ఉర్సు ఉత్సవాల్లో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి
◆:- కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ మండల పరిదధిలోని శేఖాపూర్ గ్రామంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న హజ్రత్ షేక్ షాబుద్దీన్ షయీద్ ఉర్స్ ఉత్సవాల్లో తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి పాల్గొని అత్యంత భక్తి శ్రద్దలతో దర్గాను దర్శించుకుని ప్రత్యేక ప్రార్ధనలు చేసి చాదర్ సమర్పించారు.అనంతరం వారు మాట్లాడుతూ శేఖాపూర్ గ్రామంలో షాబుద్దీన్ షయీద్ ఉర్స్ ఉత్సవాలు ప్రతి ఏటా వైభవంగా నిర్వహించడం సంతోషకరమన్నారు ఈకార్యక్రమంలో వారితో పాటు సిడిసి చైర్మన్ ముబీన్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింహారెడ్డి శేఖాపూర్ గ్రామ మాజీ యం.పి.టి.సి నర్సింహులు,మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఇమామ్ పటేల్ యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు నాగిరెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీకాంత్ రెడ్డి అక్బర్ హర్షవర్ధన్ రెడ్డి అశ్విన్ పాటిల్ జగదీశ్వర్ రెడ్డి నథానెయల్ అరుణ్
బి.మల్లికార్జున్ హర్షద్ పటేల్ రాజు నాయక్ రవీందర్ చౌహన్ హఫీజ్ అక్షయ్ జాడే జుబెర్ పటేల్ బి.గోపాల్ గౌసోద్దీన్ పటేల్ నిజాం జగన్ రబ్బానీ మరియు దర్గా కమిటీ నిర్వాహకులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆయా మండలాల నాయకులు మాజీసర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు యూత్ కాంగ్రెస్ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు,
కాలోజీ నారాయణరావు జయంతి వేడుకలను మంగళవారం కేసముద్రం మున్సిపాలిటీలోని విలేజ్ లో శ్రీ వివేకవర్ధిని హైస్కూల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చిర్రా యాకాంతం గౌడ్ కాలోజీ చిత్రపటానికి పూలమాల వేశారు. అనంతరం ప్రసంగిస్తూ కాలోజీ కవిత్వం, ఆయన సాహిత్య స్ఫూర్తి, సమాజంపై చూపిన ప్రభావం గురించి వివరించారు. నా గొడవ పేరుతో సమకాలీన సామాజిక సమస్యలపై నిర్మొహమాటంగా స్పందించిన వ్యక్తి కాళోజీ అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.
సిరిసిల్ల మానేరు రచయితల సంఘం ఆధ్వర్యంలో కాళోజి జయంతి వేడుకలు
సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈ రోజు మానేరు రచయితల సంఘం ఆధ్వర్యంలో మహతి కళాశాలలో మానేరు రచయితల సంఘం అధ్యక్షులు గెంట్యాల భూమేష్ తెలంగాణ ప్రజాకవి కాళోజి జయంతి సందర్భంగా కళాశాలలోని విద్యార్థులకు తెలంగాణ భాష దినోత్సవం పురస్కరించుకొని కాళోజి జయంతి వేడుకను పురస్కరించుకొని తాను మాట్లాడుతూ తెలంగాణ యాస భాష మన కాళోజీ అని నిజాం, నిరంకుశత్వానికి ఎదురుతిరిగిన కవితల యోధుడని, మా భాష,మన అస్తిత్వం, మన నేల భూమి మన తెలంగాణ పోరాటం అని తెలిపారు.అందులో భాగంగా ఆడెపు లక్ష్మణ్ మాట్లాడుతూ రాబోయే తరాలకు మన భాష మన ఆస్తిత్వం ఎంతో ఉపయోగమని అలాంటి ఈరోజున తెలుగు భాషా దినోత్సవం కాళోజి జయంతి వేడుక మనకెంతో గర్వకారణం అని తెలిపారు. కవి రచయిత బూర దేవానందం కాళోజి పై కవిత గానం చేశారు. ఈ కార్యక్రమంలో మానేరు రచయితల సంఘం గౌరవ సలహాదారులు, అధ్యక్షులు జర్నలిస్టు టీవీ నారాయణ,చిటికెన కిరణ్ కుమార్, అల్లే రమేష్, కామవరపు శ్రీనివాస్, పోకల సాయికుమార్, ఎండి ఆఫీస్, అధ్యాపకులు వేణు,అంకారపు రవి కవులు,రచయితలు మరియు మహతి కళాశాల విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రజా కవి కాళోజీ నారాయణరావు సేవలు మరువలేనివి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
సిరిసిల్ల టౌన్: ( నేటిధాత్రి )న్యూస్
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రజా కవి కాళోజీ నారాయణరావు సేవలు మరువలేనివని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. కాళోజీ నారాయణరావు జయంతి వేడుకల సందర్భంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం కాళోజీ చిత్ర పటానికి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డి.పి.ఆర్.ఓ. వి.శ్రీధర్ డీవైఎస్ఓ రామ్ దాస్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి లత కలెక్టరేట్ ఏవో రామిరెడ్డి, అన్సర్ ఆయా శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగింది గత 11 రోజులుగా నిత్యం పూజలు అందుకున్న వినాయకుని శనివారం రాత్రి ఘనంగా నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో ప్రజలు భక్తులు పోలీస్ సిబ్బంది రెవెన్యూ మున్సిపల్ పంచాయతీరాజ్ వివిధ శాఖలకు చెందిన అధికారులు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.రాత్రి నిమజ్జనోత్సవంలో అంబరాన్ని అంటిన సంబరాలు మిగిల్చిన గుర్తులు. పట్టణ వీధుల గుండా గణపయ్యలను ఊరేగిస్తూ భక్తులు చల్లిన పూలు. నిమజ్జనం అనంతరం ఇళ్లకు వెళ్లిన యువత కునుకుతీసింది. సుఖమెరుగని ఈ కష్టజీవులు రాత్రనకా.. పగలనకా.. చెమటోడ్చి చెత్తను అంతా ఎత్తిపోశారు. పారిశుద్ధ్య కార్మికులూ మీ సేవలకు శతకోటి దండాలు!
రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామంలో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జన మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. శుక్ర వారం సాయంత్రం గ్రామమంతా ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. నిమజ్జన శోభాయాత్రలో గ్రామస్తులు, ముఖ్యంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలు సంప్రదాయ వేషధారణలో కోలాటాలతో నృత్యాలు చేస్తూ వినాయకుడిని గంగమ్మ ఒడికి తీసుకెళ్లడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిన్నారులు, యువకులు కూడా డప్పు వాయిద్యాలు, నృత్యాలతో ఊరంతా ఉత్సవ శోభను పెంచారు. ఫ్రెండ్స్ యూత్ సభ్యులు నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులు జైజై గణేశ్, గణపతి బప్పా మోరియా అంటూ నినాదాలు చేస్తూ ఊరంతా సందడి చేశారు.
లక్కి డ్రాలో పది కిలోల లడ్డు కైవసం చేసుకున్న నల్లగోని ప్రణయ్ కుమార్ గౌడ్..
ఓదెల (పెద్దపెల్లి జిల్లా) నేటిధాత్రి:
ఓదెల మండలంలోని పొత్కపల్లి గ్రామంలో లక్కీ డ్రా ద్వారా గణపతి లడ్డూను ఓ భక్తుడు సొంతం చేసుకున్నాడు. పోత్కపల్లి శ్రీ విఘ్నేశ్వర యూత్ అసోసియేషన్ కొత్త గుడిసెల్ ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన నల్లగోని భవాని-వెంకటేష్ గౌడ్ తన కుమారుడు ప్రణయ్ కుమార్(చిన్నా) పేరుపై రూ.101 రూపాయలకు లక్కీ డ్రా వేశాడు. నవరాత్రులు పూజలు అందుకున్న స్వామివారి పది కిలో ల లడ్డును లక్కి డ్రా లో సొంతం చేసుకున్నాడు.విఘ్నేశ్వర యూత్ కమిటీ సభ్యులు శాలువాతో సన్మానం చేయడం జరిగింది. లడ్డు రావడం పట్ల వెంకటేష్ గౌడ్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలందరికీ ఎల్లవేళలా స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు.
మైసమ్మ గల్లీలో లడ్డును కైవసం చేసుకున్న మాజీ మండల అధ్యక్షుడు
నిజాంపేట , నేటి ధాత్రి
మెదక్ జిల్లా నిజాంపేట మండలం పరిధిలోని నస్కల్ గ్రామంలో మైసమ్మ గల్లీలో వినాయక నవరాత్రులలో పూజలు అందుకున్న లడ్డును మాజీ మండల అధ్యక్షుడు బక్కన గారి మంజుల లింగం గౌడ్ 5018 రూపాయలకు కైవసం చేసుకున్నాడు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవరాత్రుల్లో పూజలు అందుకున్న లడ్డును దక్కించుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు అలాగే నిజాంపేట మండల ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మైసమ్మ గల్లి నిర్వాహకులు కాలనీవాసులు పాల్గొన్నారు
ఎంపీ వద్దిరాజు ధర్మపత్ని విజయలక్ష్మీ, కూతురు గంగాభవాని, కుమారుడు నిఖిల్ చంద్రలు విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు Date 05/09/2025
నేటిధాత్రి:
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ధర్మపత్ని విజయలక్ష్మీ, కూతురు డాక్టర్ గంగుల గంగాభవాని, కుమారుడు నిఖిల్ చంద్రలు విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఎంపీ రవిచంద్ర నివాసం వద్ద వీఆర్సీ యూత్ అసోసియేషన్ సభ్యులు గణనాథుడిని ప్రతిష్ఠించి నవరాత్రోత్సవాలు ఘనంగా నిర్వహించారు.నిమజ్జనానికి బయలుదేరడానికి ముందు వినాయకుడికి శుక్రవారం విజయలక్ష్మీ, నిఖిల్ చంద్రలు పూలమాల వేసి,హారతినిచ్చి గోత్ర నామంతో ప్రత్యేక పూజలు చేశారు.
Vigneshwara
ఈ సందర్భంగా గంగాభవాని తన కుమారులు సౌరవ్,సనవ్ లతో కలిసి గణనాథుడికి కొబ్బరికాయలు కొట్టి గోత్ర నామంతో ప్రత్యేక పూజలు చేశారు.వేద పండితులు వారికి ఆశీర్వచనాలు పలికి తీర్థప్రసాదాలు అందజేశారు.
Vigneshwara
వీఆర్సీ యూత్ అసోసియేషన్ సభ్యులు ముడ్డంగుల కృష్ణ,గగులోతు నవీన్ నాయక్,యరగాని పృథ్వీ గౌడ్,ముకుంద అనిల్ పటేల్,అనంతుల శ్రీనివాస్ గౌడ్, మల్యాల శేఖర్, నాగిరెడ్డి, ముకరా దుర్గాప్రసాద్, దండు రాజు ధూదిగామ సాత్విక్,జ్యోతి, సంతోష్ తదితరులు విజయలక్ష్మీ, గంగాభవాని, నిఖిల్ చంద్ర, స్థానిక ప్రముఖులను శాలువాలతో సత్కరించి వినాయకుడి చిత్రపటాలను బహుకరించారు.
Vigneshwara
వీఆర్సీ యూత్ అసోసియేషన్ సభ్యులు అందజేసిన విఘ్నేశ్వరుడి లడ్డూ ప్రసాదాన్ని నిఖిల్ చంద్ర భక్తిప్రపత్తులతో స్వీకరించి తలపై పెట్టుకుని తన నివాసంలోకి తీసుకెళ్లారు.ఈ సందర్భంగా వీఆర్సీ యూత్ అసోసియేషన్ సభ్యులు”జై గణేశ జైజై గణేశ” అంటూ నినాదాలు చేశారు.
జైపూర్ మండలం టేకుమట్ల గ్రామంలో మల్టీ వర్కర్ గా విధులు నిర్వహిస్తున్న జల్లంపల్లి గట్టయ్య గణేష్ నవరాత్రి లో భాగంగా తన కుమారుడితో మూడున్నర ఫీట్ల గణపతి విగ్రహం తయారు చేపించి తొమ్మిది రోజులు మట్టి గణపతికి అంగరంగ వైభవంగా పూజలు జరిపించారు.అలాగే గణపతి వద్ద అన్నదాత కార్యక్రమం నిర్వహించారు.అనేక రకాల కెమికల్స్ కలిపి తయారు చేసిన విగ్రహాలు ఏర్పాటు చేయడం వల్ల కాలుష్యం వెదజల్లి పర్యావరణం కలుషితం అవుతుందని అన్నారు.మట్టి గణేష్ విగ్రహాన్ని తయారు చేసుకొని పూజలు చేయడం చాలా సంతోషంగా ఉందని వారు తెలిపారు.
వినాయక నిమజ్జనంలో పాల్గొన్న ఎమ్మెల్యే దొంతి కుటుంబం
నర్సంపేట,నేటిధాత్రి:
గణపతి నవరాత్రుల ఉత్సవాల ముగింపు కార్యక్రమాల సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వినాయక నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొన్నారు.ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హన్మకొండలోని తన నివాసంలో గణనాథున్ని ప్రతిష్ఠించుకొన్న కుటుంబ సభ్యులు భక్తి శ్రద్ధలతో నవరాత్రులు పూజలు నిర్వహించారు.శుక్రవారం నిమజ్జన కార్యక్రమం చేపట్టగా గణనాథుడికి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి దంపతులు వీడ్కోలు పలికారు.కాగా ఎమ్మెల్యే దొంతి కుమార్తె అనన్యరెడ్డి హన్మకొండ పద్మాక్షమ్మగుట్ట వద్ద ఉన్న చెరువులో నిమజ్జనం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు నర్సంపేట నియోజకవర్గం ప్రజలు సుభిక్షంగా ఉండాలని గణనాథుడిని వేడుకున్నట్లు తెలిపారు.
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను విజయవంతం చేయండి
* సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కే రామస్వామి
చేవెళ్ల, నేటిధాత్రి:
ఈనెల 11 నుండి 17 వరకు జరిగే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను విజయవంతం చేయాలని సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కే రామస్వామి పిలుపునిచ్చారు. శుక్రవారం చేవెళ్ల మండల కేంద్రంలో సిపిఐ మండల కార్యదర్శి సత్తిరెడ్డి అధ్యక్షతన సిపిఐ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కే రామస్వామి హాజరై మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటం 1946 నుండి 1951 వరకు కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో 7వ నిజాం మీర్ ఉస్మాన్ ఆలీ ఖాన్ కు వ్యతిరేకంగా జరిగిన సాయిధ రైతాంగం తిరుగుబాటు చేశారని అన్నారు. ఈ పోరాటంలో దాదాపు 4500 మంది తెలంగాణ రైతులు, ప్రజలు ప్రాణాలు కోల్పోయారని ఈ పోరాటం ప్రధానంగా హైదరాబాద్ రాష్ట్రంలోని భూస్వామ్య వ్యవస్థకు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిందని తెలిపారు. నిజాం పాలనను అంతం చేసి హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనం కావడానికి ఈ పోరాటం దారితీసిందని, భూస్వాముల దోపిడీని నిలిపి రైతుల హక్కుల పరిరక్షణకు ఈ పోరాటం ఎంతో స్ఫూర్తినిచ్చిందనిఅన్నారు. ఈ స్ఫూర్తితోనే ఈనెల 11 నుండి 17 వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటవారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 17వ తేదీన హైదరాబాదులోని రావి నారాయణరెడ్డి ఆడిటోరియంలో ముగింపు సభ ఉంటుందని ఈ సభకు పార్టీ శ్రేణులు గ్రామ కార్యదర్శులు ప్రజాసంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ వారోత్సవాలను విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం ప్రభు లింగం, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు వడ్ల సత్యనారాయణ, ఇన్సాబ్ జిల్లా అధ్యక్షుడు ఎండి మక్బుల్, ఎన్ ఎఫ్ ఐ డబ్లు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్ల మంజుల తదితరులు పాల్గొన్నారు.
గల్లీ క గణేష్ ఉత్సవ కమిటీ గణనాథుడి లడ్డు వేలం పాట 210000.రూ
శేరిలింగంపల్లి నేటి ధాత్రి :-
గల్లిక గణేష్ ఉత్సవ కమిటీ నేతాజీ నగర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన వినాయక నవరాత్రి పూజలు.ఇందులో భాగంగా నిన్న రాత్రి జరిగిన లడ్డు వేలంపాటలో గణేశుని లడ్డూ బారి దార పలికింధి. మొదటి లడ్డు గుంటి యాదగిరి సాగర్ 210000 దక్కించుకోగా రెండవ లడ్డు దయాకర్ సాగర్ 108000 కి కైవసం చేసుకున్నారు.
ఈ సందర్భంగా కమిటీ సభ్యులు లడ్డును వారికి అందచేసి అభినందనలు తేలిపారు.అనంతరం వినాయక అనుగ్రహం వారి కుటుంబ సభ్యులకి ఎల్లవేళలా వుండలని ఆ దేవునికి పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు మరియు భక్తులు భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేసినందుకు కమిటీ సభ్యులు ధన్యవాదాలు తేలిపారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపురం మండల కేంద్రం లోని బాలుర జిల్లా పరిషత్ పాఠశాలలో గురువారం రోజున సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి లో బాగంగా ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల లో భాగంగా పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులను పూల మాలలు మరియు శాలువాలతో సత్కరించి ఉపాధ్యాయుల గొప్పతనాన్ని కొనియాడారు. భారత దేశపు రెండవ రాష్ట్రపతి అయిన సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితం మొత్తంలో ఉపాధ్యాయుడిగా చేసిన సేవలే అత్యంత తృప్తినిచ్చాయని తన జీవిత చరిత్రలో రాసుకున్న సందర్భాన్ని ఉపాధ్యాయులు గుర్తు చేసుకున్నారు. ప్రతీ సంవత్సరం సెప్టెంబర్ 5వ తేది ఉపాధ్యాయులకు ప్రత్యేకమైన రోజని ప్రధానోపాధ్యాయులు అనిల్ కుమార్ అన్నారు. విద్యార్థులు ఉపాధ్యాయుల గురించి కవితలు, పాటలు వినిపించి కార్యక్రమాన్ని రక్తి కట్టించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, తిరుపతి రెడ్డి, రాజయ్య, దేవేందర్ రెడ్డి, రమేష్, లచ్చయ్య, అనిల్ కుమార్, సమ్మయ్య,షాజహా, అనిత, కవిత, కిరణ్ కుమార్, కోటేశ్వర్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు విద్యార్థులు పాల్గొన్నారు.
ఎస్ఆర్కె పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినం సందర్భంగా రామకృష్ణాపూర్ పట్టణంలోని ఎస్ఆర్కె పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ప్రధానోపాధ్యాయులు పెద్దపల్లి ఉప్పలయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.పాఠశాలలో 9, 10వ తరగతి విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి మాట్లాడారు… ఉపాధ్యాయ వృత్తి నుంచి భారతదేశానికి రెండవ రాష్ట్రపతిగా ఎదిగిన తనను మేమందరం ఆదర్శంగా తీసుకొని భారత దేశ అభ్యున్నతి కోసం పాటుపడతామని తెలిపారు.
ఉపాధ్యాయులుగా వ్యవహరించిన విద్యార్థులందరికీ బహుమతులు అందించారు. పాఠశాల ఉపాధ్యాయులును అందరినీ శాలువాలతో సత్కరించి, విద్యార్థుల భవిష్యత్తు కోసం హర్నిశలు కృషి చేయాలని వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ కోల శ్రీనివాస్,డోకూరి సోమశేఖర్, అంబాల రాజేందర్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మమతా నగర్ గణనాధుని సన్నిధిలో మహా అన్నదాన కార్యక్రమం
పరకాల నేటిధాత్రి
పట్టణంలోని పదో వార్డు మమత నగర్ కాలనీ వాసుల ఆధ్వర్యంలో గణేష్ విగ్రహ దాత తాళ్లపల్లి వెంకటేశ్వర్లు కవిత ల సహకారంతో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడుతున్న నేపథ్యంలో మమతా నగర్ కాలనీవాసులు ముప్పిడి రంజిత్ మమత,దార్న రవీందర్ సత్యవతిలచే స్వామివారి సన్నిధానంలో మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కాలనీవాసులు భక్తులు గణేష్ మహారాజ్ కి జై అంటూ స్వామివారిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాల నిర్వాహణ అనంతరం స్వామివారి మహా అన్నప్రసాద వితరణను స్వీకరించి స్వామి వారి కృపకు ప్రాప్తులైనట్లు మహా అన్నప్రసాద వితరణ దాతలు ముప్పిడి రంజిత్ దార్న రవీందర్తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలకు పరకాల పట్టణంలోనే మమతా నగర్ గణనాథుడు పెట్టింది పేరుగా నవరాత్రి తొమ్మిది రోజులు మమతా నగర్ కాలనీ వాసులంతా ఒక పండగ వాతావరణంను ఏర్పాటు చేసుకుంటూ గణపతి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని,ఈ నేపథ్యంలో శనివారం రోజున నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమంకు విచ్చేసి కార్యక్రమమును విజయవంతం చేసిన కాలనీవాసులకు భక్తులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
నర్సంపేట మండలం లక్నపల్లిలోని బాలాజీ టెక్నో స్కూల్ లో గిడుగు వేంకట రామమూర్తి పంతులు జన్మదినాన్ని పురస్కరించుకొని మాతృభాష దినోత్సవం జరుపుకున్నారు.ఈ సందర్భంగా విద్యార్థులకు తెలుగు భాష మాధుర్యాన్ని తెలిపేందుకు వీలుగా పద్య రచన,కావ్యరచన పోటీలను నిర్వహించారు.పాఠశాల ప్రిన్సిపాల్ పి .రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఆంధ్రదేశంలో వ్యవహారిక భాషో ద్యమానికి మూలపురుషుడైన గిడుగు వెంకట రామమూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నామని పేర్కొన్నారు, బహుభాషావేత్త, చరిత్రకారుడు ,సంఘసంస్కర్త అయిన గిడుగు వెంకట రామమూర్తి పంతులు 1863 ఆగస్టు 29 శ్రీకాకుళం జిల్లాలో పర్వతాలపేట గ్రామంలో జన్మించారన్నారు.తెలుగు వాడుక భాష ఉద్యమ పితామహుడు గ్రాంథిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకువచ్చి నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్ని,వీలును తెలియజెప్పిన మహనీయుడని ,అచ్చ తెలుగు చిచ్చర పిడుగు గిడుగు అని, పండితులకే పరిమితమైన సాహిత్య సృష్టి సృజనాత్మక శక్తి ఉన్న ప్రతి ఒక్కరికి వీలైందని తెలిపారు.ఈ కార్యక్రమంలో రియాజుద్దీన్,రమేష్ , రవీందర్ ,గణేష్, భాగ్యలక్ష్మి, నరేష్ ,విశాల, రంజిత్, విజయరాణి, రవీందర్ రెడ్డి, భవాని చంద్ ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.
ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం…
గొప్ప ఫీల్డ్ ఆటగాడు, దిగ్గజ మేజర్ ధ్యాన్ చంద్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఎన్.సి. సి థర్డ్ ఆఫీసర్ ఎం.డి రియాజుద్దీన్ ఆధ్వర్యంలో బాలాజీ టెక్నో స్కూల్ లో జాతీయ క్రీడా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ పి. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఆగస్టు 29 ని భారతదేశం జాతీయ క్రీడా దినోత్సవం గా జరుపుకుంటామని పేర్కొన్నారు.ఈ సంవత్సరం క్రీడా వేడుకలకు ఫిట్ ఇండియా మిషన్ నాయకత్వం వహిస్తుందని, ప్రతి సంవత్సరం “ఖేల్ కే మైదాన్ మై” అనే థీమ్ తో దేశవ్యాప్తంగా క్రీడలను నిర్వహిస్తారని తెలిపారు.మేజర్ ధ్యాన్ చంద్ 1929 నుండి 1936 వరకు ఒలంపిక్స్ లో భారతదేశ ఆధిపత్యం చెలాయించేలా కృషి చేశాడని వీరి నాయకత్వంలో భారత్ 1948లో హాకీ క్రీడలో స్వర్ణం సాధించిందని తెలిపారు.అనంతరం విద్యార్థులకు, ఎన్.సి.సి క్యాడేట్లకు క్రీడా పోటీలను నిర్వహించారు పోటీలలో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు భవాని చంద్ ,రవీందర్ రెడ్డి, పార్వతి ,వినోద్ ,గోపి, సతీష్, అరుంధతి, రాజీవ్ తదితరులు పాల్గొన్నారు.
అక్షర ద స్కూల్,బిట్స్ లో జాతీయ క్రీడా దినోత్సవం..
నర్సంపేట పట్టణంలోని బాలాజీ విద్యా సంస్థలలో ఒక్కటైనా అక్షర ద స్కూల్,బిట్స్ స్కూల్ లో లో జాతీయ క్రీడా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు.ముఖ్య అతిదులుగా బాలాజీ విద్యాసంస్థలు చైర్మన్ డాక్టర్ ఆండ్ర రాజేంద్రప్రసాద్ రెడ్డి హాజరైయ్యారు.హాకీ క్రీడ దిగ్గజం ధ్యాన్ చంద్ జయంతి సందర్బంగా క్రీడా దినోత్సవం జరుపుకుంటున్నామని పేర్కొన్నారు.ఒలంపిక్ క్రీడలలో మూడు బంగారు పథకాలు తెచ్చిన అందించిన గొప్ప క్రీడాకారుడు ధ్యాన్ చంద్ అని తెలిపారు.చదువులతో పాటు అన్ని రకాల క్రీడల్లో రాణించాలని విద్యార్థులకు సూచించారు.కోశాదికారి డాక్టర్ వనజ, ఈ కార్యక్రమంలో బిట్స్ స్కూల్ ప్రిన్సిపల్ జ్యోతి గౌడ్,అక్షర ద స్కూల్ ప్రిన్సిపల్ భవాణి,ఉపాద్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.
మున్సిపల్ పరిధిలోని ఒకటో వార్డ్ సీఎస్ఐ కంపౌండ్ ఆవరణలోని బెతెల్ ఆశ్రమంలో మదర్ థెరిస్సా జయంతి వేడుకలు మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు,మాజీ కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.అనంతరం ఆశ్రమంలోని మథర్ థెరిసా పటానికి పూలమాలలువేసి నివాళులు అర్పించి ఆశ్రమంలోని పిల్లలకు చాక్లెట్స్ పంపిణీ చేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మదర్ థెరిస్సా సమాజానికి చేసిన సేవలను కొనియాడారు,తన జీవతాన్ని ప్రజల కోసం అంకితం చేసిన మహనీయురాలని,మానవ సేవే మాధవ సేవ అని బోదించి,సమాజంలోని వికలాంగులను వ్యాధిగ్రస్తులను అక్కున చేర్చుకుని,కన్నతల్లి కన్నా కంటికి రెప్పలా కాపాడినారని, అందుకే మదర్ థెరిస అమ్మలా పిలవబడ్డారని,ప్రార్థించే పెదవుల కంటే సాయoచేసే చేతులే మిన్న అని తన జీవితం ద్వారా నిరూపించిన మానవతా మూర్తి,భారతరత్న మదర్ థెరిసా అని కొనియాడారు.
వినాయక చవితి, మిలాద్ ఉత్సవాల కోసం శాంతి కమిటీ సమావేశం
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సబ్ డివిజన్ పరిధిలోని హద్మూర్ స్టేషన్ లో నేడు శాంతి కమిటీ సమావేశం ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ సుజీత్ తెలిపారు. వినాయక చవితి ఉత్సవాలు, మిలాద్ ఉత్సవాల నిర్వాహకులు ఈ సమావేశానికి హాజరుకావాలని శనివారం ఆయన కోరారు. ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్న వినాయక చవితి, సెప్టెంబర్ 5న జరిగే మిలాద్ ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. అందరూ కలిసిమెలిసి శాంతియుతంగా వినాయక చవితి మిలాద్ ఉన్ నబీ పండుగలను జరుపుకోవాలని అన్నారు,
గణపతి నవరాత్రుల ఉత్సవ కమిటీ అధ్యక్షునిగా క్యాతరాజు రమేష్ మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
మండల కేంద్రంలో శుక్రవారం రోజున శ్రీ సాంబమూర్తి సామూహిక దేవాలయంలో ఈనెల 27న గణపతి నవరాత్రి ఉత్సవములను నిర్వహించేందుకు నిర్వాహక కమిటీని ఎన్నుకోవడం జరిగింది. శ్రీ సాంబమూర్తి దేవాలయ ప్రధాన అర్చకులు భైరవభట్ల వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో. గ్రామస్తుల సమక్షంలో గణపతి నవరాత్రుల ఉత్సవ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉత్సవ కమిటీ అధ్యక్షనిగా క్యాతరాజు రమేష్, ఎన్నికయ్యారు. అధ్యక్షులు క్యాతరాజు రమేష్ మాట్లాడుతూ. గణపతి నవరాత్రి ఉత్సవాలను గ్రామస్తుల సహకారంతో భక్తి శ్రద్ధలతో ఉత్సవాలను తొమ్మిది రోజులపాటు నిర్వహించేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తానని అందుకు కమిటీ సభ్యులతో పాటు గ్రామస్తుల సహకారంతో గణపతి నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని క్యాతరాజు రమేష్ అన్నారు. ఉపాధ్యక్షులుగాదేవునూరి కుమార్, ప్రధాన కార్యదర్శిగా ఎల్దండి ప్రకాష్, కోశాధికారిగా బత్తిని రాజు, సహాయ కార్యదర్శిగాఎర్రబాటి మహేందర్, అన్నారపు కుమార్, కార్యవర్గ సభ్యులుగా వీణవంక నవీన్,క్యాతారాజు రజనీకాంత్, సూర్నేని మణికర్, గుడిమల్ల రమేష్, తంగళ్ళపల్లి వీరబ్రహ్మం, వీణవంక ప్రసాద్, కటుకూరి శ్రీధర్, దేవునూరి అశోక్, చాట్ల రాజు, పుట్ట అజయ్, హరీష్ లను గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నికైనారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.