టర్ తెలిపారు. జిల్లా లో సరిపడా యూరియా ఎప్పటికప్పుడు సరఫర అవుతోందని.. రైతులు ఆందోళన చెందాలిసిన అవసరం లేదన్నారు. ఎవరైన కృత్రిమ కొరత సృష్టించాలని చేసిన, అధిక ధరలకు విక్రయించిన వారి పై చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ప్రతి ఎరువుల దుకాణంలో ఒక్కో రైతు వారీగా కొనుగోలు చేసిన వివరాలు రిజిస్టర్లు అప్డేట్ గా ఉండాలని అన్నారు.

అనంతరం కేసముద్రం మండల కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాటశాలను తనిఖీ చేసి కిచెన్ షెడ్, తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థులకు రుచికరమైన పరిశుభ్రమమైన వేడి వేడి ఆహార పదార్థాలను వడ్డించాలని, చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, అన్నారు. విద్యార్థుల యొక్క అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. విద్యార్థులకు టీచర్లు సులభమైన, అర్థవంతమైన పద్దతిలో పాటాలు నేర్పాలని అన్నారు.

డోర్నకల్ మండలం లోని శ్రీ బాలాజీ ఫెర్టిలైజర్ దుకాణాన్ని రెవెన్యు అదనపు కలెక్టర్ కె. అనిల్ కుమార్ తనిఖీ చేసి షాపులోని నిల్వలను, రైతులు కొన్న రశీదులను పరిశీలించారు.

ఈ తనిఖీ లో సంబందిత వ్యవసాయ అధికారులు, తహసిల్దార్ లు కళాశాల ప్రిన్సిపాల్, ప్రధానోపాధ్యాయుడు, తదితరులు పాల్గొన్నారు.

భూపాలపల్లి పనుల జాతర 2025 ఏర్పాట్లు పూర్తి…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-45-2.wav?_=8

పనుల జాతర – 2025 కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

గురువారం ఐడిఓసి కార్యాలయం నుండి ఆగస్టు 22వ తేదీన నిర్వహించనున్న పనుల జాతర 2025 కార్యక్రమంపై
ఎంపిడిఓలు, ఎంపీఓలు, డిపిఓ, పీఆర్ ఇంజినీర్లు, ఏపీఓలతో వీడియా కాన్ఫరెన్స్ నిర్వహించిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రజల భాగస్వామ్యంతో చేపడుతున్న అభివృద్ధి పనులు మరింత పారదర్శకంగా, ఫలప్రదంగా ఉండేలా అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. పనుల జాతర ద్వారా గ్రామాల్లో జరుగుతున్న పథకాల అమలును ప్రజలకు తెలియజేసి, వారి అభిప్రాయాలను సేకరించడం ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.
అలాగే ప్రతి మండలంలో అధికారులు సమన్వయంతో పనిచేసి ఈ జాతరను విజయవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ఆగస్టు 22న జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలల్లో 3.93 కోట్ల వ్యయంతో 1075 పనులు చేపట్టనున్నామని మండల ప్రత్యేక అధికారులు, ఎంపిడిఓ లు, ఎంపీఓలు భాగస్వాములు కావాలని తెలిపారు. పనుల జాతర 2025 లో భాగంగా ఆగష్టు 22న పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గత సంవత్సరం చేపట్టి పూర్తి అయిన పనులను ప్రారంభం, కొత్తగా చేపట్టిన పనులకు భూమి పూజ చేసి మొదలు పెట్టాలని ఆదేశించారు. ప్రజా ప్రతినిధులను ఆహ్వానించి గత సంవత్సరం చేపట్టి పూర్తి అయిన పనులను ప్రారంభించడం, నూతనంగా గుర్తించిన పనులకు భూమి పూజ నిర్వహించాలని సూచించారు. ఉపాధి హామీ పథకం క్రింద పశువుల పాకలు, అజోల్ల, చెక్ డామ్స్, కంపోస్ట్ పిట్స్, పౌల్ట్రీ షెడ్స్, స్వచ్ఛ భారత్ మిషన్ క్రింద కమ్యూనిటీ ఇంకుడు గుంతలు, కమ్యూనిటీ సానిటరీ కాంప్లెక్స్, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్స్ నిర్మాణ పనులకు భూమి పూజ చేయాలని తెలిపారు. ప్రతి గ్రామ పంచాయతీలో ఆగస్టు 22న కనీసం ఒక పనికి భూమి పూజ చేయాలని అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
గత ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకంలో ఎక్కువ పని రోజులు చేసిన దివ్యాంగుల కుటుంబాలను గుర్తించి వారిని సన్మానించాలన్నారు. గ్రామంలో నిబద్ధతతో పనిచేసిన మల్టీపర్పస్, పారిశుద్య కార్మికులను గుర్తించి సమావేశంలో వారిని సన్మానించాలని తెలిపారు. అలాగే గ్రామంలో స్వచ్ఛందంగా చెట్లు పెంపకంలో పాల్గొని ఇతరుల భాగస్వామ్యతో పచ్చదనాన్ని పెంపొందించడానికి తోడ్పాటు అందించిన వ్యక్తులను, కుటుంబాలను గుర్తించాలని వారిని కూడా సన్మానించాలని సూచించారు. నీటి సంరక్షణ భూగర్భ జలాలు పెంచే పనులను చేపట్టిన లబ్ధిదారులను గుర్తించి వారికి కూడా సన్మానం చేయాలన్నారు. ఫలవనాలు – వనమహోత్సవం కింద ఈత మొక్కలు, తాడిచెట్లు పండ్ల తోటలు పెంపకం లాంటి పనులను చేపట్టాలన్నారు. గుర్తించిన పనులకు మంజూరు ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన సూచించారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డిఆర్డిఓ బాల కృష్ణ, డిపిఓ శ్రీలత, పీఆర్ ఈ ఈ వేముకటేశ్వర్లు, అన్ని మండలాల ఎంపిడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలు, పీఆర్ ఏ ఈలు తదితరులు పాల్గొన్నారు.

వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-36-3.wav?_=9

వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల,నేటి ధాత్రి:

వాతావరణ శాఖ సూచన, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రజారక్షణ విషయంగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని,భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీప అన్నారు. శనివారం జిల్లాలోని హాజీపూర్ మండలంలో గల శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించి ప్రాజెక్టులో నీటిమట్టం వివరాలను పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రానున్న 24 నుండి 36 గంటల భారీ నుండి అతి భారీ వర్ష సూచన ఉన్నందున,ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.శనివారం మంచిర్యాల జిల్లాలో రెడ్ అలర్ట్,ఆదివారం ఆరెంజ్ అలర్ట్ ఉందని,ప్రజారక్షణ దిశగా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతుందని తెలిపారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులో ప్రస్తుతం 15.6 టి.ఎం.సి. నీరు ఉండని, ఎస్.ఆర్.ఎస్.పి., కడెం ప్రాజెక్టుల నుండి నీటిని విడుదల చేయడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో పెరుగుతుందని,ప్రాజెక్టులో 17 టి.ఎం.సి. నీటిమట్టం దాటితే ప్రజలకు ప్రమాద హెచ్చరికలు జారీ చేసి నీటిని విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు.టామ్ టామ్ ద్వారా నది పరివాహక ప్రాంతాల వద్దకు వెళ్లకుండా,వాగు,నది దాటకూడదని ప్రజలకు తెలియపరచడం జరుగుతుందని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా లోతట్టు,వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాసం ఏర్పాటు చేసే బిచ్చగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.శిథిలావస్థలో ఉన్న భవనాలలో నివసించే వారిని వెంటనే తరలించాలని, వాగులు,నదులు ఉదృతంగా ప్రవహించే సమయంలో ప్రజలను,వాహనదారులను అటువైపుగా వెళ్లకుండా సిబ్బందితో కొండగట్టు చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు.రహదారులు, కల్వర్టులు దెబ్బతింటే ఆ ప్రాంతంలో ప్రమాద సూచికలు ఏర్పాటు చేసి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు,వైద్య సిబ్బంది వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రాణ నష్టం,ఆస్తి నష్టం,పశు నష్టం జరగకుండా జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.ప్రజల తక్షణ సహాయం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో కంట్రోల్ రూమ్ 08736- 250501 ఏర్పాటు చేసి 24 గంటలు అందుబాటులో ఉంటున్నామని తెలిపారు. జిల్లాలో 90 మంది సభ్యులతో కూడిన 3 ఎస్.డి.ఆర్.ఎఫ్. బృందాలు,రక్షణ పరికరాలతో తక్షణ సహాయం కోసం సిద్ధంగా ఉన్నామని తెలిపారు. లో లెవెల్ కాజ్ వేల వద్ద ప్రజలు వెళ్లకుండా భారీ కేడ్లు ఏర్పాటు చేసి బందోబస్తు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.జిల్లా యంత్రాంగం క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి అప్రమత్తత చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఒకవైపు రక్షకభటుడు, మరొకవైపు రచయిత..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-20-5.wav?_=10

ఒకవైపు రక్షకభటుడు, మరొకవైపు రచయిత
కానిస్టేబుల్ ముడారి సాయి మహేష్

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

సిరిసిల్ల పట్టణానికి చెందిన కానిస్టేబుల్ ముడారి సాయి మహేష్ ఒకవైపు రక్షక భటుడిగా,మరొకవైపు రచయితగా ఎదుగుతూ అనేకమైన అంశాలపై సాహిత్యంలో పెన్నును,గన్నుగా చేస్తూ రానిస్తున్నటువంటి సాయి మహేష్ సమాజంలో జరిగే అంశాలను తన లోతుల వైపు చూస్తూ గన్నును పెన్నుగా మారుస్తూ సమాజ శ్రేయస్సుకు వివిధ అంశాలతో కూడిన కవిత్వాన్ని క్రూడీకరించి విశ్లేషించి అనేక అంశాలను కవితలుగా మార్చి సమాజాన్ని తట్టు లేపుతున్నటువంటి ముడారి సాయి మహేష్ ఎంతో మంది యువతకు స్ఫూర్తిగా ముందుకు సాగుతున్నారు. అంతేకాకుండా
రాజన్న సిరిసిల్ల జిల్లా సాహితీ సమితి సభ్యులు గా మరియు అనేక అవార్డులు రివార్డులు తీసుకున్నటువంటి వ్యక్తి ముడారి సాయి మహేష్. అంతేకాకుండా 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భముగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ సేవా పథకం వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ప్రభుత్వ విప్ చేతులమీదుగా,,జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, మరియు జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే చేతుల మీదుగా అందుకోవడం విశేషం. అలాగే జిల్లా కవులు రచయితలు, రాజన్న సిరిసిల్ల జిల్లా సాహితీ సమితి అధ్యక్షులు డాక్టర్ జనపాల శంకరయ్య, ప్రధాన కార్యదర్శి వెంగళ లక్ష్మణ్, బురదేవానందం,అంకారపు రవి ,గుండెల్ని వంశీ కృష్ణ, మొదలైన సాహితీ మిత్రులు అభినందించారు.

ఉత్తమ ఎంపీడీవో గా గుర్రం సత్యనారాయణ గౌడ్..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-17-4.wav?_=11

ఉత్తమ ఎంపీడీవో గా గుర్రం సత్యనారాయణ గౌడ్

జైపూర్,నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఎంపీడీవో గా బాధ్యతలు నిర్వహిస్తున్న గుర్రం సత్యనారాయణ గౌడ్ 79వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఎంపీడీవో గా ఎంపికై ప్రశంస పత్రాన్ని కలెక్టర్ కుమార్ దీపక్ చేతుల మీదుగా అందుకున్నారు.నిస్వార్ధంగా,నిబద్ధతతో,నియమనిష్ఠలతో తన కర్తవ్యాన్ని పరిపూర్ణంగా నిర్వర్తిస్తున్న ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్ కి ఉత్తమ ఎంపీడీవో పురస్కారం లభించడం ఆనందదాయకమనీ తోటి అధికారులు హర్షం వ్యక్తం చేశారు.ప్రతిరోజు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలు తీరుస్తూ తోటి ఉద్యోగులతో కలిసి సమన్వయంతో పని చేస్తున్నటువంటి సత్యనారాయణ గౌడ్ కి మరెన్నో మంచి ఉన్నత స్థానాన్ని లభించాలని ఆకాంక్షించారు.

గణపురంలో నూతన పోలీస్ సర్కిల్ ప్రారంభం…

గణపురం నూతన పోలీస్ సర్కిల్ ను ప్రారంభం కలెక్టర్, ఎస్.పీ గార్లతో కలిసి ప్రారంభించిన ఎమ్మెల్యే జీఎస్సార్

శాంతి భద్రతల బలోపేతమే ప్రభుత్వం లక్ష్యం ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్

గణపురం నేటి ధాత్రి

గురువారం గణపురం మండలం కేంద్రంలోనిపోలీస్ స్టేషన్లో నూతన పోలీస్ సర్కిల్‌ను జిల్లా కలెక్టర్ శ్రీ రాహుల్ శర్మ ,ఎస్పీ కిరణ్ కరే గార్లతో కలిసి ప్రారంభించిన భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్ మాట్లాడుతూ “ప్రజల శాంతి భద్రతల బలోపేతం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందనీ,నూతన సర్కిల్ ఏర్పాటుతో చట్ట పరిరక్షణ మరింత సమర్థవంతంగా జరుగుతుంది” అన్నారు.ఈ సర్కిల్ పరిధిలో గణపురం, రేగొండ, కొత్తపల్లి గోరి మండలాల పోలీస్ స్టేషన్లు ఉండనున్నాయని తెలిపారు.ఈ నూతన సర్కిల్ కి చెన్నమనేని కరుణాకర్ రావు ని సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గా ప్రభుత్వం నియమించింది అని ఇన్స్పెక్టర్ కి ఎమ్మెల్యే జీఎస్సార్ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

భారీ వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూం ఏర్పాటు..

భారీ వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూం ఏర్పాటు
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

24/7అందుబాటులో..వివిధ శాఖల అధికారులు

వరద, వర్షం ప్రభావిత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు

కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1800 233 1495

కంట్రోల్ రూమ్ వాట్సాప్ సెల్ నెంబర్ 9398684240

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించిన నేపథ్యంలో సంబంధిత అన్ని శాఖలను అప్రమత్తం చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. లోతట్టు ప్రాంతాలలో లో లెవెల్ కాజ్ వే ల వద్ద అప్రమత్త చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.రెవెన్యూ, పోలీస్, విద్యుత్, వ్యవసాయ, హెల్త్, పి.ఆర్, మిషన్ భగీరథ ఇతర శాఖల అధికారులు కంట్రోల్ రూంలో సేవలు అందిస్తున్నారని తెలిపారు. ఈ నెల 13 వ తేదీ నుంచి 16 వ తేదీ వరకు అధికారులు అందుబాటులో ఉండి, వర్షాలు, వరదలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు తగిన సమాచారం అందిస్తారు. సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని, వరద ప్రభావిత ప్రజలకు సహాయం చేసేలా సేవలు అందిస్తారు. 24 గంటలు ఆయా శాఖల అధికారులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశామని, ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నట్లయితే కంట్రోల్ రూమ్ నెంబర్లు టోల్ ఫ్రీ నెంబర్ 1800 233 1495, వాట్సాప్ సెల్ నెంబర్ 9398684240 లను వర్షం, వరద ప్రభావిత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రజలకు సూచించారు. జిల్లా, మండల స్థాయి అధికారులు తమ, తమ కార్యాలయాల్లో, క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలన్నారు. వర్షాల కారణంగా ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నట్లయితే అధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని, ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రా వద్దని ఈ ప్రకటనలో పేర్కొన్నారు.

ఆదివాసుల సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలి..

ఆదివాసుల సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలి

వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

నర్సంపేట,నేటిధాత్రి:

ఆదివాసుల సంస్కృతి సాంప్రదాయాలను కాపాడి రాబోయే భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు.
గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని నర్సంపేట పట్టణంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. డప్పు వాయిద్యాలు గిరిజన సాంప్రదాయాలు, నృత్యాలు చేస్తూ అమరవీరుల స్తూపం నుండి పాకాల రోడ్డు లోని కొమరం భీం విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ సత్య శారద ముఖ్యఅతిథిగా పాల్గొని కొమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ ప్రపంచానికి నాగరికతను నేర్పింది ఆదివాసీలేనన్నారు. ప్రకృతిని దైవంగా భావించే సాంస్కృతి ఆదివాసి గిరిజనులదని అన్నారు.గిరిజన సాంస్కృతి సాంప్రదాయాలు భావితరాలకు అందించేందుకు చేస్తున్న కార్యక్రమాల డాక్యుమెంటేషన్ పక్కగా నిర్వహించాలన్నారు. జిల్లాలోని 13 మారుమూల గిరిజన గ్రామాలపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఫీవర్ సర్వే నిర్వహించడంతో పాటు గ్రామాల్లో ఉన్న సమస్యలను అధికారులు సందర్శించి పరిష్కార నిమిత్తం తన దృష్టికి తీసుకురావాలన్నారు.గిరిజనుల హక్కులను రక్షిస్తూ వారి అభివృద్ధికి ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందన్నారు. వీటిని సద్వినియోగం చేసుకొకావాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి సౌజన్య,గిరిజన సంఘాల ప్రతినిధులు, ప్రజలు
పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

గ్రామపంచాయతీ కార్యదర్శులకు పరిశుద్ధ్యం పట్ల అవగాహన కార్యక్రమం…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-07T140053.083.wav?_=12

గ్రామపంచాయతీ కార్యదర్శులకు పరిశుద్ధ్యం పట్ల అవగాహన కార్యక్రమం

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ

ఫీవర్ కేసులకు తప్పనిసరిగా డెంగ్యూ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలి

జిల్లాలో డెంగ్యూ మరణాలు సంభవించకుండా జాగ్రత్తలు పాటించాలి

ప్రతి ఫీవర్ కేసును వైద్య సిబ్బంది ఫాలో అప్ చేయాలి

ఆస్తి పన్ను వసూలు లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలి

సిరిసిల్ల టౌన్:(నేటిధాత్రి)

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పలు గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ పట్ల పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ తెలిపారు. గురువారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సీజనల్ వ్యాధుల నియంత్రణ పై ఎం.పి. ఓ., పంచాయతీ కార్యదర్శులు, ఏ.ఎన్.ఎం. లతో రివ్యూ నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ, డెంగ్యూ, మల్లేరియా, చికెన్ గున్యా వంటి సీజనల్ వ్యాధులు వ్యాప్తి నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని, ఫీవర్ కేసులకు తప్పనిసరిగా డెంగ్యూ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు. ప్రతి గ్రామంలో పారిశుధ్య నిర్వహణ పట్ల అత్యంత ప్రాధాన్యత కల్పిస్తూ సీజనల్ వ్యాధులు వ్యాప్తి అరికట్టాలని అన్నారు. డెంగ్యూ కేసులు నమోదైన ప్రాంతంలో ప్రత్యేకంగా పారిశుధ్య చర్యలు చేపట్టాలని, చుట్టుపక్కల ఇండ్లలో ఫీవర్ సర్వే నిర్వహించాలని అన్నారు. పంచాయతీ కార్యదర్శి బాధ్యతతో గ్రామంలో పిచ్చి మొక్కల తొలగింపు, నీటి నిల్వ ఉండకుండా చర్యలు, అధికంగా నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో ఆయిల్ బాల్స్ వేయడం వంటి చర్యల చేపట్టాలని అన్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని హై రిస్క్ ఏరియాలను గుర్తించి అక్కడ డ్రై డే పకడ్బందీగా జరిగేలా చూడాలని అన్నారు. ప్రతి గ్రామంలో వారానికి రెండు సార్లు మంగళవారం, శుక్రవారం డ్రై డే కార్యక్రమం జరగాలని అన్నారు. ఆశా, ఏ.ఎన్.ఎం లు ఇంటింటి సర్వే నిర్వహించి నీటి నిల్వ వల్ల కలిగే నష్టాలు, దోమల తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సబ్ సెంటర్ అధికారులు వారి పరిధిలో సీజనల్ వ్యాధుల వ్యాప్తి నియంత్రణ జరిగేలా చూడాలని అన్నారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, హెల్త్ సబ్ సెంటర్ పరిధిలో అవసరమైన మేర వ్యాధి నిర్ధారణ కిట్లు అందుబాటులో పెట్టాలని అన్నారు. ప్రతి పీ.హెచ్.సి పరిధి లో లక్ష్యాలు నిర్దేశించుకొని నిర్దారణ పరీక్షలు చేయాలని అన్నారు.డెంగ్యూ కేసులను తక్కువ చేసి చూపించే అవసరం లేదని, మనం ఎన్ని డెంగ్యూ కేసులు గుర్తించి వారికి అవసరమైన చికిత్స అందిస్తే అంత బాగా పని చేసినట్లుగా పరిగణిస్తామని కలెక్టర్ తెలిపారు.

District Collector Sandeep Kumar Jha

ఔట్ పేషెంట్ వచ్చే ప్రతి ఫీవర్ కేసు రోగి కు తప్పనిసరిగా డెంగ్యూ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని అన్నారు. డెంగ్యూ నిర్ధారణ జరిగిన కేసులలో నిర్దేశిత ప్రోటోకాల్ ప్రకారం చికిత్స అందించడం పరిసర ప్రాంతాల పారిశుధ్య పనులు జరిగేలా చూడాలని అన్నారు.
డెంగ్యూ కేసులను రెగ్యులర్ గా ఫాలో అప్ చేయాలని, రక్త కణాలు ఎలా ఉంటున్నాయో పరిశీలించాలని అన్నారు. మన విధులలో చూపెట్టె చిన్న నిర్లక్ష్యం కారణంగా ఒక కుటుంబం సభ్యులను కోల్పోయే ప్రమాదం ఉంటుందని, దయచేసి అధికారులు సిబ్బంది అంతా అప్రమత్తతో విడుదల నిర్వహించాలని అన్నారు.
సిరిసిల్ల , వేములవాడ ఆసుపత్రులకు అధికంగా రోగులు వస్తున్నారంటే క్షేత్ర స్థాయిలో పి.హెచ్.సి పని తీరు సరిగ్గా ఉండటం లేదని అర్థం వస్తుందని అన్నారు. ప్రతి పి.హెచ్.సి వద్ద అవసరమైన మందులు, వ్యాధి నిర్ధారణ కిట్లు 20% బఫర్ స్టాక్ తో అందుబాటులో పెట్టుకోవాలని అన్నారు.
ప్రతి గ్రామంలో ఆస్తిపన్ను వసూలు లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శులు క్షేత్రస్థాయిలో పని చేయాలని
ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా రజిత, సిరిసిల్ల, వేములవాడ ఏరియా ఆసుపత్రుల సూపరింటెండెంట్ లు పెంచలయ్య, జిల్లా పంచాయతీ అధికారి షరీఫ్ద్దీన్, ఎం.పి.ఓ. లు, పంచాయతీ కార్యదర్శులు, ఏ.ఎన్.ఎం. లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

తాసిల్దార్ కార్యాలయంలో కలెక్టర్ అకస్మాత్తుగా తనిఖీలు..

తాసిల్దార్ కార్యాలయంలో కలెక్టర్ అకస్మాత్తుగా తనిఖీలు

భూభారతి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి

కలెక్టర్ సత్య శారద దేవి

#నెక్కొండ, నేటి ధాత్రి:

మండలంలోని తాసిల్దార్ కార్యాలయాన్ని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారదా దేవి అకస్మాత్తుగా తనిఖీలు నిర్వహించారు. తాసిల్దార్ కార్యాలయంలోని భూ భారతి రెవెన్యూ చట్టానికి సంబంధించిన ఫైళ్లను పరిశీలించారు. అనంతరం తాసిల్దార్ రాజ్ కుమార్ ను మండల వ్యాప్తంగా వచ్చిన ఫైళ్ళ వివరాలు అడిగి తెలుసుకుని రెండు రోజులలో భూ సమస్యల కోసం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తులతో సిబ్బంది వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించి సంబంధిత దరఖాస్తులను ఎప్పటికప్పుడు కలెక్టర్ కార్యాలయానికి చేరవేయాలని అన్నారు. ఏమాత్రం అధికారులు అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని సిబ్బంది టీములుగా విడిపోయి క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎప్పటికప్పుడు నివేదికను పంపించాలని అన్నారు.

నెక్కొండ సర్వేయర్ పై ఆగ్రహం

మండలంలోని తాసిల్దార్ కార్యాలయంలో అకస్మాత్తుగా తనిఖీలు నిర్వహించిన వరంగల్ కలెక్టర్ సత్య శారదా దేవి నెక్కొండ సర్వేయర్ కుశాల్ కుమార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వేయర్ భూభారతి దరఖాస్తులపై వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించక రెవెన్యూ కార్యాలయంలో ఏం చేస్తున్నావ్ అంటూ చురకలంటించారు. ఎక్కువ శాతం భూ సమస్యలు సర్వేయర్లు వెళ్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట ఆర్డీవో ఉమారాణి, వరంగల్ ఆర్డీవో సత్యపాల్ రెడ్డి, నర్సంపేట డి ఏ ఓ శ్రీనివాస్, వరంగల్ డీఏవో ఫణి కుమార్, రెవెన్యూ ఉన్నత అధికారులు పాల్గొన్నారు.

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ గారిని కోరిన ఎమ్మెల్యే

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-06T114519.415.wav?_=13

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ గారిని కోరిన ఎమ్మెల్యే

జహీరాబాద్ నేటి ధాత్రి:

కవర్గాలబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేయాలని మరియు నియోనికి ఇందిరమ్మ ఇండ్లను కేటాయించాలని జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేసిన ఎమ్మెల్యే మాణిక్ రావు గత ప్రభుత్వం లో నియోజకవర్గంలోని నిరుపేదలకు అర్హులైన 660 మంది లబ్దిదారులకు లాటరీ సిస్టం ద్వారా ఎంపిక చేసి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించడం జరిగింది డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు వెంటనే అందించాలని & నియోజకవర్గానికి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక నిష్పాతపక్షంగా ఉండాలని,అర్హులైన వారందరికీ పార్టీలకు అతీతంగా అందజేయాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావిణ్య గారికి వినతిపత్రం అందజేసిన శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు ఎమ్మెల్యే గారితో పాటుగా మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, పాక్స్ చైర్మన్ మచ్చెందర్,మాజి పట్టణ అధ్యక్షులు మొహియుద్దీన్, మాజి సర్పంచ్ చిన్న రెడ్డి తదితరులు ఉన్నారు..

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version