జూనియర్ కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలి.

జూనియర్ కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి:

ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలలల్లో విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పనకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.
మంగళవారం జిల్లా కలెక్టర్ చాంబర్ లో ఇంటర్మీడియట్ కళాశాలల్లో విద్యనభ్యసించే విద్యార్థుల సౌకర్యార్థం కనీస మౌలిక సదుపాయాలు కల్పనపై విద్యా, టిజిడబ్ల్యూఐడిసి ఇంజినీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూనియర్ కళాశాలల్లో కనీస సౌకర్యాలు కల్పనకు జిల్లాలోని 5 జూనియర్ కళాశాలలకు 41.07 లక్షల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసినట్లు తెలిపారు. ఇట్టి నిధులతో
మౌలిక సదుపాయాలు కల్పనకు ప్రతిపాదనలు అందచేయాలని ప్రిన్సిపాల్స్ ను ఆదేశించారు. ఈ నిధులతో సివిల్ మరమ్మతులు, ఎలక్ట్రికల్, మంచినీరు, పారిశుధ్య కార్యక్రమాలు వంటి సదుపాయాలపై ఫోకస్ చేయాలని, ఇట్టి పనులను ప్రాధాన్యతా ప్రాతిపదికన చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి వెంకన్న డీఈఓ రాజేందర్ టీజడబ్ల్యూఐడిసి డిఈ రామకృష్ణ ఏఈ మహేందర్, జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్స్ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలి

ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలి

ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చుడాలి

ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలి : ఏఐఎస్ఎఫ్

ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మచ్చ రమేష్

కరీంనగర్, నేటిధాత్రి:

 

అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) కరీంనగర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ జిల్లా విద్యాశాఖ అధికారి (డిఈవో) మొండయ్యకి వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఈసందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యారంగాన్ని విస్మరించిందని రాష్ట్రంలో ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలకు కొమ్ము కాస్తుందని తెలంగాణ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు చదువు అందని ద్రాక్షలా మారుతుందని, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందించాలని విద్యార్థులకు యూనిఫామ్స్, పాఠ్యపుస్తకాలు వూర్తిస్థాయిలో అందివ్వాలని పాఠశాలలో సబ్జెక్టు వైస్ గా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు మరియు స్కావెంజర్ పోస్టులు, ప్రతి పాఠశాలకు గ్రంథాలయం, డిజిటల్ క్లాసులకు అవసరమయ్యే ఎక్విప్మెంట్స్ మరియు ఎన్విరాల్న్మెంట్, ఎక్విప్మెంట్స్ పెంచుకునేందుకు ప్రతి పాఠశాలకు జిల్లా వ్యాప్తంగా సరిపడ గ్రాండ్స్ విడుదల చేయాలని అన్నారు.
జిల్లావ్యాప్తంగా కొన్ని పాఠశాలలో కనీసం టాయిలెట్స్, పాఠశాల
కాంపౌండ్ వాల్, కరెంటు, వాటర్ సదుపాయం కల్పించాలని అదేవిధంగా కాలిగా ఉన్న ఎంఈవో పోస్టులను భర్తీ చేయాలని, ఈఅంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించి ప్రభుత్వ పాఠశాలలో సమస్యలను తక్షణమే పరిష్కరించి ప్రభుత్వ విద్యా వ్యవస్థ పై విద్యార్థుల తల్లిదండ్రులకు నమ్మకాన్ని కల్పించేలా చర్యలు చేపట్టాలని లేనిపక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ను ముట్టడిస్తామని రమేష్ హెచ్చరించారు. ఈకార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నగర్ నాయకులు కసిరెడ్డి సందీప్ రెడ్డి, మచ్చ పవణ్, సాయి, వినయ్ తదితరులు పాల్గొన్నారు.

ప్రైవేటు పాఠశాలలలో మౌలిక వసతుల జాడేది.?

ప్రైవేటు పాఠశాలలలో మౌలిక వసతుల జాడేది..?

తీరని విద్యార్థుల దాహం..!

నిబంధనలను బేకాతర్ చేస్తున్న ప్రైవేటు యాజమాన్యాలు

మౌలిక వసతులను పకడ్బందీగా అమలు చేయాలి

జిల్లా,మండల విద్యాశాఖ అధికారికి
సామాజిక కార్యకర్త కర్నె రవి వినతి

 

నేటి ధాత్రి! భద్రాద్రి జిల్లా

విద్యార్థుల నుంచి వేలకు వేల రూపాయలను ఫీజులుగా తీసుకుంటున్న ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులకు కనీస మౌలిక వసతుల కల్పన విషయంలో మాత్రం ఏం పట్టనట్లు వ్యవహ
రిస్తున్నారని, ప్రభుత్వ నిబంధనలు పాటించని ఆయా ప్రైవేట్ విద్యాసంస్థలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, విద్యార్థు
లకు కనీస సౌకర్యాలు కల్పించా
లని, సామాజిక కార్యకర్త కర్నె రవి
జిల్లా విద్యాశాఖ అధికారి కి వినతి పత్రం అందజేశారు. ఈ సంద
ర్భంగా ఆయన మాట్లాడుతూ..
విద్యార్థుల తల్లిదండ్రులను ఆకర్షించేందుకు రకరకాల పేర్లతో పినపాక నియోజకవర్గం లో ప్రైవేట్ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నా యాజమాన్యాలు
ఒలంపియాడ్, టెక్నో, డిజిటల్‌, ఇంటర్‌నేషనల్‌, ఫౌండేషన్‌ వంటి తోక పేర్లతో పాఠశాలలను ఏర్పా
టు చేస్తున్నారని, ఆరోపించారు. ఇలాంటి స్కూల్ లను నిర్వహించ
వద్దని ప్రభుత్వం పలుమార్లు ఆదేశాలు కూడా ఇచ్చింది. కానీ తమను ఆపేది ఎవరన్నట్టు… పలు ప్రైవేటు బడుల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా ముందుకెళ్తున్నా
యన్నారు.ఓవైపు యథేచ్చగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలు…. విద్యార్థులకు కనీస వసతలు కల్పించడంలో విఫలమ
వుతున్నాయని, అగ్రహం వ్యక్తం చేశారు.ప్రైవేటు బడుల నిర్వహణ విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ ఆశించిన మేర అమలు కావటం లేదన్నారు.ఇంగ్లీషు మీడియంపై మోజు, కార్పొరేటు స్కూళ్లపై వ్యామోహంతో తమ బిడ్డల భవిష్యత్ బాగుండాలని ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పిస్తున్న తల్లిదండ్రు
లకు కన్నీరే మిగులుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పీజుల పేరుతో లక్షలు కుమ్మరిస్తున్నా సౌకర్యాలు మాత్రం కరువయ్య
యన్నారు. కోన్ని ప్రైవేట్ పాఠశాల
ల్లో విద్యార్థుల దాహం తీరడం లేదని, పాఠశాలల్లో సౌకర్యాలు మేడిపండు చందంగా ఉన్నాయని పేర్కొన్నారు.రోజంతా బడిలో గడిపే ఆడిపాడే విద్యార్థులకు ఇంటి నుంచి తెచ్చుకునే లీటరు మంచినీరు ఏ మాత్రం చాలడం లేదని,దీంతో పాఠశాలల్లో ఉన్న చేతిపంపులు, కుళాయిలు, వాటర్‌ ట్యాంకుల్లో రక్షితం కాని నీటినే తాగుతున్నారని,దీంతో విద్యార్థు
లు పలు మార్లు జబ్బుల బారిన ఘటనలు ఉన్నాయన్నారు. ఒకవైపు వేసవితో మండే ఎండలు
ఇరుకైన గదులలో విద్యార్థులకు
వేడినీరే ఆధారమవుతుందని, సౌకర్యాలు కల్పించాల్సిన ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు కనీసం స్పందించకుండా కూల్ వాటర్ ను కూడా అందుబాటులో ఉంచకుండా విద్యార్థుల జీవితాల
తో చెలగాటమాడుతున్నాయన్నా
రు.ప్రైవేటు పాఠశాలలలో మౌలిక వసతుల జాడే మచ్చుకైనా కనిపించడం లేదని ధ్వజమెత్తారు.
చాలా ప్రైవేటు పాఠశాలలకు సరైన భవనాలు ఉండటం లేదని,
అద్దెకు భవనాలతో గాలి, వెలుతు
రు కూడా సరిగా లేని బడులు చాలాచోట్ల దర్శనమిస్తున్నాయని,
కొన్ని బడులకు ఫైర్ సెఫ్టీ కూడా లేదని, ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరని ఆయన ప్రశ్నించారు. ప్రతి ప్రవేట్ పాఠశాలలో బిల్డింగ్ నిర్వహణ నుంచి టీచర్ల జీతాల వరకు ఏ విషయం తీసుకున్నా…. లోపాల పుట్ట బయటపడే పరిస్థితులు ఉన్నాయన్నారు. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి ప్రైవేట్ పాఠశాలలలో తనిఖీలు చేపట్టాలని, విద్యార్థులకు కనీస మౌలిక వసతులను కలిపించాలని కర్నెరవి డిమాండ్ చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version