అడ్డగోలు మాటలతోనే అరూరి అడ్రస్ గల్లంతు…

అడ్డగోలు మాటలతోనే అరూరి అడ్రస్ గల్లంతు

ఓడించి ఇంటికి పరిమితం చేసినా బుద్ధి రాలే కార్యకర్తలను గాలికొదిలేసిన చరిత్ర అరూరిది

అన్న అంటే అందుబాటులో ఉంటున్నది ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

లక్ష మేజారిటి అని గొప్పలు చెప్పుకున్న అరూరిని సోంత పార్టీ కార్యకర్తలే ఓడించింది నిజం కాదా..?

గ్రామాల్లో ఒక్క ఇళ్లు కూడా పెదలకు కట్టని అరూకి ప్రజల గురించి, అభివృద్ధి గురించి మాట్లాడడం సిగ్గుచేటు

నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్, వర్ధన్నపేట యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కుల్ల యాకాంతం

వర్ధన్నపేట ( నేటిధాత్రి):

లక్ష మెజారిటి గొప్పలకు పోయి కన్ను మీన్ను కానకుండా ప్రజలను, పార్టీ కార్యకర్తలను, ఉద్యమకారులను పక్కనబెట్టి అక్రమ సంపాదనకు పాకులాడి అభివృద్ధి మరిచి ఉకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చాడనే అరూరి రమేష్ ను చిత్తుగా ఓడించి ఇంటికి పరిమితం చేసినా ఇంకా అడ్డగోలుగా మాట్లాడడం మారలేదని నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్, వర్ధన్నపేట యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కుల్ల యాకాంతం ఎద్దేవా చేశారు.
నిన్నటి వరకు బీజేపి సంకలో ఉన్న అరూరికి అక్కడ కూడా ఎవరు పట్టించుకోకపోవడంతో దిక్కు తోచక బిఆర్ఎస్ పార్టీలో చేరిన అరూరి రమేష్ వాస్తవాలు మాట్లాడకుండా ఆ పార్టీ పెద్దల మెప్పు కోసం నోటికొచ్చింది మాట్లాడుతున్నాడని యాకాంతం ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు పార్టీని నమ్ముకున్న ఏ కార్యకర్తను, ఉద్యమకారులను కనీసం పట్టించుకోకుండా కేవలం కాంట్రాక్టుల మీద శ్రద్ద పెట్టి వందల కోట్ల రూపాయలు దండుకున్న అరూరి నేడు మున్సిపల్ ఓట్లు రాగానే కార్యకర్తలు రావడం ఆయన స్వార్ధ రాజకీయాలకు నిదర్శనమన్నారు. ఈ పనికిరాని మాటలు మాట్లాడారనే సొంత పార్టీ కార్యకర్తలే సాదారణ ఎన్నికల్లో చిత్తుగా ఓడించి బుద్ధి చెప్పారని అన్నారు.
నిత్యం ప్రజల్లో ఉంటూ తనకంటూ ఏ స్వార్ధం లేకుండా కేవలం నియోజకవర్గ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్న వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అక్కున చేర్చుకుంటే అన్ని కష్టనష్టాల్లో వెన్నంటి ఉండి పార్టీని నియోజకవర్గంలో బలోపేతం చేస్తున్న పరిస్థితులను చూసి తట్టుకోలేకే తప్పుడు కూతలు కుస్తు ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తే అరూరి రమేష్ రాజకీయ భవిష్యత్తు మరింత అంధకారంలోకి వెళ్లడమే గాక బీఆర్ఎన్ పార్టీ కనుమరుగు గాక తప్పదని యాకాంతం అన్నారు. నియోజకవర్గంలో గత పదేళ్ల పాలనలో ఏ గ్రామంలో ఒక్క ఇళ్లు కూడా కట్టని అరూరి రమేష్ దమ్ముంటే నేడు నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటించి ఎన్ని ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణమౌతున్నాయో లెక్క పెట్టి బుద్ధి తెచ్చుకోవాలని యాకాంతం నూచించారు.
ఇప్పటికైనా అరూరి రమేష్ వాస్తవ విషయాలను మాట్లాడి మార్పు తేచ్చుకోకుంటే ఆయన వర్ధన్నపేట మునిసిపల్ ఎన్నికల్లో ఒక్క వార్డు కూడా గెలవకుండా డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమని ఎన్ని కుట్రలు చేసినా వర్ధన్నపేట మునిసిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం ఖాయమని యాకాంతం ధీమా వ్యక్తం చేశారు.

కోహిర్ మున్సిపల్ ప్రచారంలో దూసుకుపోతున్న మజ్లిస్ పార్టీ…

కోహిర్ మున్సిపల్ ప్రచారంలో దూసుకుపోతున్న మజ్లిస్ పార్టీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

కోహిర్ మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ సందడి నెలకొంది. ఏఐఎంఐఎం పార్టీ తన పట్టు నిరూపించుకోవడానికి ఆరుగురు అభ్యర్థులను బరిలోకి దించింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు కోహిర్ పట్టణ వీధుల్లో ప్రచారం చేస్తూ, మజ్లిస్ గుర్తు ‘పతంగి’ (గాలిపటం) కు ఓటు వేసి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు.కోహిర్ పట్టణలో మజ్లిస్ జెండా ఎగరేసి ‘పతంగి’ పార్టీ అధ్యక్షునికి బహుమతిగా అందజేస్తామని పార్టీ అధ్యక్షులు మహమ్మద్ రఫీ అన్నారు మొట్టమొదటిసారిగా కోహిర్ పట్టణంలో మున్సిపాల్ ఎన్నికలు జరగడం వల్ల పతంగి ఎగరేసి పార్టీని బలపరిస్తానని భారీ మెజారిటీతో మున్సిపల్ ప్రచారంలో దూసుకుపోతున్న మజ్లిస్ ‘పతంగి’పార్టీ

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం…

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

తంగళ్ళపల్లి మండలంలో పలు గ్రామాల నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు సిరిసిల్ల జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం నిర్వహిస్తూ .గెలిపే లక్ష్యంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి ఆదేశాల మేరకు తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జలగం.ప్రవీణ్ .సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చొప్పదండి.ప్రకాష్ గారి ఆధ్వర్యంలో మూడో వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాముని వనిత.నలినికాంత్ గారి తో. ప్రచారంలో తంగళ్ళ పల్లి మండలం నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆధ్వర్యంలో వాడవాడల గడపగడప తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాముని వనిత నలినీ కాంత్ గెలుపే లక్ష్యంగా ప్రచారం నిర్వహిస్తున్నామని తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలనుదృష్టిలో పెట్టుకొని అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందు .ఉంచుతున్నారని. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ఎన్నో కష్టనష్టాలు ఓర్చుకొని గత పాలకులు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిఅప్పుల పాలు చేస్తే దాన్ని అధిగమిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకువస్తూ అన్ని వర్గాల ప్రజలకు పార్టీలకతీతంగా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మూడవ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాముని వనిత నలిని కాంత్.గార్లను మీ ఆశీర్వాదంతో అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రచారం చేస్తూ ఓటు అభ్యర్థిస్తూ ఓటర్లనువేడుకోవడం జరిగిందని సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో. మార్కెట్ కమిటీ చైర్మన్ వేల్పుల స్వరూప తిరుపతిరెడ్డి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యూత్ నాయకులు ఎన్ ఎస్ యు ఐ నాయకులు పార్టీ కార్యకర్తలు మహిళా పార్టీ నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో సిపిఐ పార్టీ 22 వార్డుల నుండి పోటీ…

క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో సిపిఐ పార్టీ 22 వార్డుల నుండి పోటీ…

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

క్యాతన్ పల్లి మున్సిపాలిటీ మేజర్ గ్రామపంచాయతీ నుండి మున్సిపాలిటీగా అవతరించిన అనంతరం రెండో సారి మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలో సిపిఐ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్, జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ ముఖ్య అతిధులుగా హాజరై మాట్లాడారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటానికి మిత్ర పక్షంగా మెలిగి గెలుపుకు సహకరించామని,సిపిఐ పార్టీ కాంగ్రెస్ తో స్నేహబంధమే కోరుకుంటుందని అన్నారు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో సిపిఐ తో పాటు కలిసి పనిచేసేందుకు ఇష్టపడని నేపథ్యంలో సిపిఐ పార్టీ మునిసిపాలిటీలోని 22 వార్డులలో కౌన్సిలర్లు గా పోటీ చేసేందుకు సిద్ధమయ్యామని అన్నారు..

CPI Fields Candidates in 22 Wards of Kattanpalli Municipality.

మిత్ర ధర్మాన్ని విస్మరిస్తే కలిసివచ్చే సెక్యులర్ పార్టీలతో సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అన్ని వార్డులలో నామినేషన్ వేస్తామని తెలిపారు. సిపిఐ కార్యకర్తలు కౌన్సిలర్ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్, జిల్లా సమితి సభ్యులు మిట్టపల్లి పౌలు, వనం సత్యనారాయణ, ఈరవేన రవీందర్, రాజేశం ,మనమ్మ, లక్ష్మణ్, శంకర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మంలో ఎంపీ వద్దిరాజు పుట్టినరోజు వేడుక

ఎంపీ వద్దిరాజుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ శ్రేణులు

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పుట్టినరోజు వేడుకలు ఖమ్మం తెలంగాణ భవన్ లో శనివారం ఘనంగా జరిగాయి.తన జన్మదినం సందర్భంగా హైదరాబాద్ నుంచి ఖమ్మం చేరుకున్న ఎంపీ రవిచంద్రకు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యలతో కలిసి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆత్మీయ స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర చేత కేక్ కట్ చేయించి శాలువాలతో ఘనంగా సన్మానించారు, హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ వేడుకలలో పార్టీ నగర శాఖ అధ్యక్షుడు పగడాల నాగరాజు, సీనియర్ నాయకులు ఉప్పల వెంకటరమణ,బెల్లం వేణు,ఖమర్,సామినేని హరిప్రసాద్,లకావత్ గిరిబాబు, పగడాల నరేందర్, మక్బూల్,డేరంగుల బ్రహ్మం,బలుసు మురళీకృష్ణ,లింగనబోయిన సతీష్,నమలికొండ వంశీ, మహ్మద్ రఫీ,భాషబోయిన వీరన్న, పలువురు జర్నలిస్టులు పాల్గొని ఎంపీ వద్దిరాజుకు హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పారు

మేడ్చల్‌లో 30 నేతలు బీఆర్ఎస్‌లో చేరిక

30 మంది బిఆర్ఎస్ లో చేరిక

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :

ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని మాజీ మంత్రి, ఎంఎల్ఏ చామకూర మల్లారెడ్డి అన్నారు. ముడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అనంతారంకు చెందిన ఇతర పార్టీ నాయకులు కొల్లా స్వప్న, బుద్ది నరేష్, ముద్దమ్ శ్రవణ్ రెడ్డి, మామిడాల వెంకటేష్ గౌడ్, స్వామి లతో పాటు దాదాపు 30 మంది బిఆర్ఎస్ లో చేరారు. మాజి మంత్రివర్యులు మేడ్చల్ శాసనసభ్యులు మల్లారెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ లో చేరగా పార్టీ కండువా కప్పి ఆహ్వానిచ్చారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు మల్లేష్ గౌడ్, మాజీ సర్పంచ్ గౌస్ పాషా, ఏఎంసి మాజీ వైస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సీనియర్ నాయకుడు వెంకట్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా

సీనియర్ నాయకుని ఘనంగా జరుపుకున్న జన్మదిన వేడుకలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండల కేంద్రంలోని జిర్లపల్లి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి జన్మదిన వేడుకలు తన గ్రామంలో శాలువా పూలమాలలతో సన్మానించి బాణా సంచలు కాల్చి కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించిన గ్రామ నూతన సర్పంచ్ అమరేశ్వరి శివమణి ఘనంగా నిర్వహించారు, ముఖ్యఅతిథిగా గోరేగావ్ గ్రామ సర్పంచ్ నాగేందర్ పటేల్ తమ కార్యకర్తలతో పాల్గొని వెంకట్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు నాయకులు ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు,

కుర్చివేడు టీడీపీ నేత శోభన్ బాబును పరామర్శించిన ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్

*కుర్చివేడు టీడీపీ యూనిట్ ఇన్చార్జ్ శోభన్ బాబును పరామర్శించిన చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్..

*త్వరగా కోలుకుని పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనాలని సూచించిన చిత్తూరు శాసనసభ్యులు…

*ఎమ్మెల్యే గురజాలకు ముందుస్తు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ సర్పంచ్ నీలకంఠం నాయుడు ,పార్టీ కార్యకర్త శోభన్ బాబు…

చిత్తూరు (నేటి ధాత్రి:

 

చిత్తూరు నియోజకవర్గం, చిత్తూరు మండలం, కుర్చివేడు పంచాయతీ, కుర్చీ వేడు గ్రామానికి చెందిన తెలుగు దేశం పార్టీ యూనిట్ ఇన్చార్జ్ శోభన్ బాబు అనారోగ్యంతో గత కొన్ని రోజులుగా ఇంటి వద్దనే ఉంటున్నారు. విషయం తెలుసుకున్న చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్ మోహన్ కుర్చివేడు పంచాయతీ పర్యటనలో భాగంగా మాజీ వైస్ ఎంపిపి, మాజీ సర్పంచ్, మాజీ సింగిల్ విండో చైర్మన్ నీలకంఠం నాయుడు ఇంటికి వెళ్ళారు. ఈ సందర్భంగా నీలకంఠం నాయుడు కుమారుడు, టిడిపి కార్యకర్త శోభన్ బాబును పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకుని తిరిగి పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనాలని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ సూచించారు.అలాగే వృద్దాప్యంలో ఉన్న పార్టీ కురువృద్ధుడు నీలకంఠం నాయుడు, ఆయన కోడలు, శోభన్ బాబు సతీమణి బిందు వారి కుటుంబ సభ్యులకు సంబంధించి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. నీలకంఠం నాయుడు, ఆయన కుమారుడు శోబన్ బాబు తెలుగు దేశం పార్టీకి ఎనలేని సేవలందించారనీ గుర్తు చేసిన ఎమ్మెల్యే,, భవిష్యత్తులో కూడా పార్టీ అభివృద్ధి కోసం ఇదే వరవడితో పనిచేయాలని ఆయన సూచిస్తున్నారు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ సూచించారు. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించే వారికి తెలుగు దేశం పార్టీ ఎప్పుడూ అండగా నిలుస్తుందని భరోసానిచ్చారు.
ఈ క్రమంలో నీలకంఠం నాయుడు, ఆయన కుమారుడు శోబన్ బాబు, సతీమణి బిందు చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్ మోహన్ కు ముందస్తుగా పుట్టిన రోజు శుభాకాంక్షలు.. తెలిపారు.
చిత్తూరు నియోజకవర్గ ప్రగతి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న గురిజాల జగన్ మోహన్ ఇలాంటి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకోవాలని, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనసా వాచా కర్మణా దేవుడ్ని ప్రార్థిస్తున్నట్లు నీలకంఠం నాయుడు, శోభన్ బాబు, ఆయన సతీమణి బిందు తెలియజేశారు.

ఓటమి గెలుపుకు తొలిమెట్టు-మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి..

ఓటమి గెలుపుకు తొలిమెట్టు-మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

పరకాల,నేటిధాత్రి

 

ఓటమి గెలుపుకు తొలిమెట్టని మాజీ శాసనసభ్యులు చల్లధర్మ రెడ్డి అన్నారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో పోటీపడి ఓటమి చెందిన బిఆర్ఎస్ అభ్యర్థులు మనోధైర్యంతో ముందుకు సాగాలని అన్నారు.శనివారం పరకాల మండలం పోచారం,వెల్లంపల్లి,పైడిపల్లి,కామారెడ్డిపల్లి గ్రామాలలో వారు పర్యటించారు.ఈ సందర్భంగా ఓటమించేందిన పార్టీ అభ్యర్థులను కలిసి ఓదార్చారు.ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు,యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ నాయకులతో చాయ్ తాగుతున్న కేకే మహేందర్ రెడ్డి…

కాంగ్రెస్ పార్టీ నాయకులతో చాయ్ తాగుతున్న కేకే మహేందర్ రెడ్డి…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

 

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో స్థానిక తాడూరు చౌరస్తాలో గల భాస్కర్ చాయ హోటల్లో చాయ్ తాగుతూ పార్టీ నాయకుల కార్యకర్తల తో. తంగళ్ళపల్లి మండలంలో జరగబోయే స్థానిక ఎన్నికల గురించి చర్చించుకోవడం జరిగింది. ఒక సామాన్య కార్యకర్తగా నాయకులు కార్యకర్తలతో మమేకమై టీ స్టాల్ వద్ద వారితో మాట్లాడుతూ సామాన్య వ్యక్తి లాగా నాయకుల కార్యకర్తలు అందరితో మమేకమై కలిసి తిరుగుతూ తాను కూడా సామాన్య కార్యకర్త ననిచెప్పగానే చెప్పినాడు. ఇలాంటి సామాన్యమైన వ్యక్తి మనకు ఏ ఆపాదవచ్చిన అందుబాటులో ఉండి మనల్ని సమస్యలు పరిష్కరించే వ్యక్తిగా ఆయనను నాయకులు కార్యకర్తలు కొనియాడారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రవీణ్ తో కాంగ్రెస్ పార్టీ మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో కలిసి టీ తాగి అందరూ అందుబాటులో ఉండి మన అనుకున్న దానికంటే మెజార్టీ ఎక్కువ స్థానాలు సాధించే దిశగా కష్టపడాలని ఈ సందర్భంగా కార్యకర్తలకు తెలియజేశారు

మొగుడంపల్లి మండల్ సర్పంచ్ ఎలక్షన్స్ ప్రచారం..

మొగుడంపల్లి మండల్ సర్పంచ్ ఎలక్షన్స్ ప్రచారం

◆-: తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జ్ జ్యోతి పండాల్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ నియోజకవర్గం, మొగుడంపల్లి మండల్, గుడ్పల్లి గ్రామంలో ఊరు పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్క మైనారిటీ కూడా సర్పంచ్ గా పోటీ చేసిన చరిత్ర లేదు కానీ టీఆర్పీ పార్టీ మొగుడంపల్లి మండల్ ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ లతీఫ్ గారు చరిత్రకి బిన్నంగా ధైరంగా ముందుకు వచ్చి సర్పంచ్ నామినేషన్ వేయడం జరిగింది.అలాగే లతీఫ్ గారు గుడ్పల్లి గ్రామ సమస్యల పైన మంచి అవగాహన కలిగిన వ్యక్తి మరియు తనని సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామం అభివృధి కోసం ఎంతవరకైనా మరియు ఏ లీడర్ తోనైనా పోరాడి గ్రామ అభివృద్ధి చేస్తాను అని చెప్పడం జరిగింది.
లతీఫ్ నామినేషన్ వేసి బీ ఆర్ ఎస్ మరియు కాంగ్రెస్ అభ్యర్థుల్లో దడ పుట్టించారు, అందుకే బీ ఆర్ ఎస్ మరియు కాంగ్రెస్ వాళ్లు ఎన్ని ప్రలోభాలకు గిరి చేసిన కూడా, ప్రలోభాలను గడ్డి పోస లాగా పక్కన పెట్టి ముందుకు సాగడం చూస్తుంటే ధైర్యం లో తీన్మార్ మల్లన్న గారికి ఏ మాత్రం తీసిపోరు అని చెప్పడానికి సంతోషిస్తున్నాను.ఈ నెల 14-12-2025 రోజున బ్యాగ్ గుర్తుకే ఓటు వేసి లతీఫ్ గారిని గెలిపించాలని వారు ప్రజలను కోరడం జరిగింది.తెలంగాణ రాజ్యాధికార పార్టీ లో ఉన్న నాయకులు గాని మరియు కార్యకర్తలు గాని ధైర్యానికి ప్రతిరూపమని లతీఫ్ మరొకసారి నిరూపించారు.సర్పంచ్ అభ్యర్థి లతీఫ్ గారికి మద్దతుగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జ్యోతి పండాల్, సంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి వరప్రసాద్, మొగుడంపల్లి మండల్ అధ్యక్షుడు శీను, మొగుడంపల్లి మండల నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.

సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు.

 

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-09T142417.423.wav?_=1

 

సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్,తెలంగాణ ఏర్పాటులో చారిత్రాత్మక పాత్ర పోషించిన సీనియర్ ఎఐసిసి నాయకురాలు సోనియా గాంధీ జయంతి సందర్భంగా, జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఆమె జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా, పార్టీ నాయకులు దేశం తెలంగాణ కోసం సోనియా గాంధీ చేసిన సేవలకు సేవలందించారనరు కేక్ కట్ చేసి వేడుకను ప్రారంభించారు.తెలంగాణ ప్రజల మనోభావాలను మరియు యువత త్యాగాలను అర్థం చేసుకున్న సోనియా గాంధీ, రాష్ట్ర ఏర్పాటు నిర్ణయంలో ముఖ్యమైన పాత్ర పోషించారని, ఇది ఎల్లప్పుడూ గుర్తుండిపోతుందని కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమంలో అన్నారు.
పెద్ద సంఖ్యలో నాయకులు మరియు కార్యకర్తల భాగస్వామ్యం కాంగ్రెస్ పార్టీకి చెందిన అనేక మంది నాయకులు, సీనియర్ కార్యకర్తలు మరియు యువ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మరియు సోనియా గాంధీ ఆరోగ్యం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

ఎన్నికల కోసం బిజెపి తపన

రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాల్లో గెలుపొందాలీ మండల బిజెపి అధ్యక్షులు..

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల బిజెపి పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో బిజెపి కార్యకర్తల సమావేశంలో పలు విషయాలపై చర్చించి వివరాలు వెల్లడించిన మండల బిజెపి అధ్యక్షులు వే న్నమనేని శ్రీధర్ రావు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాబోవు సర్పంచ్ ఎన్నికల్లో మరియు వార్డ్ మెంబర్స్.పోటీ చేయడం కొరకు విధి విధానాల గురించి చర్చించడంతోపాటుప్రతి కార్యకర్త భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బిజెపి జాతీయ ప్రభుత్వం చేస్తున్న పలు అభివృద్ధి పనులపై ప్రజలకు వివరించాలని అలాగే ప్రతి ఇంటికి వెళ్లి 420 హామీలు వాటి మోసాలను వివరించాలని రానున్న రోజుల్లో కాంగ్రెస్ కి. బిఆర్ఎస్ పార్టీకి ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఇతర పార్టీల అందరికీప్రజలందరూ వచ్చే ఎన్నికల్లో పార్టీలకు తగిన గుణపాఠం చెబుతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బిజెపి కార్యకర్తలు నాయకులు అందరూ కలిసికట్టుగా పనిచేసి అధిక స్థానాలు కైవసం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి కార్యకర్త ప్రతి ఇంటికి వెళ్లి బిజెపి చేసిన అనేక సంక్షేమ పథకాల గురించి సంస్కరణ గురించి ప్రతి ఇంటికి గడప.గడపన తెలియజేయాలని ప్రతి కార్యకర్త తమ కర్తవ్యం గా పనిచేయాలని ఈ సందర్భంగా కార్యకర్తలు ఉద్దేశించి పిలుపునిచ్చారు. ఇట్టి కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ కోల ఆంజనేయులు. జిల్లా మీడియా కన్వీనర్ కాసుగంటిరాజు. మండల ప్రధాన కార్యదర్శి ఇటికల రాజు. కోసినీ వినయ్ యాదవ్. ఉపాధ్యక్షులు రెడ్డి మల్ల ఆశీర్వాద్.బూత్ అధ్యక్షులు సీనియర్ నాయకులు మోర్చా అధ్యక్షులు శక్తి కేంద్రం ఇన్చార్జులుమహిళా బిజెపి కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు

పరకాలలో కాంగ్రెస్ శ్రేణుల గెలుపు సంబరాలు…

పరకాలలో కాంగ్రెస్ శ్రేణుల గెలుపు సంబరాలు

రాష్ట్రంలోని ప్రజలందరూ కాంగ్రెస్ వైపే

కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్

పరకాల,నేటిధాత్రి

 

జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపొందిన సందర్బంగా పట్టణంలోని బస్టాండ్ కూడలిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బాణసంచా కాల్చి,స్వీట్లు పంచి సంబరాలను జరుపుకున్నారు.ఈ గెలుపు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రజాపాలనకు నిదర్శనమని పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్ అన్నారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కృతజ్ఞతలు తెలుపుతూ గెలుపొందిన నవీన్ యాదవ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ప్రజలే కాక తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరూ కాంగ్రెస్ వైపే ఉన్నారని ఎన్నిక ఏదైనా గెలుపు ఇకనుండి కాంగ్రెస్ పార్టీ దే అని తెలిపారు.ఈ కార్యక్రమంలో పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి,మండల అధ్యక్షుడు కట్కూరి దేవేందర్ రెడ్డి,ఏఎంసీ వైస్ చైర్మన్ బుజ్జన్న,రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు మడికొండ శ్రీను,సమన్వయ కమిటీ సభ్యులు,చిన్నాల గోనాథ్ ఈర్ల చిన్ని,పంచగిరి జయమ్మ,చందుపట్ల రాఘవరెడ్డి,దుబాసి వెంకటస్వామి,పసుల రమేష్,మార్క రఘుపతి గౌడ్,సదానందం గౌడ్,పోరండ్ల సంతోష్,మడికొండ సంపత్ కుమార్,మంద నాగరాజు,రఘు నారాయణ,దార్నా వేణుగోపాల్,బొమ్మ కంటి చంద్రమౌళి,దుప్పటి సాంబశివుడు,బొచ్చు భాస్కర్,దావు పరమేశ్వర్,దుగ్గేల వినయ్,బాసాని సుమన్,సురేష్,బండారి కృష్ణ,మచ్చ సుమన్,నాగరాజు,సదన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

గడపగడపకు వెళ్లి బిఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ అభ్యర్థి మాగంటి సునీత గారి గెలుపుకై…

గడపగడపకు వెళ్లి బిఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ అభ్యర్థి మాగంటి సునీత గారి గెలుపుకై

◆:- జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు ప్రచారం నిర్వహించారు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జూబ్లీహిల్స్ నియోజకవర్గం లోని రహ్మత్ నగర్ డివిజన్ లోని వివిధ బూత్ లలో ప్రచారం నిర్వహించారు.ప్రజావ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న, *కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ది చెప్పాలని బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని మాగంటి సునీత గారి కారు గుర్తుపై మీ అమూల్యమైన ఓటువేసి అత్యంత భారీ మెజార్టీతో గెలిపించాలని,తెలంగాణ లో రామ రాజ్యం రావాలంటే కెసిఆర్ పాలన రావాలని అందుకు ఈ ఎన్నిక గెలుపుతో ఆరంభం కావాలని ఈ గెలుపుతో తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ సత్తాను చాటాలని ఓటర్లను కోరారు.ఈ కార్యక్రమంలో జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి,కోహీర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు,ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్,బూత్ ఇంచార్జులు ,బి ఆర్ ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

టీఆర్పీ పార్టీ లో ప్రజా సేన పార్టీ విలనం.

టీఆర్పీ పార్టీ లో ప్రజా సేన పార్టీ విలనం.

◆:- కార్యక్రమంలో పాల్గొన్న టీఆర్పీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జ్యోతి పండాల్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

టీఆర్పీ పార్టీ లో ప్రజా సేన పార్టీ విలీన కార్యక్రమంలో పాల్గొన్న టీఆర్పీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జ్యోతి పండాల్ హైదరాబాద్ లో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ప్రజా సేన పార్టీ అధ్యక్షులు ఆవుల హన్మన్లు టీఆర్పీ పార్టీ లో విలీనం చేయడం జరిగింది.ఈ సందర్భంగా, ప్రజా సేన పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున టీఆర్పీ పార్టీ లో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీఆర్పీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజా సేన పార్టీ నాయకులు, మహిళలు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఈ నెల 17న కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం

 

 

ఈ నెల 17న కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం

కాంగ్రెస్ కార్యకర్తలు హాజరవ్వండి.

 

ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి.

జడ్చర్ల / నేటి ధాత్రి

 

మహబూబ్ నగర్ డీసీసీ అధ్యక్షుని ఎన్నికపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్న నేపథ్యంలో ఈ విషయంగా పార్టీ వర్గాల అభిప్రాయసేకరణ కోసం పార్టీ అధిష్టానం ఈ సమావేశాన్ని నిర్వహిస్తోందని బుధవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో అనిరుధ్ రెడ్డి వెల్లడించారు. స్థానిక చంద్ర గార్డెన్స్ లో 17వ తేదీ శుక్రవారం ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నామన్నారు. బ్లాక్ ఏ, బ్లాక్ బీ గా రెండు దశలుగా సాగే ఈ సమావేశం ఒకేరోజు పూర్తవుతుందన్నారు. బ్లాక్ ఏ లో ఉన్న జడ్చర్ల, మిడ్జిల్, ఊర్కొండ మండలాల పార్టీ నేతలు కార్యకర్తల సమావేశం ఉదయం 10 గంటల మధ్యాహ్నం 2 గంటల వరకూ జరుగుతుందని చెప్పారు. భోజన విరామం అనంతరం బ్లాక్ బీ లోని నవాబుపేట, రాజాపూర్, బాలానగర్ మండలాల సమావేశం మధ్యాహ్నం 3 గంటలకు మొదలవుతుందని వివరించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ హాజరు కావాలని అనిరుధ్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి అన్ని గ్రామాల నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలను తీసుకొచ్చే బాధ్యత ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు, ముఖ్యనేతలదేనని స్పష్టం చేసారు. ఈ సమావేశానికి జడ్చర్ల నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల నుంచి పార్టీ ప్రతినిధులు హాజరై డీసీసీకి మంచి నాయకత్వాన్ని సూచించాలని అనిరుధ్ రెడ్డి కోరారు.

ఎంపీ వద్దిరాజు ఎమ్మెల్సీ పోచంపల్లితో కలిసి కార్యకర్తలకు దిశానిర్దేశం….

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-12T124639.405.wav?_=2

 

ఎంపీ వద్దిరాజు ఎమ్మెల్సీ పోచంపల్లితో కలిసి కార్యకర్తలకు దిశానిర్దేశం

 

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్,రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తదితర ప్రముఖులతో కలిసి ముఖ్య కార్యకర్తలతో సమావేశమై వారికి దిశానిర్దేశం చేశారు.

ఈ సమావేశానికి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆశీస్ కుమార్ యాదవ్,మంగళారపు లక్ష్మణ్,పుస్తె శ్రీకాంత్,వాసాల వెంకటేష్,పర్వతం సతీష్ తదితర ప్రముఖులు హాజరయ్యారు.

 

కాంగ్రెస్ గెలుపు కోసం కార్యకర్తలు కృషి చేయాలి…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-11T121454.577.wav?_=3

 

కాంగ్రెస్ గెలుపు కోసం కార్యకర్తలు కృషి చేయాలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

స్థానిక ఎన్నికల నేపథ్యంలో జహీరాబాద్ నియోజకవర్గ ఝరాసంగం మండల నర్సాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని మాజీ ఉప సర్పంచ్ గోపాల్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ ప్రభుత్వం చేయని విధంగా కాంగ్రెస్ పార్టీ గడిచిన 21 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించిందని ఆయన గుర్తు చేశారు. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్, బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, మౌలిక వసతులు ఇలా గ్రామాలన్నింటికీ చేరాయని వివరించారు. “ఈ పథకాలు అభ్యర్థుల విజయానికి ప్రధాన బలం అవుతాయి” అని అన్నారు,పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అదుబాటులో ఉండి ప్రభుత్వం చేస్తున్న పనులను వివరించాలని సూచించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలే గెలిపిస్తాయని, ప్రజలను ధైర్యంగా ఓటు అడుగుతామన్నారు.

స్థానిక ఎన్నికల్లో బిఆర్ఎస్ దే విజయం

స్థానిక ఎన్నికల్లో బిఆర్ఎస్ దే విజయం

తెలంగాణా ప్రజల గుండెల్లో కేసీఆర్

అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం లో విసుగు చెందారు

ఇంటింటికి కాంగ్రెస్‌ బాకీ కార్డు అందజేసి కాంగ్రెస్‌ వైఫల్యాలను ఎండకడుదాం-సుంకె రవిశంకర్

కరీంనగర్, నేటిధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ ఎస్‌ సత్తా చాటాలని, ఇంటింటికి కాంగ్రెస్‌ బాకీ కార్డు అందజేసి కాంగ్రెస్‌ వైఫల్యాలను ఎండగట్టాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేట్ హోటల్ లో చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలతో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది.

 

ఈసందర్బంగా చొప్పదండి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు సుంకె రవిశంకర్‌ మాట్లాడుతూ రెండేళ్లకే కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, దీనిని ఎన్నికల్లో చూపించేలా కార్యకర్తలు కలిసికట్టుగా పని చేయాలని కోరారు. రేవంత్‌ ప్రభుత్వం రైతులకు యూరియా ఇవ్వలేకపోయిందని విమర్శించిరు.

 

రైతులు, మహిళా రైతులు రోజుల తరబడి క్యూలైన్లలో నిలబడుతున్నారని, కొన్నిచోట్ల చెప్పులు కూడా క్యూలో పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై నిందలు వేస్తూ రేవంత్‌ సర్కారు కాలం వెళ్లబుచ్చుతోందని, రేవంత్‌ సర్కారు డైవర్షన్‌ పాలిటిక్స్‌తో రాష్ట్రంలో పరిపాలన కుంటుపడిందని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు గొప్పగా అమలు చేసిన కేసీఆర్‌ మళ్లీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.

 

స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగితే బీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధించడం తథ్యమన్నారు. పార్టీని మరింత బలోపేతం చేసి, అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి తెచ్చేలా నాయకులు, కార్యకర్తలు శ్రమించాలన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా 420 హామీలను, ఆరు గ్యారెంటీలను అమలు చేయలేకపోయిందని విమర్శించారు. యూరియా కోసం రైతన్నలు రోజుల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

 

పింఛన్లు పెంచుతామన్న హామీని గాలికొదిలేశారని దు య్యబట్టారు. బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై ప్రభుత్వం ఇప్పటికీ డ్రామాలాడుతోందని ధ్వజమెత్తారు.

 

ఈవిషయాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తలపైనే ఉందన్నారు. బిఆర్ఎస్ పార్టీ బిఫామ్ ఎవరికీ వచ్చిన క్రమశిక్షణ గల పార్టీగా అందరు బిఆర్ఎస్ అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలని ఈసందర్బంగా కోరారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version