42% రిజర్వేషన్లు బీసీలకు కల్పించాలి….

42% రిజర్వేషన్లు బీసీలకు కల్పించాలి.

బీసీ సంక్షేమ సంఘం జిల్లా యూత్ ఉపాధ్యక్షులు మెరుగు సురేష్ గౌడ్
మొగుళ్లపల్లి నేటి ధాత్రి

 

భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని పెద్ద కోమటిపల్లి లో బిసి సంఘాల బందుకి కాంగ్రెస్ మరియు బిఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తూ పెద్దకోమటిపల్లి గ్రామంలో అన్ని రాజకీయ పార్టీల బీసీ సంఘాల ఆధ్వర్యంలో అన్ని వ్యాపార సంస్థలను, విద్యాసంస్థలను బందు చేయించడం జరిగింది , అనంతరం గ్రామపంచాయతీ ఆవరణంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద రమేష్ బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు గడ్డం రాజు గౌడ్ కాంగ్రెస్ పార్టీ గ్రామ ప్రధాన కార్యదర్శి నిమ్మతి రాజేందర్ మంద దశరథం గడ్డం శ్రీనివాస్ మంద లక్ష్మయ్య ఆదిమూల సత్యనారాయణ మంద నవీన్ మెరుగు తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

బీసీ రిజర్వేషన్‌ అమలు కాకుంటే మరో తెలంగాణ ఉద్యమమే…

బీసీ రిజర్వేషన్‌ అమలు కాకుంటే మరో తెలంగాణ ఉద్యమమే…
– పూలే…అంబేద్కర్‌ను అర్థం చేసుకుంటేనే రాజ్యాధికారం సాధ్యం
– బీసీ రిజర్వేషన్‌ అమలు కాకుండా కుట్రలు జరుగుతున్నయ్‌
– రిజర్వేషన్‌ ఎవరు ఇస్తరో ఎవరుతీసుకుంటరో అలోచించాలే
– కాంగ్రెస్‌…బీజేపీ పార్టీల మద్దతు తెలుపడం సంతోషకరమే
– మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌

మంథని :- నేటి ధాత్రి

 

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ చిత్తశుద్దితో బీసీ రిజర్వేషన్‌లు తీసుకువచ్చి బీసీల చేతుల్లో పెట్టాలని లేకుంటే మరో తెలంగాణ ఉద్యమంలా మారుతుందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ అన్నారు. 42శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలనే డిమాండ్‌తో బీసీ సంఘాల జేఏసీ పిలుపుమేరకు మంథనిలో చేపట్టిన బంద్‌లో ఆయన పాల్గొన్నారు. ముందుగా మహాత్మా జ్యోతిరావుపూలేకు నివాళులు అర్పించి ప్రధాన చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రధాన చౌరస్తాలో మానవహారంగా ఏర్పడి నిరసన వ్యక్తం చేశారు, అనంతరం వంటావార్పు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన బంద్‌లో పాల్గొన్న వారితో కలిసి సహపంక్తి బోజనం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆనాడు మేమెంతో మాకంత అని మహాత్మాజ్యోతీరావు పూలే సంకల్పించారని, పూలేను అర్థం చేసుకున్న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ దేశానికి గొప్ప రాజ్యాంగం అందించారన్నారు. అయితే పూలే, అంబేద్కర్‌ను అర్థం చేసుకోకపోవడం మూలంగానే అనేక అనర్థాలు జరుగుతున్నాయని, వారిని అర్థం చేసుకున్న నాడే రాజ్యాధికారం సాధ్యమవుతుందన్నారు. బీసీ రిజర్వేషన్‌ కోసం బీసీ సంఘాల జేఏసీ పిలుపుమేరకు అన్ని రాజకీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు రోడ్డు మీదకు వచ్చి బంద్‌ మద్దతు తెలుపడం సంతోషకరమన్నారు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనకపోతే తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోతామని ప్రతి ఒక్కరు ఉద్యమంలో ముందుకు వచ్చారని, అదే తరహాలో ఈనాడు బంద్‌కు సహకారిస్తున్నారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ అసలు బీసీ రిజర్వేషన్‌లు ఇచ్చే వారు ఎవరు తీసుకునే వారు ఎవరనే అయోమయం నెలకొనెలా అధికార పార్టీలు పాల్గొంటున్నాయన్నారు. బీసీ రిజర్వేషన్‌లు కేంద్రం ఇస్తుందా రాష్ట్రం ఇస్తుందా అని ఆలోచించకుండా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల మద్దతుపై బీసీ సమాజం సూక్ష్మంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఒకరిపై ఒకరు నెపం మోపి బీసీలు ఒక్కటి కాలేరనే ఆలోచనతో బీసీవర్గాల్లో చిచ్చు పెట్టి రిజర్వేషన్‌లు ఆపేందుకు కుట్రలు జరుగుతున్నాయనే అనుమానం వ్యక్తం చేశారు. అందరూ బాపనోళ్లు అయితే రొయ్యల మొలతాడు ఏడ పోయినట్లు అన్న చందంగా అన్ని పార్టీల నాయకులు బీసీ బంద్‌లో పాల్గొంటే అసలు రిజర్వేషన్‌లు ఎవరు అమలు చేయాలనే ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు. బీసీ సంఘాల ఏర్పడిన జేఏసీ ఎవరో ఒకరిపై గురి పెట్టకపోతే అయోమయపరిస్థితులకు దారి తీస్తుందని ఆయన వాపోయారు. తెలంగాణ ఉద్యమంలో ఎలాగైతే ప్రభుత్వాల మెడలు వంచి తెలంగాణ సాధించుకున్నామో అదే రీతిలో బీసీ రిజర్వేషన్‌లు సాధించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాహుల్‌ గాంధీ రోడ్లపై కాకుండా పార్లమెంట్‌లో గళమెత్తాలని, అలాగే ప్రధాని మోడీ బీసీల గురించి ఆలోచన చేయాలన్నారు. వీళ్లిద్దరు కలిసి మాట్లాడుకుంటే బీసీ రిజర్వేషన్‌లు సునాయమవుతాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు. బీసీ సంఘాల పిలుపుమేరకు నియోజకవర్గంలో బంద్‌కు సహకరించిన వ్యాపార సంస్థలు, అన్ని రాజకీయ పార్టీ ల నాయకులు, ప్రజలు, మేధావులకు ఆయన ఈ సందర్బంగా ధన్యవాదాలు తెలిపారు.

బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో న్యాల్ కల్ బంద్….

బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో న్యాల్ కల్ బంద్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

స్థానిక న్యాల్ కల్ మండల కేంద్రం లోని బస్టాండ్ ముందు బీసీ సంక్షేమ సంఘం న్యాల్ కల్ మండల అధ్యక్షులు భోజగొండ శివరాజ్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది విద్య సంస్థలు దుకాణాలు ఇతర వ్యాపారాలు స్వచ్చందంగా బంద్ పాటించారు ఈ సందర్బంగా బీసీ సంఘం నాయకులు మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన 42 % శాతం బీసీ రిజర్వేషన్ హామీని నిలబెట్టుకోవాలని, ఇచ్చిన హామీని అమలు చేసి వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ అమలు చేస్తానని చెప్పి రాష్ట్ర ప్రజానీకానికి మోసపూరిత మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందన్నారు. ఇచ్చిన హామీని అమలు చేయక పోవడం కారణంగానే బీసీల “బంద్” కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. బంద్ లో భాగంగా శాంతియుతంగా చేపట్టమని తెలిపారు ఈ రాష్ట్ర ప్రభుత్వనికి చిత్త శుద్ధి ఉంటే మీరు ఇచ్చిన బీసీ లకు కామారెడ్డి డిక్లరేషన్ 42% ఇస్తాను అన్న మాయమాటలు చెప్పి ప్రభుత్వన్ని ఏర్పాటు చేసుకొని ఈ రోజు బీసీలకు ముంచే ప్రయత్నం చేస్తున్నారు అని వారు అన్నారు ఈ కార్యక్రమం లో మాజీ మల్గి సర్పంచ్ బీసీ సంఘం విద్యార్థి విభాగం ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ అధ్యక్షులు జట్గొండ మారుతీ మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ శివరాజ్ మిర్జాపూర్ మాజీ సర్పంచ్ బీరప్ప చల్కి అశోక్ బీజేపీ మాజీ మండలం అధ్యక్షులు ఓంకార్ యాదవ్ బీజేపీ మండలం అధ్యక్షులు మల్లేష్ బీజేవైఎం మండలం అధ్యక్షులు విష్ణు పాటిల్ మండలం ఉపాధ్యక్షులు మధుసూదన్ రెడ్డి సతీష్ కులకర్ణి మైనారిటీ సభ్యులు అసిఫ్ నర్సప్ప లావేష్ పాటిల్ రాజు యాదవ్ పాండు తదితరులు ఉన్నారు,

బీసీ రిజర్వేషన్ల అమలుకు బీసీ జేఏసీ జహీరాబాద్ లో వ్యాపార సంస్థలు మూత…

బీసీ రిజర్వేషన్ల అమలుకు బీసీ జేఏసీ జహీరాబాద్ లో వ్యాపార సంస్థలు మూత

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గ ము(సంగారెడ్డి జిల్లా) జహీరాబాద్ పట్టణంలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బందు ప్రకటించడం జరిగింది. ఈ బంద్ జహీరాబాద్ పట్టణంలోని భవాని మత మందిర్ చౌరస్తా నుండి బైక్ లపై ర్యాలీగా బయలుదేరి డా.బీ.ఆర్ అంబెడ్కర్ గారికి విగ్రహానికి పూవుల మాల వేసి పాస్తాపూర్ చౌరస్తా వరకు అన్ని షాపులు ముహించడం జరిగింది .ఆ తర్వాత బస్టాండ్ ముందు ధర్నా చేసి స్థానిక ఎమ్మార్వో గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. తెలంగాణలో బీసీలకు రావలసిన నలబై రెండు శాతం రిజర్వేషన్ లు ఇవ్వాలని లేని పక్షంలో ఏ పార్టీ అయినా బీసీలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు .ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇస్తామని హామీ ఇచ్చిన 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని లేనిపక్షంలో భవిషతులో తగిన కార్యచరణ రూపొందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ నాయకులు డా. పెద్ద గొల్ల నారాయణ, కొండాపూర్ నర్సిములు, విశ్వనాథ్ యాదవ్, శంకర్ సగర, వేణు కాడిగే, వడ్డే శేఖర్, సాధన కృష్ణ,మాక్కుసూద్,మాదినం శివ కుమార్,ఇమ్రాన్,బీసీ నాయకులు హుగెల్లి రాములు,అడ్వై్కేట్ శంకర్, మహేష్ ముదిరాజ్, బీ.ఆర్ యస్ నాయకులు తట్టు నారాయణ, నర్సిములు కోహిర్, వెంకటేశం, శిఖరి గోపాల్, వెంకట్ సాగర్,అమిత్ కుమార్,దత్తు ముదిరాజ్, బిజెపి పార్టీ నాయకులు నావబాత్ జగనత్, సుదీర్ బండారి, పూల సంతోష్, విశ్వనాధ్ స్వామి,వైద్యనాథ్, విశ్వనాధ్, సురేష్ పూరి, మాలశెట్టి,సతీష్ రాయచూరు గుప్తా, సుభాష్, మోహన్ చాకలి మరియు ధర్మ సమాజ్ పార్టీ నాయకులు మహేందర్ మహారాజ్, పెంటయ్య, వీవిధ కుల సంఘాల నాయకులు సంగప్పముదిరాజ్,భీర్ గొండ,మంగలి దత్తత్రి, చాకలి శ్రీనివాస్, శిఖరి శ్రీనివాస్,రవికాంత్, మల్లేష్, గొల్ల శ్రీనివాస్,సందీప్ దాదా,మడపతి స్వామి తో పాటు అన్ని కుల సంఘాలు వ్యాపారస్తులు పాల్గొన్నారు.

కండ్లకు గంతలు కట్టుకొని సిపిఐ నిరసన…

కండ్లకు గంతలు కట్టుకొని సిపిఐ నిరసన

బీజేపీ వల్లనే బీసీలకు అన్యాయం

సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు ప్రవీణ్ కుమార్

భూపాలపల్లి నేటిధాత్రి

 

భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్లో చేర్చి,బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ సెంటర్ వద్ద కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ దేశంలోనే బీసీల జనాభా 60% పైగా ఉన్నప్పటికీ బీసీలకు ఏ ప్రభుత్వం న్యాయం చేయలేదని చెప్పారు. కేవలం బీసీలను ఓట్లకు వాడుకోడానికి మాత్రమే చూశారని వారి హక్కుల కోసం, రిజర్వేషన్లు పెంచి న్యాయం చేయాలని ఏ ప్రభుత్వం చూడలేదని అన్నారు. కేంద్రంలో ఉన్న బిజెపి ఒకసారి బీసీలకు రిజర్వేషన్లకు పెంపు కు మద్దతుగా మరోసారి బీసీ రిజర్వేషన్లు పెంపు వల్ల ముస్లింలకు లాభం చేరుతుందని వ్యతిరేకంగా ద్వంద వైఖరులను పాటిస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో 42% ఆమోదం తెలిపి కేంద్రానికి పంపిస్తే గవర్నర్, రాష్ట్రపతి సంతకం పెట్టకుండా బీసీలను మోసం చేస్తుందని తెలిపారు. అతి త్వరలోనే బీసీ ప్రజలంతా బిజెపికి బుద్ధి చెప్పే సమయం దగ్గర లో ఉందని తెలిపారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేయకుండా బీసీ రిజర్వేషన్లు 9వ షెడ్యూల్లో చేర్చి రాష్ట్రపతి, గవర్నర్ ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు. లేనియెడల భవిష్యత్తులో సిపిఐ పార్టీ ,అన్ని రాజకీయ పార్టీలు, బీసీ సంఘాలు ఆధ్వర్యంలో పోరాటాలు ఉదృతం చేస్తామని తెలిపారు. బందును విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ప్రవీణ్ కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు క్యాతరాజ్ సతీష్,కుడుదుల వెంకటేశ్,నేరెళ్ల జోసెఫ్, వేముల శ్రీకాంత్,గోలి లావణ్య, పొనగంటి లావణ్య, పీక రవికాంత్, రమేష్ చారి, రాజేష్, ఎకు రాములు, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

చేతిలో లేని అధికారంతో బీసీ రిజర్వేషన్ పెంపు…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-18T135254.537.wav?_=1

 

చేతిలో లేని అధికారంతో బీసీ రిజర్వేషన్ పెంపు.

42 శాతం బిసి రిజర్వేషన్లను అమలు చేయాలి

రాష్ట్రవ్యాప్త బిసి బంద్ లో పాల్గొన్న తెలంగాణ ముదిరాజ్ మహాసభ నాయకులు

దుగ్గొండి,నేటిధాత్రి:*

ఎన్నికల హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలోలేని అధికారంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు 42 శాతం చట్టసభల్లో రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టగా ఆ రిజర్వేషన్ పట్ల సుప్రీంకోర్టు స్టే విధించిందని తెలంగాణ ముదిరాజ్ మహాసభ వరంగల్ జిల్లా అధ్యక్షుడు,నర్సంపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పొన్నం మొగిలి ముదిరాజ్ ఆరోపించారు. బీసీ బందు కార్యక్రమంలో భాగంగా దుగ్గొండి మండలంలోని గిర్నిబావి గ్రామం ప్రధాన రహదారిపై ముదిరాజ్ మహాసభ దుగ్గొండి మండల శాఖ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నం మొగిలి మాట్లాడుతూ విద్య ఉద్యోగాలు చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ పట్ల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రిజర్వేషన్ బిల్లు మంచిదే కానీ.. అది అమలు కాకపోవడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తం ఉన్నదని ఆరోపించారు. రిజర్వేషన్ల అమలు కోసం వివిధ బిసి కుల సంఘాలు రోడ్డెక్కాల్సిన పరిస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తంచేశారు. 42 శాతం బిసి రిజర్వేషన్ అమలు పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకొని అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినా నేటికీ బీసీ వర్గాలకు ఇలాంటి రిజర్వేషన్ల ప్రకారం ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ నుండి కేంద్రంలో ఉన్న మంత్రులు, పార్లమెంటు సభ్యులు బిసి రిజర్వేషన్ల పట్ల ఆలోచించాలని ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షులు పొన్నం మొగిలి కోరారు.ఈ కార్యక్రమంలో
తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఎన్నారై సెల్ కన్వీనర్ శానబోయిన రాజ్ కుమార్ ముదిరాజ్,దుగ్గొండి మండలం అధ్యక్షులు పల్లె రమేష్ ముదిరాజ్, సార రాములు ముదిరాజ్, బీసీ జాక్ కన్వీనర్ బండారి ప్రకాష్ ముదిరాజ్, మాజీ ఉప సర్పంచ్ నేదురి రాజేందర్ ముదిరాజ్, వరంగంటి తిరుపతి, నీరటి మురళి, ఒరంగంటి కుమారస్వామి, గొర్రె శీను, దండు రాజు, మేక అనిల్, జెట్టబోయిన రాజు, తెప్ప శంకర్, పొన్నం వంశీ తదితరులు పాల్గొన్నారు.

బీసీ బందులో పాల్గొన్న ఎమ్మెల్యే జి ఎస్ ఆర్…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-18T132231.789.wav?_=2

 

బీసీ బందులో పాల్గొన్న ఎమ్మెల్యే జి ఎస్ ఆర్

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం
రిజర్వేషన్లు ఇవ్వవలసిందే ఎమ్మెల్యే జీఎస్సార్.

భూపాలపల్లి నేటిధాత్రి

 

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనపై హైకోర్టు ఇచ్చిన స్టేను నిరసిస్తూ బీసీ సంఘాల జేఏసీ శనివారం తెలంగాణ బంద్‌ నిర్వహించింది.ఈ బంద్‌కు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరై భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని హనుమాన్ ఆలయం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం ఎమ్మెల్యే జీఎస్సార్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కొరకు సర్వే నిర్వహించి శాసన సభలో ఏకగ్రీవ తీర్మానం చేసి ఆర్డినెన్స్ ను గవర్నర్ కు పంపియడం జరిగింది. బీసీలకు 42 శాతం కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇస్తే ప్రజలు కాంగ్రెస్ వైపు ఉంటారని దురుద్దేశంతో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం గవర్నర్ ను మధ్యలో అడ్డు పెట్టుకొని నాటకం చేస్తుందని విమర్శించారు.అందుకే గవర్నర్ గారు అట్టి ఆర్డినెన్సును ఎటు తేల్చకుండా పెండింగులో పెట్టారు అన్నారు.అని దీనికంతటికీ ముఖ్య కారణం కేంద్రలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే అని విమర్శించారు. మాకు కోర్టుల మీద గౌరవం,నమ్మకం ఉంది.కావునా బీసీ లందరూ ఏకమై కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకు రావాలని సూచించారు. ఇట్టి కార్యక్రమంలో టౌన్ అధ్యక్షులు ఇస్లావత్ దేవన్ సుంకరి రామచంద్రయ్యా అధికార ప్రతినిధి గాజర్ల అశోక్ పిసిసీ సభ్యులు చల్లూరి మధు ప్రజా సంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సిరిసిల్లలో బీసీ రిజర్వేషన్ల బంద్ పై అఖిలపక్షం బైక్ ర్యాలీ…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-18T124331.616.wav?_=3

 

సిరిసిల్లలో బీసీ రిజర్వేషన్ల బంద్ పై అఖిలపక్షం బైక్ ర్యాలీ

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు బీసీ సంఘాల, మరియు అఖిల పక్ష పార్టీల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 42 శాతం బీసీ రిజర్వేషన్ అమలుకు మద్దతుగా ఈరోజు సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని న్యూ బస్టాండ్ సమీపంలో తెలంగాణ తల్లి విగ్రహం నుండి గాంధీ చౌక్ వరకు అఖిలపక్ష పార్టీల మద్దతుతో బైక్ ర్యాలీ చేపట్టడం జరిగినది. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా పట్టణ బీసీ సంఘాలు మరియు వ్యాపార సంఘాలు సంపూర్ణంగా మద్దతు ప్రకటించడం జరిగనది. అంతేకాకుండా నిత్యం సిరిసిల్ల రద్దీ జనం తో ఉన్న కూడళ్లు నిర్మానుషంగా మారడం తో అటు బస్ డిపో వద్ద బిసి సంఘాల ముఖ్య నేతలు బస్ లను ఆపివేయడం, ప్రయాణి కులకు ఇబ్బంది అయ్యే విధంగా ఏర్పడంతో, దీపావళి పండగ ముందు సమయన సిరిసిల్ల ప్రాంత ప్రజలకు ఇబ్బంది చెప్పడం జరుగుతున్నది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 42 శాతం రిజర్వేషన్లు బీసీలకు అమలు చేయాలని అన్ని పార్టీలు కూడా మరియు ప్రజలు కూడా ప్రశాంతంగా మద్దతు ప్రకటించాలని బీసీ సంఘాలు కోరడం జరిగినది.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు మద్దతు తెలిపిన జహీరాబాద్ బిసి జేఏసీ….

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు మద్దతు తెలిపిన జహీరాబాద్ బిసి జేఏసీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ : భవాని మందిర్ చౌరస్తా నుండి బస్టాండ్ వరకు స్వచ్ఛంద బంద్ కు బీసీ బంధువులు మరియు అన్ని పార్టీల బీసీ కార్యకర్తలు తమ తమ మద్దతు తెలుపాలని మనం బీసీలు అందరం ఏకతాటికి రావాలని మనకు జరిగినా అన్యాయాన్ని ఈ బంద్ ధార తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని జహీరాబాద్ బీసీ జేఏసీ నెంబర్లు కోరడం జరిగింది
ఈ కార్యక్రమంలో బీసీ కుల సంఘాలు మరియు బిఆర్ఎస్ పార్టీ బీసీ సోదరులు మరియు బిజెపి పార్టీ బీసీ సోదరులు జాగో తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జహీరాబాద్ నియోజకవర్గం అన్ని మండలాల నుండి బీసీ బందులు. ఈరోజు అతిధి హోటల్లో బీసీ తాలుక జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం కావడం జరిగింది
రేపు జరగబోయే బంద్ కు తమ తమ మద్దతు తెలుపుతున్నామని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ పెద్ద గొల్ల నారాయణ ,, కోహిర్ మండల్ మాజీ జెడ్పిటిసి , నర్సింలు,, కొండాపురం నరసింహులు, విశ్వనాథ్ యాదవ్ బిజెపి, తట్టు నారాయణ , బిఆర్ఎస్ పార్టీ జహీరాబాద్ మండల అధ్యక్షులు వెంకటేశం బిఆర్ఎస్ జర సంఘం మండల్ మొహమ్మద్ఇమ్రాన్, బీసీ మైనార్టీ, సంగారెడ్డి జిల్లాఅధ్యక్షులు, శంకర్ సాగర్ బి సి,,. జగన్ బిజెపి,మాదినం శివప్రసాద్ జాగో తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తదిపర్లు పాల్గొనడం జరిగింది

రిజర్వేషన్లు దక్కకుండా అగ్రకులాలు చేస్తున్న కుట్రలను బీసీలు తిప్పికొట్టాలి…

రిజర్వేషన్లు దక్కకుండా అగ్రకులాలు చేస్తున్న కుట్రలను బీసీలు తిప్పికొట్టాలి

18న తలపెట్టిన రాష్ట్ర బంద్ ను జయప్రదం చేయండి

కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్ జిల్లా జిల్లాఅధ్యక్షులు బీసీ హక్కుల సాధన సమితి

కరీంనగర్, నేటిధాత్రి:

 

స్థానిక సంస్థల ఎన్నికల్లో విద్యా ఉద్యోగ రంగాల్లో 42శాతం రిజర్వేషన్లు చట్టాన్ని ఆమోదించకుండా మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యహరించడం వల్లనే రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల ప్రక్రియలో అనేక ఆటంకాలు కలుగుతున్నాయనీ బుచ్చన్న అన్నారు. కమాన్ సెంటర్లో లోజరిగిన నిరసన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్, ప్రధానకార్యదర్శి పిట్టల సమ్మయ్యతో కలిసి మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లు అమలు కాకుండా మోడీ ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. బుధవారం కరీంనగర్ లోని కమాన్ సెంటర్లో ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈసందర్భంగా కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన చట్టాన్ని గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపినప్పటికీ బీసీ చట్టాన్ని 9వ షెడ్యూల్లో చేర్చి ఆమోదించవలసిన బీసీ ప్రధాన మంత్రిని అంటున్న మోడీ బీసీల ఎడల అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి కారణంగానే తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్లు దక్కకుండా పోతున్నాయన్నారు. బీసీల రిజర్వేషన్లు అమలు జరగాలంటే తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చడం ఒక్కటే మార్గమని, ఎందరో న్యాయకోవిదులు నిపుణులు చెప్పుతున్నా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆర్డినెన్స్ అని ఒకసారి జీవో అని ఒకసారి కాలయాపన చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల జీవో మీదా అగ్రకులాలు న్యాయస్థానాలకు వెళ్ళే అవకాశాలు కల్పించేలా వ్యవహారించడం మంచిది కాదన్నారు. ఇప్పటికైనా బీసీ రిజర్వేషన్లు సాధించడానికి అన్ని రాజకీయ పార్టీలను బీసీ సంఘాలను కలుపుకొని ఐక్య కార్యాచరణ ద్వారా బలమైన ఉద్యమాన్ని నిర్మించి మోడీ ప్రభుత్వం బీసీ చట్టాన్ని 9వ షెడ్యూల్ లో చేర్చే విధంగా కృషి చేయాలన్నారు.
ఈమోకా తప్పితే బీసీలు ఆగమై పోతారు కాబట్టి అన్ని రాజకీయ పార్టీల వెనుకాల ఉన్న బీసీలంతా రాజకీయాలకు అతీతంగా ఎక్కడికక్కడ జేఏసీలుగా ఏర్పడి బీసీ రిజర్వేషన్లను సాధించుకోవాలని అన్నారు.
కోర్టులో గెలిచామనీ రెడ్లు టపాసులు కాల్చుకొంటున్నారనన్నారు.
ఇందుకు నిరసనగా హైకోర్టులో బుట్టెంగారి మాధవరెడ్డి వేసిన కేసు ప్రతులను దగ్ధం చేస్తూ ఇదీ బీసీలంతా గమనించాలన్నారు.
బీసీలను రోడ్లు ఎక్కేలా చేస్తున్న అగ్రకులాలు జరగబోయే పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.
మేమెంతో మాకంత వాటా ఇవ్వాలని, ఈనెల 18న జరిగే రాష్ట్రవ్యాప్త బంద్ ను జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈనిరసన ధర్నా కార్యక్రమంలో బీసీ హక్కుల సాధన సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి పిట్టల సమ్మయ్య, కోశాధికారి పైడిపల్లి రాజుగౌడ్, నాయకులు బాకం ఆంజనేయులు, జంగం కొమురయ్య యాదవ్, దానవీని రమేష్,మల్లేశం, ఓరుసుబన్నీ, మేకల కుమార్, ఎన్.కుమార్, తదితరులు పాల్గొన్నారు.

బీసీల 42% రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన స్టేను రద్దు చేయాలి…

బీసీల 42% రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన స్టేను రద్దు చేయాలి

బీసీ రిజర్వేషన్లపై బిజేపి కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి విడనాడాలి

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుపై అంబేద్కర్ విగ్రహానికి ఆవేదనతో కూడిన వినతి పత్రం అందజేత

రామన్నపేట నేటి ధాత్రి యాదాద్రి జిల్లా

 

బీసీ రిజర్వేషన్లపై కేంద్రం ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడి 42 శాతం రిజర్వేషన్లు అమలు పరచాలని రామన్నపేట మండల సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో, బీసీ హక్కుల సాధన సమితి మండల కమిటి ఆధ్వర్యంలోఈరోజు రామన్నపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి ఆవేదన వ్యక్తం చేసారు.ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి ఊట్కూరి నరసింహ, ఎర్ర రమేష్ గౌడ్ లు మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చి దాన్ని అమలుపరచడానికి ప్రయత్నం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఆపడానికి ప్రయత్నం చేస్తూ, గవర్నర్ వద్ద ఉన్న బిసి బిల్లు పాస్ అవ్వకుండా చేసి,ఇప్పుడు హైకోర్టులో స్టే విధించినా బిజేపి ఎలాంటి ఉలుకుపలుకు లేకుండా బీసిలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు హడావుడిగా అమలు చేశారని, మరి బీసీలకు రిజర్వేషన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం సంవత్సరాలు గడుస్తున్నా కొలిక్కి రాకుండా, మొండి వైఖరి ప్రదర్శిస్తూ ఉన్నదని, తక్షణమే బిసి రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని అన్ని బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 18వ తారీఖున చేసే నిరసన ధర్నా , రాస్తారోకో కార్యక్రమాలను అన్ని బీసీ సంఘాల నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు…. వినతి పత్రం ఇచ్చిన వారిలో సిపిఐ జిల్లా నాయకులు ఎర్ర రమేష్ గౌడ్, సిపిఐ సీనీయర్ నాయకులు వీరమల్ల.ముత్తయ్య, గంగాపురం వెంకటయ్య, భగవంతం, సిపిఐ పట్టణ కార్యదర్శి రచ్చ యాదగిరి, శివరాత్రి సమ్మయ్య, రచ్చ దయాకర్, ఊట్కూరి కృష్ణ, పెండెం రవీందర్ , సల్లా ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు..

బీసీల రిజర్వేషన్ కోసం రామాయంపేట బంద్ పిలుపు..

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-15T140829.637.wav?_=4

 

బీసీల రిజర్వేషన్ కోసం రామాయంపేట బంద్ పిలుపు..

రామాయంపేట అక్టోబర్ 15 నేటి ధాత్రి (మెదక్)

 

తెలంగాణ బీసీ జేఏసీ పిలుపు మేరకు బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ రాబోయే 18వ తేదీ శనివారం రామాయంపేట బంద్ నిర్వహించాలని నిర్ణయించారు.
మెదక్ జిల్లా బీసీ సంక్షేమం, రాజకీయ, కుల, మహిళా, యువజన, ఉద్యోగుల, దివ్యాంగుల, విద్యార్థి సంఘాల జేఏసీ నాయకత్వంలో రామాయంపేట మండల కేంద్రంలోని శ్రీకర ఫంక్షన్ హాల్‌లో సమావేశం జరిగింది.
సమావేశంలో నేతలు మాట్లాడుతూ — రాష్ట్ర జనాభాలో 65 శాతం బీసీలు ఉన్నా, విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో కేవలం 24 శాతం మాత్రమే రిజర్వేషన్లు కల్పించడం అన్యాయం అని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు సముచిత న్యాయం చేయాలంటే 42 శాతం రిజర్వేషన్ల బిల్లును చట్టబద్ధం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
బీసీ జేఏసీ పిలుపు మేరకు రామాయంపేట పట్టణం మరియు మండలంలోని ప్రజలు, వ్యాపార వాణిజ్యవేత్తలు, కుల సంఘాలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ–ప్రైవేటు ఉద్యోగులు, యువజన సంఘాలు, అలాగే ఎస్సీ–ఎస్టీ, ఇతర ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు బీసీ బంద్‌కు స్వచ్ఛందంగా మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.
నాయకులు బీసీ సమాజం ఐక్యంగా ముందుకు వచ్చి బంద్‌ను ఘనవిజయం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు మెట్టు గంగారం. మామిడి సిద్ధరాములు. పోచమ్మల అశ్విని శ్రీనివాస్. రేవెల్లి వినయ్ సాగర్. బిసి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

జహీరాబాద్ లో వక్స్ సవరణ చట్టం వ్యతిరేకంగా సలహా సమావేశం…

జహీరాబాద్ లో వక్స్ సవరణ చట్టం వ్యతిరేకంగా సలహా సమావేశం

◆:- అక్టోబర్ 3న దేశవ్యాప్తంగా నిరసనకు పిలుపు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ దేశవ్యాప్తంగా వక్స్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి అనుసంధానంగా, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లోని పోలీస్ స్టేషన్ సమీపంలోని అదబీ హాల్ లో శనివారం జూహార్ నమాజు అనంతరం ఒక ముఖ్యమైన సలహా సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో వివిధ మతాలు, మతపరమైన సంస్థలు, సామాజిక సంఘాలు, పత్రికా రంగానికి చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. వక్తలు మాట్లాడుతూ, 2025 సెప్టెంబర్ 15న సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల తర్వాత కూడా, వక్స్ సవరణ చట్టంలోని పలు విభాగాలు ఇంకా అమలులో ఉన్నాయని, ఇవి ముస్లిం సమాజం యొక్క మతపరమైన, రాజ్యాంగబద్ధ హక్కులకు ప్రమాదకరమని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే అక్టోబర్ 3న ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ( ఏఐఎంపిఎల్బి ) పిలుపు మేరకు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం రెండవ దశలో జరగనుంది. అందులో భాగంగా జహీరాబాద్ మరియు పరిసర మండలాలు కోహీర్, ఝరాసంగం, మొగడంపల్లి, న్యాలకల్ లలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పూర్తి వ్యాపార బంద్ కొనసాగనుంది. ప్రజాసౌకర్యం దృష్ట్యా ఆసుపత్రులు మరియు మెడికల్ షాపులకు మినహాయింపు ఇవ్వబడింది. ‘వక్స్ రక్షించు రాజ్యాంగాన్ని రక్షించు ఉద్యమం’ కన్వీనర్ మాట్లాడుతూ, ఈ నిరసన కేవలం బంద్ కాకుండా, ముస్లిం సమాజం యొక్క ఐక్యత, బాధ్యత, చైతన్యం మరియు హక్కుల పట్ల చురుకుదనాన్ని ప్రతిబింబించే కార్యక్రమంగా ఉండబోతుందని తెలిపారు. ఈ సమావేశంలో సమావేశంలో ముఖీ అబ్దుసబూర్ కాసిమీ, మౌలానా అబ్దుల్ ముజీబ్ కాసిమీ, ముఫ్తా నజీర్ అహ్మద్ హుస్సామీ, అయూబ్ ( ఎం. పి. జే ), యూసుఫ్ (ముస్లిం యాక్షన్ కమిటీ), మొయిజ్ (ముస్లిం యాక్షన్ కమిటీ), ఇజాజ్ (పత్రికా ప్రతినిధి), మహబూబ్ మౌరీ (పత్రికా ప్రతినిధి), అబ్దుల్ మజీద్ (ఈద్గా కమిటీ అధ్యక్షుడు), హాఫిజ్ అక్బర్, అబ్దుల్ ఖదీర్ (జమియతుల్ ఉలమా), అడ్వొకేట్ సమీర్, అబ్దుల్ వహీద్, మౌలానా కమాన్ పట్టేవాలే, ముహమ్మద్, ముఫ్తా మొయిన్, ముఫ్తా సిరాజ్, ముఫ్తా అబ్దుల్ వాసిః, మౌలానా అబ్దుల్ ఘనీ, ఐయూబ్ సహారా, వసీం ( పిటి ), అలీ, డా. నసీర్ సన్రోహీ, అలీం (జిమ్), ఖదర్ ఖాన్, అయూబ్ ఖాన్, వసీం (పేపర్ షాప్), తదితరులు పాల్గొన్నారు.

ముందస్తు అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు,…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-22T134938.420-1.wav?_=5

 

ముందస్తు అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు,

◆:- పి.రాములు నేత

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జాగో తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపకులు
యావత్తు తెలంగాణ సమాజం రోడ్లపైకి రాకముందు కల్తీ నకిలీ వ్యాపారాలను పరిశ్రమల కాలుష్యాన్ని కార్మికులపై మోసాలను ప్రభుత్వాలు అధికార యంత్రాంగం తో పూర్తిగా అరికట్టాలి
తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర భారతదేశం నుండి వచ్చిన వర్తకులు పరిశ్రమల పెట్టుబడిదారులు తెలంగాణ ప్రాంతంలో నాణ్యతలేని తినుబండరాలను నకిలీ వస్తువులను విక్రయిస్తూ తెలంగాణ ప్రజలను పూర్తిగా మోసానికి గురి చేస్తున్నారు వీరి బారిన పడి అనేక మంది ప్రజలు తమ ఆరోగ్యాలు కాకుండా ఆర్థికంగా నష్టపోతున్నారు ఈ ప్రాంతంలో పెట్టుబడిదారులుగా వచ్చిన పారిశ్రామికవేత్తలు పారిశ్రామాలు నెలకొల్పి కార్మిక చట్టాలను పూర్తిగా తుంగలో తొక్కి తెలంగాణ ప్రాంతంలోని నవయువ కార్మికులతో వెట్టిచాకిరి చేయించుకొని వారికి సరిపడా వేతనాలు ఇవ్వకుండా సరైన సౌకర్యాలు కల్పించకుండా వారి ఆరోగ్యాలను సమయాన్ని ఆర్థిక పరిస్థితులను నిలువున దోచుకుంటున్నారు కర్మ గారాల యజమాన్యాలు మన గడ్డమీద టికానపెట్టి మన ప్రాంతంను కాలుష్యంతో నింపి వేస్తున్నారు వీరి బారిన పడి ప్రజలు అనేక సందర్భాల్లో అనారోగ్యం పాలవుతున్నారు ఈ విషయాలపై జాగో తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపకులు పి.రాములు నేత తేదీ 22 -8 -2025 నాడు జహీరాబాద్ బందుకు పిలుపునివ్వగా జహీరాబాద్ పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి జహీరాబాద్ పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు బందు పిలుపును అడ్డుకున్నారు కార్యక్రమంలో జాగో తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహమ్మద్ ఇమ్రాన్ మాదినం శివప్రసాద్ ప్యార్ల దశరథ్ జహీరాబాద్ కిరాణా వర్తక సంఘం అధ్యక్షులు సంతోష్ ముందస్తుగా అరెస్టు చేసి సొంత పూచికతపై వదిలిపెట్టారు,

చేర్యాల రెవెన్యూ డివిజన్ కొరకు బంద్ విజయవంతం..

చేర్యాల రెవెన్యూ డివిజన్ కొరకు బంద్ విజయవంతం

రెవెన్యూ డివిజన్ ప్రజల చిరకాల ఆకాంక్ష

ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన జేఏసీ

జేఏసీ చైర్మన్ డాక్టర్ రామగళ్ళ పరమేశ్వర్

చేర్యాల నేటిదాత్రి

చేర్యాల రెవెన్యూ డివిజన్ కొరకు ఈప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేర్చడం కోసం జేఏసీ నిర్వహించిన బంద్ ఎంత బలంగా ఉందో ప్రభుత్వానికి తెలిసి రావాలని జేఏసీ చైర్మన్ డాక్టర్ రామగల్ల పరమేశ్వర్ అన్నారు. శుక్రవారం జేఏసీ తలపెట్టిన బంద్ తో పట్టణంలో వ్యాపార వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బందు పాటించాయి.చేర్యాల,మద్దూరు,కొమురవెల్లి, ధూల్మీట్ట మండల మండల కేంద్రాలతో పాటు మేజర్ గ్రామపంచాయతీలు సైతం ఉదయం నుండే జేఏసీ నాయకులు రోడ్డుపైకి వచ్చి పాదయాత్ర బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ రామగళ్ళ పరమేశ్వర్ మాట్లాడుతూ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో నాటి పీసీసీ అధ్యక్షులు నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటిస్తామని హామీ ఇచ్చిన సందర్భంలో 18 నెలల కాలంలో వారి హామీని నెరవేర్చకపోవడం ఈప్రాంత ప్రజల ఆకాంక్షను నెరవేర్చకపోవడంపై మండిపడ్డారు. ప్రజలు, వ్యాపార వాణిజ్య వర్గాలే నాయకులై స్వచ్ఛందంగా బందు చేశారని, ఇందుకు నిదర్శనమే రెవెన్యూ డివిజన్ ఆకాంక్ష ప్రజల్లో ఎంత ప్రభలంగా ఉందో అర్థమవుతుందన్నారు. ఇది ఒక భౌతిక అంశం మాత్రమే కాకుండా ఈప్రాంత ప్రజల ఆకాంక్ష అస్తిత్వం, ఉనికి ఆత్మగౌరవంతో ముడిపడి ఉన్నదని ఈ బందు ద్వారా ప్రజల ఆకాంక్షను వెలిబుచ్చారు. ఇదే స్ఫూర్తితో రెవెన్యూ డివిజన్ సాధించేవరకు పోరాటం కొనసాగిస్తామని తెలియజేశారు. వ్యాపార వాణిజ్య వర్గాలు ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు సంబంధించి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తున్నామన్నారు. త్వరలో విద్యాసంస్థల బంద్, రహదారి దిగ్బంధం, చలో కలెక్టరేట్, వంటావార్పు తదితర అంశాలపై తేదీలను ప్రకటిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు , అందె బీరయ్య, అందే అశోక్ .బుట్టి సత్యనారాయణ, పిల్లి చంద్రం, పోలోజు వెంకటాద్రి, ఎక్కలదేవి సుధాకర్, ఈరి భూమయ్య, సుతారి రమేష్, కత్తుల భాస్కర్ రెడ్డి,పొన్నబోయిన మమత,సనవాల ప్రసాద్, పోషబోయిన పరమశేఖర్, భూమిగారి మధూకర్, పుల్ల ఆంజనేయులు, నంగి కనకయ్య, పోనుగోటి శ్రీనివాస్ రెడ్డి, అరుట్ల లింగం, కడుదూరి పుల్లారెడ్డి, పొన్నబోయిన శ్రీనివాస్, కర్రె నర్సిరెడ్డి, భూర సీతారాముల, పుల్ల కుమార్, ముద్దల్ల యాదయ్య, కత్తుల లక్ష్మరెడ్డి, బింగి పోశయ్య, మురళి, మహేందర్, రాజు,తదితరులు పాల్గొన్నారు.

కేంద్రంలో విద్యా సంస్థల బంద్ విజయవంతం..

శంకరపల్లి మండల కేంద్రంలో విద్యా సంస్థల బంద్ విజయవంతం

చేవెళ్ల డివిజన్ ఎస్ఎఫ్ఐ కార్యదర్శి బేగరి అరుణ్ కుమార్ నేతృత్వంలో నిరసన

శంకర్పల్లి, నేటిధాత్రి:

చేవెళ్ల డివిజన్ ఎస్ఎఫ్ఐ కార్యదర్శి బేగరి అరుణ్ కుమార్ నేతృత్వంలో చేపట్టిన విద్యాసంస్థల బంద్ విజయవంతంగా ముగిసింది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులంతా బంద్‌కు మద్దతు తెలిపినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా కార్యదర్శి అరుణ్ మాట్లాడుతూ, ఖాళీగా ఉన్న టీచర్, MEO, DEO పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని, అలాగే ఇంటర్మీడియట్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అదే విధంగా
పెండింగ్ స్కాలర్షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదల
అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలకు మౌలిక సదుపాయాలు మరియు అవసరమైన నిధుల కేటాయింపు
పెండింగ్ మెస్ బిల్లులు, కాస్మెటిక్ ఛార్జీల విడుదల
అద్దె భవనాల్లో నడుస్తున్న వసతి గృహాలకు స్వంత భవనాల నిర్మాణం
గురుకులాల్లో అమలు చేస్తున్న అశాస్త్రీయ సమయపాలనకు విరుద్ధంగా చర్యలు
బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద పెండింగ్ బకాయిల విడుదల
ఎయిడెడ్ పాఠశాలలకు పెండింగ్ నిధుల మంజూరు
విద్యార్థులకు RTC ఉచిత బస్ పాసుల అందుబాటులోకి తేవడం.

ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న ప్రిన్సిపాల్ మరియు లెక్చరర్ పోస్టుల భర్తీ

NEP-2020ను తెలంగాణలో అమలు చేయకుండా అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేసారు.

ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ శంకరపల్లి నాయకులు హనుమంత్, నవీన్, వరుణ్, వరుణ్ తేజ, అభిరామ, అల్తాఫ్, రాము, విష్ణువర్ధన్, అరవింద్, ఆకాష్, ఋషి, చరణ్ తేజ తదితరులు పాల్గొన్నారు.

మండలంలో బంద్ విజయవంతం..

మండలంలో బంద్ విజయవంతం

ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కుమ్మరి రాజు
మహాదేవపూర్ జూలై 23 (నేటి ధాత్రి )
భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో బుధవారం రోజున విద్యాసంస్థల బంద్ కార్యక్రమం విజయవంతం అయిందని ఎస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి కుమ్మరి రాజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్ర,రాష్ట్ర కమిటీల పిలుపు మేరకు బంద్ నిర్వహణ లో భాగంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కుమార్ రాజు మాట్లాడుతూ మండలం లోని విద్య రంగ సమస్యలు పరిష్కరించాలనీ, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించాలనీ, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలనీ, రెగ్యులర్ ఎంఈఓ డీఈవో పోస్టులను భర్తీ చేయాలనీ, అద్దె భవనాలలో కొనసాగుతున్న గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలనీ, ప్రభుత్వ పాఠశాలల సమస్యలు పరిష్కరించాలనీ, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలనీ, నూతన జాతీయ విద్యా విధానం 2020 ను రద్దు చేసి అసెంబ్లీలో తీర్మానం చేయాలిచేయాలనీ, ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికట్టాలి ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలనీ అన్నారు.

మండలంలో బంద్ విజయవంతం..

మండలంలో బంద్ విజయవంతం

*ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కుమ్మరి రాజు

భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో బుధవారం రోజున విద్యాసంస్థల బంద్ కార్యక్రమం విజయవంతం అయిందని ఎస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి కుమ్మరి రాజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్ర,రాష్ట్ర కమిటీల పిలుపు మేరకు బంద్ నిర్వహణ లో భాగంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కుమార్ రాజు మాట్లాడుతూ మండలం లోని విద్య రంగ సమస్యలు పరిష్కరించాలనీ, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించాలనీ, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలనీ, రెగ్యులర్ ఎంఈఓ డీఈవో పోస్టులను భర్తీ చేయాలనీ, అద్దె భవనాలలో కొనసాగుతున్న గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలనీ, ప్రభుత్వ పాఠశాలల సమస్యలు పరిష్కరించాలనీ, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలనీ, నూతన జాతీయ విద్యా విధానం 2020 ను రద్దు చేసి అసెంబ్లీలో తీర్మానం చేయాలిచేయాలనీ, ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికట్టాలి ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలనీ అన్నారు.

విద్య సంస్థల బంద్ విజయవంతం.

విద్య సంస్థల బంద్ విజయవంతం.

ధనిక రాష్ట్రం అంటూనే మరో వైపు ఖజానా ఖాళీ

వామపక్ష విద్యార్థి సంఘాలు

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-85.wav?_=6

నర్సంపేట,నేటిధాత్రి:

ప్రైవేట్,కార్పొరేట్ పాఠశాలల్లో అధిక పీజులు వసూల్ చేస్తూ విద్య హక్కు చట్టాన్ని ఉల్లంగిస్తున్నారని ఆరోపిస్తూ అలాగే ప్రభుత్వ పాఠశాలలు,గురుకులాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ వివిధ విద్యార్థి సంఘాల పిలుపు మేరకు బుదవారం చేపట్టిన విద్య సంస్థల బంద్ నర్సంపేటలో విజయవంతం అయ్యింది.ఈ నేపథ్యంలో పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగా సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులతో రాస్తారోకో నిర్వహించి విజయవంతం చేశారు.ఈ సందర్బంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు దిడ్డి పార్థసారథి, పీడీఎస్యు జిల్లా అధ్యక్షులు గుర్రం అజయ్,జిల్లా అధ్యక్షులు నరేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వం విద్యార్థి వ్యతిరేక విధానాలు,ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకోడం కారణంగా అధికారాన్ని కోల్పోయింది.కేసీఆర్ ను గద్దేదించే పోరాటాల్లో వామపక్ష విద్యార్థి సంఘాలు ప్రధాన పాత్ర పోషించాయాన్నారు.పేద విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు బకాయిలను పెండింగ్ పెట్టకుండా ఎప్పటికప్పుడు చెల్లిస్తామని,విద్య రంగానికి 15 శాతం నిధులు కేటాయిస్తామని,నిరుద్యోగ సమస్య తీరుస్తామని చెప్పారు.
ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ఇచ్చిన హామీలను అమలు చేస్తూ పెండింగ్ బకాయిలు పెట్టకుండా,విద్య రంగంలో ఉన్నా అన్ని ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తూ,ఫీజు నియంత్రనా చట్టం తీసుకోస్తు, విద్యార్థులందరికి ఉచిత బస్సు పాసులు ఇవ్వాలని కోరారు.

జాతీయ నూతన విద్య విధానాన్ని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలనీ డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 23 న తలపెట్టిన విద్య సంస్థల బంద్ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొని బంద్ ను విజవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈకార్యక్రమలో ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి పైస గణేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు పవన్ వరుణ్, బానోత్ స్టాలిన్, వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు కిరణ్, క్రాంతి ప్రవళిక కళ్యాణి శ్వేత రజిని నాగేంద్ర,గౌతమ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పాఠశాలలు జూనియర్ కళాశాలల బంద్ విజయవంతం.

ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పాఠశాలలు ,జూనియర్ కళాశాలల బంద్ విజయవంతం

విద్యా శాఖ మంత్రిని వెంటనే కేటాయించాలి

పెండింగ్ స్కాలర్షిప్ లను విడుదల చేయాలి

ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గుండెల్లి కళ్యాణ్,మల్లారపు ప్రశాంత్

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-82.wav?_=7

సిరిసిల్ల టౌన్:(నేటిధాత్రి)

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ ) ఆధ్వర్యంలో విద్యా రంగంలో ఉన్న సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతూ పాఠశాలలు, ఇంటర్ కళాశాలల బంద్ విజయవంతం అయ్యిందని తెలిపారు.

Education Minister

ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గుండెల్లి కళ్యాణ్, మల్లారపు ప్రశాంత్ లు మాట్లాడుతూ విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం సిగ్గుచేటని అన్నారు వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించాలనీ,ప్రైవేట్, కార్పోరేట్ విద్యాసంస్థలలో ఫీజు నియంత్రణ చట్టం తీసుకుని రావాలనీ,ఖాళీగా ఉన్న టీచర్, ఎంఇఓ, డిఇఓ, మరియు లెక్చరర్స్,ప్రిన్సిపాల్ పోస్టులు భర్తీ చేయాలనీ,అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకులాల, హస్టల్స్ భవనాలుకు స్వంత భవనాలు నిర్మించాలి.గురుకులాల సమయాన్ని శాస్ర్తీయంగా మార్చాలనీ,NEP -2020 రద్దు చేసి, తెలంగాణ అసెంబ్లీలో అమలు చేయకుండా తీర్మానం చేయాలనీ,పెండింగ్ స్కాలర్ షిప్స్ ,ఫీజు రీయంబర్స్ మెంట్స్ విడుదల చేయాలనీ,పెండింగ్ మెస్, కాస్మోటిక్ ఛార్జీలు విడుదల చేయాలనీ,బడ్జెట్, చిన్న ప్రైవేటు విద్యాసంస్థలకు ప్రభుత్వం ప్రోత్సాహం అందించాలి.ఆర్ధిక సహాకారం అందించాలనీ విద్యాసంస్థల సమయానికి అనుగుణంగా అన్ని గ్రామాల నుండి బస్సు సౌకర్యం కల్పించి విద్యార్థులకు ఉచిత బస్ పాస్ లు ఇవ్వాలనీ అన్నారు.జిల్లాలో నిర్వహించిన బంద్ లో విద్యార్థులు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేశారని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు జశ్వంత్, ఉస్మాన్, షాహిద్, యశ్వంత్, సిద్దు, సాయి, భార్గవ్, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version