నెక్కొండ బస్టాండ్ అభివృద్ధికి నిధులు కేటాయించండి..

నెక్కొండ బస్టాండ్ అభివృద్ధికి నిధులు కేటాయించండి

రవాణా శాఖ మంత్రి పొన్నంకు వినతి పత్రం అందజేసిన ఎమ్మెల్యే దొంతి

#నెక్కొండ, నేటి ధాత్రి:

నెక్కొండ మండల కేంద్రంలోని బస్టాండ్ అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని నర్సంపేట ఎమ్మెల్యే మాధవరెడ్డి హైదరాబాదులోని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ క్యాంపు కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. వెంటనే సానుకూలంగా స్పందించిన మంత్రి పోన్నం ప్రభాకర్ అతి తొందరలో బస్టాండ్ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తానని హామీ ఇవ్వడం జరిగిందని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట టిపిసిసి సభ్యుడు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు బొంపల్లి దేవేందర్ రావు, బానోత్ సింగ్ లాల్, నెక్కొండ మార్కెట్ కమిటీ డైరెక్టర్ రావుల మైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మల్లాపూర్ మండలం మొగిలి పేట నడుకుడా కొత్తదామరాజు పల్లి

మల్లాపూర్ నేటి ధాత్రి

మల్లాపూర్ మండలం మొగిలి పేట నడుకుడా కొత్తదామరాజు పల్లి సంగెం శ్రీరాంపూర్ ఓబులాపూర్ పలు గ్రామాలలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు విడుదల చేపించి కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభం చేసి అదే విధంగా ఎస్ డి ఎఫ్ నిధులు ల నుండి శ్రీ కృష్ణ యాదవ సంఘ అభివృద్ధి కొరకు నిధులు మంజూరు చేసిన జువ్వాడి వారికి ప్రోస్టింగ్ పత్రాన్ని అందజేశారు.ఒక్క మొగిలి పేట గ్రామానికి 25 లక్షల నిధులు మంజూరు అయ్యాయి. అనంతరం లబ్దిదారులకు నూతన రేషన్ కార్డు లను పంపిణీ చేసిన మన కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు .
అనంతరం మొగిలిపేట గ్రామంలో కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు ఆధ్వర్యంలో టిఆర్ఎస్ . బీజేపీ పార్టీ ల నుండి పలువురు నాయకులు. మహిళలు కాంగ్రెస్ పార్టీ లో చేరిక, నర్సింగరావు వెంట మల్లాపూర్ మండల కేంద్రంలోని పలు గ్రామాల కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version