సాయికుమార్ మరణం దుగ్గొండి యువతకు తీరనిలోటు…

సాయికుమార్ మరణం దుగ్గొండి యువతకు తీరనిలోటు

దశదినకర్మ సందర్భంగా రక్తదాన శిబిరం

మాజీ ఎంపీటీసీ సాయికుమార్ యాదిసభలో పలువురు నివాళులు

నర్సంపేట,నేటిధాత్రి:

 

దుగ్గొండి మండల కేంద్రం మాజీ ఎంపిటిసి, జిల్లెల్ల సాయికుమార్ మరణం దుగ్గొండి మండల యువతకు స్థానిక ప్రజలకు తీరనిలోటని నర్సంపేట ఆర్టీసీ డిపో బీసీ సంఘం అధ్యక్షుడు కందికొండ మోహన్,పలువురు నేతలు అన్నారు.దుగ్గొండి మండలంలోని దేశాయిపల్లె గ్రామానికి చెందిన దుగ్గొండి మండల కేంద్రం మాజీ ఎంపీటీసీ జిల్లెల్ల సాయికుమార్ ఈ నెల 4 గుండెపోటుతో మరణించారు.కాగా సోమవారం దశదిన కర్మ కాక్యక్రమం సందర్బంగా
కుమారుడు జిల్లెల ఉమేష్ రక్తదాన శిబిరం నిర్వహించారు.ఈ నేపథ్యంలో సుమారు 30 మంది యువకులు రక్తదానం చేశారు.అలాగే సాయికుమార్ సంస్మరణ యాదిసభ ఏర్పాటు చేశారు.మాజీ మావోయిస్టు నేతలు భారతక్క,సిద్ది రాజు,మురళీ తో ప్రజాసంఘాలు,కుల సంఘాలతో పాటు వివిధ పార్టీల నేతలు నాయకులు పాల్గొన్నారు.సాయి కుమార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం బార్య రమ, కుమారుడు ఉమేష్, కుతురు లక్ష్మిప్రసన్నలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఆయన చేసిన సేవలు జ్ఞాపకాలు గుర్తుకు చేశారు.ఈ కార్యక్రమాలలో జిల్లెల్ల శ్రీనివాస్,కందికొండ నవిన్, కందికొండ రాజు,మద్దూరి ప్రశాంత్, బూస రమేష్,
బూస శోభన్, గాండ్ల సందిప్, వల్లె విజెందర్, బూస ప్రశాంత్, తుత్తూరు లవకుమార్,నల్లబెల్లి చిరంజివి, పెళ్లి రాజశేకర్, జిల్లెల్ల మోహన్,మాజీ ప్రజా ప్రతినిధులు,వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

ఎర్రోళ్ల శ్రీనివాస్ ను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది…

ఎర్రోళ్ల శ్రీనివాస్ ను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది

నర్సంపేట,నేటిధాత్రి:

 

రాష్ట్ర మాజీ ఎస్సి ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తండ్రి ఎర్రోళ్ల విజ్జయ అనారోగ్యంతో గురువారం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపూర్ గ్రామంలో మృతి చెందాడు. ఈ నేపథ్యంలో రాష్ట్ర సివిల్ సప్లై మాజీ చైర్మన్, బిఆర్ఎస్ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విజ్జయ మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.రాష్ట్ర మాజీ ఎస్సి ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తో పాటు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం

నర్సంపేట, నేటిధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

నర్సంపేట పట్టణం మున్సిపాలిటీ 10 వార్డులోని సాంబారి సత్యం బుధవారం మృతిచెందగా స్థానిక తాజా మాజీ కౌన్సిలర్ నాగిశెట్టి పద్మ ప్రసాద్ పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరిమర్శించి , ప్రగాఢ సానుభూతి తెలిపారు.అనంతరం కుటుంబానికి ఆర్థికసహాయంగా రూ.5 వేలు రూపాయలు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎదరబోయిన రామస్వామి, మామిడాల బిక్షపతి, వలుస సత్యం, డాక్టర్ హరిబాబు, మూస్కు రాజేందర్, పసునూరి రమేష్, నాగిశెట్టి ప్రవీణ్, పస్తం కృష్ణ, ఆరేపల్లి కిరణ్ ,  కంప సమ్మయ్య, మల్యాల శ్రీనివాస్, అడెపు రవిందర్,చిటిమల్ల బ్రహ్మచారి, గోరంట్ల మహేందర్, మేడి నరేష్, గ్యార శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

డాక్టర్ అల్హాజ్ సయ్యద్ గౌసుద్దీన్ మృతి…

డాక్టర్ అల్హాజ్ సయ్యద్ గౌసుద్దీన్ మృతి

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్,డాక్టర్ అల్హాజ్ సయ్యద్ గౌసుద్దీన్ 75 సంవత్సరాల వయసులో మరణించారు. మౌలానా హఫీజ్ సాకిబ్ సాహిబ్ నాయకత్వంలో జుహర్ ప్రార్థన తర్వాత బాగ్దాదీ మసీదులో అంత్యక్రియల ప్రార్థన జరిగింది, దీనిలో పెద్ద సంఖ్యలో బంధువులు మరియు స్నేహితులు పాల్గొన్నారు. మృతుడు పదిహేను సంవత్సరాలుగా పరిహారం లేకుండా హజ్ యాత్రికుల కోసం దరఖాస్తులు రాసి రెండుసార్లు పెన్షన్ పొందాడు.

అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు.
డాక్టర్ అల్హాజ్ సయ్యద్ గౌసుద్దీన్ ను వారిలో అతని భార్య, 3 కుమారులు మరియు 4 కుమార్తెలు ఉన్నారు.

సీనియర్‌ జర్నలిస్ట్‌ టీజేఎస్‌ జార్జ్‌ కన్నుమూత…

సీనియర్‌ జర్నలిస్ట్‌ టీజేఎస్‌ జార్జ్‌ కన్నుమూత

 

సీనియర్‌ జర్నలిస్ట్‌ టీజేఎస్‌ జార్జ్‌ బెంగళూరులో శుక్రవారం సాయంత్రం గుండెపోటుతో కన్నుమూశారు. వయోభారం, ఆరోగ్య సమస్యలతో…

సీనియర్‌ జర్నలిస్ట్‌ టీజేఎస్‌ జార్జ్‌ బెంగళూరులో శుక్రవారం సాయంత్రం గుండెపోటుతో కన్నుమూశారు. వయోభారం, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న జార్జ్‌(97) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. బెంగళూరులో ఆదివారం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహిస్తామని ఆయన కుమార్తె శిబా తెలిపారు. 1938, మే 7న కేరళలో జన్మించిన జార్జ్‌.. 1950లో ప్రీ ప్రెస్‌ జర్నల్‌ ద్వారా బొంబాయిలో పాత్రికేయ వృత్తిలో ప్రవేశించారు. సుదీర్ఘకాలం ఇండియన్‌ ఎక్స్‌ప్రె్‌సలో కొనసాగారు. సుమారు రెండున్నర దశాబ్దాలపాటు ‘పాయింట్‌ ఆఫ్‌ వ్యూ’ పేరిట కాలమ్స్‌ రాశారు. 2007లో కన్నడ రాజ్యోత్సవ పురస్కారం, 2011లో పద్మభూషణ్‌ పురస్కారం అందుకున్నారు.

మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన పెద్ది సుదర్శన్ రెడ్డి.

మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన పెద్ది సుదర్శన్ రెడ్డి.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

మండల కేంద్రానికి చెందిన మాజీ కోఆప్షన్ సభ్యుడు ఎండి నన్నేసాహెబ్ తల్లి అనారోగ్యంతో మృతిచెందగా. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతురాలి స్వగృహానికి చేరుకొని ఆమె పార్థివ దేహం పై పూలమావిసి నివాళులర్పించారు అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగడ సానుభూతిని తెలిపారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీనివాస్ గౌడ్, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ఊడుగుల ప్రవీణ్ గౌడ్ నాయకులు నాన బోయిన రాజారాం, సట్ల శ్రీనివాస్ గౌడ్, ఖ్యాతం శ్రీనివాస్ గుమ్మడి వేణు పాండవుల రాంబాబు ముదిరాజ్ తదితరులు ఉన్నారు.,

మద్యం మత్తులో నీటిలో మునిగి వ్యక్తి మృతి..

మద్యం మత్తులో నీటిలో మునిగి వ్యక్తి మృతి..

ఓదెల (పెద్దపెల్లి జిల్లా)నేటిధాత్రి:

 

 

ఓదెల మండలం గుంపుల మానేరు వాగులో మద్యం మత్తులో మునిగి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది విషయం తెలుసుకొని సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టిన ఎస్సై దీకొండ రమేష్ ఎస్సై చెప్పిన వివరాల ప్రకారం కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం రాచపల్లి గ్రామానికి చెందిన ఆరెళ్ళి రవీందర్ (51) హమాలీ వృత్తి చేస్తున్న రవీందర్ తరచుగా మద్యం సేవించి కుటుంబ సభ్యులతో గొడవ పడేవాడని పోలీసులు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం కూడా మద్యం సేవించి ఇంటికి రావడంతో భార్య, కుమారుడు మందలించగా గుంపులలో గల రామభద్ర ఆలయ సమీపానికి వెళ్లాడు. అనంతరం తన కుమారుడికి ఫోన్ చేసి అక్కడ ఉన్నానని తెలిపాడు. కుమారుడు దిలీప్, బంధువు రాజు అక్కడికి చేరుకోగా ఒడ్డున బట్టలు ఉండగా, రవీందర్ నీటిలో కనిపించాడు. బయటకు రావాలని కుమారుడు పిలవగా ప్రమాదవశాత్తు లోతైన నీటిలో కొట్టుకుపోయాడు. వెంటనే కుమారుడు బయటకు తీసుకురాగా అప్పటికే స్పృహ తప్పి ఉండడంతో 108 అంబులెన్స్ ద్వారా జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు మృతి చెందాడని ధృవీకరించారు. ఈ ఘటనపై దిలీప్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పొత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ తెలిపారు.

గుండెపోటుతో పంచాయతీ కార్యదర్శి మృతి…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-19T143955.810.wav?_=1

గుండెపోటుతో పంచాయతీ కార్యదర్శి మృతి…

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గం న్యాల్కల్ మండలంలోని మీర్జాపూర్ (బి) గ్రామ పంచాయతీ కార్యదర్శి రాంప్రసాద్ గుండెపోటుతో మృతి చెందారు. స్వగ్రామం నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాంతానికి చెందిన ఆయన, నిర్వర్తిస్తున్నారు. ఈనెల 162 తేదీన ఆరోగ్య సమస్యలు ఉన్నందున సెలవు ఇవ్వాలని ఎం.పీ.డీ.వోను కోరగా, ఆ సెలవు తిరస్కరించారని మృతుని భార్య ఆరోపించారు. అంతేకాక, గత ఎం.పీ.వో.తో పాటు ప్రస్తుత ఎం.పీ.వో కూడా తన భర్తను మానసికంగా వేధించారని ఆమె తెలిపారు. వీరిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాంప్రసాద్కు ఒక చిన్న పాప ఉంది.

కంప్యూటర్ ఆపరేటర్ మృతికి సంతాపం తెలిపిన ఎంపీడీఓ ఆపీస్ సిబ్బంది…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-16T121029.177.wav?_=2

 

కంప్యూటర్ ఆపరేటర్ మృతికి సంతాపం తెలిపిన ఎంపీడీఓ ఆపీస్ సిబ్బంది

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

కీర్తిశేషులు ఏలేటి సోమిరెడ్డి తుంగతుర్తి మండలం కంప్యూటర్ ఆపరేటర్ మరణించటం తో అయన చిత్రపటానికి సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం ఎంపీడీవో మంజుల, కార్యాలయంలో ఎంపీడీవో జూనియర్ అసి స్టెంట్ శాస్త్రము, పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్ సిబ్బంది పూలమాల వేసి నివాళుఅర్పించి మౌనంపాటించి సంతాపం తెలిప్యారు.

పశువుల మేతకు వెళ్ళి వ్యక్తి మృతి..

పశువుల మేతకు వెళ్ళి వ్యక్తి మృతి..
• రెస్క్యూ టీం గాలింపులో శవం లభ్యం.

నిజాంపేట: నేటి ధాత్రి

పశువుల మేతకు వెళ్లి ప్రమాదవశత్తు చెరువులో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన నిజాంపేట మండలంలో జరిగింది. నార్లపూర్ గ్రామానికి చెందిన బదన కంటి మహేష్ (25) అను వ్యక్తి శుక్రవారం మధ్యాహ్నం సుమారు 3 గంటల నుండి కనిపించక పోవడంతో పోలీసులకు సమాచారం అందించినట్లు గ్రామస్తులు తెలిపారు.

Man dies after going to graze cattle

సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ రాజేష్ గ్రామంలో గల హైదర్ చెరువులో రిస్క్యూమ్స్ తో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ గాలింపులో శనివారం సుమారు 12 గంటలకు మహేష్ శవం లభ్యమయింది. పశువుల మేతకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

బాధిత కుటుంబానికి కాంటారెడ్డి ఆర్థిక సహాయం…

బాధిత కుటుంబానికి కాంటారెడ్డి ఆర్థిక సహాయం

నిజాంపేట, నేటి ధాత్రి

 

 

మండలం కేంద్రంలోని షౌకత్పల్లి కి చెందిన సుజాత మృతి చెందింది. విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జ్ కాంటారెడ్డి తిరుపతిరెడ్డి స్థానిక టిఆర్ఎస్ నేతల ద్వారా బాధిత కుటుంబానికి 5000 ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ మండల యూత్ ప్రెసిడెంట్ మావురం రాజు,
మాజీ సర్పంచ్ అరుణ్ కుమార్, పత్య నాయక్, రాజు నాయక్ ,రమేష్ , రవీందర్ రెడ్డి, సుర మల్లేశం,రాములు,రాంరెడ్డి, ఐలయ్య, బాల్ రెడ్డి, రాజు నాయక్, నాగిరెడ్డి, దేవుల మహారాజ్, అంతీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

మాజీ జెడ్పిటిసిని పరామర్శించిన మునిగాలా సురేందర్ రావు…

మాజీ జెడ్పిటిసిని పరామర్శించిన మునిగాలా సురేందర్ రావు

పరకాల నేటిధాత్రి

 

 

 

కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతు మరణించిన పరకాల మాజీ జడ్పిటిసి సిలివేరు మొగిలి పార్థివదేహానికి తన స్వగ్రామం మండలంలోని వెంకటపూర్ గ్రామంలో బిఆర్ఎస్ జిల్లా నాయకులు మునిగాల సురేందర్ రావు నివాళులు అర్పించారు.మొగిలి మరణ వార్త తెలిసి పరకాల ప్రాంత ప్రజలు తీవ్రంగా విచారాన్ని వ్యక్తం చేశారు.ప్రజా సమస్యలపై ఎల్లప్పుడూ ముందుండే నాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు లభించింది.రాజకీయ నాయకులు,స్థానిక ప్రజలు ఆయన మరణంపై సంతాపం తెలియజేస్తూ,వారి ఆత్మకు శాంతి కలగాలని,కుటుంబ సభ్యులకు ధైర్యం కలగాలని ప్రార్థించారు.

ఖోర్ ముహమ్మద్ అహ్మద్ ఖాన్ అంత్యక్రియలో భారీ సంఖ్యలో పాల్గొన్న ప్రజలు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-10T123238.256.wav?_=3

 

 

ఖోర్ ముహమ్మద్ అహ్మద్ ఖాన్ అంత్యక్రియలో భారీ సంఖ్యలో పాల్గొన్న ప్రజలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

 

జహీరాబాద్,ముహమ్మద్ అయూబ్ అహ్మద్ ఖాన్, సీనియర్ జర్నలిస్ట్ మరియు V6 న్యూస్ ఛానల్ రిపోర్టర్, ఖోర్ ముహమ్మద్ అహ్మద్ ఖాన్ సోదరుడు (30 సంవత్సరాలు) నిన్న రాత్రి హైదరాబాద్‌లోని నమాస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచి ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు. ఆయన అంత్యక్రియల ప్రార్థనాయకు జహీరాబాద్ లోని ఈద్గాలోని బాగ్దాదీ మసీదులో జుహర్ ప్రార్థనల తర్వాత, మసీదు జహ్రా ఖతీబ్ మరియు ఇమామ్ మౌలానా మసూమ్ ఆలం ఖాస్మీ చేత చేయబడ్డాయి మరియు అంజుమాన్ స్మశానవాటికలో ఖననం జరిగింది. సమాచారం అందుకున్న రాజకీయ, సామాజిక, మతపరమైన నాయకులు మరియు జర్నలిస్టు సంఘం జహీరాబాద్‌లోని శాంతి ఒమర్‌లోని ఐడిఎస్ఎంటి కాలనీలో ఉన్న ఆయన ఇంటికి వెళ్లి, ఓపికగా ఉండాలని సలహా ఇవ్వడం ద్వారా మృతుల కుటుంబానికి తమ సంతాపాన్ని తెలిపారు. అంత్యక్రియల ఊరేగింపులో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

పార్టీవ దేహానికి నివాళులర్పించిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం..

పార్టీవ దేహానికి నివాళులర్పించిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

V6 రిపోర్టర్ అయ్యుబ్ ఖాన్ సోదరుడు అహ్మద్ ఖాన్ అనారోగ్యంతో మంగళవారం మరణించిన విషయం తెలిసి ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం పట్టణంలోని ఈద్గా వద్దకు వెళ్లి వారి మృతదేహాన్నీ సందరర్శించి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియజేసారు,మాజీ కౌన్సిలర్ అబ్దుల్లా,ఆతార్ అహ్మద్ ఏఐఎంఐఎం నాయకులు, జర్నలిస్ట్ లు మహబూబ్, కరీం,తదితరులు ఉన్నారు,

సిఐఎస్ఎఫ్ జవాన్ మృతదేహానికి నివాళులర్పించిన బిజెపి మండల అధ్యక్షుడు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-09T114441.637.wav?_=4

 

సిఐఎస్ఎఫ్ జవాన్ మృతదేహానికి నివాళులర్పించిన బిజెపి మండల అధ్యక్షుడు.

చిట్యాల, నేటి ధాత్రి :

 

 

జయ శంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని రాంనగర్ కాలనీకి చెందిన సిఐఎస్ఎఫ్ బీడీఎల్ జవాన్ ఆరెపల్లి రమేష్ అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన బిజెపి చిట్యాల మండలాధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్ అతని వెంట
రాయని శ్రీనివాస్ గుండ మణికుమార్ తదితరులు ఉన్నారు.

వినాయక నిమజ్జన విధుల్లో అపశృతి.. ఏం జరిగిందంటే..

వినాయక నిమజ్జన విధుల్లో అపశృతి.. ఏం జరిగిందంటే..

 

 

 

వినాయక నిమజ్జన విధుల్లో అపశృతి చోటుచేసుకుంది. టస్కర్ వాహనం కిందపడి జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలు మృతిచెందారు. గత 15 ఏళ్లుగా జీహెచ్ఎంసీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా గుడిమల్కాపూర్‌కు చెందిన రేణుక పని చేస్తున్నారు.

వినాయక నిమజ్జన విధుల్లో (Ganesh immersion Duties) అపశృతి చోటుచేసుకుంది. టస్కర్ వాహనం కిందపడి జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలు మృతిచెందారు. గత 15 ఏళ్లుగా జీహెచ్ఎంసీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పని చేస్తున్నారు గుడిమల్కాపూర్‌కు చెందిన రేణుక. ఇవాళ(ఆదివారం) ఉదయం బషీర్ బాగ్ నుంచి లిబర్టీ వెళ్లే మార్గంలో విధులు నిర్వహిస్తున్నారు రేణుక.

ఈ క్రమంలో రోడ్డును దాటేందుకు యత్నించారు మృతురాలు. అదే సమయంలో రేణుకను బలంగా ఢీ కొట్టింది బషీర్ బాగ్ నుంచి వస్తున్న వినాయకుడు ఉన్న టస్కర్ వాహనం. దీంతో ఆమె తలకు బలమైన గాయం కావడంతో హుటాహుటిన ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే రేణుక మృతి చెందినట్లు తెలిపారు వైద్యులు.

టస్కర్ వాహనం డ్రైవర్ గజానంద్‌ను సైఫాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ గజానంద్‌‌పై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. రేణుక మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. రేణుక మృతి పట్ల జీహెచ్ఎంసీ అధికారులు, కార్మికులు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలని కార్మికులు కోరారు.

విజయ్ శంకర్ ఝా మృతి ప్రజా ఉద్యమాలకు తీరనిలోటు…

విజయ్ శంకర్ ఝా మృతి ప్రజా ఉద్యమాలకు తీరనిలోటు

ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

యంసిపిఐ(యు) మాజీ పోలిట్ బ్యూరో సభ్యుడు, పార్టీ కేంద్ర కమిటీ శాశ్వత ఆహ్వానితులు కామ్రేడ్ విజయ్ శంకర్ ఝా మృతి ప్రజా ఉద్యమాలకు,ఎంసిపిఐ(యు) పార్టీకి తీరని లోటని పార్టీ జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ అన్నారు.నర్సంపేట ఓంకార్ భవన్ లోఎంసిపిఐ(యు) ఆధ్వర్యంలో రాజస్థాన్ కోటా తల్వాండిలో అమరత్వం పొందిన పార్టీ మాజీ పోలిట్ బ్యూరో సభ్యులు విజయ్ శంకర్ ఝా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు.అనంతరం పార్టీ నర్సంపేట డివిజన్ కార్యదర్శి మహమ్మద్ రాజాసాహెబ్ అధ్యక్షతన జరిగిన సంతాప కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పెద్దారపు రమేష్ మాట్లాడుతూ అమరజీవి విజయ్ శంకర్ ఝ కార్మిక ఉద్యమాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తూనే రాజస్థాన్ రాష్ట్ర పార్టీ నిర్మాణంలో కామ్రేడ్ మోహన్ పునామియాతో కలిసి కీలకమైన బాధ్యతలు నిర్వహించిన గొప్ప మార్క్సిస్ట్ నాయకుడని ఉన్నారు. కామ్రేడ్ ఓంకార్ చూపిన బాటలో బూర్జువా భూస్వామ్య పెట్టుబడిదారీ శక్తులకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు ఐక్యత కోసం నిరంతరం పరితపించిన గొప్ప వ్యక్తి అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు గోనె కుమారస్వామి, ఐక్య ప్రజానాట్యమండలి, మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శులు కన్నం వెంకన్న వంగల రాగసుద, పార్టీ రాష్ట్ర నాయకులు బాబురావు,నాగెల్లి కొమురయ్య, కనకం సంధ్య, జిల్లా నాయకులు మాలోత్ సాగర్,సుంచు జగదీశ్వర్, ముక్కెర రామస్వామి,కొత్తకొండ రాజమౌళి, కేశెట్టి సదానందం,ఐతమ్ నాగేష్, మాలోత్ మల్లికార్జున్, ప్రభాకర్,ఓదేలు దాసు కుమారస్వామి,నరసయ్యలతోపాటు తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తీరుకోళ్లూరి రామయ్య మృతి…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-04T143411.649.wav?_=5

 

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తీరుకోళ్లూరి రామయ్య మృతి

నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు

గుండాల(భద్రాద్రికొత్త

గూడెం జిల్లా),నేటిధాత్రి:

 

మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తిరుకొళ్ళూరి రామయ్య అనారోగ్య కారణంతో మరణించిన విషయం తెలుసుకుని వారి మృత దేహానికి కాంగ్రెస్ పార్టీ జెండాను కప్పి ఘన నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చిన గుండాల మండల పిఎస్ఆర్,పీవీఆర్ యువసేన కాంగ్రెస్ పార్టీ కో ఆర్డినేటర్ ఎస్కె ఖదీర్ ఈ సందర్బంగా ఖదీర్ మాట్లాడుతు రామయ్య ని అందరూ తమ ఇంటి పేరుతో కాకుండా పట్వారి రామయ్య అని సంభోదించే వారు ఈ ప్రాంతానికి వారు ఎంత సేవ చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని కరుడు గట్టిన కాంగ్రెస్ వాదిని కోల్పోవడం చాలా బాధాకరం అని వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని వారి మరణం పార్టీకి గాని ప్రజలకు గాని తీరని లోటుగా భావించారు.
ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పొంబోయిన ముత్తయ్య , మండల ఏఏంసి డైరెక్టర్ ఊకే బుచ్చయ్య , సీనియర్ నాయకులు మోకాళ్ళ బుచ్చయ్య,ఎస్కె అబ్దుల్ నభి, పాయం గణేష్ , నునావత్ రవి,యువజన నాయకులు ఈసం భద్రయ్య,పల్లపు రాజేష్,బొంగు చంద్రశేఖర్, యూత్ కాంగ్రెస్ మండల ఉప అధ్యక్షులు బొబ్బిలి పవన్ కళ్యాణ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

కాట్రియాల గ్రామంలో శ్రావణ్ కుమార్ మృతి..

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-02T122515.833-1.wav?_=6

కాట్రియాల గ్రామంలో శ్రావణ్ కుమార్ మృతి..

యూత్ కాంగ్రెస్ నేత రమేష్ చారి పరామర్శ..

రామాయంపేట సెప్టెంబర్ 2 నేటి ధాత్రి (మెదక్)

కాట్రియాల గ్రామానికి చెందిన కట్ట శ్రావణ్ కుమార్ (25) అనారోగ్యంతో నాలుగు నెలలుగా హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున 1 గంట సమయంలో మృతి చెందాడు. గతంలోనే తండ్రి మరణించడంతో తల్లి నర్సవ్వ, తమ్ముడు శివతో కలిసి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబం తీవ్ర కష్టాలు ఎదుర్కొంటోంది.
శ్రావణ్ అనారోగ్యంతో ఆసుపత్రుల్లో ఉన్న నాలుగు నెలల కాలంలో తల్లి అప్పులు చేసి చికిత్స చేయించినా ఫలితం లేకపోయింది. కుటుంబం పరిస్థితి మరింత దయనీయంగా మారింది.
ఈ విషయం తెలుసుకున్న మెదక్ జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కమ్మరి రమేష్ చారి గ్రామానికి వెళ్లి మృతుని కుటుంబాన్ని పరామర్శించారు. బాధిత కుటుంబానికి సొంతంగా 50 కిలోల బియ్యం అందజేసి, వారి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కట్ట చంద్రం, కిష్టయ్య, గ్రామ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గొల్ల నరేష్, నవీన్, రాజు, విజయ్, నరేష్, నిఖిల్, కమల్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

గణపురం మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే జీఎస్సార్

గణపురం మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే జీఎస్సార్

పలు మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే
అధైర్యపడొద్దు అండగా ఉంటానన్న ఎమ్మెల్యే

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలంలోని లక్ష్మారెడ్డిపల్లి, బుద్దారం గ్రామాలల్లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పర్యటించారు. ముందుగా లక్ష్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన మొగిలి కోమల కొంతకాలంగా అనారోగ్యం బారిన పడి చికిత్స పొందుతూ మృతి చెందింది. కాగా, విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కోమల అంతిమ యాత్ర లో పాల్గొని పార్ధీవ దేహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం బుద్దారం గ్రామంలో పెరుమాండ్ల మొగిలి, బండి శాంతమ్మ ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందగా, వారి కుటుంబ సభ్యులను కూడా ఎమ్మెల్యే వారి వారి ఇళ్లకు వెళ్లి పరామర్శించారు. ఎల్లవేళలా అండగా ఉంటానని, దైర్యంగా ఉండాలని బాధిత కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే సూచించారు. ఈ పరామర్శ కార్యక్రమాలల్లో ఎమ్మెల్యే వెంట పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఉన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version