మంచిర్యాల బంద్ విజయవంతం.

మంచిర్యాల బంద్ విజయవంతం

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

 

 

జమ్మూ కాశ్మీర్ పెహల్గాం లో పాకిస్తాన్ ఉగ్రమూకలు హిందువులపై దాడి చేసి 25 మందిని కిరాతకంగా చంపేసిన దుశ్చర్యను నిరసిస్తూ శనివారం హిందూ సంఘాల ఐక్య వేదిక మంచిర్యాల బంద్ పిలుపు మేరకు అన్ని వర్గాల ప్రజలు పాల్గొని సంపూర్ణ బంద్ కు మద్దతు ఇవ్వడం జరిగింది.పార్టీ కండువాలు పక్కనపెట్టి మనమంతా హిందువులం అంటూ బైక్ ర్యాలీకి పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయడం చేశారు.హిందూ సంఘాలకు ఐక్య వేదిక అధ్యక్షులు కార్యదర్శి,డేగ రవింద్, కర్ణకంటి రవీందర్ మాట్లాడుతూ హిందువులంతా ఏకమై గర్జించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. ఉగ్రవాదం పై ఒక పాదం మోపి సమూలంగా పాతలానికి తొక్కేయాలని ప్రభుత్వాన్ని కోరారు.బందుకు మరియు బైక్ ర్యాలీకి సహకరించి మద్దతు తెలిపిన అన్ని వర్గాల ప్రజలకు,కుల సంఘాలకు,వ్యాపారస్తులకు, వివిధ పార్టీ ప్రజాప్రతినిధులకు ధన్యవాదములు తెలియజేశారు.

నిరసనగా రామకృష్ణాపూర్ బంద్ ప్రశాంతం..

పహల్గామ్ దాడికి నిరసనగా రామకృష్ణాపూర్ బంద్ ప్రశాంతం..

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం సమీపంలో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ హిందూ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన రామకృష్ణాపూర్ బంద్ ప్రశాంతంగా కొసాగింది. ఈ బందులో రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ, వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా పాల్గొని తమ దుకాణాలను మూసివేసి సంఘీభావం ప్రకటించారు. అమాయకులైన పర్యాటకులను ముష్కరులు లక్ష్యంగా చేసుకొని కాల్పులకు తెగబడడం హేయనీయమైన చర్య అని అందుకే స్వచ్ఛందంగా బందు పాటిస్తున్నామని పలువురు వ్యాపారస్తులు పేర్కొన్నారు. ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version