విద్యార్థులకు అందుబాటులో ఉన్నత విద్య…

విద్యార్థులకు అందుబాటులో ఉన్నత విద్య

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కృషితో చొప్పదండి నియోజకవర్గం డిగ్రీ కళాశాల మంజూరు

గంగాధరలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు

హర్షం వ్యక్తం చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు

గంగాధర, నేటిధాత్రి:

 

 

కరీంనగర్ జిల్లా గంగాధర మండలంతో పాటు చుట్టుపక్కల మండలాల్లో పేద మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోకి వచ్చింది. డిగ్రీ విద్య కోసం కరీంనగర్, జగిత్యాల వంటి పట్టణాలకు వెళ్లి చదువుకోవడం వ్యయప్రయాసలతో కూడుకున్నది కావడంతో చాలామంది పేద విద్యార్థులు చదువును ఇంటర్మీడియట్ తోనే ఆపేస్తున్నారు. చొప్పదండి నియోజకవర్గంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తే పేద మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోకి వస్తుందన్న సదుద్దేశంతో మేడిపల్లి సత్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు ఈసమస్య తీసుకువెళ్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంజూరు చేయించారు. గంగాధరలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తుండడంతో విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గురువారం గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరైన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రజా పక్షం ప్రజల గొంతుక -7వ వార్షికోత్సవ వేడుకలు…

ప్రజా పక్షం ప్రజల గొంతుక -7వ వార్షికోత్సవ వేడుకలు

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

ప్రజాపక్షం దిన పత్రిక ప్రజల గొంతుకగా నిలుస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్ అన్నారు. ప్రజాపక్షం దిన పత్రిక 7వ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సిపిఐ కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కలవేన శంకర్, సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, ఎఐటియుసి జిల్లా కార్యదర్శి మేకల దాసు హాజరై కేక్ కట్ చేశారు.ప్రజల సమస్యలను పరిష్కరించడంలో,పారదర్శక పాలనను,ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో ప్రజాపక్షం దిన పత్రిక ఎనలేని కృషి చేస్తుందని వారు పేర్కొన్నారు.భవిష్యత్తులో ఈ పత్రిక మరింత ముందుకు వెళ్లాలని వారు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ప్రజాపక్షం జిల్లా ప్రతినిధి పార్వతి సురేష్ కుమార్,మంచిర్యాల ఆర్సీ ఇన్చార్జి కేశేటి వంశీ,నస్పూర్ మండల విలేకరి నారగొని పురుషోత్తం,గంగారపు గౌతమ్,కుమ్మరి సతీష్, చిట్యాల వినీత్ తదితరులు పాల్గొన్నారు.

జహీరాబాద్ నియోజకవర్గం కి గర్వకారణంగా వెలిసిన పూజ…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-22T135103.119.wav?_=1

 

జహీరాబాద్ నియోజకవర్గం కి గర్వకారణంగా వెలిసిన పూజ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గం ( సంగారెడ్డి జిల్లా) జహీరాబాద్ ప్రాంతంలో చిన్న హైదరాబాద్ లో అంజయ్య, జయశ్రీ దంపతులకు జన్మించిన పూజ, చిన్నతనం నుండి బాగా చదువుకొని మన ప్రాంతము కె గర్వకారణం అయ్యే విదంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రూప్ 1 పరీక్షల్లో తెలంగాణ లో 25 వ ర్యాంకు సాధించి వికారాబాద్ జిల్లాలో డిప్యూటీ కలెక్టర్ గా పోస్టింగ్ పొందింది.మన ప్రాంతంలో ఎంతో మంది విద్యార్థులకు పూజ ఆదర్శంగా నిలిచారు అని జహీరాబాద్ ప్రాంత వాసులు కొనియాడారు జహీరాబాద్ మహిళా మణులు పూజకు ఘనంగా సర్కారం చేశారు.పూజ ను జన్మనిచ్చినందుకు తండ్రి అంజయ్య దంపతులు గర్వపడ్డారు.ఈ కార్యక్రమంలో అనిత,స్వప్న,సిందూజా, రుక్మిణి, పద్మ, ఆశమ్మ, శారదా,రాజరమేశ్, తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా అబ్దుల్ కలాం జయంతి వేడుకలు…

ఘనంగా అబ్దుల్ కలాం జయంతి వేడుకలు

కేసముద్రం/ నేటి ధాత్రి

 

కేసముద్రం మండల కేంద్రంలోని శ్రీ వివేకవర్ధిని హైస్కూల్‌లో బుధవారం భారత మాజీ రాష్ట్రపతి, “మిసైల్ మాన్ ఆఫ్ ఇండియా”గా పేరుపొందిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతిని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా పాఠశాల రెస్పాండెంట్ చిర్ర యాకాంతం గౌడ్ కలాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ –
“డాక్టర్ అబ్దుల్ కలాం జీవితమే ఓ ప్రేరణ. సాధారణ కుటుంబంలో పుట్టి, కఠిన శ్రమతో దేశానికి శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా సేవలు అందించారు. విద్యార్థులు ఆయనలా పెద్ద కలలు కనాలి, వాటిని నెరవేర్చే దిశగా కృషి చేయాలి. కలాం చెప్పిన ‘ కలలు కనండి వాటిని సాకారం చేసుకునేందుకు కృషి చేయండి’ అనే వాక్యాన్ని జీవితమంతా మంత్రంలా మార్చుకోవాలి” అని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

జహీరాబాద్ లో వివాహ వేడుకలో పాల్గొన్న మొహమ్మద్ తన్వీర్…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-13T113842.407.wav?_=2

 

వివాహ వేడుక లో వేడుక లో పాల్గొన్న రాష్ట్ర ఇండస్ట్రియల్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ పట్టణంలోని ఫ్రెండ్స్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో మొగుడంపల్లి గ్రామానికి చెందిన మహమ్మద్ తాజుద్దీన్ గారి కుమార్తె వివాహ వేడుక లో పాల్గొని నూతన వరునికి వివాహ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర ఇండస్ట్రియల్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్ వారితోపాటు వెంకట్ రెడ్డి మొహమ్మద్ కుతుబుద్దీన్ మహమ్మద్ తాజోద్దీన్ సుభాష్ సందీప్ తదితరులు ఉన్నారు,

బోడగుట్ట తండాలో పోషణ మాసోత్సవం…

బోడగుట్ట తండాలో పోషణ మాసోత్సవం

కేసముద్రం/ నేటిదాత్రి

 

కేసముద్రం మండలంలోని అంగన్వాడి కల్వల క్లస్టర్ లోని పిక్లా తండా శివారు బోడగుట్ట తండా అంగన్వాడి సెంటర్లో గురువారం పోషణ మాసోత్సవం కార్యక్రమం నిర్వహించారు ఇందులో పోషకాలను అందించే 20 రకాల పిండి వంటలు, కొత్త రకమైన వంటకాలు, అలంకరణ బాగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా అంగన్వాడి సూపర్వైజర్ ఎస్ ప్రేమ జ్యోతి మాట్లాడుతూ… చిన్నపిల్లలకు ఎలాంటి జంక్ ఫుడ్ ఇవ్వవద్దని, నూనె పదార్థాలు, చక్కెర, చిప్స్ వంటి వాటికి దూరంగా ఉంచాలన్నారు. గర్భిణీ స్త్రీలు ప్రతినెల పరీక్ష చేయించుకుని తగిన పోషకాహారం తీసుకోవాలన్నారు. గర్భిణిగా ఉన్నప్పుడు మంచి ఆహారం తీసుకుంటే ఆరోగ్యవంతమైన బేబీ జన్మిస్తుందని చెప్పారు. పిల్లల పెరుగుదల విషయంలో ఎప్పటికప్పుడు పోషకాహారం అందిస్తూ ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలన్నారు. ఈ సందర్భంగా వివిధ రకాల ఆహార పదార్థాలను చిరుధాన్యాలతో తయారుచేసి పిల్లలకు అందించారు. హాజరైన వారందరితో పోషకాహారం పై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం గనె యాదగిరి, కార్యదర్శి ఇ.నివాస్ రెడ్డి, టీచర్ గానె పావన, క్లస్టర్ లోని అంగన్వాడి టీచర్లు జీ. నీల, టి. వాణి, ఈ. జ్యోతి, బి. సునీత, బి. స్వప్న, జి. పద్మ, ఆశ వర్కర్లు ఎం. నాగలక్ష్మి, ఎస్. ఉపేంద్ర, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, గ్రామస్తులు, పిల్లలు పాల్గొన్నారు.

కోటగుళ్ళు, ఆంజనేయ స్వామి దేవాలయంలో భూపాలపల్లి సిఐ పూజలు

కోటగుళ్ళు, ఆంజనేయ స్వామి దేవాలయంలో భూపాలపల్లి సిఐ పూజలు

గణపురం నేటి ధాత్రి

Vaibhavalaxmi Shopping Mall

గణపురం మండల కేంద్రంలోని శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లు, శ్రీ దక్షిణముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో భూపాలపల్లి సిఐ దొమ్మాటి నరేష్ కుమార్ గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాల అర్చకులు గోవర్ధన వేణుగోపాలాచార్యులు, జూలపల్లి నాగరాజు లు సిఐని సాదరంగా ఆహ్వానించి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం శాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించి ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలను అందజేశారు.

మెట్ పల్లిలో బిఆర్ఎస్ నేతల బతుకమ్మ ఉత్సవం…

మెట్ పల్లి అక్టోబర్ 4 నేటి ధాత్రి

మెట్ పల్లి ఎమ్మెల్యే స్వగృహంలో బతుకమ్మ పండుగ పురస్కరించుకొని బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు సతీమణి కల్వకుంట్ల సరోజన బతుకమ్మ అలంకరణ చేశారు ఈ కార్యక్రమంలో ఆర్పిలు పాల్గొన్నారు.

వల్లబ్ నగర్ లో దుర్గ మాత పూజలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డ్….

వల్లబ్ నగర్ లో దుర్గ మాత పూజలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డ్
వనపర్తి నేటిదాత్రి .

 

వల్లబ్ నగర్ 33 వార్డులో రామ్ సేన యూత్ మహిళా సంఘం సభ్యులు దసరా ఉత్సవాలలో సందర్భంగా దుర్గామాత ప్రత్యేక పూజలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రత్యేక పూజలో పాల్గొన్నారని 33 వ వార్డు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ తిరుమాల్ తెలిపారు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారని చెప్పారు పూజలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ మాజీ కౌన్సిలర్ తిరుమల్ అలేఖ్య గులాం సూర్యవంశం గిరి సునీల్ వాల్మీకి చిట్యాల రాము బీచుపల్లిసాగర్ రాఘవేంద్ర క్రాంతి తదితరులు పాల్గొన్నారని తిరిమాల్ ఒక ప్రకటన లో తెలిపారు

దసరా శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర నాయకులు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి…

దసరా శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర నాయకులు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ ప్రజలకు రాష్ట్ర నాయకులు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. దుర్గామాత అనుగ్రహం కోసం.. నవరాత్రుల్లో 9 రోజులపాటు భక్తిశ్రద్ధలతో దుర్గామాతను పూజించి, చెడుపై.. మంచి, దుష్ట శక్తులపై.. దైవ శక్తుల విజయానికి ప్రతీకగా జరుపుకునే పండుగే విజయదశమి అన్నారు. దసరా పండుగ ధనిక పేద తేడా లేకుండా ప్రతి ఒక్కరి మధ్య స్నేహభావాన్ని పెంపొందించి సమాజం ఐక్యమత్యంతో ఉండేలా చేస్తుందని పేర్కొన్నారు. జహీరాబాద్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ముఖ్యంగా విద్య వైద్యం ప్రతి ఒక్కరికి చేరాలని తలంపుతో ప్రజా ప్రభుత్వం పనిచేస్తూ విద్యా వైద్యానికి పెద్దపీట వేస్తుందని తెలిపారు. పేదింటి బిడ్డలకు అత్యుత్తమ విద్య అందించాలని తలంపుతో ప్రారంభించరు ఈ సందర్భంగా ఉదాహరించారు. జహీరాబాద్ నియోజకవర్గ ప్రజలంతా సుఖ సంతోషాలతో దసరా ఉత్సవాలను జరుపుకోవాలని, ఆ జగన్మాత ఆశీస్సులతో ప్రజలంతా సుఖ శాంతులతో, సిరి సంపదలతో తులతూగాలని ఆ కనకదుర్గమ్మ అమ్మవారి దీవెనలు, ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

వైభవంగా చండీయాగం…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-01T141753.181.wav?_=3

వైభవంగా చండీయాగం

రాయికల్ అక్టోబర్ 1: నేటి ధాత్రి:

రాయికల్ పట్టణంలోని శ్రీ దుర్గా సేవా సమితి ఆధ్వర్యంలో బుధవారం దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా నిర్వహించిన చండీయాగం భక్తుల్ని ఆకట్టుకుంది. ఉదయం నుండి ప్రారంభమైన యాగ కార్యక్రమాలు మధ్యాహ్నం వరకు భక్తిశ్రద్ధలతో కొనసాగాయి. వేదపండితుడి మంత్రోచ్చారణల నడుమ జరిగిన యాగంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
భక్తులందరికీ యాగ దర్శనం కనుల విందుగా నిలిచింది. సమితి సభ్యులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, భక్తులకు ప్రసాదాలను అందజేశారు.

ఝరాసంగం మండల ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపిన…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-01T133811.880.wav?_=4

 

ఝరాసంగం మండల ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపిన

◆:- మండల ఎంఐఎం పార్టీ అధ్యక్షులు షేక్ రబ్బాని

జహీరాబాద్ నేటి ధాత్రి:

ప్రజలందరిలోనూ దసరా సంతోషాన్ని నింపాలని ఝరాసంగం మండల ఎంఐఎం పార్టీ అధ్యక్షులు షేక్ రబ్బాని పేర్కొన్నారు. దసరా నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. చెడుపై మంచికి విజయానికి ప్రతీకగా చేసుకునే దసరా పండగలో అందరి జీవితాల్లోనూ కొత్త వెలుగు నింపాలని కోరారు. శాంతియుత, అభివృద్ధి కారక సమాజం కోసం అందరూ కృషి చేయాలని ఆయన కోరారు.చెడుపై మంచి, దుష్టశక్తులపై దైవశక్తి విజయానికి ప్రతీక దసరా అని, చెడు ఎంత దుర్మార్గమైనా, శక్తిమంతమైనా అంతిమ విజయం మంచినే వరిస్తుందని ఎంఐఎం పార్టీ మండల అధ్యక్షులు షేక్ రబ్బాని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు ఆయన దసరా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా సుఖశాంతులు, సిరి సంపదలతో తలతూగాలని ఆయన కోరారు.

ఫార్మసిస్ట్ లందరికి ఫార్మసిస్ట్ జరుపుకున్న వైద్యాధికారులు…

ఫార్మసిస్ట్ లందరికి ఫార్మసిస్ట్ జరుపుకున్న వైద్యాధికారులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ప్రపంచ ఫార్మసిస్టుల దినోత్సవం ఝరాసంగం మండల ప్రాథమిక వైద్యాధికారి రమ్య ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఫార్మసిస్టుల పాత్రను ప్రోత్సహించడానికి మరియు సమర్ధించడానికి సెప్టెంబర్ 25న వైద్యాధికారులు అందరూ కలసి జరుపుకునారు.

ఎంగిలి పూల బతుకమ్మ తెలంగాణ సాంస్కృతి సంబరాలు…

ఎంగిలి పూల బతుకమ్మ తెలంగాణ సాంస్కృతి సంబరాలు

నస్పూర్(మంచిర్యాల)నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం 23 వ వర్డ్ లో ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు.వివిధ రకాల పువ్వులతో బతుకమ్మను పేర్చి,గౌరీ దేవిని పూజించి సంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మల చుట్టూ తిరుగుతూ ఆడుతూ పాడుతూ నృత్యాలతో అలరించారు.9 రోజుల పాటు బతుకమ్మ ఉత్సవాలను మహిళలు చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఒక చోట కలసి పకృతితో మమేకమైన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల ఔన్నత్యాన్ని బతుకమ్మ పండుగ విశ్వవ్యాప్తంగా చాటుతుందని అన్నారు.తెలంగాణ ప్రజలందరి జీవితాలు వెలుగులు నింపుతూ మరింత సుఖ సంతోషాలతో జీవించేలా దీవించాలని గౌరీ దేవిని ప్రార్థించారు.

ఘనంగా ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలు…

ఘనంగా ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలు

నస్పూర్(మంచిర్యాల)నేటి ధాత్రి:

 

 

నస్పూర్ మండలం షిర్కే కాలనీలో ఆదివారం ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలను మహిళలు ఘనంగా జరుపుకున్నారు.తంగడి పూలకు తోడుగా రకరకాల పూలతో బతుకమ్మను అందంగా పేర్చి గౌరీ దేవిని పూజించి,నూతన వస్త్రాలు ధరించి అందరూ ఒకచోట కలసి ఆడుతూ పాడుతూ బతుకమ్మను ఆనందంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ.. బతుకమ్మ పండగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి,మన ఆస్తిత్వానికి నిలువుటద్దమని అన్నారు.ప్రకృతిని ఆరాధిస్తూ భూమి నీరు మానవ సంబంధాలను గుర్తు చేసుకుంటూ జరుపుకునే గొప్ప పండుగ అని తెలిపారు.మహాలయ అమావాస్య నుండి తొమ్మిది రోజుల పాటు సాగే ఈ పూల జాతర తెలంగాణ సంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెపుతుందని అన్నారు.అలాగే మహిళలు, ఆడపడుచులు ఐక్యంగా జరుపుకునే ఈ బతుకమ్మ పండుగ వారి మధ్య అనుబంధాలను,ఐక్యతను, పెంపొందిస్తుందని,గౌరీ దేవి ఆశీస్సులు అందరిపై ఉండాలని వారు పూజించారు.

జీఎస్టీ రద్దుపట్ల ఎల్ఐసిఏఓఐ సంబరాలు…

జీఎస్టీ రద్దుపట్ల ఎల్ఐసిఏఓఐ సంబరాలు.

నర్సంపేట,నేటిధాత్రి:

ఎల్ఐసి ప్రీమియం లో కేంద్ర ప్రభుత్వం గతంలో విధించిన జీఎస్టీని గత 8 సంవత్సరాలుగా ఎల్ఐసిఏఓఐ పోరాటం ఫలితంగా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని రద్దు చేసిన నేపథ్యంలో నర్సంపేట పట్టణంలోని ఎల్ఐసి కార్యాలయం ఎదుట ఎల్ఐసిఏఓఐ ఆర్గనైజేషన్ బ్రాంచ్ అధ్యక్షుడు పోనుగొటి సుధాకర్ రావు అధ్యక్షతన ఏజెంట్లు సంబరాలు జరుపుకున్నారు. బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎల్ఐసిఏఓఐ వరంగల్ డివిజన్ ప్రధాన కార్యదర్శి పడిదం కట్టస్వామి మాట్లాడుతూ 2017 నుండి జిఎస్టి పట్ల కేంద్ర ప్రభుత్వంపై
ఎల్ఐసిఏఓఐ వివిధ రకాల పోరాటం ఫలితంగా కేంద్ర ప్రభుత్వం జిఎస్టిని రద్దు చేసిందని పేర్కొన్నారు. పాలసీదారుల లబ్దికోసం అలాగే ఎల్ఐసి ఏజెంట్ల సంక్షేమం కోసం ఎల్ఐసి ఏఓఐ ఆర్గనైజేషన్ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.రాష్ట్ర నాయకులు మొద్దు రమేష్,వైనాల శంకరయ్య ,సాంబరాతి శ్రీనివాస్, బ్రాంచ్ గౌరవ అధ్యక్షులు పెండ్లి రవి, బ్రాంచ్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ మర్థ గణేష్ ,కార్యదర్శి సుభానుద్దిన్, కోశాధికారి కందికొండ రవికుమార్, చంద్రమౌళి ,డివిజన్ నాయకులు బూర రమేష్ ,శ్రీధర్ రాజు ,అనంత గిరి స్వామి,ప్రచార కార్యదర్శి కుసుంబ రఘుపతి,ముఖ్య సలహాదారు కొమురయ్య ,పురాణి రాంబాబు,సార సాంబశివుడు,కొనకటి స్వామి,అల్లె రాజు,నాంపెల్లి.రాంబాబు,టెంకురాల రాజేశ్వర్ రావు, బాబురావు,వీరస్వామి,భానోతు చందు తదితరులు పాల్గొన్నారు.

ఓదెల మండలం లో అంగరంగ వైభవంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-22T140342.321.wav?_=5

ఓదెల మండలం లో అంగరంగ వైభవంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు

ఓదెల(పెద్దపెల్లి జిల్లా)నేటి ధాత్రి

 

ఓదెల మండలం లోని ఓదెల, పోత్కపల్లి, మడక , కనగర్తి, గుండ్లపల్లి, పిట్టల ఎల్లయ్య పల్లి, కొలనూర్, గోపరపల్లి, హరిపురం, లంబాడి తండా, నాంసానిపల్లి, అబ్బిడిపల్లి, జీలకుంట, శానగొండ, రూపు నారాయణపేట, ఇందుర్తి, గుంపుల, గూడెం, బాయమ్మపల్లి, భీమరపల్లి, ఉప్పరపల్లి గ్రామాలతో పాటు ఇతర గ్రామాలలో తెలంగాణలో బతుకమ్మ పండుగ వెయ్యి ఏండ్ల నాటిదనీ తెలంగాణ యొక్క సంస్కృతి ,సాంప్రదాయాలకు ప్రతీక అని,ప్రకృతిని, పుడమితల్లని స్థానికంగా దొరికే గుమ్మడి, తంగేడు, గునుగు, బంతి, చామంతి పూలతో అలంకరించి గౌరీ దేవికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ జరుపుకునే స్త్రీల పండుగ అని మహిళలు పేర్కొన్నారు. బతుకమ్మ పండుగ నేటి నుండి 9 రోజులు ఆడే బతుకమ్మ పండుగ ఈ సందర్భంగా మహిళలు భక్తిశ్రద్ధలతో ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు కోలాటం,ఆట పాటలతో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అనే ఆట పాటలతో పాడారు.

దసరా నవరాత్రి ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-22T135735.182.wav?_=6

 

దసరా నవరాత్రి ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి:

◆:- ఎంఐఎం పార్టీ మండల అధ్యక్షులు షేక్ రబ్బాని

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఈ నెల 21 నుండి ప్రారంభమయ్యే బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని జహీరాబాద్ నియోజకవర్గ ఝరాసంగం మండల ఎంఐఎం పార్టీ అధ్యక్షులు షేక్ రబ్బాని తెలిపారు.
బతుకమ్మ సంబురాలు, దసరా ఉత్సవాల ఏర్పాట్లు మండల గ్రామాల అధికారులు అధికారులతో సమావేశం నిర్వహించి గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు పూర్తి చేయాలన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బతుకమ్మ పండుగ రాష్ట్ర ప్రజల సాంప్రదాయ, సంస్కృతికి ప్రతీక అని, పూల పండుగ అని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 9 రోజులు జరుగనున్న నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా మహిళలు వివిధ రకాల పూలతో బతుకమ్మలు తయారు చేసి అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారని, బతుకమ్మలు ఆడిన తదుపరి చెరువుల్లో నిమజ్జనం చేస్తారు కాబట్టి గ్రామాలు, మండలాలు పరిధిలో బతులమ్మ ఘాట్లు గుర్తించి విద్యుత్ సౌకర్యాలు కల్పించాలన్నారు అన్ని శాఖల ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలి. రహదారులు, వీధి విద్యుత్ దీపాలు తాగునీరు, పరిశుభ్రత, భద్రతా చర్యలు, వైద్య సేవలు వంటి అన్ని సౌకర్యాలను ముందుగానే సిద్ధం చేయాలన్నారు,పెద్ద సంఖ్యలో పాల్గొనే ఈ వేడుకల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. ముఖ్యంగా అన్ని గ్రామాల్లో,ఝరాసంగం మండల ఆయా గ్రామాల పరిధిలోని అన్ని వార్డుల్లోని ముఖ్యమైన కూడళ్లను అందంగా తీర్చిదిద్దాలనారు. గ్రామాల్లో స్పెషల్ ఆఫీసర్లు, పంచాయతీ సెక్రటరీలు స్పెషల్ డ్రైవ్ చేపట్టి సమస్యలను పరిష్కరించాలని ముఖ్యంగా గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ, వీధులలో, ప్రధాన కూడళ్లలో వీధిలైట్ల వెలిగేలా చూడాలని తెలిపారు. దసరా ఉత్సవాల ముగింపు రోజైన అక్టోబర్ 2న
జరిగే దసరా ఉత్సవాలను ఘనంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు ముందుగానే పూర్తిచేయాలని. అక్టోబర్ 2వ తేదీన దసరా ఉత్సవాల సందర్భంగా గ్రామంలో ఉన్న దేవాలయాలకు భక్తుల తాకిడి అధికంగా ఉండే అవకాశం ఉన్నందున భక్తులకు అనుగుణంగా ఏర్పాటు చేయాలని ఝరాసంగం మండల వివిద శాఖల అధికారులకు కోరారు.ఉత్సవాలు అందరికీ ఆనందాన్ని పంచేలా విజయవంతంగా నిర్వహించడమే మనందరి లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. బతుకమ్మ నిమజ్జన ప్రాంతాలను గుర్తించి రక్షణ ఏర్పాట్లు చేయాలని కోరారు

జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ చైర్మన్ మండల అధ్యక్షులు…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-19T134612.031.wav?_=7

 

జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ చైర్మన్ మండల అధ్యక్షులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ఝరాసంగం మండల ఈదులపల్లి రచ్చయ్య స్వామి కుమారుడు బసవరాజ్ జన్మదినాన్ని శుభాకాంక్షలు పురస్కరించుకుని, టీజీఐడిసి మాజీ చైర్మన్, మహమ్మద్ తన్వీర్ ఝరాసంగం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హనుమంతు రావు పటేల్ శాలువా పూలమాలలతో సన్మానించి కప్ కేక్ కట్ చేసి,ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు మాజీ ఎంపీటీసీ జడ్పిటిసి శంకర్ పటేల్, నర్సింలు పటేల్ మల్లన్న పటేల్, బాలభాయ్ బాలరాజ్ తదితరులు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

నిరంకుశ నిజాం పరిపాలనకు చరమగీతం పాడిన రోజు…

నిరంకుశ నిజాం పరిపాలనకు చరమగీతం పాడిన రోజు
* బిజెపి మండల అధ్యక్షుడు రామ్ శెట్టి మనోజ్

మహాదేవపూర్ సెప్టెంబర్ 17 (నేటి ధాత్రి)

 

 

తెలంగాణ విమోచన దినోత్సవ సందర్భంగా రామ్ శెట్టి మనోజ్ బుధవారం రోజున మాట్లాడుతూ నిరంకుశ నిజాం పరిపాలనకు చరమ గీతం పాడిన రోజని అన్నారు. మహాదేవ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించిన అనంతరం మండల బిజెపి అధ్యక్షుడు రామ్ శెట్టి మనోజ్ మాట్లాడుతూ నిరంకుశ నిజాం పరిపాలనకు చరమగీతం పాడిన రోజు అని, రజాకర్ల అకృత్యాలకు గోరి కట్టిన రోజని, దొరల గడీల్లో బానిసత్వానికి సమాధి కట్టిన రోజు అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శిలు లింగంపల్లి వంశీధర్ రావు, బల్ల శ్రావణ్, మండల కోశాధికారి ఊదరి పూర్ణచందర్, కార్యదర్శి బందుల సంతోష్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు ఓడేటి బాల్రెడ్డి, మండల నాయకులు, ఏబీవీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version