ఘనంగా మాజీ ఎమ్మెల్యే వివాహవార్షికోత్సవ వేడు కలు..

ఘనంగా మాజీ ఎమ్మెల్యే వివాహవార్షికోత్సవ వేడు కలు

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండలకేంద్రంలో మండల అధ్యక్షులు గంగుల మనోహర్ రెడ్డి, మాజీ ఎంపీపీ మెతుకు.తిరుపతిరెడ్డి ఆధ్వ ర్యంలోభూపాలపల్లి అభివృద్ధి ప్రదాత మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి వరం గల్ జిల్లా మాజీ జడ్పీ ఛైర్ప ర్సన్ & భూపాలపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి పుణ్య దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించి,కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు, వివిధ గ్రామాల సర్పంచ్లు, వార్డ్ మెంబర్లు, గ్రామశాఖ అధ్య క్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శిలు, కోశాధి కారులు, యూత్ నాయకులు, సోషల్ మీడియా కోఆర్డినే టర్లు, వివిధ సంఘాల అధ్య క్షులు, రైతు బంధు సమితి నాయకులు, మాజీ ఎంపీ టీసీలు,బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు,మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.

ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు:

ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు:

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండల కేంద్రం లోని కూడలి వద్ద భూపాల పల్లి అభివృద్ధి ప్రదాత మాజీ శాసనసభ్యులు గండ్ర వెంక టరమణారెడ్డి, వరంగల్ జిల్లా మాజీ జడ్పీ ఛైర్పర్సన్ & భూపాలపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ఆదేశాలమేరకు మం డల అధ్యక్షులు గంగుల మనో హర్ రెడ్డి, మాజీ ఎంపీపీ మె తుకు తిరుపతి రెడ్డి ఆధ్వర్యం లోఅంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళుల ర్పించారు.

ఈ కార్య క్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు, వివిధ గ్రామాల సర్పంచ్ లు, వార్డ్ మెంబర్లు, గ్రామశాఖఅధ్యక్షులు, ఉపా ధ్యక్షులు, ప్రధాన కార్యద ర్శులు,కోశాధికారులు, యూ త్ నాయకులు, సోషల్ మీడి యా కోఆర్డినేటర్లు, వివిధ సంఘాల అధ్యక్షులు, రైతు బంధు సమితి నాయకులు, మాజీ ఎంపీటీసీలు,బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు, మ హిళా కార్యకర్తలు పాల్గొన్నా రు.

ఘనంగా శ్రీపాదారవు వర్ధంతి వేడుకలు…

ఘనంగా శ్రీపాదారవు వర్ధంతి వేడుకలు

కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్

భూపాలపల్లి నేటిధాత్రి

మున్సిపల్ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శ్రీపాద రావు 27వ వర్ధంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బట్టు కరుణాకర్ హాజరైనారు అనంతరం చిత్రపటానికి పూలమానవేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్ మాట్లాడుతూ దివంగత మాజీ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి శాసనసభ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాద రావు స్పీకర్ పదవికే వన్నెతెచ్చిన నాయకుడు శ్రీపాద రావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏ ఒక్కరికి ఏ అవసరం పడ్డ ప్రతి సమస్య ను పరిష్కరించిన నాయకుడు. మంథని నియోజక వర్గం ఏజెన్సీ ప్రాంతం అయినప్పటికీ ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో ముందున్న ఏకైక నాయకుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో శత్రువులేని అజాత శత్రువు శ్రీ పాదరావు వారి అడుగుజాడల్లో ఆశయ సాధన కోసం పనిచేస్తామని వారు ఎక్కడ ఉన్నా వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవున్ని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుందని వారు అన్నారు ఈ కార్యక్రమంలో భూపాలపల్లి మున్సిపాలిటీ చైర్మన్ బుర్ర కొమురయ్య వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్ కౌన్సిలర్లు, ఓరుగంటి రాధ, ధరావత్ శారద , పొనగంటి మేఘన శ్రీనివాస్, ఎర్రవెల్లి అరుణ్ రావు, కురుమిళ్ళ శ్రీనివాస్, బడితల వెంకటస్వామి , ఇస్లావత్ రాజు నాయక్ ,బొడ్డు అశోక్ , మాజీ వార్డ్ కౌన్సిలర్ దాట్ల శ్రీనివాస్ వేంపటి భువన సురేందర్ బేతేల్లి మధుకర్ రెడ్డి అజ్మీర తిరుపతి నాయక్, కడారి మాలతి గొగ్గిల లక్మి, నలికా పరమేశ్వరి, ఎద్దు పుష్ప, చల్లా రేణుక, లత, సుష్మ ఎర్రగడ్డల వెంకీ యాదవ్, పోతర్ల ప్రేమ్ కుమార్, అప్పాల శ్రీనివాస్, విజయ భాస్కర్, ఆంజనేయులు, రాజు, దుర్గం తిరుపతి, కిషోర్ శ్రీకాంత్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు

భాదిత కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్.పెసరు విజయ్ చెందర్ రెడ్డి…

భాదిత కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్.పెసరు విజయ్ చెందర్ రెడ్డి

పరకాల,నేటిధాత్రి

రూరల్ మండలం వెల్లంపల్లి గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు సింగడి శ్రీనివాస్ రెడ్డి సతీమణి ఈశ్వరమ్మ సంవత్సరిక కార్యక్రమానికి బీజేపీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇంచార్జ్ డాక్టర్.పెసరు విజయచందర్ రెడ్డి హాజరై వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో పరకాల మండల అధ్యక్షులు కాసగాని రాజ్ కుమార్ గౌడ్,కిసాన్ మోర్చా నాయకులు కునూరు వీరాస్వామి,శెక్తి కేంద్ర ఇంచార్జ్ గంట శ్రీనివాస్ రెడ్డి,బూత్ అధ్యక్షులు ఏకు సదయ్య, బీజేవైఎం నాయకులు రేగురి శశిధర్ రెడ్డి మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఘనంగా బిజెపి పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు…

ఘనంగా బిజెపి పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

నాగారం నేటిదాత్రి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా

నాగారం డివిజన్ బీజేపీ అధ్యక్షులు కొండబోయిన నాగరాజు యాదవ్ ఆధ్వర్యంలో నాగారం డివిజన్‌లో పెద్ద ఎత్తున బీజేపీ జెండాలు ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్రా రెడ్డి పాల్గొని మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ నేషన్ ఫస్ట్ అనే సిద్ధాంతంతో ముందుకు సాగుతుందని తెలిపారు.
47 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో పార్టీ నాయకులు, కార్యకర్తల త్యాగాల వల్లే ఈరోజు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే భావంతో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే పార్టీ లక్ష్యమని చెప్పారు. పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ గారి అంత్యోదయ సిద్ధాంతాన్ని గుర్తు చేస్తూ, సమాజంలోని చివరి వ్యక్తికి కూడా ప్రభుత్వ పథకాలు చేరాలనే లక్ష్యంతో బీజేపీ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో నాగారం డివిజన్‌ ను బీజేపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. నాగారం డివిజన్‌లో సుమారు 20 బూత్‌లలో జెండాలు ఎగరవేయడం పార్టీ ఎదుగుదలకు మంచి పరిణామమని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి మునిగంటి సురేష్, జిల్లా ఉపాధ్యక్షులు శ్యామ్ సుందర్ శర్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి బుధవరం లక్ష్మి, మాజీ ఎంపిటిసి తరిగొప్పుల బలరాం, మాజీ కౌన్సిలర్ బిజ్జా శ్రీనివాస్ గౌడ్ ,మాజీ పీఎస్ఎస్ డైరెక్టర్ కొండేటి ఎల్లారెడ్డి, సీనియర్ నాయకులు బొమ్మిడి బుచ్చిరెడ్డి, రామారం మహేందర్ గౌడ్, నక్క కిషోర్ గౌడ్, డివిజన్ ప్రధాన కార్యదర్శులు మామిడి జంగారెడ్డి, పోతంశెట్టి వెంకటేశ్వర రావు, ఉపాధ్యక్షులు వల్లల శ్రీనివాస్ గౌడ్, ఎలసాని నాగరాజ్ యాదవ్, కార్యదర్శి బోల్లపు సురేందర్ రెడ్డి, సతీష్ రెడ్డి, నాయకులు శంకర్ రెడ్డి , జమ్మల శంకర్ తాటకొండ రవీందర్,బుధవరం వేణుగోపాల్, రవీందర్ రెడ్డి, సూర్య శేఖర్ రెడ్డి, నెల్లుట్ల నవీన్, మంచాల మహేందర్, జూపల్లి నరేష్, అక్కల సురేష్, భువనేశ్వరి, విజయలక్ష్మి, ముద్రగణం శ్రీనివాస్ యాదవ్, సూర్వి రాజు, రమాదేవి, షాజీ, కృష్ణ చారి, విజయ్, సతీష్ , శ్రీకాంత్ యాదవ్, బూత్ అధ్యక్షులు శంకర్ ముదిరాజ్, కత్తురోజు అశోక్ చారి, వెంకట చారి, గుమ్మడి చంద్ర రెడ్డి, యాదగిరి, మహేష్, సంజయ్, కుమార్ యాదవ్, పొట్ట సుధాకర్, మల్యాల మధు, రఘు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా బిజెపి వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు.

ఘనంగా బిజెపి వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు.

కల్వకుర్తి/ నేటి ధాత్రి :

 

భారతీయ జనతా పార్టీ 47వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సోమవారం నాడు కల్వకుర్తి బిజెపి పార్టీ కార్యాలయం పైన బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్దారి పర్వతాలు పార్టీ జెండా ను ఆవిష్కరిoచారు.
పట్టణంలోని పలు వార్డులలో బిజెపి బూత్ అధ్యక్షులు జెండాను ఆవిష్కరించారు.పార్టీకార్యాలయం, బూత్ ల వారిగా జరిగిన జెండా ఆవిష్కరణలో బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మొగిలి దుర్గాప్రసాద్,జిల్లా ఉపాధ్యక్షులు మున్సిపల్ కౌన్సిలర్ బోడ నరసింహ, జిల్లా కార్యదర్శి గుర్రాల రాంభూపాల్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ లు రామకృష్ణ, శ్రీరాములు,సీనియర్
నాయకులు నీరుకంటి రాఘవేందర్ గౌడ్, నారెడ్ల శేఖర్ రెడ్డి, కృష్ణ గౌడ్, పాలకూర్ల రవి గౌడ్, గంగాధర్, వంశీ నాయక్, పెద్దారి విజయ్, ధన్నోజు నరేష్ చారి, కుడుముల రాంరెడ్డి,,శివాజీ, లక్ష్మీనరసింహ, అరవింద్ రెడ్డి, కూన ప్రవీణ్, వెంకటేష్, కిరణ్ యాదవ్,శివకుమార్, రాఘవేందర్ సాగర్, హనుమంతు గౌడు,మణికంఠ గౌడ్,శేఖర్, శ్రీకాంత్,రమేష్, పట్టణ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.పార్టీ స్థాపకులకు, మహానేతలకు ఘన నివాళులు అర్పించారు. ప్రతి కార్యకర్త పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిస్తూ, దేశ సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న బీజేపీ మరింత బలపడాలని ఆకాంక్షించారు.భారతీయ జనతా పార్టీ 1980 ఏప్రిల్ 6న స్థాపించబడినప్పటి నుండి సాధారణ కార్యకర్తల శక్తితో ఎదుగుతూ దేశ రాజకీయాల్లో కీలక శక్తిగా అవతరించింది. ప్రారంభ దశలో కేవలం 2 ఎంపీ స్థానాలతో ప్రారంభమైన ఈ పార్టీ, ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుంటూ క్రమంగా తన బలాన్ని పెంచుకుంది.అటల్ బిహారీ వాజపేయి నాయకత్వంలో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తన సత్తాను చాటుకున్న బీజేపీ, అనంతరం నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా అఖండ విజయాలను సాధిస్తూ పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దేశ అభివృద్ధికి కొత్త దిశను చూపుతోందన్నారు.

బెల్టు జోరు… కుటుంబాలు బేజారు…

బెల్టు జోరు… కుటుంబాలు బేజారు

అడ్డగోలుగా మద్యం విక్ర యాలు

పట్టించుకొని ఎక్సైజ్ అధికారులు

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండలంలోని వివిధ గ్రామాల్లో రాత్రింబవ ళ్ళు పొద్దున్న కొడుకుయక ముందే యథెచ్చగా మద్యం వ్యాపారం కొనసాగుతుంది. బెల్టు దుకాణాల్లో జరుగుతు న్న ఈ అక్రమ వ్యాపారానికి సంబంధించిన అధికారులు అండదండలతో అడ్డుఅదుపు లేకుండా ఈ మద్యం వ్యాపా రం దందా మండలంలో మూ డు పూలు ఆరు కాయలుగా విరజిల్లుతుంది. దీన్ని ఆసరా గా చేసుకున్న మద్యం వ్యాపా రులు ఈ దందాను పూర్తిగా తమ అధీనంలోకి తీసుకొని కొనసాగిస్తున్నారు. మండ లంలో వివిధ గ్రామాలలో మద్యం ఏరులై పారుతున్నది. ప్రతి గ్రామం పల్లెలలో కిరాణా దుకాణాల కంటే ఎక్కువ మద్యం దుకాణాలే దర్శనమి స్తున్నాయి. మద్యానికి బాని సలై ఎంతో మంది పేద బతు కులు చింద్ర మౌతున్నాయి. అయినా ఎక్సైజ్ పోలీసులు యంత్రానికి చీమకుట్టినట్లు కూడా లేదు వాళ్లకు నెలకు మాములు ఇస్తే చాలు. నాలు గు నెలలకు ఒకసారి తూతూ మంత్రంగా చుట్టపు చూపుగా తనిఖీలు నిర్వహిస్తూ చూసి చూడనట్టు వ్యవహరిస్తు న్నారు. బెల్టు షాపుల యజ మానులు ఒక బీరు, ఒక క్వాటర్ నుండి రూ. 20 నుండి రూ. 40 రూపాయల వరకు మద్యంపై అధికంగా వసూలు చేస్తున్నారు. మండ లంలో బెల్టు షాపులు ఎక్సైజ్ అధికారుల కనుసన్నల్లోనే జరుగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.

ఎనీ టైం మద్యంను అరిక ట్టలేరా!

ప్రభుత్వ అనుమతి కలిగిన మద్యం దుకాణాల నిర్వహణ కు సమయపాలనలో నిబంధ న ఉంది. కానీ ఎనీ టైంమద్యం దొరికేది ఒక బెల్టు షాప్ దుకా ణాలోనే ఎనీ టైం మందును అరికట్టే వారే అధికారులు లేరా!

ఇబ్బంది పడుతున్న మహిళలు

గ్రామాల్లో అక్రమంగా వెలసిన బెల్టుషాపుల దుకాణాల వల్ల మహిళలు ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారు. మద్యం సేవిం చిన మత్తులో బెల్టు దుకాణా ల వైపు వెళ్తున్న మహిళలను ఇబ్బందులకు గురిచేసిన ఘ టనలు అనేకం చోటుచేసు కున్నాయి. ఈ బెల్టు దుకా ణాల వల్ల చెడు మార్గాలు పడుతున్నట్టు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పచ్చని సంసారాల్లో బెల్టు దుకాణాలు చిచ్చు పెడుతు న్నాయని మహిళలు ఆందో ళన వ్యక్తం చేస్తున్నారు. బెల్టు దుకాణాలపై అధికారులు కొరడా జరిపించాలని పలు వురు మహిళలు కోరుకుం టున్నారు.

యువతపై త్రీవప్రభావం

BJP Celebrates Foundation Day in Narsampet

 

 

 

మండలంలోని అనేక గ్రామాల్లో బెల్టు దుకాణాలు విచ్చలవిడిగా మొదలయ్యా యి. అందుబాటులో మద్యం దొరుకుతుంది. దీనివల్ల యు వత మద్యానికి బానిసై భవి ష్యత్తును నాశనం చేసుకుం టున్నారు. అధికారులు చర్య లు తీసుకోకపోతే భవిష్యత్తు లో ఇంకా ఎన్నో అనార్థాలు జరిగే ప్రమాదం ఉందని పలు వురు మేధావులు అంటున్నారు.

పట్టించుకోని ఎక్సైజ్ అధికారులు

బస్టాండ్, ఆటో స్టాండ్ ఆవ రణంలో రోడ్డు పక్కనే , కిరాణం దుకాణాల్లోచాలా మద్యం దుకాణాలు ఏర్పాటు చేశారు.మండల కేంద్రం నుండి గ్రామాల్లో గల్లీకోక్క మద్యం దుకాణం. దీనికి తోడు ఇక్కడ మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడంతో అనుక్షణం ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా మద్యం షాపు పూర్తిగా రోడ్డుకు ఆనుకునే ఏర్పాటు చేశారు.ఈ దుకా ణంలో విచ్చలవిడిగా మద్యం కొనుగోలు చేసిన వారు దుకా ణం ముందురోడ్డుపైనే మద్యం తాగి అక్కడే పడిపోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బం దులు ఏర్పడుతున్నాయి. అదే విధంగా ఈ దుకాణం పక్కనే ఇళ్ళు ఉండడంతో మందుబాబుల ఆగడాలతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ దుకాణం ముందు పలుసార్లు ఇక్కడ ఎదురెదురుగా వస్తున్న వాహ నాలు ఢీకొన్న సంఘటనలు కూడా ఉన్న సంబంధిత అధికారులు ఏ మాత్రం పట్టిం చుకోవడం లేదని తీవ్ర ఆరోప ణలు వస్తున్నాయి. మామ్ము ళ్లకు అలవాటు పడిన సంబం ధిత ఎక్సైజ్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకో లేదు.దీంతో ప్రజల సమస్యలు నిత్య కృత్యం అయ్యాయి. అంతేగాక పలు గ్రామాల్లో బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి విచ్చ లవిడిగా మద్యం అమ్మకాలు కొనసాగిస్తున్న అధికారులు కిమ్మనక పోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దుకాణం నుండి ఆటోలు ఇతర వాహనాల్లో అక్రమంగా మద్యంను గ్రామాల్లో కొనసా గుతున్న బెల్ట్ షాపులకు తరలించి అధిక ధరలకు అమ్మకాలు చేపడుతున్నా రు.దీంతో తాగుబోతుల జేబులకు చిల్లులు పడుతున్న అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.

సిద్ధాంతిక నిబద్ధతతో ప్రజల మన్ననలు పొందిన పార్టీ బీజేపీ….

సిద్ధాంతిక నిబద్ధతతో ప్రజల మన్ననలు పొందిన పార్టీ బీజేపీ

భాజపా జిల్లా కార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి

నర్సంపేటలో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

నర్సంపేట, నేటిధాత్రి:

సిద్ధాంతిక నిబద్ధతతో ప్రజల మన్ననలు పొందిన పార్టీ బీజేపీ అని వరంగల్ జిల్లా కార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి అన్నారు.నర్సంపేట పార్టీ కార్యాలయంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పార్టీ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ సిద్ధాంతిక నిబద్ధతతో క్రియాశీల రాజకీయాలు నెరుపుతూ ప్రజల మన్ననలు పొందిన పార్టీగా బీజేపీ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా ఎదిగిందన్నారు. 1980 ఏప్రిల్ 6న దేశ సంస్కృతి, సాంప్రదాయాల పరిరక్షణ మరియు అంత్యోదయ సిద్ధాంత ప్రాతిపదికన ఆవిర్భవించిన బీజేపీ అవినీతి రహిత పారదర్శక పాలనతో దేశ అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు.

దివంగత మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజపేయి సుపరిపాలనకు బాటలు వేస్తే, నేడు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్‌ను ప్రపంచంలో అగ్రగామిగా నిలబెట్టేందుకు వికసిత్ భారత్ లక్ష్యంగా కృషి చేస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో యువత, మహిళలు, రైతులు అన్ని వర్గాల ప్రజల మద్దతుతో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, నర్సంపేట నియోజకవర్గంలో కూడా బీజేపీ జెండా ఎగురుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ వడ్డేపల్లి నరసింహారాములు, జిల్లా ఉపాధ్యక్షులు రేసు శ్రీనివాస్, పార్లమెంట్ కో-కన్వీనర్ కట్ల రామచందర్ రెడ్డి, బీజేపీ ఫ్లోర్ లీడర్ జూలూరు రోజా రాణి, సీనియర్ నాయకులు గడ్డం ఆంజనేయులు, కుంభం కోమల్ రెడ్డి, బాల్నే జగన్, దుగ్యాల సమ్మయ్య, మాజీ కౌన్సిలర్ జుర్రు రాజు, రూరల్ అధ్యక్షులు తనుగులు అంబేద్కర్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి అచ్చ దయాకర్, ఉపాధ్యక్షులు కొంకీసా విగ్నేష్ గౌడ్, పట్టణ ప్రధాన కార్యదర్శి సూత్రపు సరిత, ఉపాధ్యక్షులు ఠాకూర్ విజయ్ సింగ్, కందగట్ల నాగరాజు, కాసుల నాగేంద్రబాబు, ముత్యాల శ్రీనివాస్, పోనుగొటి రవీంద్ర చారి, పులిపాక అశోక్, శోభన్, చిల్వేర్ అన్వేష్, సామల ప్రవీణ్ కుమార్, ఆముదాల రమేష్, సామల సాయి, నూనె రంజిత్, కట్ల మహేందర్, నరసయ్య, అల్లం నిఖిల్, వేల్పుల సుమన్ తదితరులు పాల్గొన్నారు.

మైలారంలో బిజెపి పార్టీ ఆవిర్భావదినోత్సవ వేడుకలు…

మైలారంలో బిజెపి పార్టీ ఆవిర్భావదినోత్సవ వేడుకలు

శాయంపేట, నేటిధాత్రి;

శాయంపేట మండలం మైలా రం గ్రామంలో భారతీయ జన తా పార్టీ ఆవిర్భావదినోత్సవ వేడుకలను ఘనంగానిర్వహిం చారు. మండల అధ్యక్షుడు నరహరిశెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు, నాయకులు పెద్దఎత్తున పాల్గొన్నారు.ఈసందర్భంగా మండల అధ్యక్షుడు చేతుల మీదుగా పార్టీ జెండాను ఆవి ష్కరించారు . అనంతరం పార్టీ స్థాపకుల త్యాగాలు, సేవలను స్మరించుకున్నారు మాట్లాడుతూ దేశాభివృద్ధి దిశగా బిజెపి చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. గ్రామ స్థాయిలో పార్టీ బలోపే తానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవే యాలని పిలుపునిచ్చా రు.ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలు ఉత్సాహంగా నినాదాలు చేస్తూ కార్యక్రమాన్ని విజయ వంతం చేశారు. ఈ కార్యక్ర మంలో రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ రాయరాకుల మొగిలి, మండ ల ప్రధాన కార్యదర్శి భూతం తిరుపతి, సీనియర్ నాయ కులు బాసని విద్యా సాగర్, ఉప్పు రాజు, మండల ఉపా ధ్యక్షులు కోమటి రాజశేఖర్ మండల కార్యదర్శి మేకల సుమన్, భూత అధ్యక్షులు కన్నేబోయిన రమేష్, బాసాని నవీన్,నూనె వెంకటేష్ పాల్గొ న్నారు..

బాలానగర్‌లో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు…

బాలానగర్‌లో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

జడ్చర్ల / నేటి ధాత్రి.

 

జడ్చర్ల నియోజకవర్గంలోని బాలానగర్ మండల కేంద్రంలోని జనార్దన్ రెడ్డి కాంప్లెక్స్‌లో సోమవారం భారతీయ జనతా 46వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మండల బీజేపీ అధ్యక్షుడు గోపాల్ నాయక్ ఆధ్వర్యంలో.. నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..1980లో ఏర్పడినప్పుడు 2 సీట్లతో ప్రారంభమై, నేడు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా ఎదిగిందన్నారు.పార్టీ సిద్ధాంతం ప్రకారం “దేశ ప్రథమం” నినాదంతో, జాతీయవాదం, సమగ్ర అభివృద్ధి కోసం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో.. మండల బీజేపీ పార్టీ ఉపాధ్యక్షులు మల్లేష్ , శ్రీనివాస్ కార్యదర్శి బాలరాజు, జిల్లా కౌన్సిలర్ మెంబర్ శ్రీశైలం, బీజేపీ సీనియర్ నాయకులు నర్సింలు,యాదయ్య, సామ్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.

అధైర్య పడకండి అండగా ఉంటా…..

అధైర్య పడకండి అండగా ఉంటా…..

మంత్రి సీతక్క సహకారంతో పేదలకు మేలు…

సీనియర్ కాంగ్రెస్ నాయకులు నాసిరెడ్డి సాంబశివరెడ్డి…

మంగపేట:నేటిధాత్రి

ఆపన్న సమయంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుతామని అధైర్య పడకండి అండగా ఉంటా అని సీనియర్ కాంగ్రెస్ నాయకులు, జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి అన్నారు సోమవారం మండలంలోని అకినేపల్లి మల్లారం గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన కాంగ్రెస్ కార్యకర్త ఇప్ప నరసింహారావు కుటుంబాన్ని స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన పరామర్శించి ఆర్థిక సాయం అందించారు ఈ సందర్భంగా సాంబశివరెడ్డి మాట్లాడుతూ గౌరవ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి సీతక్క గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ గారి ఆదేశాల మేరకు మృతుని కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు మంత్రి సీతక్క సహకారంతో పేదల కుటుంబాలకు మేలు జరుగుతుందని అన్నారు మృతుని సతీమణి ఇప్ప ప్రమీల కు ప్రజా పాలనలో వితంతు పింఛన్ వెంటనే మంజూరు చేస్తామని అదేవిధంగా వికాస్ సంస్థలో పొందిన రుణం పై ఉన్న వడ్డీని పూర్తిగా మాఫీ చేస్తామని అంతేకాకుండా వివేక ఎఫ్పిఓ నుండి వ్యవసాయ సాగు కి అవసరమైన విత్తనాలు ఉచితంగా పంపిణీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు అనంతరం మృతుడు ఇప్ప నరసింహారావు సతీమణి ఇప్ప ప్రమీలకు తక్షణ సహాయం కింద రూ ఐదు వేల ఆర్థిక సహాయాన్ని నాసిరెడ్డి సాంబశివరెడ్డి అందించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు షేక్ మోయునుద్దీన్ స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ధూళిపాల బాలకృష్ణ కటుకూరి శేషయ్య నాసిరెడ్డి నాగిరెడ్డి లక్కీ వెంకన్న యలగొండ లక్ష్మయ్య చెట్టిపల్లి రాజు రవి సాంబశివరావు నరసింహారావు చౌదరి మాల మహానాడు నాయకులు రాజమళ్ళ సుకుమార్ తదితరులు పాల్గొన్నారు

మండల బిజెపి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ…..

మండల బిజెపి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ…..

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని బిజెపి పార్టీ ఆఫీసులో బిజెపి మండల అధ్యక్షులు బిజెపి నాయకుల ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ 47 వ స్థాపన దివస్ సందర్భంగా. పార్టీ స్థాపకులకు మహానేతలకు ఘన నివాళులు అర్పిస్తూ స్తూ భారతీయ జనతా పార్టీ 1980 ఏప్రిల్. 6. స్థాపించబడినప్పటి నుండి సాధారణ కార్యకర్తల శక్తితో ఎదుగుతూ దేశ రాజకీయాల్లో కీలక శక్తిగా అవతరించిందని ప్రారంభ దశలో కేవలం రెండు ఎంపీ స్థానాలతో మాత్రమే ప్రస్థానం ప్రారంభించిన పార్టీ క్రమక్రమంగా ప్రజల విశ్వాసాన్ని గెలిచుకుంటూ తన బలం పెంచుకుందని మొదటి సారి అటల్ బిహారీ వాజపేయి గారి నాయకత్వంలో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారా బిజెపి తన సత్తాను చాటుకుందని అనంతరం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా అఖండ విజయాలు సాధిస్తూ పూర్తి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అభివృద్ధికి కొత్త దిశను చూపుతుందని తెలియజేస్తూ. సబ్కా సాత్ -సబ్కా వికాస్-సబ్కా విశ్వాస్”. అనే సిద్ధాంతంతో అన్ని వర్గాల అభ్యున్నతని లక్ష్యంగా చేసుకొని దేశంలో ప్రజల ఆశీర్వాదం పొందుతూ ప్రపంచంలోనే అత్యధిక శక్తివంత దేశంగా తీర్చిదిద్దుతున్న మన ప్రధాని నరేంద్ర మోడీకి యావత్ భారతదేశం ప్రజలు దీవిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ. ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుంటూ తన బలం పెంచుకుందని తెలియజేస్తూ మండల బిజెపి నాయకులు ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ 47 వ స్థాపన దివస్ సందర్భంగా పార్టీ జెండాను ఎగురవేసి. మహానేతలకు ఘన నివాళులు అర్పిస్తూ పార్టీ అభివృద్ధికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిస్తూ దేశ సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న బిజెపి మరింత బలపడడానికి ఆకాంక్షించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో. మండల బిజెపి అధ్యక్షులు వెన్నమనేని శ్రీధర్ రావు. ప్రధాన కార్యదర్శి ఇటికలరాజు. కోసినివిజయ్. ఇటుకల మహేందర్. యాదవ్. బోల్గంభాస్కర్ గౌడ్. బక్క శెట్టి రాజేందర్. రెడ్డి మల్ల నరసింహ. గణేష్. వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు

ఏకాత్మ మానవవాద సిద్ధాంతమే భారతీయ జనతా పార్టీ లక్ష్యం: మోడీ రవీందర్…

ఏకాత్మ మానవవాద సిద్ధాంతమే భారతీయ జనతా పార్టీ లక్ష్యం: మోడీ రవీందర్

రామడుగు, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షులు మోడీ రవీందర్ ఆధ్వర్యంలో పార్టీ నలభై ఏడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో పార్టీ శ్రేణులతో కలిసి పార్టీ జెండా ఆవిష్కరించి, స్వీట్లు పంపిణీ చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఏకాత్మ మానవవాద సైద్ధాంతిక పునాదుల మీద ఏర్పడి దేశ నిర్మాణం లో సమస్యల పరిష్కారనికి భారతీయ జనతా పార్టీ అలుపెరుగని పోరాటం చేస్తుందని అన్నారు. బీజేపీ కార్యకర్తలు సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసి రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి రావడానికి కృషి చేయాలని ఆయన కోరారు. ఈకార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి పోచంపెల్లి నరేష్, దళిత మోర్చా మండల అధ్యక్షులు సంటి జితేందర్, యువ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు ఎడవెళ్లి రాం, యువ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి ఎడవేల్లి లక్ష్మణ్, మండల ఉపాధ్యక్షులు కారుపాకల అంజిబాబు, బూత్ కమిటీ అధ్యక్షులు కడారి శ్రీనివాస్, ఉత్తేం కనుకరాజు, నాయకులు వడ్లూరి రాజేందర్, వేముల రమేష్, ఐతరవేణి శ్రీనివాస్, బొజ్జ తిరుపతి, పురేళ్ల శేఖర్, రామకృష్ణ, గంగారెడ్డి, మల్లేశం, హరీష్,
పర్శరం, సంజీవ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ జిల్లా సెక్రెటరీగా గుండు సాయిలు గౌడ్…

కాంగ్రెస్ పార్టీ జిల్లా సెక్రెటరీగా గుండు సాయిలు గౌడ్
#యాదగిరిగుట్ట ఎస్ ఎల్ ఎన్ ఎస్ ఆటో యూనియన్ అధ్యక్షులు గుండు సాయిలు గౌడ్ నీ యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ సెక్రెటరీగా నియామకం.

నేటిదాత్రి యాదగిరిగుట్ట:

ఎస్ ఎల్ ఎన్ ఎస్ ఆటో యూనియన్ రాంపల్లి రజనీకాంత్ గర్లా ఆధ్వర్యంలో మా మిత్రుడు గుండు నరసింహ గౌడ్ గారికి కాంగ్రెస్ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా సెక్రెటరీగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా వారిని ఈరోజు ఘనంగా సన్మానించడం జరిగింది అదేవిధంగా మా ఆటో యూనియన్ నుండి పై స్థాయికి వెళ్లడానికి కృషిచేసిన ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బిర్లా ఐలన్న గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నం మా ఆటో కార్మికులపై మీరు చూపిస్తున్న ప్రేమని మేము ఎన్నడు మరువలేమన్న మీకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామన్న అని బిర్లా ఐలయ్య గారికి కృతజ్ఞతలు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న అధ్యక్షులు గుండు సాయిల్ గౌడ్, రాంపల్లి రజనీకాంత్ గౌడ్, మోహన్ నాయక్, కంసాని శ్రీహరి, జమాల్, ఎల్లా గౌడ్, రజినీకాంత్, చాంద్ పాషా, సత్యం గౌడ్, మంగు నాయక్, జహంగీర్, గుండు మధు, సాయి, కందుకూరు మధు, వాటర్ మధు, నగేష్ తదితర ఆటో డ్రైవర్స్ పాల్గొనడం జరిగింది.

అడ్డగోలు మాటలతోనే అరూరి అడ్రస్ గల్లంతు…

అడ్డగోలు మాటలతోనే అరూరి అడ్రస్ గల్లంతు

ఓడించి ఇంటికి పరిమితం చేసినా బుద్ధి రాలే కార్యకర్తలను గాలికొదిలేసిన చరిత్ర అరూరిది

అన్న అంటే అందుబాటులో ఉంటున్నది ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

లక్ష మేజారిటి అని గొప్పలు చెప్పుకున్న అరూరిని సోంత పార్టీ కార్యకర్తలే ఓడించింది నిజం కాదా..?

గ్రామాల్లో ఒక్క ఇళ్లు కూడా పెదలకు కట్టని అరూకి ప్రజల గురించి, అభివృద్ధి గురించి మాట్లాడడం సిగ్గుచేటు

నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్, వర్ధన్నపేట యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కుల్ల యాకాంతం

వర్ధన్నపేట ( నేటిధాత్రి):

లక్ష మెజారిటి గొప్పలకు పోయి కన్ను మీన్ను కానకుండా ప్రజలను, పార్టీ కార్యకర్తలను, ఉద్యమకారులను పక్కనబెట్టి అక్రమ సంపాదనకు పాకులాడి అభివృద్ధి మరిచి ఉకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చాడనే అరూరి రమేష్ ను చిత్తుగా ఓడించి ఇంటికి పరిమితం చేసినా ఇంకా అడ్డగోలుగా మాట్లాడడం మారలేదని నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్, వర్ధన్నపేట యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కుల్ల యాకాంతం ఎద్దేవా చేశారు.
నిన్నటి వరకు బీజేపి సంకలో ఉన్న అరూరికి అక్కడ కూడా ఎవరు పట్టించుకోకపోవడంతో దిక్కు తోచక బిఆర్ఎస్ పార్టీలో చేరిన అరూరి రమేష్ వాస్తవాలు మాట్లాడకుండా ఆ పార్టీ పెద్దల మెప్పు కోసం నోటికొచ్చింది మాట్లాడుతున్నాడని యాకాంతం ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు పార్టీని నమ్ముకున్న ఏ కార్యకర్తను, ఉద్యమకారులను కనీసం పట్టించుకోకుండా కేవలం కాంట్రాక్టుల మీద శ్రద్ద పెట్టి వందల కోట్ల రూపాయలు దండుకున్న అరూరి నేడు మున్సిపల్ ఓట్లు రాగానే కార్యకర్తలు రావడం ఆయన స్వార్ధ రాజకీయాలకు నిదర్శనమన్నారు. ఈ పనికిరాని మాటలు మాట్లాడారనే సొంత పార్టీ కార్యకర్తలే సాదారణ ఎన్నికల్లో చిత్తుగా ఓడించి బుద్ధి చెప్పారని అన్నారు.
నిత్యం ప్రజల్లో ఉంటూ తనకంటూ ఏ స్వార్ధం లేకుండా కేవలం నియోజకవర్గ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్న వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అక్కున చేర్చుకుంటే అన్ని కష్టనష్టాల్లో వెన్నంటి ఉండి పార్టీని నియోజకవర్గంలో బలోపేతం చేస్తున్న పరిస్థితులను చూసి తట్టుకోలేకే తప్పుడు కూతలు కుస్తు ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తే అరూరి రమేష్ రాజకీయ భవిష్యత్తు మరింత అంధకారంలోకి వెళ్లడమే గాక బీఆర్ఎన్ పార్టీ కనుమరుగు గాక తప్పదని యాకాంతం అన్నారు. నియోజకవర్గంలో గత పదేళ్ల పాలనలో ఏ గ్రామంలో ఒక్క ఇళ్లు కూడా కట్టని అరూరి రమేష్ దమ్ముంటే నేడు నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటించి ఎన్ని ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణమౌతున్నాయో లెక్క పెట్టి బుద్ధి తెచ్చుకోవాలని యాకాంతం నూచించారు.
ఇప్పటికైనా అరూరి రమేష్ వాస్తవ విషయాలను మాట్లాడి మార్పు తేచ్చుకోకుంటే ఆయన వర్ధన్నపేట మునిసిపల్ ఎన్నికల్లో ఒక్క వార్డు కూడా గెలవకుండా డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమని ఎన్ని కుట్రలు చేసినా వర్ధన్నపేట మునిసిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం ఖాయమని యాకాంతం ధీమా వ్యక్తం చేశారు.

కోహిర్ మున్సిపల్ ప్రచారంలో దూసుకుపోతున్న మజ్లిస్ పార్టీ…

కోహిర్ మున్సిపల్ ప్రచారంలో దూసుకుపోతున్న మజ్లిస్ పార్టీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

కోహిర్ మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ సందడి నెలకొంది. ఏఐఎంఐఎం పార్టీ తన పట్టు నిరూపించుకోవడానికి ఆరుగురు అభ్యర్థులను బరిలోకి దించింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు కోహిర్ పట్టణ వీధుల్లో ప్రచారం చేస్తూ, మజ్లిస్ గుర్తు ‘పతంగి’ (గాలిపటం) కు ఓటు వేసి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు.కోహిర్ పట్టణలో మజ్లిస్ జెండా ఎగరేసి ‘పతంగి’ పార్టీ అధ్యక్షునికి బహుమతిగా అందజేస్తామని పార్టీ అధ్యక్షులు మహమ్మద్ రఫీ అన్నారు మొట్టమొదటిసారిగా కోహిర్ పట్టణంలో మున్సిపాల్ ఎన్నికలు జరగడం వల్ల పతంగి ఎగరేసి పార్టీని బలపరిస్తానని భారీ మెజారిటీతో మున్సిపల్ ప్రచారంలో దూసుకుపోతున్న మజ్లిస్ ‘పతంగి’పార్టీ

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం…

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

తంగళ్ళపల్లి మండలంలో పలు గ్రామాల నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు సిరిసిల్ల జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం నిర్వహిస్తూ .గెలిపే లక్ష్యంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి ఆదేశాల మేరకు తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జలగం.ప్రవీణ్ .సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చొప్పదండి.ప్రకాష్ గారి ఆధ్వర్యంలో మూడో వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాముని వనిత.నలినికాంత్ గారి తో. ప్రచారంలో తంగళ్ళ పల్లి మండలం నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆధ్వర్యంలో వాడవాడల గడపగడప తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాముని వనిత నలినీ కాంత్ గెలుపే లక్ష్యంగా ప్రచారం నిర్వహిస్తున్నామని తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలనుదృష్టిలో పెట్టుకొని అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందు .ఉంచుతున్నారని. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ఎన్నో కష్టనష్టాలు ఓర్చుకొని గత పాలకులు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిఅప్పుల పాలు చేస్తే దాన్ని అధిగమిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకువస్తూ అన్ని వర్గాల ప్రజలకు పార్టీలకతీతంగా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మూడవ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాముని వనిత నలిని కాంత్.గార్లను మీ ఆశీర్వాదంతో అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రచారం చేస్తూ ఓటు అభ్యర్థిస్తూ ఓటర్లనువేడుకోవడం జరిగిందని సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో. మార్కెట్ కమిటీ చైర్మన్ వేల్పుల స్వరూప తిరుపతిరెడ్డి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యూత్ నాయకులు ఎన్ ఎస్ యు ఐ నాయకులు పార్టీ కార్యకర్తలు మహిళా పార్టీ నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో సిపిఐ పార్టీ 22 వార్డుల నుండి పోటీ…

క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో సిపిఐ పార్టీ 22 వార్డుల నుండి పోటీ…

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

క్యాతన్ పల్లి మున్సిపాలిటీ మేజర్ గ్రామపంచాయతీ నుండి మున్సిపాలిటీగా అవతరించిన అనంతరం రెండో సారి మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలో సిపిఐ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్, జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ ముఖ్య అతిధులుగా హాజరై మాట్లాడారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటానికి మిత్ర పక్షంగా మెలిగి గెలుపుకు సహకరించామని,సిపిఐ పార్టీ కాంగ్రెస్ తో స్నేహబంధమే కోరుకుంటుందని అన్నారు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో సిపిఐ తో పాటు కలిసి పనిచేసేందుకు ఇష్టపడని నేపథ్యంలో సిపిఐ పార్టీ మునిసిపాలిటీలోని 22 వార్డులలో కౌన్సిలర్లు గా పోటీ చేసేందుకు సిద్ధమయ్యామని అన్నారు..

CPI Fields Candidates in 22 Wards of Kattanpalli Municipality.

మిత్ర ధర్మాన్ని విస్మరిస్తే కలిసివచ్చే సెక్యులర్ పార్టీలతో సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అన్ని వార్డులలో నామినేషన్ వేస్తామని తెలిపారు. సిపిఐ కార్యకర్తలు కౌన్సిలర్ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్, జిల్లా సమితి సభ్యులు మిట్టపల్లి పౌలు, వనం సత్యనారాయణ, ఈరవేన రవీందర్, రాజేశం ,మనమ్మ, లక్ష్మణ్, శంకర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మంలో ఎంపీ వద్దిరాజు పుట్టినరోజు వేడుక

ఎంపీ వద్దిరాజుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ శ్రేణులు

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పుట్టినరోజు వేడుకలు ఖమ్మం తెలంగాణ భవన్ లో శనివారం ఘనంగా జరిగాయి.తన జన్మదినం సందర్భంగా హైదరాబాద్ నుంచి ఖమ్మం చేరుకున్న ఎంపీ రవిచంద్రకు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యలతో కలిసి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆత్మీయ స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర చేత కేక్ కట్ చేయించి శాలువాలతో ఘనంగా సన్మానించారు, హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ వేడుకలలో పార్టీ నగర శాఖ అధ్యక్షుడు పగడాల నాగరాజు, సీనియర్ నాయకులు ఉప్పల వెంకటరమణ,బెల్లం వేణు,ఖమర్,సామినేని హరిప్రసాద్,లకావత్ గిరిబాబు, పగడాల నరేందర్, మక్బూల్,డేరంగుల బ్రహ్మం,బలుసు మురళీకృష్ణ,లింగనబోయిన సతీష్,నమలికొండ వంశీ, మహ్మద్ రఫీ,భాషబోయిన వీరన్న, పలువురు జర్నలిస్టులు పాల్గొని ఎంపీ వద్దిరాజుకు హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పారు

మేడ్చల్‌లో 30 నేతలు బీఆర్ఎస్‌లో చేరిక

30 మంది బిఆర్ఎస్ లో చేరిక

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :

ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని మాజీ మంత్రి, ఎంఎల్ఏ చామకూర మల్లారెడ్డి అన్నారు. ముడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అనంతారంకు చెందిన ఇతర పార్టీ నాయకులు కొల్లా స్వప్న, బుద్ది నరేష్, ముద్దమ్ శ్రవణ్ రెడ్డి, మామిడాల వెంకటేష్ గౌడ్, స్వామి లతో పాటు దాదాపు 30 మంది బిఆర్ఎస్ లో చేరారు. మాజి మంత్రివర్యులు మేడ్చల్ శాసనసభ్యులు మల్లారెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ లో చేరగా పార్టీ కండువా కప్పి ఆహ్వానిచ్చారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు మల్లేష్ గౌడ్, మాజీ సర్పంచ్ గౌస్ పాషా, ఏఎంసి మాజీ వైస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version