వరంగల్ నగర అభివృద్ధికి పాటు పడతామని కొండా దంపతుల హామీ


కొండా సురేఖను కలిసిన వరంగల్ కాంగ్రెస్ జిల్లా లీగల్ సెల్ చైర్మన్ శామంతుల శ్రీనివాస్

వరంగల్ నగర అభివృద్ధికి పాటు పడతామని కొండా దంపతుల హామీ:-

వరంగల్ హన్మకొండ నేటిధాత్రి (లీగల్):

వరంగల్ నగరంలో అండర్ రైల్వే గేట్ ప్రాంతం మురికి కాలువలతో, ముంపుకు గురి అవుతుందని, శాశ్వత పరిష్కారానికి, మంత్రివర్యులు కొండా సురేఖ గారు అన్ని చర్యలు తీసుకున్నారని, .శాఖరాశికుంఠ 39 డివిజన్ లో అభివృద్ధికి పాటుపతనని హామీనిచ్చారనీ అన్నారు.
ఈ కార్యక్రమం లో కతేరాశాల వేణు గోపాల్, బాసాని శ్రీనివాస్, ముత్యాల విజయ్, రుకాంగ్రెస్ లీగల్ సెల్ చెర్మెన్ శామంతుల శ్రీనివాస్ మహిళా నాయకురాలు, రావుల విజయరాంచందర్, రాధిక, కవిత, మెడిది రజిత, తదితరులు పాల్గొన్నా

వరంగల్ రైల్వే స్టేషన్ పునఃప్రారంభం….

వరంగల్ రైల్వే స్టేషన్ పునఃప్రారంభం….

న్యూ భారత్, న్యూ వరంగల్ రైల్వే స్టేషన్..

అమృత్ భారత్ స్టేషన్ పథకంలో బాగంగా పునరాభివృద్ది చేయబడిన వరంగల్ రైల్వే స్టేషన్,

నూతన హంగులతో, అత్యాధునిక సదుపాయాలతో వరంగల్ రైల్వే స్టేషన్ పునఃప్రారంభం

వరంగల్, నేటిధాత్రి.

 

 

దేశ వ్యాప్తంగా అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా అభివృధి చేసిన దాదాపు 103 రైల్వే స్టేషన్లను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, గురువారం వర్చువల్ గా ప్రారంభించారు. అందులో భాగంగా అమృత్ భారత్ స్టేషన్‌ పథకంలో రూ.25.41 కోట్లతో పునరాభివృద్ధి చేసిన వరంగల్ రైల్వే స్టేషన్ ను కూడా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు.

Railway Station.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డి కే అరుణ, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్, రాష్ట్ర రెవెన్యూ, పౌర సరఫరా, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు.

కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ మాట్లాడుతూ…

Railway Station.

 

భారత ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టాక భారతదేశాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి తీవ్ర కృషి చేస్తున్నారు అని, అందులో భాగంగా రైల్వే శాఖను అభివృద్ధి చేయాలనే దృఢ సంకల్పంతో నరేంద్ర మోడీ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో మూడు రైల్వే స్టేషన్లను నూతన హంగులతో అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేసాం అని అన్నారు. రైల్వే స్టేషన్లో అమృత్ భారత్ రైల్వే స్టేషన్ పథకం ద్వారా సామాన్యులందరీకి అన్ని సదుపాయాలని కల్పించే విధంగా రైల్వే స్టేషన్ పునరుద్ధరించారు.

Railway Station.

 

2014కు ముందు రైల్వే బడ్జెట్కు కేటాయించిన బడ్జెట్ కంటే ఇప్పుడు కేటాయించిన బడ్జెట్ చాలా ఎక్కువ అని, కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి వైపు నడిపిస్తున్న నేపథ్యంలో ప్రజలు నాయకత్వాన్ని అభినందించాల్సిన అవసరం ఉంది అని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో ఇక్కడి నాయకులతో కలిసి పనిచేసిన బంధం, అనుభవం నాకుందని కేంద్ర మంత్రి గుర్తు చేసుకున్నారు. వరంగల్ ప్రజలకు రైల్వే స్టేషన్ పునః ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

పార్లమెంట్ సభ్యులు డి.కె. అరుణ, ఈటల రాజేందర్ మాట్లాడుతూ..

Railway Station.

 

 

నరేంద్రమోదీ నాయకత్వంలో భారత్ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో దానికి సజీవ సాక్ష్యం ఈరోజు పునఃప్రారంభమైన మన వరంగల్ రైల్వే స్టేషన్ అని అన్నారు. ఎయిర్పోర్టులను తలపించే పద్ధతిలో రైల్వే స్టేషన్ అభివృద్ధి చెందుతున్నాయి అని, స్వతంత్రం వచ్చినప్పుడు నుండి 2014 వరకు ఎంత అభివృద్ధి జరిగిందో ఈ పది సంవత్సరాల కాలంలో అంతకంటే వేగంగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పడానికి సజీవ సాక్ష్యం ఈరోజు పునఃప్రారంభమైన బేగంపేట్, కరీంనగర్, వరంగల్ ఇలా 103 రైల్వే స్టేషన్లు అని వారు అన్నారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది.

Railway Station.

 

 

రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఏవైనా ఉండొచ్చు కానీ అన్ని రాష్ట్రాలు సమగ్రంగా అభివృద్ధి చెందితే దేశం బాగుపడుతుందని చెప్పి మోడీ భావిస్తున్నారు అని తెలిపారు. వరంగల్ రైల్వే స్టేషన్ ను ప్రజలకు అంకితం చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేశారు.

Railway Station.

 

ఈ కార్యక్రమంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, నగర మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వి రెడ్డి, వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద దేవి, మున్సిపల్ కమిషనర్ అశ్వినీ తానజీ, సౌత్ జోన్ రైల్వే జిఎం, స్థానిక కార్పొరేటర్ అనిల్, వరంగల్ ఆర్డీఓ సత్యపాల్ రెడ్డి, వరంగల్ తహశీల్దార్ ఇక్బాల్, ఖిలా వరంగల్ తహసిల్దార్ నాగేశ్వర్ రావు, రైల్వే అధికారులు, రైల్వే టెక్నికల్ సిబ్బంది, వీరితో పాటు .

Railway Station.

 

ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు రాష్ట్ర క్రమశిక్షణ సంఘ చైర్మన్ మార్తినేని ధర్మారావు, మాజీ పార్లమెంట్ సభ్యులు అజ్మీర సీతారాం నాయక్, వన్నాల శ్రీరాములు, డాక్టర్ టి రాజేశ్వరరావు, వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంటా రవి కుమార్, బీజేపీ జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Railway Station.

 

వరంగల్ లో సుందరీమణులు ఆహ్వానించిన సీపీ.!

ఖిలా వరంగల్ లో ప్రపంచ సుందరీమణులు

ప్రపంచ సుందరిమణులను సాధరంగా ఆహ్వానించిన వరంగల్ సీపీ

ఖిలా వరంగల్ లో భారీ పోలీస్ బందోబస్తు

వరంగల్ తూర్పు  నేటిధాత్రి :

 

 

మిస్ వరల్డ్ పోటీల సందర్బంగా హెరిటేజ్ టూర్ లో భాగంగా హన్మకొండ, వరంగల్ పర్యటనకై బుధవారం సాయంత్రం హరిత కాకతీయ హోటల్ కు చేరుకున్న వివిధ దేశాలకు చెందిన సుందరిమణులను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సాధరంగా ఆహ్వానించారు.

 

Thousand Pillar

మొదటగా హనుమకొండ లోని వేయి స్తంభాల దేవాలయంలో సందర్శన చేసిన ప్రపంచ సుందరీమణులు, అనంతరం వరంగల్ తూర్పు పరిధిలోని ఖిలా వరంగల్ కోట వద్ద జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరంగల్ పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

 

Thousand Pillar

వరంగల్ డివిజన్ పోలీసులు ఏసీపీ నందిరాం నాయక్ ఆధ్వర్యంలో, ఇంతేజార్గంజ్ సీఐ షుకూర్, మిల్స్ కాలనీ సీఐ వెంకటరత్నం, మట్టేవాడ సిఐ తుమ్మ గోపి, వరంగల్ ట్రాఫిక్ సిఐ రామకృష్ణ, ఎస్సై లు, మహిళా కానిస్టేబుళ్లు బందోబస్తులో పాల్గొన్నారు.

‘‘ఈ’’ ఇద్దరు గులాబీకి చీడనే! పార్టీకి పీడనే!

ఇద్దరు ఐరన్‌ లెగ్గులే?

`ఆ రెండు జిల్లాల ఓటమి వాళ్ల వల్లనే!!

`రెండు జిల్లాల్లో తుడిచిపెట్టుకు పోవడానికి కారణం వాళ్లే?

`ఖమ్మం ఖాళీ కావడానికి పువ్వాడే!

`వరంగల్‌ ఓటమికి కారణం రాకేషే!

`పొంగులేటిని పట్టించుకోక చెడగొట్డింది పువ్వాడ.

`తమ్మలను పక్కనపెట్టి మొదటికే మోసం తెచ్చింది అజయే.

`వరంగల్‌ ఓటమి మొత్తం రాకేష్‌ వల్లనే!

`బీఆర్‌ఎస్‌ నేతలను తిట్టి పార్టీని పలున చేసింది రాకేషే!

`ఆ ఇద్దరి వల్ల కారుకు వచ్చిన పీడనే!

`ఆ ఇద్దరు చెదపట్టినట్లే పార్టీని చెరిపేశారు.

`ఖమ్మంలో కారు తలెత్తుకోకుండా పువ్వాడ చేశాడు.

`రాకేష్‌ నమ్మితే వరంగల్‌ కు ఓటమిని తెచ్చిపెట్టాడు.

`ఈ ఇద్దరు పార్టీని భ్రష్టు పట్టించారు.

`ఖమ్మం కారులో పువ్వాడ చెరి ఖాళీ చేశాడు.

-మంత్రి పదవిలో వుండి అందర్నీ పార్టీకి దూరం చేశాడు.

-ప్రత్యక్ష,పరోక్షంగా ఈ ఇద్దరు పార్టీని కోలుకోకుండా చేశారు.

-వరంగల్‌ లో తలెత్తుకోకుండా రాకేష్‌ చేశాడు.

-బీజేపీలో వుండి రాకేష్‌ బిఆర్‌ఎస్‌ మీద దుమ్మెత్తిపోశాడు.

-కారులో చేరి పొగబెట్టాడు.

-ఎన్నికల ముందు చేరి, చిల్లం చిల్లం చేశాడు.

-బీఆర్‌ఎస్‌ అగ్రనేతలు ఈ ఇద్దరినే నమ్మారు.

-నమ్మిన వాళ్లను ఈ ఇద్దరు నట్టెట ముంచారు.

-ఇప్పటికీ ఆ ఇద్దరికే అగ్రనేతలు ప్రాధాన్యతనిస్తున్నారు.

-ఆ ఇద్దరు వున్నంత కాలం పార్టీ కష్ట కాలం తప్పదు.

-రాకేష్‌ ఒంటెద్దు పోకడలు..పువ్వాడ పనికి రాని లెక్కలు.

-తలకిందులైన కారు అంచనాలు.

-ఇప్పటికీ మించిపోయింది లేదు.

-ఈ ఇద్దరినీ పక్కన పెడితే చాలు.

-కారు జోరందుకోవడానికి పెద్ద సమయం పట్టదు.

-ఈ ఇద్దరి వల్లనే బిఆర్‌ఎస్‌ కు ఉద్యమ కారులు దూరమౌతున్నారు.

-మాజీ ఎమ్మెల్యేలు మధనపడుతున్నారు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:
రాజకీయాల్లో కొంత మందిని గోల్డెన్‌ హాండ్స్‌అంటారు. కొంత మందిని ఐరన్‌ లెగ్స్‌ అంటారు. గోల్డెన్‌ హాండ్స్‌ వల్ల పార్టీకి ఎంతో మేలు జరిగిందని చెప్పుకునే అవకాశముంటుంది. ఐరన్‌ లెగ్గుల వల్ల పార్టీకి ఇబ్బందులు తప్ప జరిగే మేలు ఏమీ వుండదు. ఐరన్‌ లెగ్గులుగా ముద్ర పడిన నాయకుల్లో చాలా వరకు వాళ్లు గెలిచినా, పార్టీ గెలవదు. వాళ్లతోపాటు పార్టీని నిండా ముంచేస్తారు. అలాంటి వారిని రాజకీయ పార్టీలే ఐరన్‌ లెగ్‌లంటూ ప్రచారం సాగిస్తుంటాయి. అలా ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో, ముఖ్యంగా బిఆర్‌ఎస్‌ పార్టీలో ఇద్దరి పేర్లు చెప్పుకుంటున్నారు. ఆ ఇద్దరు ఐరన్‌ లెగ్‌లే కాదు, ఏకంగా రెండు ఉమ్మడి జిల్లాల్లో బిఆర్‌ఎస్‌ పార్టీ ఓటమికి ప్రత్యక్ష, ప్రరోక్ష కారణాలు కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వాళ్లను బిఆర్‌ఎస్‌ నమ్మడమే పాపమైపోయిందని అంటున్నారు. వాళ్ల వల్ల పార్టీకి అణాపైస లాభం జరక్కపోగా, పెద్ద నష్టం మిగిల్చారన్న చర్చ సర్వత్రా జరగుతోంది. పార్టీలో ఆ ఇద్దరి మూలంగా జరిగిన నష్టం భర్తీ కావడానికి కూడా సమయం పట్టేలా వుందంటున్నారు. వారు పార్టీలో వుంటే నాయకులంతా ఒక్కతాటి మీద వుండలేకపోతున్నారు. వారి పెత్తనం సాగుతుంటే పార్టీల నాయకులు సహించలేకపోతున్నారు. ముందుగా ఖమ్మం జిల్లా విషయాన్ని చెప్పుకుంటే పువ్వాడ అజయ్‌ కుమార్‌ తెలంగాణ ఉద్యమకారుడు కాదు. తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చిన నాయకుడు. పువ్వాడ నాగేశ్వరరావు మీద వున్న అభిమానంతో ఆయనను గెలిపించారు. ముందుగా పువ్వాడ కాంగ్రెస్‌లో చేరారు. అక్కడి నుంచి గెలిచారు. తర్వాత 2014ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ గెవడంతో బిఆర్‌ఎస్‌లోకి వచ్చారు. బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంటు కేటిఆర్‌కు సన్నిహితుడయ్యారు. కేటిఆర్‌ వల్ల జిల్లా రాజకీయాల్లో కీలకంగా మారుతూ వచ్చారు. 2018 ముందస్తు ఎన్నికల్లో ఖమ్మం నుంచి గెలిచి, మంత్రి అయ్యారు. 2014నుంచి ఉనికి కోసం తపత్రయ పడ్డ అజయ్‌కుమార్‌ 2018 తర్వాత పెత్తనం చేయడం మొదలు పెట్టారు. మంత్రిగా బాద్యతలు చేపట్టిన తర్వాత సీనియర్‌ నాయకులను పార్టీకి దూరం చేసే ఎత్తుగడలు చేస్తూ వచ్చారు. ఒంటెద్దు పోకడలతో ఇతర నాయకులను పట్టించుకోవడం మానేశారు. ఇతర నాయకుల నాయకత్వాలు ప్రశ్నార్ధకం చేశారు. ముఖ్యంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నాయకత్వాన్ని బలహీన పర్చుతూ వచ్చారు. ఆయనకు ప్రాదాన్యత లేకుండా చేయాలనుకున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు ఆయనను దూరం చేస్తూ వచ్చారు. నిజానికి తుమ్మల నాగేశ్వరావు ఒకప్పుడు కేసిఆర్‌కు మంచి మిత్రుడు. ఆ సాన్నిహిత్యంతోనే తెలంగాణ వచ్చిన తర్వాత ఆయనను కేసిఆర్‌ పిలిచి మరీ పార్టీలోకి ఆహ్వానించారు. ముందు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. తర్వాత మంత్రిగా అవకాశం కల్పించారు. తెలంగాణ అభివృద్దిలో ఆయన అనుభవాన్ని వినియోగించుకోవాలని చూశారు. ఎందుకంటే ముందు నుంచి ఖమ్మం జిల్లా రాజకీయాలను ఒంటి చేత్తో నడిపిని నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు. ఉమ్మడి రాష్ట్రంలో ఖమ్మం జిల్లా రాజకీయాలను ఆయన శాసించారు. సుదీర్ఘ కాలం పాటు తెలుగుదేశం పార్టీ అదికారంలో వున్నంత కాలం మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఖమ్మం జిల్లా అభివృద్దికి బాటలు వేశారు. అలాంటి నాయకుడిని పువ్వాడ అజయ్‌ మంత్రి అయిన నుంచి పక్కన పెట్టడం మొదలు పెట్టారు. 2019 ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వరరావు ఓటమికి కారణమయ్యారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఎందుకంటే పాలేరు ఉప ఎన్నికల్లో మంచి మెజార్టీతో గెలిచిన తుమ్మల తర్వాత జరిగిన 2018 ముందస్తు ఎన్నికల్లో ఓటమి పాలు కావడం అందర్నీ ఆశ్చర్యపర్చింది. తుమ్మల ఓటమికి కారణం పువ్వాడ అన్న విమర్శలు అప్పుడే వచ్చాయి. ఎందుకంటే తుమ్మల 2018 ఎన్నికల్లో గెలిస్తే తనకు ప్రాదాన్యత లభించదని పువ్వాడ ఎత్తులువేసినట్లు చెప్పుకుంటారు. ఇక మరో నాయకుడు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. ఆయన 2014 వరకు తెలంగాణ రాజకీయాలకు పరిచయం లేని నాయకుడు. కానీ ఉప్పొంగిన తరంగంలా తెలంగాణ వచ్చినతర్వాత కూడా ఆయన తెలంగాణలో వైసిపి తరుపున పోటీచేసి గెలిచారు. ఖమ్మం ఎంపిగా ఆయన గెలవడమే కాదు, ఓ ఇద్దరు ఎమ్మెల్యేలను కూడా గెలిపించి, తెలంగాణ రాజకీయాలను తన వైపు తిప్పుకున్నారు. అందరూ ఆయన వైపు చూసేలా చేసుకున్నారు. ఖమ్మం జిల్లాను శాసించే కొత్త నాయకుడు వచ్చాడని అందరూ అప్పుడే అనుకున్నారు. అలాంటి సమయంలోనే కేసిఆర్‌ ఖమ్మం ఎంపిగా వున్న పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన సేవలు వినియోగించుకున్నారు. 2018 ఎన్నికల్లో ఆయనకు అవకాశమివ్వకపోయినా పార్టీ కోసం పనిచేశారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో కూడా టికెట్‌ ఇవ్వకపోయినా పార్టీ కోసం పనిచేస్తూనే వచ్చారు. అలాంటి నాయకుడిని పువ్వాడ అజయ్‌ పార్టీకి దూరం చేస్తూ వచ్చారు. పొంగులేటికి ప్రాదాన్యతనివ్వకుండా చూసుకున్నారు. కేసిఆర్‌ అప్పాయింటు మెంటు కూడా మంత్రి పొంగులేటికి అందకుండా చేశారు. జిల్లారాజకీయాల నుంచి పొంగులేటిని తరిమేయాలని పువ్వాడ చూశారు. కాని ఏమైంది. పువ్వాడ ఓడిపోయారు. కాంగ్రెస్‌లో చేరిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బిఆర్‌ఎస్‌ మీద సవాలు చేశారు. బిఆర్‌ఎస్‌ను ఖమ్మం నుంచి అసెంబ్లీ గేటు తాకుండా చేస్తానన్నారు. అన్నట్లుగానే కాంగ్రెస్‌ను గెలిపించారు. ఖమ్మంలో క్లీన్‌ స్వీప్‌ చేసి చూపించారు. తన రాజకీయ శక్తి ఎంత గొప్పదో రుచి చూపించారు. తను కూడా గెలవలేని పువ్వాడను నమ్ముకొని, ఆయన మాటలు పట్టుకొని పొంగులేటి శ్రీనివాస్‌ను దూరం చేసుకొని పార్టీ ఓటమి పాలైంది. అదే శ్రీనివాస్‌రెడ్డికి బిఆర్‌ఎస్‌లో ప్రాధాన్యత వుంటే బిఆర్‌ఎస్‌ రాజకీయం మరో విధంగా వుండేది. పువ్వాడ తన స్వార్ధ రాజకీయం కోసం పార్టీని నట్టెట ముంచేశారు. ఇప్పుడు కూడా ఆయన వ్యవహారం మారలేదు. ఆయన తీరు ఏ మాత్రం మారలేదనే వ్యాఖ్యలే స్వర్వత్రా వినిపిస్తున్నాయి. పార్టీ కోసం ఆయన చేస్తున్నదేమీ లేదు. ముందు పడతున్నదేమీ లేదు. ఇటీవల జరిగిన పార్టీ రజతోత్సవ సభకు ఇతర నాయకులు తరలించినంత మందిని కూడా పువ్వాడ తలరించలేదని అంటున్నారు. అందువల్ల ఖమ్మం కారు రాజకీయాల నుంచి పువ్వాడను పక్కకు తప్పిస్తే తప్ప ఖమ్మంలో మళ్లీ గులాబీ వికసించదంటున్నారు. బిఆర్‌ఎస్‌కు పూర్వ వైభవం రాదంటున్నారు. ఇక ఉమ్మడి వరంగల్‌ జిల్లా అంటేనే బిఆర్‌ఎస్‌కు కంచుకోట. ఉమ్మడి వరంగల్‌ రాజకీయాల్లో బిఆర్‌ఎస్‌ నాయకులున్నంత బలంగా ఏ పార్టీ లేదు. ఏ పార్టీకి అంత బలవంతమైన నాయకులు లేరు. కాని ఒక్క నాయకుడు మూలంగా వరంగల్‌ బిఆర్‌ఎస్‌ రాజకీయాలు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందన్న మాటలు పార్టీ పెద్దల దాకా చేరడం లేదు. వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో నాయకులు, ఉద్యమ కారులు ఎక్కువ మంది బిఆర్‌ఎస్‌లోనే వున్నారు. ఉద్యమ కాలం నుంచి బిఆర్‌ఎస్‌ పార్టీకోసం పనిచేస్తూనే వున్నారు. పార్టీకి కంచుకోటలు కట్టిన నాయకులున్నారు. అలాంటి పార్టీని చిన్నా భిన్నం చేసిన నాయకుడు రాకేశ్‌రెడ్డిని బిఆర్‌ఎస్‌లోకి తీసుకోవడమే పెద్ద పొరపాటు అంటున్నారు. ఇది బిఆర్‌ఎస్‌ అధినేత కేసిఆర్‌ తీసుకున్న సరైన నిర్ణయం కాదంటున్నారు. ఎవరో చెప్పిన మాటలు నమ్మి, బిఆర్‌ఎస్‌కు తీరని అన్యాయంచేసిన రాకేష్‌రెడ్డికి ప్రాదాన్యత కల్పించడం మంచిది కాదంటున్నారు. ఎందుకంటే బిజేపిలో టికెట్‌ దక్కే అవకాశం లేదని నిర్ధారణ జరిగిన తర్వాత రాకేశ్‌రెడ్డి బిఆర్‌ఎస్‌లో చేరారు. అంతకు ముందు మూడేళ్ల కాలం పాటు రాకేష్‌రెడ్డి తన సోషల్‌ మీడియా, బిజేపిని అడ్డం పెట్టుకొని బిఆర్‌ఎస్‌ మీద తీవ్ర విమర్శలు చేసేవారు. కేంద్రంలో అధికారంలో వున్న బిజేపి అండదండలతో బిఆర్‌ఎస్‌ మీద లేని పోని అబద్దాలు సృష్టించి ప్రచారం చేసేవారు. ఏకంగా పోలీసు శాఖను కూడా పదే పదే అవమానించే రీతిలో మీడియా సమావేశాలు ఏర్పాటుచేస్తుండేవారు. ఇక ఉమ్మడి వరంగల్‌ బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై ఆయన చేసిన అబద్దపు ప్రచారాలను ప్రజలు నమ్మారు. ఎంతో నిజాయితీగా పనిచేసిన ఎమ్మెల్యేలు వున్నారు. అలాంటి మాజీ ఎమ్మెల్యేల మీద కూడా లేనిపోనివి ప్రచారం చేసి, ప్రజల దృష్టిని మరల్చాడు. అంతిమంతా అది కాంగ్రెస్‌కు కలిసొచ్చేలా చేశారు. తీరా ఎన్నికల ముందు రాకేష్‌రెడ్డి బిఆర్‌ఎస్‌లో చేర్చుకోవడం వల్ల ఆయన మరింత నష్టమే జరిగింది తప్ప, మేలు జరగలేదు. వ్యక్తిగతంగా ఆయన కొంత మంది ఎమ్మెల్యేలపై చేసిన ఆరోపణలను సరిదిద్దుకునే ప్రయత్నం చేయలేదు. తాను బిజేపిలో వున్నప్పుడు చేసిన ఆరోపణలు నిజం కాదని చెప్పలేకపోయారు. వరంగల్‌ బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల గెలుపుకోసం పెద్దగా కష్టపడిరది లేదు. కాని ఆయనను తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టికెట్‌ ఇవ్వడంతో బిఆర్‌ఎస్‌ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమైంది. ఎమ్మెల్సీగా వున్న పల్లా రాజేశ్వరరెడ్డి జనగామ ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఉప ఎన్నిక వచ్చింది.. ఆ టికెట్‌ ఉద్యమ కారులకు ఇస్తారని అనుకున్నారు. కాని రాకేష్‌రెడ్డికి ఇస్తారని ఎవరూ ఊహించలేదు. ఆఖరు నిమిషంలో ఆయన పేరు ఖరారు చేయడంతో అందరూ అవాక్కయ్యారు. పైగా రాకేష్‌రెడ్డికి టికెట్‌ ఇవ్వడమే కాకుండా, ఎన్నికల ఖర్చు కూడా మొత్తం బిఆర్‌ఎస్‌ పార్టీయే భరించింది. అదే టికెట్‌, ఖర్చు ఇతర ఉద్యమ నాయకులకు ఎవరికి ఇచ్చినా బిఆర్‌ఎస్‌ గెలిచేది. రాకేశ్‌రెడ్డి బిజేపిలో వున్నంత కాలం బిఆర్‌ఎస్‌కు మద్దతుగా వున్న పత్రికలపై కూడా నిత్యం విషం కక్కుతూ వుండేవారు. నమస్తే తెలంగాణ వంటి పత్రికను కూడా తర్పూర పడుతుండేవారు. ఇప్పుడు అలాంటి రాకేష్‌రెడ్డికి ఆ పత్రికలోనే అధిక ప్రాదాన్యతన్విడంపై బిఆర్‌ఎస్‌ శ్రేణుల్లో అసహనం కనిపిస్తోంది. ఇటీవల జరిగిన బిఆర్‌ఎస్‌ రజతోత్సవాలను పురస్కరించుకొని జరిగిన సభ ఏర్పాటు, నిర్వహణ, బాధ్యతలు రాకేష్‌రెడ్డి తీసుకోలేదు. దాని పర్యవేక్షణ సైతం కనీసం చేయలేదు. రజతోత్సవసభ వేదిక మీద నిర్వాహకుల కన్నా, ఎక్కువ హల్‌చల్‌చేశారు. ఇది నిజమైన ఉద్యమకారులకు ఎంతో ఇబ్బందికరంగా కనిపించింది. ఎందుకంటే రాకేష్‌రెడ్డి తెలంగాణ ఉద్యమకారుడు కాదు. కనీసం ఆది నుంచి బిఆర్‌ఎస్‌ నాయకడు కాదు. మద్దతు దారుడు అసలే కాదు. తెలంగాణ తెచ్చిన నాయకుడిగా కేసిఆర్‌ను గుర్తించిన వ్యక్తి కాదు. కేసిఆర్‌ త్యాగాన్ని ఏనాడు కొనియాడిన నాయకుడు కాదు. తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తుంటే కళ్లు చూసిన నాయకుడు కాదు. కాని తెలంగాణను కేసిఆర్‌ ఆగం చేస్తున్నాడని విమర్శించిన నాయకుడు రాకేష్‌రెడ్డి. తెలంగాణను కేసిఆర్‌ అప్పుల పాలు చేస్తున్నాడన్నారు. కాలేశ్వరం విషయంలో రాకేష్‌రెడ్డి చేసిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. వరంగల్‌ జిల్లాకు చెందిన బిఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులపై రాకేష్‌రెడ్డి అబద్దాలు చెప్పి, చెప్పి వారి ఓటమికి కారణకుడయ్యారు. అలాంటి రాకేష్‌రెడ్డిని తెచ్చి ఆ నాయకుల నెత్తి మీద పెట్టేంత పనిచేయడం సరైంది కాదంటున్నారు. రాకేష్‌ పార్టీలో వున్నా, లాభం లేదని అంటున్నారు. అలాంటి నాయకుడు వల్ల పార్టీకి ఒరిగేదేమీ లేదంటున్నారు

DNSS వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా.!

DNSS వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మారముల్ల యాకూబ్ ఏకగ్రీవ ఎన్నిక

వర్దన్నపేట (నేటిదాత్రి):DNSS

వర్ధన్నపేట పట్టణ మూడో డివిజన్ కు చెందిన మారముల్లా యాకూబ్ ను దళిత నిరుద్యోగ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సోమవారం రోజున డిఎన్ఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల కుమార్ స్వామి ఉత్తర్వులు జారీ చేశారు ఎం యాకోబు ఉద్యమాలు తెలిసిన వ్యక్తి సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తి పోరాట యోధులు అని వారన్నారు ఎన్నుకోబడిన మారుమూల యాకూబ్ మాట్లాడుతూ దళితుల సమస్యల పైన నిరుద్యోగుల సమస్యల పైన నిరంతరం పోరాటాలు

General Secretary

చేస్తానని వారు అన్నారు గౌరవ వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు గారు పై ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించమన్నారు తన ఎన్నికకు సహకరించిన డిఎన్ఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల కుమారస్వామి డిఎన్ఎస్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చల్ల మిథున్ గారు డిఎన్ఎస్ఎస్ రాష్ట్ర కార్యదర్శి కంజర్ల సమ్మయ్య గారు పట్టణ అధ్యక్షులు మునిగాల అరుణ్ కుమార్ గారికి కొండేటి రామచంద్ర గారికి కృతజ్ఞతలు తెలిపారు
ఇట్లు
తుమ్మల కుమారస్వామి
డిఎన్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు
తెలంగాణ రాష్ట్రం

ఇట్లు
మారముల్లా యాకూబ్
డిఎన్ఎస్ఎస్ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి
వరంగల్ జిల్లా
తెలంగాణ రాష్ట్రం

ఛలో వరంగల్ సభను విజయవంతం చేద్దాం..

ఛలో వరంగల్ సభను విజయవంతం చేద్దాం
ఐనవోలు మండల బిఆర్ఎస్ పార్టీ కన్వీనర్ తంపుల మోహన్

 

బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు ఐనవోలు మండలంలోని బిఆర్ఎస్ సైనికులు పెద్ద ఎత్తున పాల్గొని సభను విజయవంతం చేయాలనీ ఐనవోలు మండల బిఆర్ఎస్ పార్టీ కన్వీనర్ తంపుల మోహన్ పిలుపునిచ్చారు.ఈ సభ కోసం దేశం మొత్తం ఎదురుచూస్తుందని
ఇంత పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న వరంగల్ సభ రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉంటుందని అభివర్ణించాడు.రామాయణంలో రాముని కోసం రామదండు లంకకు ఏవిధంగా బయలుదేరిందొ అదేవిధంగా మన అధినేత కెసిఆర్ కోసం మన గులాబీదండు అలాగే బయలుదేరాలని మోహన్ పిలుపునిచ్చారు.ఆదివారం జరగబోయే సభలో మన అధినేత కెసిఆర్ సందేశం కోసం యావత్ తెలంగాణ సమాజం ఎదురుచూస్తుందనారు.
420 హామీలతో ప్రజలను మోసం చేసి అధికారం చేపట్టిన కాంగ్రెస్ కు ఈసభతో వెన్నులో వణుకు పుట్టా లనని అన్నారు.
జాతీయ పార్టీలతో తెలంగాణకు ఒరిగిందేమిలేదని
తెలంగాణ కోసం పుట్టిన మన పార్టీతోనే తెలంగాణకు అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.
మన రాష్ట్రం- మన పార్టీ అనే నినాదంతో ముందుకు సాగాలని మోహన్ పిలుపునిచ్చారు.

అన్ని దారులు వరంగల్ వైపే…

అన్ని దారులు వరంగల్ వైపే

మాజీ మున్సిపల్ కో ఆప్షన్ ఫాతిమా హమీద్

పరకాల నేటిధాత్రి

 

 

రాతెలంగాణ ష్ట్ర ప్రజల కోసంభారత రాష్ట్ర సమితి 25 వసంతాల రజతోత్సవ సభ 27 ఏప్రిల్ నాడు వరంగల్ లోని ఎల్కతుర్తి లో ఆవిర్భవించి అంగరంగ వైభవంగా జరగనుంది.దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో లక్షలాదిగ జనం ఈ సభకు హాజరుకానున్నారు. ఉద్యమపందాతో అధికారంలోకి వచ్చి దశాబ్దం పాటు తెలంగాణ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసి దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అగ్రగామిగా ఉంచిందని కేవలం తెలంగాణా రాష్ట్ర ప్రయోజనార్థం పుట్టిన బీఆరెస్ పార్టీ రేపు 25 వసంతాలు పూర్తి చేసుకోబోతుంది.ఈ సందర్భంగా ఉద్యమ సింహం కేసీఆర్ గారు ప్రజల సంక్షేమంలో విఫలమైన కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ఏం మాట్లాడుతారో ,ప్రజలకు ఎలాంటి భరోసా కల్పిస్తారో అని 4 కోట్ల రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు.రేపు రాష్ట్రం మొత్తం టీవీలు మరియు మొబైల్ ఫోన్ల ద్వారా కేసీఆర్ సభను వీక్షించే అవకాశముంది.భను ఇలాంటి మహోతరమైన సబిఅరెస్ నాయకులు,కార్యకర్తలు, బిఅరెస్ సానుభూతి పరులు,ప్రజలు అత్యధికంగా పాల్గొని సభను విజయవంతం చేయాలని మాజీ మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు ముఫీనా ఫాతిమా హమీద్ కోరారు.

వరంగల్ తూర్పు వర్కింగ్ జర్నలిస్ట్ ల.!

వరంగల్ తూర్పు వర్కింగ్ జర్నలిస్ట్ ల డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సాధనకై జర్నలిస్టులు చేపట్టిన నిరహార దీక్షకి,

“నేటిధాత్రి”

దినపత్రిక ఎండీ కట్ట రాఘవేంద్రరావు,

డైరెక్టర్ కట్టా శివ సుబ్రమణ్యం లు హాజరై సంఘీభావం తెలిపారు..

వరంగల్ రజతోత్సవ సభను విజయవంతం.!

వరంగల్ రజతోత్సవ సభను విజయవంతం.

జహీరాబాద్. నేటి ధాత్రి:

వరంగల్ ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరిగే బిఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు డిసిఎంఎస్ చైర్మన్ చైర్మన్ శివకుమార్,నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.మాజి మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు గారి ఆదేశాల మేరకు బి ఆర్ ఎస్ పార్టీ జహీరాబాద్ మండల ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే, చైర్మన్ గార్లు మాట్లాడుతూ.

Silver Jubilee

27న ఎల్కతుర్తి బిఆర్ఎస్ రజతోత్సవ సభకు నాయకులు తరలిరావాలని ,ఎల్కతుర్తిలో జరుగనున్న రజతోత్సవ సభలో కేసీఆర్‌ తెలంగాణ ప్రజల భవిష్యత్‌ గురించి దిశా నిర్దేశం చేయనున్నారని, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో న్యాల్కల్ మండల పార్టీ అధ్యక్షులు రవీందర్,జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం ,మాజి కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయ చైర్మన్ నర్సింహ గౌడ్,మాజి న్యాల్కల్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింహ రెడ్డి,వీర రెడ్డి,రాజు పటేల్,రాజ్ కుమార్,ప్రవీణ్ కుమార్,రాజేందర్ రెడ్డి,శ్రీకాంత్ రెడ్డి,అశోక్,హనీఫ్ పటేల్,యువత అధ్యక్షులు ఉమేష్ ,మాజి సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షులు రవి కుమార్, మాజి సర్పంచ్ లు ,ఎంపీటీసీ లు ,
గ్రామ పార్టీ అధ్యక్షులు,నాయకులు ,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

వరంగల్ ఎల్కతుర్తిలో రజతోత్సవ సభను.!

వరంగల్ ఎల్కతుర్తిలో రజతోత్సవ సభను విజయవంతం చేయాలి. 

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

వరంగల్ ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరిగే బిఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు నాయకులకు,కార్యకర్తలకు పిలుపునిచ్చారు
మాజి మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు గారి ఆదేశాల మేరకు

Silver Jubilee Celebration

బిఆర్ఎస్ పార్టీ జహీరాబాద్ మండల ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే, మాట్లాడుతూ.ఈనెల 27న ఎల్కతుర్తి బిఆర్ఎస్ రజతోత్సవ సభకు నాయకులు తరలిరావాలని ,ఎల్కతుర్తిలో జరుగనున్న రజతోత్సవ సభలో కేసీఆర్‌ తెలంగాణ ప్రజల భవిష్యత్‌ గురించి దిశా నిర్దేశం చేయనున్నారని, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Silver Jubilee Celebration

ఈ కార్యక్రమంలో మాజి మార్కెట్ చైర్మన్ గుండప్ప ,మాజి ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్,పెంట రెడ్డి,
జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ,మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి ,కోహీర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు,పాక్స్ చైర్మన్ మచ్చెందర్,బీసీ సెల్ మండల అధ్యక్షులు అమిత్ కుమార్,ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు హీరు రాథోడ్,మైనార్టీ మండల అధ్యక్షులు వహీద్,మండల పార్టీ జనరల్ సెక్రటరీ మోహన్ రెడ్డి,మాజి సర్పంచ్ లు చిన్న రెడ్డి,విజయ్ ,అబ్రహం,మాజి ఎంపీటీసీ లు బస్వరాజు,రాములు,శంకర్,గ్రామ పార్టీ
అధ్యక్షులు,నాయకులు ,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

వరంగల్ సభా వేదికసిద్ధం….

వరంగల్ సభా వేదికసిద్ధం….

ప్రతి పల్లె కదలి రావాలి కదం తొక్కుతూ…!

కేటీఆర్ సేన మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు తరుణ్ నాయక్

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

 

వరంగల్ ను గమ్యంగా చేసుకుని రాష్ట్ర వ్యాప్తం గా బిఆర్ఎస్ కార్యకర్త లు, ప్రజలు ఉత్సాహం తో కదలికలోకి వస్తున్నారని. కేటీఆర్ సేన మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు వాంకుడోత్ తరుణ్ నాయక్ తెలిపారు.
“పల్లె పల్లె కదలి రావాలని నినాదంతో ప్రతి ఊర్లో నూ చైతన్యం వెల్లి విరుస్తోందని.
25 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని పూర్తిచేసుకున్న భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) మరోసారి ప్రజల మద్దతుతో ముందుకు సాగేందుకు రెట్టింపు ఉత్సాహంతో సిద్ధమవుతుందని. ఈ సభ కేవలం ఒక రాజకీయ కార్యక్రమం కాదని. ఇది ఒక విశాల సంకల్పానికి సంకేతమని. ఉద్యమాన్ని గుర్తు చే సుకుంటూ, భవిష్యత్తు దిశగా ప్రజలను నడిపించే ప్రయ త్నం. ఉద్యమ కాలం నుంచీ సాధన వరకూ మార్గనిర్దేశ కుడిగా నిలిచిన నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఇప్పుడు భవిష్యత్తు తలుపులు తట్టేందుకు సిద్ధమవు ఉన్నారని తెలిపారు. గ్రామాలన్నీ ఒక్కటై, బండి మీద బండి, పాదా లపై పాదాలు వేసుకుంటూ, ఒకే నినాదంతో ముందుకు సాగుతున్నాయని “మన తెలంగాణ కోసం మళ్లీ కసితో ముందుకు సాగుతోందని ప్రతి వాడలోనూ, ప్రతి గూడెం లోనూ ఉద్యమాత్మక జోష్ చల్లరాని ఉత్సాహాన్ని నింపు తోందని. ఈనేపథ్యంలో, కేటీఆర్ సేన మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు వాంకుడొత్ తరుణ్ నాయక్ ప్రజలకు పిలుపునిచ్చారు.. వెనుకంజ లేదు వెనక్కి తిరిగే అవసరం లేదు. అన్నదమ్ములారా అక్కచెల్లెళ్ళారా బండి ఎక్కండి, కెసిఆర్ సభకు రండి వరంగల్ రజతోత్సవ సభను ఘనవిజయం చేద్దాం అని పిలుపునిచ్చారు.

వరంగల్ సభను విజయవంతం చేద్దాం.

వరంగల్ సభను విజయవంతం చేద్దాం…

– వరంగల్ సభ పోస్టర్ ఆవిష్కరించిన…

– నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత రెడ్డి….

కొల్చారం,( మెదక్) నేటిధాత్రి :-

 

 

ఏప్రిల్ 27వ తేదీన వరంగల్ జిల్లా ఎలకతుర్ధిలో జరగనున్న బి ఆర్ఎస్ పార్టీ రజితోత్సవ సభను విజయవంతం చేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని కొల్చారం మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాంపల్లి గౌరీ శంకర్ తాజా మాజీ ఎంపీపీ మంజుల నాయకులతో కలిసి గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2001 వ సంవత్సరంలో గులాబీ పార్టీ జెండా పట్టి 14 సంవత్సరాలు పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించి తెలంగాణలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి దేశంలోనే తెలంగాణను నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు దక్కుతుందన్నారు. ఏప్రిల్ 27వ తేదీన ప్రతి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించి వరంగల్ భారీ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు బయలుదేరాలని విజ్ఞప్తి చేశారు. వరంగల్ లో జరిగే భారీ బహిరంగ సభకు పార్టీ తరపున వాహనాలు ఏర్పాటు చేస్తామన్నారు. బహిరంగ సభ విజయవంతం చేయడానికి పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ సమావేశాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే సునీత రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో సంగాయిపేట రైతు సంఘం అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి, తుంకులపల్లి సంతోష్ రావు , మోత్కు మల్లేశం, వేమారెడ్డి, పరిగి రమేష్ కుమార్ , బిఆర్ఎస్ మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఎల్కతుర్తిలో రజతోత్సవ సభను విజయవంతం చేయాలని.

వరంగల్ ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరిగే బిఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని.

జహీరాబాద్. నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయలో ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు ,డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ , పార్టీ ముఖ్య నాయకులతో కలిసి ఈనెల 27న వరంగల్ ఎల్కతుర్తిలో జరిగే బిఆర్ఎస్ రచోత్సవ సభకు సంబంధించిన గొడ పత్రిక ను బిఆర్ఎస్ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.ఈనెల 27న ఎల్కతుర్తి బిఆర్ఎస్ రచోత్సవ సభకు జహీరాబాద్ నియోజకవర్గం నుండి సుమారు 5 వేలకు పైగా బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తరలి వెళుతున్నారని అన్నారు. తెలంగాణ ను అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్ దేనని, పదేళ్ల కేసీఆర్ పాలన దేశంలో నంబర్ వన్ గా మారిందని పేర్కొన్నారు.

BRS

కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని పాలించడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి గెలిపించి పెద్ద తప్పు చేశామని ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు. ఎల్కతుర్తిలో జరుగనున్న రజతోత్సవ సభలో కేసీఆర్‌ తెలంగాణ ప్రజల భవిష్యత్‌ గురించి దిశా నిర్దేశం చేయనున్నారని, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజి మార్కెట్ చైర్మన్ గుండప్ప ,మాజి ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్,మాజి జడ్పిటిసి స్వప్న భాస్కర్,జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం ,పాక్స్ చైర్మన్ మచ్చెందర్,సీనియర్ నాయకులు నామ రవికిరణ్,మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్, మొహిద్దీన్,మాజి కౌన్సిలర్ అబ్దుల్లా,ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్,మాజి ఆలయ చైర్మన్ నర్సింహ గౌడ్,మాజి సర్పంచ్ శేఖర్ రెడ్డి,యువ నాయకులు మిథున్ రాజ్,నాయకులు గణేష్ , చంద్రయ్య,దీపక్ తదితరులు పాల్గొన్నారు.

వరంగల్ క్యూర్ వెల్ హాస్పిటల్ లో దారుణం.!

వరంగల్ క్యూర్ వెల్ హాస్పిటల్ లో దారుణం!!

వైద్యం వికటించి బాలింత మృతి

మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ మృతురాలి కుటుంబ సభ్యుల ఆందోళన

ఆసుపత్రి ముందు పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు

ఆసుపత్రి గేటు మూసివేసి ఎవరిని లోపలికి అనుమతించని వైనం.

Hospital

వరంగల్ నేటిధాత్రి.

వరంగల్ ఎంజీఎం సమీపంలోని క్యూర్ వెల్ ప్రసూతి ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. కాన్పు కోసం క్యూర్ వెల్ ఆసుపత్రికి వచ్చిన మహిళ ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆసుపత్రిలో జరిగింది. వివరాలలోకెళితే హనుమకొండ జిల్లా వేలేరు మండలం పీసర గ్రామానికి చెందిన జినుకల ప్రవళిక (25) నిండు గర్భంతో కాన్పు కోసం ఆదివారం రాత్రి 8 గంటలకు క్యుర్ వెల్ ఆసుపత్రిలో అడ్మిట్ అయింది. గర్భిణీకి అన్ని రకాల పరీక్షలు చేసి సోమవారం ఉదయం 9 గంటలకి డెలివరీ కోసం ఆపరేషన్ థియేటర్ కి తీసుకెళ్లారు. 10 గంటలకు ఆపరేషన్ సక్సెస్ అయింది ఆడపిల్ల పుట్టింది తల్లి, బిడ్డ క్షేమంగానే ఉన్నారని కుటుంబ సభ్యులకు వైద్యులు తెలిపారు. అర్థగంట గడవకముందే ప్రవళిక కు తీవ్ర రక్త స్రావం కావడం ప్రారంభమైంది. వెంటనే వైద్యులు మరల ఆపరేషన్ థియేటర్కు తీసుకెళ్లి సుమారు 15 యూనిట్ల రక్తము ఎక్కించడం జరిగింది. అయినను రక్తస్రావం అదుపులోకి రాకపోవడంతో వైద్యులు ప్రవళిక కు గర్భసంచి తొలగిస్తేనే ఎలాంటి ప్రాణాపాయం ఉండదని కుటుంబ సభ్యుల చేత బలవంతంగా సంతకాలు చేయించుకున్నారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో కుటుంబ సభ్యులకు చెప్పకుండా అంబులెన్స్ ను రప్పించి ప్రవళికను అనుకొండలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడానికి ఏర్పాట్లు చేశారు. దీంతో భయాందోళనకు గురైన ప్రవళిక సోదరుడు ప్రవీణ్ మా అక్కను చెప్పకుండా ఎక్కడకు తీసుకువెళ్తున్నారని హుటాహుటిగా అంబులెన్స్ వద్దకు పరిగెత్తే క్రమంలో మెట్ల పైనుంచి జారిపడి కాలు విరగడం జరిగింది. అయినా ఆస్పత్రి యాజమాన్యం పట్టించుకోకుండా ప్రవళికను హనుమకొండలోని ఓ ప్రైవేట్ హాస్పటల్ కు తరలించారు. తీరా అక్కడికెళ్లాక ప్రవళిక మరణించిందని వైద్యులు తెలిపారు. దీంతో ఆందోళనకు గురైన ప్రవళిక భర్త రాజు మరియు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు క్యూర్ వెల్ ఆస్పత్రి వైద్యులను అడగగా మాకు ఏమీ సంబంధం లేదు అన్నట్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారని తెలిపారు. ఖచ్చితంగా ఇది వైద్యుల నిర్లక్ష్యం వల్లనే జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు మాకు సరైన న్యాయం చేయాలని ఆస్పత్రి నందు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. వరంగల్ ఏసిపి నందిరం నాయక్ ఆసుపత్రి వద్దకు వచ్చి ఏలాంటి సంఘటనలు జరగకుండా బందోబస్తు చేపట్టారు. ప్రస్తుతం మృతురాలి కుటుంబ సభ్యులు ఆసుపత్రి యాజమాన్యంతో చర్చలు చేస్తున్నారు.

Hospital

వరంగల్ నూతన సీపీ గా సన్ ప్రీత్ సింగ్ నియామకం.

వరంగల్ నూతన సీపీ గా సన్ ప్రీత్ సింగ్ నియామకం

– రామగుండానికి అంబర్ కిషోర్ ఝా బదిలీ,

– రాష్ట్ర వ్యాప్తంగా 21 మంది ఐపీఎస్‌ ల ట్రాన్స్ ఫర్
ప్రభుత్వ ఉత్తర్వులు జారీ,

వరంగల్, నేటిధాత్రి.

వరంగల్ సీపీ అంబర్ కిశోర్ ఝా ను రామగుండం పోలీస్ కమిషనర్‌గా బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే సూర్యపేట ఎస్పీగా పనిచేస్తున్న సన్ ప్రీత్ సింగ్ ను వరంగల్ కమిషనరేట్ కు బదిలీ చేశారు. రామగుండం పోలీస్ కమిషనర్ గా పనిచేస్తున్న ఎం. శ్రీనివాసును సీఐడీకి బదిలీ చేయగా.. ఆయన స్థానంలో వరంగల్ పోలీస్ కమిషనర్ గా పనిచేస్తున్న అంబర్ కిషోర్ ఝాను ఇక్కడకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి. అదేవిధంగా పెద్దపల్లి డీసీపీగా పనిచేస్తున్న చేతనను తెలంగాణ ఉమెన్స్ సేఫ్టీ వింగ్‌కు బదిలీ చేయగా ఆమె స్థానంలో వెయిటింగ్‌లో ఉన్న నాన్ క్యాడర్ ఎస్పీ పి.కరుణాకర్‌ను బదిలీ చేశారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా 21 మంది ఐపీఎస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది.ఇంటెలిజెన్స్ ఎస్పీగా సింధూశర్మ, వరంగల్ సీపీగా సన్ ప్రీత్ సింగ్‌, రామగుండం సీపీగా అంబర్ కిషోర్ ఝా, కామారెడ్డి ఎస్పీగా రాజేష్ చంద్ర, నిజామాబాద్ సీపీగా సాయి చైతన్య, కంరీంనగర్ సీపీగా గౌస్ ఆలం, ఆదిలాబాద్ ఎస్పీగాఅఖిల్ మహాజన్, నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా రూపేష్, భువనగిరి డీసీపీగా ఆక్షాన్స్ యాదవ్, సంగారెడ్డి ఎస్పీగా పంకజ్ పరితోష్, సిరిసిల్లా ఎస్పీగా గీతే మహేష్‌ బాబా సాహెబ్‌, వరంగల్ డీసీపీగా అంకిత్ కుమార్, మంచిర్యాల డీసీపీగా భాస్కర్‌, పెద్దపల్లి డీసీపీగా కరుణాకర్, సెంట్రల్‌ జోన్ డీసీపీగా శిల్పవల్లి, సూర్యపేట్ ఎస్పీగా నరసింహా, సీఐడీ ఐజీగా ఎం శ్రీనివాసులు, సీఐడీ ఎస్పీగా రవీందర్ బదిలీ అయ్యారు.

వరంగల్ తూర్పులో కేసీఆర్ 72వ జన్మదిన వేడుకలు

కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్

పోచంమైదాన్ లో కేసీఆర్ భారీ కటౌట్ కు పాలాభిషేకం, పులాభిషేకం, పండుగ వాతావరణంల కేసీఆర్ జన్మదిన వేడుకలు.

72వ జన్మదినం సందర్బంగా 72 కిలోల భారీ కేక్ కట్టింగ్ చేసి శుభాకాంక్షలు తెలిపిన నన్నపునేని నరేందర్.

కార్యకర్తలతో, ఫ్లెక్సీలతో, బిఆర్ఎస్ జెండాలతో గులాబీ మయమైన పోచమ్మమైదాన్ జంక్షన్.

నేటిధాత్రి, వరంగల్ తూర్పు

తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 72వ జన్మదినం సందర్బంగా సోమవారం వరంగల్ తూర్పు పొచమ్మమైదాన్ సెంటర్ లో, మాజీ మేయర్, మాజీ శాసనసభ్యులు నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో కేసీఆర్ భారీ కటౌట్ ఏర్పాటు చేసి, ఆ కటౌట్ కు భారీ ఎత్తున పాలాభిషేకం, పులాభిషేకం నిర్వహించి ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నాడు. అనంతరం కార్యకర్తలతో కలిసి భారీ కేక్ ను ఏర్పాటు చేసి కార్యకర్తల నడుమునా వారితో కలిసి కేక్ కట్టింగ్ చేసి కేసీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కార్యకర్తలు అందరూ కలిసి కేసీఆర్ పాటలతో పోచమ్మమైదాన్ జంక్షన్ లో పండుగా వాతావరణంలో ఈ వేడుకలను నిర్వహించుకున్నారు. అనంతరం మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు వృక్షర్చనలో భాగంగా వరంగల్ తూర్పు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో కలిసి సీకేఎం కళాశాల మైదానంలో మొక్కను నాటి కేసీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నరేందర్ మాట్లాడుతు ఈ రోజు మా బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందిరికి ఒక పండుగ రోజు ఒక బీసీ బిడ్డను అయినా నన్ను కేసీఆర్ పేదింటి బిడ్డకూ మేయర్, ఎమ్మెల్యేను చేసి నన్ను ఈ రోజు ఈ స్థాయిలో ఉంచిన కేసీఆర్ కి నా జీవితం మొత్తం రుణపడి ఉంటాను అని అన్నారు.

ఈ రోజు ప్రజలందరూ ఒక్కటే కోరుకుంటున్నారు. మళ్ళీ కేసీఆర్ సారే రావాలి మా జీవితాల్లో వెలుగులు నింపాలి అని ప్రతి వ్యక్తి కోరుకుంటున్నారు, రానున్న రోజుల్లో బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అప్పుడు ఈ జన్మదిన వేడుకలు మరింత ఘనంగా నిర్వహించుకుంటాం అని నరేందర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో 34 వ డివిజన్ కార్పొరేటర్ దిడ్డి కుమారస్వామి, మాజీ కార్పొరేటర్ బయ్య స్వామి, మాజీ మార్కెట్ చైర్మన్ టి. రమేష్ బాబు, మాజీ కార్పొరేటర్ కుందారపు రాజేందర్, డివిజన్ అధ్యక్షులు, మహిళా నాయకురాలు, యూత్ నాయకులు, బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

NIT వరంగల్ లో 1970-75 బ్యాచ్ స్వర్ణోత్సవ వేడుకలు.

“నేటిధాత్రి” వరంగల్.

RECW(NITW) 1970-75 బ్యాచ్ స్వర్ణోత్సవ వేడుకలు NIT వరంగల్ లో గురువారం NITలోని బోస్ హాల్‌లో ప్రత్యేక స్వాగత కార్యక్రమంతో ప్రారంభమయ్యాయి.REC వరంగల్లో మా శిక్షణ సౌజన్యంతో జరిగిన పని గురించి ప్రకాశవంతంగా వివరించిన మా ముఖ్య అతిథి ప్రొఫెసర్ డాక్టర్.పాండురంగారావు, ప్రొఫెసర్ శిరీష్ హరి సోనావానే,ప్రొఫెసర్ వేణు వినోద్,RECW పూర్వ విద్యార్థుల సంఘం సంయుక్త కార్యదర్శి డాక్టర్ రమ హాజరై ప్రసంగించారు.1970-75 బ్యాచ్‌మేట్స్ మరియు వారి జీవిత భాగస్వాములు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆనందించారు. అనంతరం గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ రెండో భాగం గోవాలో జరగనుందని అన్నారు.

డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ పోస్టర్ ఆవిష్కరించిన వరంగల్ ఏసిపి నందిరాం నాయక్.

మత్తు పదార్థాల నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి.

వరంగల్, నేటిధాత్రి

తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ (టీ.ఎస్.జే.యు) ఆధ్వర్యంలో డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం ఫిబ్రవరి 12న చేపట్టబోతున్న 2కే రన్ కార్యక్రమ ప్రచార పోస్టర్ ను గురువారం వరంగల్ సబ్ డివిజన్ పోలీసు కార్యాలయంలో వరంగల్ ఏసిపి నందిరాం నాయక్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మత్తు పదార్థాల నివారణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కోసం ప్రజలను చైతన్యవంతం చేసే కార్యక్రమాన్ని చేపట్టిన తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ సభ్యులకు అభినందనలు తెలిపారు. జర్నలిస్టుల సామాజిక బాధ్యతగా సమాజంలోని రుగ్మతలను దూరం చేసేందుకు ప్రయత్నించడం అభినందనీయమన్నారు. జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలు ఇందు కోసం కృషి చేయాలని కోరారు. ఈ 2కే రన్ లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో టి.ఎస్.జే.యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్, వరంగల్ జిల్లా అధ్యక్షులు కందికొండ మోహన్, ఉపాధ్యక్షుడు కందికొండ గంగరాజు, లింగబత్తిని కృష్ణ, బత్తుల సత్యం, ప్రధాన కార్యదర్శి ఆవునూరి కుమారస్వామి, ఈద శ్రీనాథ్, నాగపురి నాగరాజు, సురేష్, తదితరులు పాల్గొన్నారు.

హ్యాపీ సీడర్ తో వరిలో పంట అవశేషాల నిర్వహణ యొక్క ప్రయోజనాలు

అధునాతన టెక్నాలజీ ద్వారా వరిని హార్వెస్టర్ సహాయంతో కోయడం జరుగుతోంది. ఈ విధానంతో వరి అవశేషాలను సమర్థంగా ఉపయోగించడంలో అసమర్థత ఎదురవుతోంది. వరి అవశేషాలను ఉపయోగించేందుకు అనేక మార్గాలు అందుబాటులో ఉన్నప్పటికీ, వరి కోత మరియు విత్తనాల నాటికి తక్కువ వ్యవధి ఉండటం వల్ల రైతులు తరచుగా ఈ అవశేషాలను దహనం చేస్తారు. ఇది ఖర్చు తక్కువగా ఉండే పరిష్కారం అయినప్పటికీ, పర్యావరణం మరియు ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. వరి అవశేషాలను దహనం చేయడం ద్వారా అధికంగా ధూళి కణాలు (PM 2.5 మరియు PM 10), కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, మరియు మీథేన్ వంటి విష వాయువులు విడుదలవుతాయి. అవశేషాలను సమర్థవంతంగా నిర్వహించడానికి రైతుల వద్ద అవశేషాలను మట్టిలో చేర్చడం, కత్తిరించడం, కోయడం, మల్చింగ్, బెయిలింగ్ మరియు పొలం నుండి అవశేషాలను తొలగించడం వంటి అనేక ఉత్తమ పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. పరిస్థితిని బట్టి ఈ ఆప్షన్లలో ఒకదాన్ని ఎంచుకోవచ్చు. పంట అవశేషాల నిర్వహణను సుస్థిర వ్యవసాయంలో ఒక ముఖ్యమైన అంశంగా పరిగణించవచ్చ. వరి అవశేషాలను ఉపయోగిచుకోవడానికి వివిధ వ్యవసాయ యంత్రాలు, హ్యాపీ సీడర్, జీరో టు డ్రిల్ మరియు రోటో టిల్ డ్రిల్ అనేవి సంప్రదాయ పద్ధతి కాకుండా వాడుకలో ఉన్న సాంకేతికతలు. వాటికీ ప్రభుత్వం కూడా సబ్సిడీ ఇస్తుంది. వాటిలో హ్యాపీ సీడర్ టెక్నాలజీ చాలా వరి అవశేషాలను ఉపయోగిచడం లో సమర్థవంతంగా పనిచేస్తుంది. హ్యాపీ సీడర్ అనేది ప్రస్తుత వ్యవసాయ అవసరాలను తీర్చగల సాంకేతిక పరిజ్ఞానంలో ఒక విప్లవాత్మక పరికరం. హ్యాపీ సీడర్ అనేది ట్రాక్టర్ ఆధారిత యంత్రం, ఇది వరి గడ్డిని కత్తిరించి పైకి తీసేస్తూ, ఖాళీ మట్టిలో విత్తనాలను నాటుతుంది మరియు గడ్డిని మల్చ్‌గా విత్తనాలపై నిల్వ చేస్తుంది. హ్యాపీ సీడర్, ఈ విధంగా, గడ్డి మల్చింగ్, విత్తనాల నాటడం, మరియు ఎరువుల డ్రిల్లింగ్‌ను ఒకే పాస్‌లో చేర్చుతుంది. ఈ సాంకేతికతను ఉపయోగించడం ద్వారా రైతులు పంట అవశేషాలను మట్టిలో కలిపి, ఫలితంగా నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చు. హ్యాపీ సీడర్ వలన పొందే ప్రయోజనాలలో నీటిపారుదల నీటి వినియోగం, విత్తనాలు, ఎరువుల వినియోగం, శక్తి మరియు ఉత్పత్తి వ్యయాలను తగ్గించడం ఉన్నాయి. పంట అవశేషాల సంరక్షణ సాంకేతికత ద్వారా ఈ ప్రయోజనాలను సాధించవచ్చు. ఇది వరి గోధుమల మల్చింగ్ విధానంలో కొత్త మార్గాలను తెరిచింది. పంట వ్యర్థాలను సస్య ద్రవ్యంగా ఉపయోగించి, నేల జీవవైవిధ్యాన్ని మెరుగుపరిచే ఈ పరికరం రైతులకి ఆర్థిక మరియు పర్యావరణ పరిరక్షణలో కీలకంగా ఉంది. ఈ పరికరంలో ప్రత్యేకమైన రోటర్ బ్లేడ్‌లు ఉంటాయి, ఇవి వరి తొడుగును కోయడం ద్వారా ఒకే సమయంలో విత్తనాలను నేలలో పడేస్తాయి.

రోటర్ వేగాలు మరియు తేమ శాతం వ్యవసాయ పనితీరును ప్రభావితం చేస్తాయి. గోధుమ పంటను నాటడానికి ముందు వరి గడ్డిని కాల్చకుండా నిర్వహించడానికి హ్యాపీ సీడర్ అత్యంత ఆర్థికమైన పద్ధతిగా తేలింది. వరి గడ్డిని తొలగించకుండా గోధుమ విత్తనాలు నాటడానికి ఇది ఉపయోగించబడింది. హ్యాపీ సీడర్ యొక్క రోటర్ యాంటిలాక్ వైజ్ దిశలో తిరుగుతుంది. రోటర్ ఫ్లేల్స్ పొలం నేల నుండి 2-3 సెం.మీ ఎత్తులో తిరుగుతూ అవశేషాలను శుభ్రపరుస్తాయి. రోటర్ వేగం గడ్డి లోడ్ మరియు తేమ ద్వారా ప్రభావితమవుతుంది. పరికరం ఉపయోగించే శక్తి వనరు 45-55 హార్స్ పవర్ మధ్య ఉంటుంది. ఇది త్రీ పాయింట్ లింకేజ్ హిచ్ టైప్‌తో కూడి ఉంటుంది. క్యాట్-1, క్యాట్-2 కేటగిరీలకు అనుగుణంగా రూపొందించబడింది. ఈ యంత్రం 11 టైన్లను కలిగి ఉంటుంది, వీటిలో వరుసల మధ్య దూరం 225 మిమీ. ఫ్యూరో ఓపెనర్లు ఇన్వర్టెడ్ టి-రకానికి చెందినవి. రోటార్ డ్రమ్ వ్యాసం 700-800 మిమీ మధ్య ఉండగా, రోటార్ షాఫ్ట్ వ్యాసం 130-150 మిమీ మధ్య ఉంటుంది. ట్రాక్టర్ పిటిఒ 540 ఆర్‌పిఎమ్ వద్ద నడుస్తున్నప్పుడు, రోటర్ 1000-1600 ఆర్‌పిఎమ్ వేగంతో పనిచేస్తుంది. ఫ్లేయిల్ బ్లేడ్లు రివర్సబుల్ గామా రకానికి చెందినవి. రోటర్ ఉపరితలం నుండి బ్లేడ్ పొడవు 240 మిమీ, బ్లేడ్ మొత్తం పొడవు 85 మిమీ. మీటరింగ్ కోసం ఫ్లూటెడ్ రోలర్ యంత్రాంగాన్ని ఉపయోగించి విత్తనాలు పంపిణీ చేయబడతాయి. ఎరువులను గ్రావిటీ ఫీడ్ లేదా తుప్పు పట్టిన రోలర్ రకంతో అందిస్తారు. మీటరింగ్ మెకానిజానికి శక్తి లగ్డ్ గ్రౌండ్ వీల్ ద్వారా గొలుసులు మరియు స్ప్రాకెట్లతో ప్రసారం అవుతుంది.

ఫలితాలు మరియు ప్రయోజనాలు

  1. హ్యాపీ సీడర్ వాడటం వల్ల పంట వ్యర్థాలను దహనం చేయవలసిన అవసరం ఉండదు. దీని వల్ల వాయు కాలుష్యం తగ్గుతుంది.
  2. మల్చింగ్ వల్ల నీటి ఆవిరి కావడం తగ్గుతుంది. ఇది నీటిని పొదుపు చేయడంలో సహాయపడుతుంది.
  3. హ్యాపీ సీడర్ వివిధ రోటర్ వేగాలతో పని చేయగలదు. దీనివల్ల వివిధ మట్టి తేమ స్థితులలో కూడా ఉత్తమ పనితీరు అందించగలదు.
  4. ఈ పరికరం వ్యవసాయ ఖర్చులను తగ్గిస్తుంది, ముఖ్యంగా చేతి పనిని మరియు ఇంధనాన్ని ఆదా చేస్తుంది.

Dr. KALLURI PRAVEEN 

Assistant Professor

Dept. of Agriculture Engineering,

SoA, SR University, Warangal, Telangana, India.

Phone: +91- 9542424278

జగన్నాటకం”లో.. “మహేంద్రుడి” మాయాజాలం

“మహేంద్రుడి” మెడకి చుట్టుకొనున్న “సివిల్ సప్లై” “ట్రాన్స్పోర్ట్ ఫ్రాడింగ్”!

 

“చెక్కు రిలీజ్” అయ్యిందో మహేంద్రుడి కి ఇక చుక్కలే!

 

మంత్రి ఉత్తమ్ ఆగ్రహానిక లోను కాక తప్పదు.

 

ఉద్యోగం ఊడకా తప్పదు!

 

“సివిల్ సప్లై” లో అవినీతి తీమంగళం “మహేంద్రుడు”!

 

ట్రాన్స్పోర్టేషన్ పేరుతో కోట్లకు కోట్లు ప్రభుత్వ సొమ్ము సిండికేట్ గా దోచేస్తున్నారు?

 

అవినీతికి పాల్పడుతున్న బినామీలు ఇక జైలుకే?

 

ప్రభుత్వ సొమ్ము పప్పు ఫలహారంగా పంచుతున్న మహేంద్రుడు!

 

“చెక్కు రిలీజ్” అయిన మరుక్షణమే “ప్రభుత్వం” పై ముపెట్ట దాడి చేయనున్న ప్రతిపక్షాలు?

 

బినామీలుగా ఉన్న వారంతా మిల్లర్ల అనుచర వర్గమే?

 

ఒక్క జిల్లాలోనే “కోట్ల” రూపాయలు అవినీతి ఉంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం ఎన్ని “వందల కోట్ల” అవినీతి ఉండాలి?

“మంత్రి” కే కాదు “కమిషనర్” కి కూడా తెలియని యవ్వారం?

త్వరలో మీ “నేటిధాత్రి”లో

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version