ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అకస్మిక తనిఖీ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్..

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అకస్మిక తనిఖీ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

మొగుళ్ల పెళ్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి(DM&HO) డాక్టర్ మధుసూదన్ గారు ఆకస్మిక తనిఖీ చేసినారు. ఆస్పత్రి హాజరు పట్టికను పరిశీలించినారు. ఆసుపత్రి ఉద్యోగులు సమయపాలన పాటించాలని తెలియజేసినారు. లేనిపక్షంలో శాఖపరమైన చర్యలు తీసుకోబడును అని తెలియజేసినారు. అదేవిధంగా ఆస్పత్రిలో లేబర్ రూమ్ ,ఆయుష్ రూమ్, యోగ రూమ్ ములను పరిశీలించినారు .
తర్వాత మొగుళ్లపల్లి ఉప కేంద్రాన్ని తనిఖీ చేసి రికార్డ్స్ పరిశీలించినారు. వాక్సినేషన్ టిబి నోటిఫికేషన్ , సీజన్ వ్యాధుల గూర్చి మరియు ఎన్ సి డి తదితర అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ నాగరాణి గారు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రాజేంద్రప్రసాద్ సిబ్బంది పాల్గొన్నారు.

ఘనంగా డాక్టర్ ఆరాధన్ రెడ్డి, సరిన్ జాన్ జన్మదిన వేడుకలు…

ఘనంగా డాక్టర్ ఆరాధన్ రెడ్డి, సరిన్ జాన్ జన్మదిన వేడుకలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్. పట్టణంలోని సిటీ సెంటర్ ఆసుపత్రి ప్రధాన డాక్టర్ ఆరాధన్ రెడ్డి, డైరెక్టర్ సారిన్ జాన్ జన్మదిన వేడుకలు ఆదివారం నాడు సిటీ సెంటర్ ఆసుపత్రిలో పార్లమెంట్ ఇంచార్జ్, ఆసుపత్రి డైరెక్టర్ గంకటి శుక్లవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జన్మదిన వేడుకల్లో భాగంగా ఇరు డాక్టర్లకు డైరెక్టర్లు శుక్లవర్ధన్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి లు శాలువకప్పి బొకేతో ఘనంగా సన్మానించి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పార్లమెంట్ ఇంచార్జ్ మాట్లాడుతూ తమ జీవితంలో చేసే మంచి కార్యాలు తమను ఉన్నతంగా నిలుపుతాయని, ప్రజల కష్ట నష్టలలో అండగా నిలిచినప్పుడే తమకు పేరు ప్రఖ్యాతలు వస్తాయని అన్నారు. కార్యక్రమంలో డా ఆరాధన్ రెడ్డి, డా సారిన్ జాన్, డైరెక్టర్ లు గంకటి శుక్లవర్ధన్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి, పల్లవి స్కూల్ డైరెక్టర్ గంకటి శ్రీధర్ రెడ్డి, మొయిజ్ లష్కరి, మొహమ్మద్ అష్రాఫ్, డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సమాచార హక్కు చట్టం ద్వారా పౌరులు కోరిన సమాచారం ఇవ్వాలి…

సమాచార హక్కు చట్టం ద్వారా పౌరులు కోరిన సమాచారం ఇవ్వాలి

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

 

సమాచార హక్కు చట్టం ద్వారా పౌరులు కోరిన సమాచారాన్ని నిర్దేశిత వ్యవధిలోగా అందించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.
శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఐడిఓసి కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన “సమాచార హక్కు చట్టం 2005” వారోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పనితీరులో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడంలో సమాచార హక్కు చట్టం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.
పౌరులు కోరిన సమాచారాన్ని సకాలంలో అందించడం ప్రతి అధికారి బాధ్యతగా భావించాలని సూచించారు. అలాగే స్వచ్ఛందంగా ఇవ్వాల్సిన సమాచారాన్ని పౌరులకు సులభంగా అందుబాటులో ఉంచే విధంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు.
అంతకుముందు ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బందితో సమాచార హక్కు చట్టాన్ని గౌరవిస్తూ పౌరులు కోరిన సమాచారాన్ని సకాలంలో అందిస్తానని, స్వచ్ఛందంగా ఇవ్వవలసిన సమాచారాన్ని పౌరులకు అందుబాటులో ఉండేలా వ్యవహరిస్తారని, పనితీరులో పారదర్శకతను, జవాబుదారీతనాన్ని పాటిస్తూ పని చేస్తానని ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఎస్డిసి రమేష్, ట్రైని డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, అన్ని శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

ధర్మ మార్గాన్ని చూపిన వాల్మీకి మహర్షి

ధర్మ మార్గాన్ని చూపిన వాల్మీకి మహర్షి

జిల్లా ఎస్పీ

వనపర్తి నేటిదాత్రి .

Vaibhavalaxmi Shopping Mall

మంగళవారం నాడు జిల్లా పోలీసు కార్యాలయంలో మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఎస్పీ మాట్లాడుతూ మహర్షి వాల్మీకి రామాయణం మనిషి జీవనానికి మార్గదర్శక గ్రంథమని అన్నారు ఆయన చూపిన సత్యం, ధర్మం, నీతి మార్గాల్లో నడుచుకుంటూ సమాజానికి.నీతి మార్గంలో నడవడమే వాల్మీకి మహర్షి కి మనం ఇచ్చే నిజమైన నివాళి అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఏ ఆర్ అదనపు ఎస్పీ, వీరారెడ్డి, డిసిఅర్భి డిఎస్పీ, ఉమామహేశ్వరావు, కార్యాలయం ఏవో, సునందన, స్పెషల్ బ్రాంచ్ సీఐ,నరేష్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, అప్పలనాయుడు, శ్రీనివాస్ ,జిల్లా పోలీసు కార్యాలయం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

విజయదశమి అందరికి విజయాలు చేకూర్చాలి…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-01T135810.401.wav?_=1

 

 

విజయదశమి అందరికి విజయాలు చేకూర్చాలి

జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐపీఎస్

జిల్లా ప్రజలకు,పోలీస్ అధికారులకు,సిబ్బందికి విజయదశమి శుభాకాంక్షలు

జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయుధ,వాహన పూజలు

సిరిసిల్ల టౌన్ : ( నేటిధాత్రి )

సిరిసిల్ల జిల్లాలో ఈరోజు విజయదశమి పండుగ ప్రజలకు అన్ని రంగాలలో విజయం చేకూర్చాలని ఎస్పీ ఆకాంక్షించారు.ఈరోజు జిల్లా పోలీసు కార్యాలయంలోని ఆర్ముడు రిజర్వ్ విభాగంలో ఆయుధ పూజ, వాహన పూజ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్పీ దుర్గా దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.విజయదశమి పర్వదినోత్సవం అందరికి సుఖ సంతోషాలు కలిగించాలని ఆకాంక్షించారు. ఈసందర్భంగా జిల్లా ప్రజలకు మరియు పోలీస్ అధికారులకు సిబ్బందికి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈపూజా కార్యక్రమాలలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, ఆర్.ఐ లుమధుకర్, యాదగిరి, సి.ఐ లు కృష్ణ,నాగేశ్వరావు,మధుకర్, శ్రీనివాస్, ఆర్.ఎస్.ఐ లు, ఎస్.ఐ లు సిబ్బంది పాల్గొన్నారు.

సిరిసిల్ల జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎం.హరిత…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-29T130410.862.wav?_=2

 

సిరిసిల్ల జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎం.హరిత

శుభాకాంక్షలు తెలిపిన అదనపు కలెక్టర్, జిల్లా అధికారులు

సిరిసిల్ల టౌన్:(నేటిధాత్రి)

సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గా ఎం హరిత సోమవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా సమీకృత కార్యాలయానికి రాగా, అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తన ఛాంబర్ లో కలెక్టర్ ఎం హరిత బాధ్యతలు స్వీకరించారు.

అనంతరం అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు పుష్పగుచ్చం అందజేసి, శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు, అధికారులు, సిబ్బంది కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో ఏ.ఓ రాంరెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ ఎం. హరిత…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-29T121919.981.wav?_=3

 

 

బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ ఎం. హరిత

– శుభాకాంక్షలు తెలిపిన అదనపు కలెక్టర్, జిల్లా అధికారులు

సిరిసిల్ల(నేటి ధాత్రి):

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గా ఎం. హరిత సోమవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా సమీకృత కార్యాలయానికి రాగా, అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తన ఛాంబర్ లో కలెక్టర్ ఎం హరిత బాధ్యతలు స్వీకరించారు. అనంతరం అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు పుష్పగుచ్చం అందజేసి, శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు, అధికారులు, సిబ్బంది కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.
కార్యక్రమంలో ఏఓ రాంరెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మహిళా చైతన్యానికి,ఆత్మగౌరవానికి చాకలి ఐలమ్మ ఒక ప్రతీక…

మహిళా చైతన్యానికి,ఆత్మగౌరవానికి చాకలి ఐలమ్మ ఒక ప్రతీక

పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్

మంచిర్యాల,నేటి ధాత్రి:

తెలంగాణ వీర వనిత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝ, అధికారులు, సిబ్బంది పోలీస్ కమిషనరేట్ కార్యాలయం భవనం వద్ద ఏర్పాటు చేసిన చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ…పెత్తందార్ల దురాగతాలను,ఆనాటి నిరంకుశ రజాకార్లకు,దేశ్ ముఖ్ లకు వ్యతిరేఖంగా మొక్కవోని ధైర్యంతో ఐలమ్మ ఎదిరించిన తీరు అందరికీ ఆదర్శమని ఐలమ్మ పోరాటాలను కొనియాడారు. ఆమె చేసిన పోరాట ఉద్యమమే తెలంగాణ సాయుధ పోరాటానికి స్ఫూర్తి అని అన్నారు.మహిళా చైతన్యానికి,ఆత్మగౌరవానికి ప్రతిక అని మహిళలందరూ ఆమెను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈకార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్,ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్,ఏ ఓ శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ లు భీమేష్,ఆర్ఐ లు దామోదర్,శ్రీనివాస్, వామన మూర్తి,సీపీఓ సిబ్బంది,వివిధ వింగ్స్ సిబ్బంది,ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు.

నిమ్జ్ డిప్యూటీ కలెక్టర్గా విశాలాక్షి…

నిమ్జ్ డిప్యూటీ కలెక్టర్గా విశాలాక్షి

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ నిమ్జ్ డిప్యూటీ కలెక్టర్గా విశాలాక్షి విధుల్లో చేరారు. హైదరాబాద్ మహిళా శిశు సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్గా పనిచేస్తున్న విశాలాక్షిని ఇక్కడకు బదిలీ చేశారు. నూతన డిప్యూటీ కలెక్టరు కార్యాలయ సిబ్బంది ఘనంగా సన్మానించారు. విశాలాక్షి మాట్లాడుతూ.. నిమ్జ్ రైతుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు.

ఎస్ఆర్కె పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-04T135338.011.wav?_=4

ఎస్ఆర్కె పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినం సందర్భంగా రామకృష్ణాపూర్ పట్టణంలోని ఎస్ఆర్కె పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ప్రధానోపాధ్యాయులు పెద్దపల్లి ఉప్పలయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.పాఠశాలలో 9, 10వ తరగతి విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి మాట్లాడారు… ఉపాధ్యాయ వృత్తి నుంచి భారతదేశానికి రెండవ రాష్ట్రపతిగా ఎదిగిన తనను మేమందరం ఆదర్శంగా తీసుకొని భారత దేశ అభ్యున్నతి కోసం పాటుపడతామని తెలిపారు.

 

ఉపాధ్యాయులుగా వ్యవహరించిన విద్యార్థులందరికీ బహుమతులు అందించారు. పాఠశాల ఉపాధ్యాయులును అందరినీ శాలువాలతో సత్కరించి, విద్యార్థుల భవిష్యత్తు కోసం హర్నిశలు కృషి చేయాలని వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ కోల శ్రీనివాస్,డోకూరి సోమశేఖర్, అంబాల రాజేందర్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మహాదేవపూర్‌లో ఓటర్ల తుది జాబితా….

నోటీస్ బోర్డులో ఓటర్ల తుది జాబితా

మహాదేవపూర్ సెప్టెంబర్ 2 (నేటి దాత్రి)
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ గ్రామపంచాయతీ లో ఓటర్ల తుది జాబితాను మంగళవారం రోజున ప్రజల సందర్శనార్థం నోటీసు బోర్డులో ఉంచారు. గ్రామపంచాయతీ లో ఓటర్ల తుది జాబితాను గ్రామపంచాయతీ సిబ్బందితో సేకరించి మండల పంచాయతీ అధికారి ప్రసాద్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సందర్శనార్థం నోటీస్ బోర్డ్ లో ఉంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి కల్పన, గ్రామ ప్రజలు మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

డిఈఓ జ్ఞానేశ్వర్ కు ఘన సన్మానం..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-63.wav?_=5

డిఈఓ జ్ఞానేశ్వర్ కు ఘన సన్మానం

వరంగల్ జిల్లా ప్రతినిధి/నర్సంపేట,నేటిధాత్రి:

వరంగల్ జిల్లా విద్యాధికారి మామిడి జ్ఞానేశ్వర్ పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించి సంవత్సరం పూరైన సందర్భంగా ఘన సన్మానం చేశారు.ఈ నేపథ్యంలో డిఈఓ జ్ఞానేశ్వర్ ను ఏఎంఓ సృజనతేజ, జీఈసిఓ ఫ్లోరెన్స్, డిఎస్ఓ శ్రీనివాస్, సూపరింటెండెంట్స్, కోఆర్డినేటర్లు, టీఎన్జీవో జిల్లా ఉపాధ్యక్షుడు రామానుజం జగదీశ్వర్ లు శాలువాలతో సన్మానించి పుష్పగుచ్ఛాలతో శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పరకాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జెండా పండుగ..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-48-1.wav?_=6

ప్రభుత్వం జూనియర్ కళాశాల లో ఘనంగా జెండా పండుగ

పరకాల నేటిధాత్రి
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆగస్టు 15నాడు 79 వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ కే.సంపత్ కుమార్ జెండావిష్కరించడం జరిగింది. అనంతరం అయన మాట్లాడుతూ స్వతంత్రం కోసం మనము 1857 నుంచి 1947 వరకు పోరాటం చేసి ఆ పోరాటంలో ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేయడం జరిగిందని తద్వారా మనకు స్వతంత్రం సిద్ధించింది కావున ప్రతి విద్యార్థి తప్పకుండా స్వతంత్ర పోరాట యోధులను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.ఈరోజు మనము కళాశాలలో ఉచిత విద్య మరియు ఉచిత హాస్టల్స్ గురుకులాలు స్కాలర్షిప్ సౌకర్యము పొందుతున్నాము విద్యార్థులందరూ దేశ రక్షణ కోసం అందరూ పాటుపడాలని ఉత్తమ పౌరులుగా తయారు కావాలని విద్యార్థులకు సూచించారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు,విద్యార్థులు కళశాల సిబ్బంది పాల్గొన్నారు.

తహసిల్దార్ కార్యాలయంలో వన మహోత్సవం..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-21-3.wav?_=7

తహసిల్దార్ కార్యాలయంలో వన మహోత్సవం

జైపూర్,నేటి ధాత్రి:

జైపూర్ తహసిల్దార్ కార్యాలయంలో సోమవారం వనమహోత్సవ కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమం తహసిల్దార్ వనజా రెడ్డి, ఎంపీఓ శ్రీపతి బాబురావు ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తమ పుట్టినరోజు,పెళ్లిరోజు వేడుకల సందర్భంగా మొక్కలు నాటి వాటిని విరివిరిగా సంరక్షిస్తూ వాతావరణ సమతుల్యతకు పాటుపడలని తెలిపారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ సంతోష్,ఏపీవో బాలయ్య,ఎఫ్ఎస్ఓ రామకృష్ణ,ఐసిడిఎస్ సూపర్వైజర్ కవిత,పంచాయతీ కార్యదర్శి బి.ఉదయ్,తహసిల్దార్ కార్యాలయ సిబ్బంది,ఫీల్డ్ అసిస్టెంట్ తదితరులు పాల్గొన్నారు.

మున్సిపల్ సిబ్బందికి సీజనల్ మరియు హెల్త్ కిట్స్ పంపిణీ.

మున్సిపల్ సిబ్బందికి సీజనల్ మరియు హెల్త్ కిట్స్ పంపిణీ

.వర్షాకాలంలో 16వ డివిజన్ ను పరిశుభ్రంగా ఉంచాలి.

సుంకరి మనిషా శివకుమార్.
16వ డివిజన్ కార్పొరేటర్

కాశిబుగ్గ నేటిధాత్రి.

వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధి 16వ డివిజన్ లోని పారిశుద్య పనులు నిర్వహిస్తున్న మున్సిపల్ సిబ్బందికి స్థానిక 16వ డివిజన్ కార్పొరేటర్ సుంకరి మనీషా శివకుమార్ సీజనల్ మరియు హెల్త్ కిట్స్ అందచేయడం జరిగింది.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ నిరంతం డివిజన్ ను పరిశుభ్రంగా ఉంచేందుకు ఎంతగానో శ్రమిస్తున్న సిబ్బంది అనారోగ్య ఇబ్బందులకు గురి కాకుండా ఉండేందుకు కార్పొరేషన్ హెల్త్ కిట్స్ అందించడం ద్వారా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని అన్నారు.అదే విధంగా వర్షా కాలాన్ని దృష్టిలో పెట్టుకొని సీజనల్ కిట్స్ అందించడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపాలిటీ సిబ్బంది కార్పొరేటర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ జవాన్ లు సిబ్బంది పాల్గొన్నారు.

యూనియన్ బ్యాంకు లో స్టాఫ్ లేక ఖాతాదారుల కు ఇబ్బందులు.

యూనియన్ బ్యాంకు లో స్టాఫ్ లేక ఖాతాదారుల కు ఇబ్బందులు

డి.ఎస్.పి పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కండె రవి

గణపురం నేటి ధాత్రి:

 

గణపురం మండల కేంద్రంలో ఉన్న యూనియన్ బ్యాంక్ ను ధర్మ సమాజ్ పార్టీ భూపాలపల్లి జిల్లా ప్రదాన కార్యదర్శి కండె రవి ఆధ్వర్యంలో పరిశీలించడం జరిగింది ఈ బ్యాంకులో 80,000 మంది ఖాతాదారులు ఉండగా ముగ్గురు మాత్రమే సిబ్బంది వారికి తోడుగా ఒకరిద్దరు సహా సిబ్బంది ఉన్నారు రోజుకు మండలంలోని 17 గ్రామాలు కాకుండా పక్క గ్రామాలను కలుపుకొని 80,000 మంది ఖాతాదారులు ఉన్నారు వీరందరికీ సరిపడా స్టాఫ్ లేరు రైతు భరోసా పైసలు వడ్ల పైసలు ఏకకాలంలో పడడం వల్ల రైతులు ఖాతాదారులు బ్యాంకుకు వస్తున్నారు వారి డబ్బులను వారికి సకాలంలో చెల్లించడంలో ఈ ప్రభుత్వం మరియు బ్యాంకు విఫలమైంది గంటల తరబడి ఖాతాదారులంతా లోపల నిలబడుతున్నారు కనీస సౌకర్యాలు బ్యాంకులో లేవు బిపి షుగర్ ఉన్న పేషెంట్లు చాలా ఇబ్బంది పడుతున్నారు కూర్చోడానికి కుర్చీలు లోపల ఉండవు మూత్రం పోదా పోద్దాం అంటే బయట టాయిలెట్ గది ఉండదు ఖాతాదారులకు అనుగుణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలి ఇది ప్రజా ప్రభుత్వం అని చెప్పినప్పుడు ఒక్కొక్క రైతు చెప్పులు అరిగేలా ఎనిమిది రోజులు బ్యాంకు చుట్టూ తిరుగుతున్నారు ఒక పేద రైతుకు చెక్ బుకు ఎందుకు చెక్ బుక్ ల పేరుతోనే కాలయాపన చేస్తున్నారు సరైన సెక్యూరిటీ లేక ప్రజలు గుంపులుగాడుతున్నారు స్థానిక ఎస్ఐ సహకరించాలని కోరుతున్నాం ఒక రెండు నెలలు ఈ సమస్య పైన బ్యాంకు మేనేజర్ స్థానిక ఎస్సై ఆర్ అశోక్ స్పందించాలని కోరుతున్నాం ఇది ప్రజా ప్రభుత్వం కాదు దళారి ప్రభుత్వం ప్రజల అవసరాలు తీర్చని ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఎట్లా అయితది అని ధర్మ సమాజ్ పార్టీ పక్షాన ప్రశ్నిస్తున్నాం ఇక ముందు ఇలా కొనసాగితే ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బ్యాంక్ ఖాతాదారులు అందరితో కలిసి ధర్నా రాస్తారోకోలు చేస్తాం ఈ కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ గాంధీనగర్ గ్రామ అధ్యక్షులు ఇంజపల్లి విక్రమ్ నరసన్న మొగిలి వినయ్ శ్రీ కరణ్ బ్యాంకు ఖాతాదారులు  పాల్గొన్నారు

ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు సిబ్బంది వ్యాధుల.

పట్టణ ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు సిబ్బంది వ్యాధుల నియంత్రణలో అప్రమత్తంగా ఉండాలి

హన్మకొండ, నేటిధాత్రి:

 

shine junior college

 

 

స్టాప్ డయేరియా క్యాంపెయిన్ లో భాగంగా 15 రోజుల పాటు పిల్లలు అతిసార వ్యాధికి గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తల్లిదండ్రులకు అవగాహన కలిగించాలని ఓ ఆర్ ఎస్ మరియు జింక్ టాబ్లెట్లు అందుబాటులో ఉంచుకోవాలనిహనుమకొండ డిఎంహెచ్వో డాక్టర్ ఏ అప్పయ్య సూచించారు .ఈరోజు హనుమకొండ పట్టణ పరిధిలోని పట్టణ ఆరోగ్య కేంద్రాలు, పీహెచ్సీ కడిపికొండ కు సంబంధించిన వైద్యాధికారులు సూపర్వైజర్లతో కలెక్టరేట్ లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ డెంగ్యూ మలేరియా కేసులు రాకుండా సంబంధిత విభాగాలతో సమన్వయంతో పని చేస్తూ ,ప్రజల్లో అవగాహన కలిగిస్తూ పాజిటివ్ వచ్చిన ఏరియాలో తగిన చర్యలు తీసుకోవాలని , ప్రతి మంగళవారం శుక్రవారం డ్రైడే పాటించాలని డ్రైడే ప్రాముఖ్యతని ప్రజలకు తెలియజేయాలని అలాగే గ్రామాల్లో మరియు పాఠశాలల్లో వైద్య శిబిరములు నిర్వహించాలని, వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యంగా చేతుల పరిశుభ్రత పై ,పరిసరాల పరిశుభ్రత వంటి అంశములపై అవగాహన కలిగించాలన్నారు. టీవీ ముక్త అభియాన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న క్యాంపులలో పరీక్షలు ఎక్కువగా నిర్వహించడంతోపాటు టీవీకి చికిత్స పొందుతున్న కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించాలని అలాగే వారికి పోషణకు సంబంధించిన అవగాహన ,తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ విజయకుమార్,అడిషనల్ డి ఎం హెచ్ ఓ మరియు ఇన్చార్జి మలేరియా అధికారి డాక్టర్ టి మదన్ మోహన్ రావు ఆరోగ్య కేంద్రాల వారీగా మెడికల్ క్యాంపులు ,అలాగే పాజిటివ్ కేసులు (తీసుకుంటున్న చర్యల గురించి సమీక్షించగా, జిల్లా ఎమినైజేషన్ అధికారి డాక్టర్ మహేందర్ స్టాప్ డయేరియా క్యాంపెయిన్,మరియు రోట వైరస్ వ్యాక్సిన్ ల గురించి, జిల్లా టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ హిమబిందు టీబీ ముక్తాభియాన్ అలాగే ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఇక్తదార్ అహ్మద్ఎన్సిడి, మాతా శిశు సంక్షేమం ప్రోగ్రాం అధికారి డాక్టర్ మంజుల తగిన సూచనలు చేయడం జరిగింది.

సిబ్బందికి జీతాలు చెల్లించాలి.

‘సిబ్బందికి జీతాలు చెల్లించాలి’

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

సంగారెడ్డి: జహీరాబాద్లోని 1962 పశుసంచార వాహన సేవల సిబ్బందికి గత మూడు నెలలుగా జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గురువారం జీతాలు చెల్లించాలని నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మూగ జీవాలకు వైద్య సేవలు అందిస్తున్న వీరికి సకాలంలో జీతాలు చెల్లించి ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

భూ భారతి పై రెవెన్యూ సిబ్బంది కి అవగాహన.

— భూ భారతి పై రెవెన్యూ సిబ్బంది కి అవగాహన
• జూన్ 2 నుండి భూ భారతి దరఖాస్తుల స్వీకారణ
• అకాల వర్షాలకు రైతులు అప్రమత్తంగా ఉండాలి

మెదక్ ఆర్డీఓ రమాదేవి

నిజాంపేట: నేటి ధాత్రి

 

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా తీసుకువచ్చిన భూ భారతి పై రెవెన్యూ సిబ్బందికి మెదక్ ఆర్డీఓ రమాదేవి అవగాహన కల్పించారు. ఈ మేరకు నిజాంపేట మండల తహసీల్దార్ కార్యాలయాన్నీ ఆమె శుక్రవారం సందర్శించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడారు.. మెదక్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జూన్ 2 న భూ భారతికి సంబంధించి దరఖాస్తులను తీసుకోవడం జరుగుతుందన్నారు. భూమిలకు సంబంధించిన సమస్యల పై సంబంధిత ధ్రువ పత్రాలను జోడించి దరఖాస్తు ఫామ్ తో కలిపి అధికారులకు అందివాలన్నారు. భూ భారతి లో దరఖాస్తు చేసుకున్న సమస్యలను విచారించి పరిష్కారం చేయడం జరుగుతుందన్నారు. సత్వర సమస్యల పరిష్కారం కోసం భూ భారతి నీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చెయ్యడం జరిగిందన్నారు. అలాగే అకాల వర్షాల దృశ్య కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం అరబోసిన రైతులు టార్పాలిన్ అందుబాటులో ఉంచుకోవాలన్నారు. వేగవంతగా కొనుగోలు జరపాలని ఇంచార్జులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం లో తహసీల్దార్ శ్రీనివాస్, డిప్యుటీ తహసీల్దార్ రమ్యశ్రీ,సీనియర్ అసిస్టెంట్ రమేష్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ లు ప్రీతీ, ఇమాద్, కార్యాలయ సిబ్బంది ఉన్నారు.

క్షేత్రస్థాయి సిబ్బంది తలసీమియా వ్యాధి.

క్షేత్రస్థాయి సిబ్బంది తలసీమియా వ్యాధి గురించి ప్రజల్లో అవగాహన కలిగించాలి

హనుమకొండ డిఎంహెచ్ఓ డాక్టర్ అల్లం అప్పయ్య

హన్మకొండ, నేటిధాత్రి:

 

 

ప్రపంచ తలసీమియా దినం సందర్భంగా ఈరోజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి హనుమకొండ నుండి నిర్వహించిన అవగాహన ర్యాలీని జిఎంహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి మరియు ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి మదన్మోహన్ రావుతో కలిసి జండా ఊపి ప్రారంభించారు. పట్టణ కుటుంబ సంక్షేమ కేంద్రం ,అలాగే పోచమ్మ కుంట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ,బ్లడ్ బ్యాంక్ మరియు టీ హబ్ సిబ్బందితో కలిసి నిర్వహించిన ఈ ర్యాలీ కొత్తూర్ మరియు మెయిన్ రోడ్డు గుండా అవగాహన నినాదాలతో నిర్వహించడం జరిగింది. అనంతరం బ్లడ్ బ్యాంకులో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న డాక్టర్ అప్పయ్య మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో దాదాపుగా 300 మంది చిన్నారులు తలసీమియా వ్యాధితో బాధపడుతున్నారని , ఇది ఒక జన్యు సంబంధమైనటువంటి వ్యాధి అని,వ్యాధితో బాధపడుతున్నారు మరియు వారి కుటుంబ సభ్యులు జన్యు పరీక్షలు చేయించుకోవాలని అలాగే మేనరిక వివాహాలు కూడా సరికాదన్నారు. వీరికి తరచుగా రక్త మార్పిడి అవసరము ఉంటుందన్నారు అలాగే రెడ్ క్రాస్ ఆవరణలో వీరి కోసం ప్రత్యేకమైనటువంటి వార్డు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని ఆరోగ్యశ్రీ సదుపాయం కూడా ఉందన్నారు. నెలల వయస్సులోనే ఈ వ్యాధి లక్షణాలను మనం గుర్తించవచ్చునని వీరిలో ఎదుగుదల సరిగా ఉండదని మొహం పీకపోయి ఉన్నట్టుగా ఉండి నీరసంగా ఉంటారని తొందరగా అనారోగ్యం బారిన పడతారన్నారు. తలసీమియా మరియు సికిల్ సెల్ అనే మియా రెండు కూడా జన్యుపరమైనవని అలాగే రక్తమునకు సంబంధించిన సమస్యలతో కూడుకున్న వన్నారు. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాలో సికిల్ సెల్ అనేమియా గురించి ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ప్రత్యేక కార్యక్రమంలు నిర్వహించడం జరుగుతున్నది అన్నారు.
జిఎంహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ వీరికి ప్రతి రెండు మూడు వారాలకు ఒకసారి రక్త మార్పిడి అవసరం ఉంటుందని అలాగే తలసీమియా వ్యాధితో బాధపడుతున్న కుటుంబ సభ్యులు, వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు అలాగే గర్భవతి కావాలనుకున్నప్పుడు తప్పనిసరిగా తలసీమియా స్క్రీనింగ్ చేసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ టి మదన్మోహన్రావు , ఇన్చార్జ్ బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నిఖిల, పట్టణ కుటుంబ సంక్షేమ కేంద్రం డాక్టర్ గీత , జిల్లా మాస్ మీడియా అధికారి వి అశోక్ రెడ్డిపోచమ్మ కుంట వైద్యాధికారి డాక్టర్ దీప్తి పిహెచ్ఎన్ రామేశ్వరి టీ హబ్ మేనేజర్ శ్రీ కౌముది, హెచ్ ఈ ఓ ఖాదర్ అబ్బాస్ ,సూపర్వైజర్లు రమేష్ , బజిలీస్ అమ్మ, విప్లవ్ కుమార్్,రాజేష్ , కమలాకర్,ల్యాబ్ టెక్నీషియన్లుఏఎన్ఎంలు ,ఆశాలు
పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version