ప్రధాని నరేంద్ర మోడి భారీ బహిరంగ సభను జయప్రదం చేయండి

ప్రధాని నరేంద్ర మోడి భారీ బహిరంగ సభను జయప్రదం చేయండి

బిజెపి జిల్లా మీడియా కన్వీనర్ ఊరటి మునెందర్

భూపాలపల్లి నేటిధాత్రి

భారత ప్రధాని నరేంద్ర మోడీ మూడోసారి గెలిచిన తరువాత తెలంగాణకు మొదటిసారిగా విచ్చేస్తున్న సందర్భంగా రేపు హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించ తలపెట్టిన భారత ప్రధాని నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభకు భూపాలపల్లి జిల్లా ప్రజలు,పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని భారతీయ జనతా పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మీడియా కన్వీనర్ ఊరటి మునేందర్ ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.
​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని దేశాభివృద్ధిలో భాగస్వామ్యం చేయడమే లక్ష్యంగా ప్రధాని మోదీ ఈ సభకు వస్తున్నారని తెలిపారు.కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు,అభివృద్ధి పనులకు ఆకర్షితులై ప్రజలు స్వచ్ఛందంగా బీజేపీ వైపు వస్తున్నారని ఆయన పేర్కొన్నారు.ఈ బహిరంగ సభ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని, జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామల నుంచి బీజేపీ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండల నాయకులు,శక్తి కేంద్ర ఇన్చార్జిలు,బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు,అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన కోరారు.

అత్నూర్ గ్రామంలో రూ.10 లక్షల సైడ్ డ్రైనేజీ పనులు ప్రారంభం…

అత్నూర్ గ్రామంలో రూ.10 లక్షల సైడ్ డ్రైనేజీ పనులు ప్రారంభం

జహీరాబాద్ నేటి ధాత్రి:

https://youtu.be/FvRqDzK6-PU?si=-2MLBuxUJemVBUgU

 

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం అత్నూర్ గ్రామంలో బుధవారం సైడ్ డ్రైనేజీ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఉపాధి హామీ పథకం ఎంపీ కోటా కింద మంజూరైన రూ.10 లక్షల నిధులతో ఈ పనులు చేపట్టారు. గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని నాయకులు తెలిపారు. ఈ పనులు గ్రామ అభివృద్ధికి దోహదపడతాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ, నూతన సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, పంచాయతీరాజ్ అధికారులు పాల్గొన్నారు.

మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ కు కృతజ్ఞతలు 22వ వార్డు కౌన్సిలర్ బుర్ర రమాదేవి – సదానందం…

మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ కు కృతజ్ఞతలు 22వ వార్డు కౌన్సిలర్ బుర్ర రమాదేవి – సదానందం

భూపాలపల్లి నేటిధాత్రి

మున్సిపాలిటీ 22వ వార్డు కౌన్సిలర్ బుర్ర రమాదేవి – సదానందం గౌడ్ గణేష్ చౌక్ ప్రాంత పునర్వైభవం కోసం చేస్తున్న కృషికి తొలి విజయం లభించింది. ఈ ప్రాంతంలో ప్రభుత్వ కార్యాలయాలు, వారసంత, బస్టాండ్ పునరుద్ధరించాలని కౌన్సిలర్ గతంలోనే జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది
మున్సిపల్ పాలకవర్గం, బుధవారం నాడు గణేష్ చౌక్ నుండి లక్ష్మీ నగర్, శాంతి నగర్, హనుమాన్ నగర్, సి.ఆర్. నగర్ కాలనీల వరకు ఉన్న ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్ స్వయంగా ఎర్ర చెరువు ప్రాంతాన్ని సందర్శించి, క్షేత్రస్థాయిలో స్థల పరిశీలన చేశారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ బుర్ర రమాదేవి సదానందం గౌడ్ మాట్లాడుతూ
మా వార్డులోని గణేష్ చౌక్ ప్రాంతం వెనుకబడకూడదని మొదట కలెక్టర్ కి వినతి పత్రం ఇచ్చాం వెంటనే స్పందించిన మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు
పాత గ్రామ పంచాయతీ స్థలంలో సబ్ రిజిస్టర్ కార్యాలయం బస్టాండ్ ఆటో నగర్ అంగన్‌వాడీ ప్రత్యేక భవనాల ఏర్పాటు చేయాలని అయినా అధికారులకు తెలిపారు

భూ సేకరణ దరఖాస్తు పనులను వేగవంతం చేయాలి

భూ సేకరణ దరఖాస్తు పనులను వేగవంతం చేయాలి

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల,నేటి ధాత్రి:

జిల్లాలో జాతీయ రహదారుల విస్తరణలో భాగంగా చేపట్టిన భూసేకరణకు సంబంధించి దరఖాస్తుల పరిష్కారం పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని రాజస్వ మండల అధికారి కార్యాలయాన్ని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్ రావు తో కలిసి సందర్శించి దరఖాస్తుల పరిష్కారం వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అభివృద్ధిలో భాగంగా భారత జాతీయ రహదారుల సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలో చేపట్టిన 63, 163జి రహదారుల ఏర్పాటులో భాగంగా జిల్లాలోని ప్రాంతాలకు సంబంధించిన దరఖాస్తుల పరిష్కార చర్యలను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

చేర్యాల కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులనే గెలిపించండి…

చేర్యాల కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులనే గెలిపించండి

కాంగ్రెస్ పార్టీ చేర్యాల మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ముస్తాల తేజ

చేర్యాల నేటిదాత్రి

 

చేర్యాల మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ చేర్యాల మున్సిపల్ చైర్మన్ 2 వార్డ్ అభ్యర్థి ముస్తల తేజ అన్నారు ఈ సందర్భంగా తన సొంత వార్డులో ప్రచారం నిర్వహిస్తూ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ ఫలాలు ప్రజలందరి మనసును దోచుకున్నదని చేర్యాల మున్సిపల్ మేము హస్తగతం చేసుకుంటామని

అన్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సంక్షేమ ఫలాలను వివరిస్తూ గృహజ్యోతి ఇందిరమ్మ ఇండ్లు మరియు ఆర్టీసీ మహిళలకు ఉచిత ప్రయాణం పేదలకు సన్న బియ్యం వంటి ఎన్నో సంక్షేమ ఫలాలను ప్రభుత్వం అందిస్తుందని అన్నారు చేర్యాల మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో ముందు ఉంచుతానని మరియు ప్రజలందరికీ సేవ చేయడానికి మీ ముందుకు వచ్చానని రెండో వార్డ్ కౌన్సిలర్ గా నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని కోరారు గత 10 సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో చేర్యాల పట్టణాన్ని అగాధంలో నెట్టివేశారని అన్నారు ఈ కార్యక్రమంలో భూమి గారి మనోహర్ ముస్తాల స్టీవెన్ కాటం సంజీవయ్య చెవిటి లింగం భూమిగారి మహేందర్ ముస్తాల కిష్టయ్య పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు మరియు మహిళలు పాల్గొన్నారు

ప్రతిఇంటికి మిషన్ భగీరథ పైప్ లైన్…

ప్రతిఇంటికి మిషన్ భగీరథ పైప్ లైన్
33 వ వార్డు కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎస్ ఎల్ ఎన్ మాధవిని గెలిపించాలి
వనపర్తి నేటిధాత్రి .

 

వనపర్తి జిల్లా కేంద్రంలో 33 వ వార్డు నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి.మున్సిపల్ కౌన్సిలర్ గా పోటీ చేస్తున్న అభ్యర్థి ఎస్ ఎల్ ఎన్ మాధవిని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాధవి భర్త ఎస్ ఎల్ ఎన్ మిడిదొడ్డి రమేష్ నేత నరహరి నరేష్ ప్రజలను కోరారు 33 వ వార్డు ఎన్నికల ప్రచారంలో బాగంగా శ్రీ బాలాజీ వాకింగ్ టీం సభ్యుల ను ఆర్యవైశ్యులను కలిశారు ఈ సందర్భంగా ఎస్ ఎల్ ఎన్ మాధవి రమేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి ఆశీస్సులతో 33 వ వార్డు ను అభివృద్ధి చేస్తామని చేసేది చాలా ఉన్నదని అభివృద్ధి చేసి చూపిస్తామని మాధవి రమేష్ వార్డు ప్రజలకు హామీ ఇచ్చారు పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు రేషన్ కార్డ్ లు లేని పేద ప్రజలకు ఇప్పి స్తామని హామీ ఇచ్చారు వార్డు లో హైమాట్స్ లైట్స్ నూతన డ్రైనేజీలో ప్రతి ఇంటికి మిషన్ భగీరథ పైప్ లైన్ వేయిస్తామని 33 వ వార్డు ప్రజలకు హామీ ఇచ్చారు వనపర్తి మున్సిపల్ చైర్మన్ గా ఆర్యవైశ్య మహిళాకు వచ్చే అవకాశం ఉన్నదని మాధవి ప్రజలకు వివరించారు ఈమేరకు వనపర్తి 33 వ వార్డు ప్రజలు కౌన్సిలర్ గా గెలిపించాలని సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేత ఎస్ ఎల్ ఎన్ మాధవి రమేష్ కోరారు ఎన్నో సంవత్సరాలకు మహిళ జనరల్ కు 33 వ వార్డు కౌన్సిలర్ గా పోటీ చేయడానికి అవకాశం వచ్చిందని వారు పేర్కొన్నారు ఆర్యవైశ్య చిరు వ్యాపారులకు ఆర్యవైశ్య కార్పొరేషన్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే మెగా రెడ్డి ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి కల్వ సుజాత దృష్టికి తీసుకువెళ్లి రాజీవ్ యువశక్తి ద్వారా రుణాలు ఇప్పించుటకు కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎస్ ఎల్ ఎన్ మాధవి రమేష్ హామీ ఇచ్చారు రాష్ట్రంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ గతంలో కాలేదని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి న వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటుచేసి చైర్మన్ గా శ్రీమతి కల్వ సుజాతకు ఆర్యవైశ్య కార్పొరేషన్ పదవి అప్పగించారని మాధవి గుర్తు చేశారు ఈ మేరకు వనపర్తి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వ్యాపారి నరహరి నరేష్ వనపర్తి శ్రీ బాలాజీ వాకింగ్ టీం అధ్యక్షులు కలకొండ శ్రీనివాసులు పోలిశెట్టి మురళి గోకారం కృష్ణమూర్తి రాజు చిదిరే రాజు కందికొండ సాయిరాం సి వి రామన్ కళాశాల ప్రిన్సిపల్ ప్రసాద్ లగిశెట్టి వెంకటేష్ కాంగ్రెస్ పార్టీ నేత ఎస్ ఎల్ ఎన్ రమేష్ కుటుంబ సభ్యులను తిరుమ లయ్య గుట్టకు తిరుమల లేషుని దర్శనానికి రావాలని వాకిoగ్ టీము సభ్యులు కలకొండ శ్రీనివాసులు గోకారం రాజు పొలిశెట్టి మురళీ కాంగ్రెస్ నేత నరహరి నరహరి నరేష్ ఆహ్వానిoచారు ఈమేరకు 33 వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి ఎస్ ఎల్ ఎన్ మాధవి విజయం సాధించుటకు కృషి చేస్తామని సంపూర్ణ మద్దతు ఇస్తామని అవొప బాలాజీ వాకింగ్ టీము సబ్యలు ఎస్ ఎల్ ఎన్ రమేష్ కు హామీ ఇచ్చారు ఈకార్యక్రమంలో ఆర్యవైశ్య లు బచ్చురాం మోహన్ కోలాటము శిక్షణ పొందే వారు తదితరులు పాల్గొన్నారు

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం…

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

తంగళ్ళపల్లి మండలంలో పలు గ్రామాల నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు సిరిసిల్ల జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం నిర్వహిస్తూ .గెలిపే లక్ష్యంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి ఆదేశాల మేరకు తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జలగం.ప్రవీణ్ .సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చొప్పదండి.ప్రకాష్ గారి ఆధ్వర్యంలో మూడో వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాముని వనిత.నలినికాంత్ గారి తో. ప్రచారంలో తంగళ్ళ పల్లి మండలం నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆధ్వర్యంలో వాడవాడల గడపగడప తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాముని వనిత నలినీ కాంత్ గెలుపే లక్ష్యంగా ప్రచారం నిర్వహిస్తున్నామని తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలనుదృష్టిలో పెట్టుకొని అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందు .ఉంచుతున్నారని. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ఎన్నో కష్టనష్టాలు ఓర్చుకొని గత పాలకులు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిఅప్పుల పాలు చేస్తే దాన్ని అధిగమిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకువస్తూ అన్ని వర్గాల ప్రజలకు పార్టీలకతీతంగా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మూడవ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాముని వనిత నలిని కాంత్.గార్లను మీ ఆశీర్వాదంతో అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రచారం చేస్తూ ఓటు అభ్యర్థిస్తూ ఓటర్లనువేడుకోవడం జరిగిందని సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో. మార్కెట్ కమిటీ చైర్మన్ వేల్పుల స్వరూప తిరుపతిరెడ్డి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యూత్ నాయకులు ఎన్ ఎస్ యు ఐ నాయకులు పార్టీ కార్యకర్తలు మహిళా పార్టీ నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

టిడిపి నేత జేబీ శ్రీనివాస్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ

అవ్వ, తాతల ముఖాల్లో ఆనందం చూడటమే కూటమి ప్రభుత్వం లక్ష్యం…
ఇంటి ఇంటికి వెళ్లి పెన్షన్లను పంపిణీ చేసిన టిడిపి నేత జేబీ శ్రీనివాస్

తిరుపతి(నేటి ధాత్రి:

అవ్వ తాతల ముఖాలలో చిరునవ్వు చూడటమే టిడిపి కూటమి ప్రభుత్వం లక్ష్యమని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత జేబీ శ్రీనివాస్ అన్నారు. శనివారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను నగరంలోని 5, 6, 7, 8, 9 డివిజన్లలో ఉదయం 6 గంటల నుండి రెండవ క్లస్టర్ ఇంచార్జ్ జేబీ శ్రీనివాస్ పర్యటించి అర్హులైన వృద్దులు, వికలాంగులు, వితంతువులకు వారి ఇళ్ళకు వెళ్లి జేబీ శ్రీనివాస్ పెన్షన్లను అందజేశారు. ఆయా డివిజన్ ల
లో ఏవైనా సమస్యలు ఉన్నాయా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. పలువురు తమ సమస్యలను జేబీ శ్రీనివాస్ దృష్టికి తేవడంతో వాటిని పరిష్కరించే దిశగా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం మీడియాతో జేబీ శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రతినెల 1వ తేదీ ఇవ్వాల్సిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పార్టీలకు అతీతంగా అర్హులైన వారందరికీ ఒక రోజు ముందుగానే పంపిణీ చేయడం జరిగిందన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఇప్పటికే 90% హామీలను నెరవేర్చడం జరిగిందని పేర్కొన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో పాటు మూడు సిలిండర్ల గ్యాసు అందించడం జరిగిందన్నారు. రాబోయే రోజులలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రం దేశంలో నెంబర్ వన్ స్థానంలో అభివృద్ధి చెందడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రఘురాం, ఆయా డివిజన్ల అధ్యక్షులు, కార్యదర్శులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

జహీరాబాద్ మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి

జహీరాబాద్ మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగిరేలా కృషి చేయాలని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. గాంధీభవన్లో శనివారం జరిగిన జహీరాబాద్ పార్లమెంటు ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కార్యకర్తలు క్షేత్రస్థాయికి వెళ్లి ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు.తమ ప్రభుత్వం రెండు సంవత్సరాల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేయడంతో పాటు రేషన్‌ దుకాణాల్లో సన్నబియ్యం, కొత్త రేషన్‌కార్డులు ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానిదేనని తెలిపారు. నియోజకవర్గంలోని మున్సిపాలిటీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, అజారుద్దీన్, ఎంపీ సురేష్ షెట్కర్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి పాల్గొన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి భూపాలపల్లి పర్యటన విజయవంతం కావాలి

సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయండి

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

భూపాలపల్లి నేటిధాత్రి

మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి త్వరలో భూపాలపల్లికి రానున్నారని, వారి పర్యటనను భూపాలపల్లి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నేతలు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, ప్రజలు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పిలుపునిచ్చారు. ఈమేరకు (శనివారం) ఎమ్మెల్యే జీఎస్సార్ రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు, వివిధ మండలాల అధ్యక్షులతో కలిసి గణపురం మండలం చెల్పూరు గ్రామ శివారులోని కర్నాలకుంట చెరువు పక్కన ఉన్న ఖాళీ మైదానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీఎస్సార్ నాయకులకు, పోలీసులకు పలు సూచనలు చేశారు. సభా వేదిక ఏర్పాటు, హెలీ ప్యాడ్, వాహనాల పార్కింగ్ తదితర ఏర్పాట్లపై ఎమ్మెల్యే గణపురం సిఐ కరుణాకర్ రావు, ఎస్సై అశోక్ తో చర్చించారు.

కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే
రేగొండ మండలంలోని కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్ పలువురు ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ ముఖ్య నేతలతో కలిసి దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణం మొత్తం కలియ తిరుగుతూ, జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. పనులన్నీ యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సూచనలు చేశారు. అనంతరం అక్కడ జరిగిన రేగొండ కొత్తపల్లిగోరి మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులతో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి పలు సూచనలు చేశారు. రెండు మండలాల్లోని అన్ని గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు తరలిరావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

జహీరాబాద్‌లో ఎంఐఎం అభ్యర్థి మహమ్మద్ రఫీ నామినేషన్

జహీరాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి మహమ్మద్ రఫీ నామినేషన్ దాఖలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ మున్సిపాలిటీ 14వ వార్డు నుంచి ఎంఐఎం పార్టీ అభ్యర్థిగా, జహీరాబాద్ ఎంఐఎం పార్టీ జనరల్ సెక్రెటరీ, మహమ్మద్ రఫీ తన నామినేషనన్ను దాఖలు చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, గతంలోనూ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పనిచేశానని ఆయన తెలిపారు. రాబోయే ఎన్నికల్లో తనను 14వ వార్డు కౌన్సిలర్గా గెలిపిస్తే వార్డు మరియు మున్సిపాలిటీలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తానని, 14వ వార్డు అభివృద్ధి, ప్రజల సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజలు తనను ఆశీర్వదించి, భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.తనను పతంగి గుర్తుపై అత్యధిక మెజార్టీతో గెలిపించి అభివృద్ధికి సహకరించాలని ప్రజలను కోరారు.ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజలు,యువకులు,కార్యకర్తలు ర్యాలీలో పాల్గొని ఆయనకు మద్దతు తెలిపారు. పాల్గొన్న వారందరికీ మొహమ్మద్ రఫీ ధన్యవాదాలు తెలిపారు.

*కస్తూర్భా గాంధీ కేంద్ర ట్రస్ట్ చైర్మన్ డా. పి.సి. రాయులు నేతృత్వంలో…..

*కస్తూర్భా గాంధీ కేంద్ర ట్రస్ట్ చైర్మన్ డా. పి.సి. రాయులు నేతృత్వంలో..

+ఘనంగా 77.వ గణ తంత్ర దినోత్సవ వేడుకలు..

తిరుపతి(నేటి ధాత్రి:

 

తిరుపతిలోని గాంధీ రోడ్డులో కస్తూర్భా గాంధీ కేంద్ర ట్రస్ట్ చైర్మన్ డా. పి.సి. రాయులు నేతృత్వంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా, ఉత్సాహభరితంగా నిర్వహించబడ్డాయి.
ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు చమంతి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమం మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం ద్వారా ప్రారంభమైంది. అనంతరం ట్రస్ట్ చైర్మన్ డా. పి.సి. రాయులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలకు మిఠాయిలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా డా. పి.సి. రాయులు మాట్లాడుతూ, కస్తూర్భా గాంధీ ట్రస్ట్ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. జనవరి 26ను దేశవ్యాప్తంగా దేశభక్తి భావాలతో మనంగా జరుపుకుంటారని చెప్పారు. దాదాపు 200 సంవత్సరాల బొటిష్ పాలన అనంతరం 1947లో భారతదేశం స్వాతంత్ర్యం సాధించిందని, 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి రావడంతో సంపూర్ణ స్వయంప్రభుత్వం లభించిందని గుర్తు చేశారు.
ఆనాటి నుండి నేటి వరకు భారత్ శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఇతర దేశాలతో పోటీపడుతూ ముందుకు సాగుతోందన్నారు. గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటూనే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని తెలిపారు. గత 20 సంవత్సరాలుగా కస్తూర్భా గాంధీ ట్రస్ట్ పేదలు, వెనుకబడిన వర్గాల కోసం నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని,
భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు.
గాంధీ స్మృతి & దర్శన్ సమితి ఆధ్వర్యంలో ట్రస్ట్ పేదలు, అవసరమైన వారికి సేవలు అందిస్తోందని తెలిపారు. ఈ సమితి న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుండగా, భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు చైర్మన్ గా ఉన్నారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాట్లాడిన బీజేపీ జిల్లా అధ్యక్షులు
చమంతి శ్రీనివాస్, గణతంత్ర దినోత్సవం దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నామని అన్నారు. సమానత్వం, న్యాయం. స్వేచ్ఛ. ఆర్థిక స్వాతంత్ర్యం ప్రతి ఒక్కరి అభివృద్ధికి దోహదపడుతున్నాయని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ అనేక రంగాల్లో ముందుకు సాగుతోందని, గత నేతలు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని పిలుపునిచ్చారు. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారే దిశగా ముందుకెళోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తిరుపతి ఉప మేయర్ ఆర్.సి. ముని కృష్ణ జెండా ఆవిష్కరణలో పాల్గొన్నారు.
ఈ వేడుకలో బీజేపీ స్థానిక నాయకులు, కార్యాలయ సిబ్బంది. బండి మధుసూదన్ రెడ్డి, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు..

చిలుకమారి శ్రీనివాస్ కు పద్మశాలి సంఘం ఘన సన్మానం

చిలుకమారి శ్రీనివాస్ కు ఘన సన్మానం. పద్మశాలి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ భీమనాదుని సత్యనారాయణ.

మొగుళ్ళపల్లి నేటి దాత్రి

మొగుళ్లపల్లి గ్రామపంచాయతీ ఎనిమిదవ వార్డు నంబర్ గా గెలుపొందిన శ్రీ చిలుకమారి శ్రీనివాస్ గారిని మొగుళ్లపల్లి మండల కేంద్రంలో పద్మశాలి సంఘం నాయకులు చేనేత కార్మికులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా పద్మశాలి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ భీమనాధుని సత్యనారాయణ హాజరై మాట్లాడుతూ శ్రీనివాస్ గారు వార్డ్ నెంబర్ గా గెలుపొందడం ఆనందదాయకమని మొగుళ్ళపల్లి సమగ్ర అభివృద్ధి కోసం పాలకమండలి అందరూ కృషి చేయాలని ఈ సందర్భంగా కోరారు అలాగే చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న అనేక ఇబ్బందులను సత్యనారాయణ అడిగి తెలుసుకున్నారు ముఖ్యంగా చేనేత కార్మికులు పొద్దంతా కష్టపడితే 200 రూపాయల కూడా కూలి గిట్టుబాటు కావడం లేదని కావున రాష్ట్ర ప్రభుత్వం నెలకు 20 వేల రూపాయలు కూలిగిట్టుబాటు అయ్యే విధంగా పనికల్పించాలని ప్రతినెల చేనేత బంధు పథకం కింద ₹2,000 నేత కార్మికునికి కండెల చుట్టే వారికి 500 రూపాయలు గత ప్రభుత్వంఅందించిన విధంగానే ఈ ప్రభుత్వం కూడా అందించి చేనేత కార్మికులకు చేయూతనివ్వాలని మరియు 50 నిండిన చేనేత కార్మికులకు వృద్ధాప్య పింఛను వెంటనే మంజూరు చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని కోరారు

టిడిపి నుంచి కాంగ్రెస్ వరకు బద్దంపల్లి సర్పంచ్ బద్దం రాంరెడ్డి

సేవే మార్గం.. సేవే లక్ష్యంగా..

-టిడిపి ప్రస్థానం నుంచి బద్దంపల్లి సర్పంచ్ వరకు రాంరెడ్డి రాజకీయ ప్రస్థానం
మొగుళ్ళపల్లి నేటి దాత్రి

 

ఆయన పేరు వింటేనే నమ్ముకున్న వ్యక్తులకు, నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండే మనస్తత్వమని, 1982లో స్వర్గీయ ఎన్టీఆర్ ప్రభంజనంలో ప్రారంభమైన టిడిపిలో మాజీ ఎంపీపీ కీ: శే: బత్తిని భూమయ్య గౌడ్ నేతృత్వంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని బద్దంపల్లి గ్రామానికి చెందిన బద్దం రాంరెడ్డి తన అనుచరులతో కలిసి టిడిపిలో చేరారు. అప్పటి నుంచి టిడిపిలోనే కొనసాగుతూ నమ్ముకున్న వ్యక్తులకు ఏ ఆపద వచ్చినా తాను ముందుండి ఆదుకునే మనస్తత్వం ఆయన సొంతం. 1982 నుంచి 2023 వరకు టిడిపి పార్టీ అధికారంలో ఉన్న, లేకపోయినా నమ్ముకున్న సిద్ధాంతమే తన ఊపిరిగా టిడిపి పార్టీకి విశేష సేవలందించాడు. బద్దంపల్లి గ్రామానికి చెందిన కీ: శే: బద్దం రాజక్క-బుచ్చిమల్లు దంపతులకు ఐదవ సంతానంగా జన్మించిన బద్దం రాంరెడ్డి ప్రజలకు సేవ చేసే అదృష్టం కోసం ఎదురు చూశాడు. ఈ క్రమంలో స్వర్గీయ ఎన్టీఆర్ ప్రారంభించిన టిడిపిని వేదికగా చేసుకున్నాడు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం సందర్భంగా టిడిపి తెలంగాణలో కనుమరుగై పోయినప్పటికీ పార్టీ కోసమే పని చేశాడు. ప్రజా ప్రతినిధిగా అవకాశం రాకపోయినా నిత్యం ప్రజలలో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పరితపించేవాడు. 1982 నుంచి టిడిపి పార్టీలో క్రియాశీల నాయకునిగా ఎదిగిన ఆయన ఎంతోమంది యువకులకు ఆదర్శనీయం. 1982 నుంచి టిడిపి బలపర్చిన అభ్యర్థుల గెలుపులో ఆయన పాత్ర కీలకం. కాగా టిడిపిలో ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగిన గండ్ర సత్యనారాయణ రావు ఆహ్వానం మేరకు 2023లో ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అదే సంవత్సరంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థిగా గండ్ర సత్యనారాయణ రావు భారీ మెజార్టీతో గెలిచేలా వ్యూహాలు పన్నాడు. అనంతరం 2025 నవంబర్ లో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడ్డ బద్దంపల్లి గ్రామ సర్పంచ్ గా ప్రజలు బద్దం రాంరెడ్డిని ఏకగ్రీవ సర్పంచ్ గా ప్రజలు ఎన్నుకున్నారు. నికార్సైన వ్యక్తిత్వం..మంచి మనస్తత్వం కలిగిన బద్దం రాంరెడ్డి ఈ సందర్భంగా తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ.నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడ్డ బద్దంపల్లి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ప్రజలకు హామీనిచ్చారు.

కాటం సంజీవ్, ముస్తాల తేజ కాంగ్రెస్ చేరిక

*కాంగ్రెస్ పార్టీలోకి చేరిన కాటం సంజీవ్ .ముస్తాల తేజ*

*చేర్యాల నేటిధాత్రి*

చేర్యాల మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు జరిగాయి పట్టణానికి చెందిన కాటం సంజీవ్ ముస్తాల తేజ జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ, మాజీ శాసనసభ్యులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారి సమక్షంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా కాటం సంజీవ్ మరియు ముస్త్యల తేజ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తున్న సేవలను గుర్తించి మేము కాంగ్రెస్ పార్టీలో చేరామని అన్నారు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి దాసరి అనసూయ (సీతక్క) గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.

జనగామ నియోజకవర్గంలో జనగామ మరియు చేర్యాల మున్సిపాలిటీ మరియు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ పనులు, మౌలిక వసతుల కల్పనతో పాటు రాబోయే మున్సిపల్ ఎన్నికల వ్యూహాలు, ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పార్టీ తీసుకోవాల్సిన కార్యాచరణ అంశాలపై విస్తృతంగా చర్చించారు.మంత్రి సీతక్క గారు మాట్లాడుతూ,జనగామ మున్సిపాలిటీ మరియు చేర్యాల మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తుంది. గ్రామీణ ప్రాంతాలే కాదు, మున్సిపల్ పరిధిలోని సమస్యలను కూడా సమగ్రంగా పరిష్కరించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోంది. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల పక్షాన నిలిచే విధంగా పార్టీ వ్యూహాలు ఉండాలి” అని సూచించారు.
అలాగే త్వరలోనే జనగామ నియోజకవర్గాన్ని స్వయంగా సందర్శించి, అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని మంత్రి సీతక్క గారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆడెపు చంద్రయ్య కొమ్ము నర్సింగరావు దాసరి శ్రీకాంత్ తాటికొండ సదానందం భూమి గారి మనోహర్ మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు

నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ 9 వార్డు పదో వార్డ్ కు సంబంధించిన…

నేటి దాత్రి నాగర్ కర్నూల్ జిల్లా

 

నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ 9 వార్డు పదో వార్డ్ కు సంబంధించిన సిసి రోడ్ శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ నాగర్ కర్నూల్ నాగర్ కర్నూలు జిల్లాకు జూనియర్ కళాశాలకు 9 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి 19వ తారీకు డిప్యూటీ సీఎం రాజనర్సిమతో కలిసి శంకుస్థాపన చేస్తున్నట్లు అదేవిధంగా కొత్త బస్టాండ్ కు 14 కోట్లు మంజూరయ్యాయని అది కూడా త్వరలో శంకుస్థాపన చేస్తామని నాగర్ కర్నూల్ జిల్లా ను ఒక ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దామని ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ రమణారావు తొమ్మిదో వార్డ్ మాజీ కౌన్సిలర్ లలిత భాస్కర్ 10 వార్డ్ మాజీ కౌన్సిలర్ బాదం సునీత నరేందర్ వార్డు సభ్యులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

కల్వకుర్తిలో బీజేపీ నేత హెచ్చరిక

కల్వకుర్తి జిల్లా ప్రకటిస్తే మున్సిపల్ ఎన్నికల్లో నుంచి తప్పుకుంటామన్న బిజెపి నేత.

కల్వకుర్తి/ నేటి ధాత్రి :

 

కల్వకుర్తిని జిల్లాగా ప్రకటిస్తే ఆమనగల్ మున్సిపల్ ఎన్నికల్లో, ఆమనగల్లు మున్సిపాలిటీలోని ఆర్డీవో, సబ్ రిజిస్టర్, ఎస్ టి ఓ, ఆర్టీవో కార్యాలయా లను ఏర్పాటు చేస్తే ఈ ఎన్నికల్లో బీజేపీ పార్టీ పోటీ చేయమని బీజేపీ నేత, జాతీయ బీసీ కమీషన్ మాజీ సభ్యులు శ్రీ తల్లోజు ఆచారి ప్రకటించారు. కల్వకుర్తి నియోజకవర్గ సమగ్ర అభివృద్దే బీజేపి లక్ష్యమని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టిన గడ్డ రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైందని ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ తీసుకోని కల్వకుర్తి భవిష్యత్తును మార్చాలని తల్లోజు ఆచారి విజ్ఞప్తి చేశారు.

 నేషనల్ గ్రిడ్‌తో చొరబాటుదారుల ఆటకట్టు.. ఆమిత్‌షా..

 నేషనల్ గ్రిడ్‌తో చొరబాటుదారుల ఆటకట్టు.. ఆమిత్‌షా

 

మమతా బెనర్జీ సర్కార్‌పై అమిత్‌షా విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రజలకు ఉద్దేశించిన కేంద్ర సంక్షేమ పథకాలను బెంగాల్ సీఎం అడ్డుకుంటున్నారని విమర్శించారు.

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ (West Bengal)లో బీజేపీ(BJP) అధికారంలోకి వస్తే చొరబాటుదారులను (Infiltrators) వెనక్కి పంపుతామని కేంద్ర హోం మంత్రి హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) తెలిపారు. దేశంలోకి చొరబాటుదారులను నిలువరించేందుకు నేషనల్ గ్రిడ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న పశ్చిమబెంగాల్‌లో మూడ్రోజుల పర్యటనలో భాగంగా మీడియాతో మంగళవారంనాడు ఆయన మాట్లాడారు.
‘బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి రాగానే బెంగాల్ వారసత్వాన్ని, అభివృద్ధిని పునరుద్ధరిస్తామని ప్రజలకు హామీ ఇస్తున్నాం. పేద ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తాం. చొరబాట్లకు అడ్డుకట్ట వేసేందుకు నేషనల్ గ్రిడ్ ఏర్పాటు చేస్తాం’ అని అమిత్‌షా తెలిపారు.

ప్రజాసంక్షేమ పథకాలకు మోకాలడ్డు

మమతా బెనర్జీ సర్కార్‌పై అమిత్‌షా విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రజలకు ఉద్దేశించిన కేంద్ర సంక్షేమ పథకాలను బెంగాల్ సీఎం అడ్డుకుంటున్నారని విమర్శించారు. గత 14 ఏళ్లలో మమతా బెనర్జీ పాలనలో అవినీతి, భయాందోళనలు పెరిగిపోయాయన్నారు. ప్రభుత్వ అవినీతి కారణంగా బెంగాల్ అభివృద్ధి నిలిచిపోయిందన్నారు. 2026 ఏప్రిల్ 15 తర్వాత బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి రాగానే బెంగాల్ వారసత్వం, సంస్కృతిని పునరుద్ధరిస్తామని చెప్పారు.

మూడింట రెండువంతుల మెజారిటీతో..

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మూడింట రెండు వంతుల మెజారిటీతో అధికారంలోకి వస్తుందని అమిత్‌షా ధీమా వ్యక్తం చేశారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 17 శాతం ఓట్లు, రెండు సీట్లు సాధించిందని, 2016 అసెంబ్లీ ఎన్నికల్లో 10 శాతం ఓట్లు, 3 అసెంబ్లీ సీట్లు గెలుచుకుందని చెప్పారు. అదే 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 41 శాతం ఓట్లు 18 సీట్లు సాధించిందని, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 21 శాతం ఓట్లు, 77 సీట్లు గెలుచుకుందని గుర్తు చేశారు. 2016లో కేవలం 3 సీట్లు గెలుచుకున్న బీజేపీ కేవలం 5 ఏళ్లలో 77 సీట్లు గెలుచుకోగలిగిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ జీరో స్థాయికి చేరుకుందని, కమ్యూనిస్టు కూటమి ఒక్క సీటు కూడా దక్కించుకోలేదని చెప్పారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 39 శాతం ఓట్లు 12 సీట్లు గెలుచుకుందని, 2026లో బీజేపీ మెజారిటీ సాధించిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. బెంగాల్ సరిహద్దు నుంచే చొరబాట్లు జరుగుతున్నాయని, ఇక్కడ నుంచి చొరబాట్లను నిలిపివేసి, చొరబాటుదారులను వెనక్కి పంపించే ప్రధాన అంశంపైనే బెంగాల్ ఎన్నికల్లో తమ పార్టీ ఎన్నికలకు వెళ్తుందని తెలిపారు. 2026 ప్రథమార్ధంలో పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండగా, ఎన్నికల తేదీలను ఎలక్షన్ కమిషన్ ప్రకటించాల్సి ఉంది.

కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తేనే అభివృద్ధి.

కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తేనే అభివృద్ధి

యువజన కాంగ్రెస్ గుండాల మండల ఉపాధ్యక్షులు బొబ్బిలి పవన్ కళ్యాణ్

గుండాల,నేటిధాత్రి:

 

మండల గ్రామపంచాయతీలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి విజయాన్ని యువజన కాంగ్రెస్ గుండాల మండలం ఉపాధ్యక్షులు బొబ్బిలి పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుండాల మండలం ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలుపరిచిన అభ్యర్ధులను గెలిపిస్తేనే గుండాల మండలంలోని ప్రతి గ్రామం అభివృద్ధి చెందుతుందన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచే అభ్యర్థులకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కాంగ్రెస్ తోనే పల్లె ప్రగతి సాధ్యం అవుతుంది గ్రామంలో మౌలిక సదుపాయాలతో పాటు మరింత అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడలేని విధంగా ప్రజలు సన్న బియ్యం అందిస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందన్నారు. గుండాల మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ ని నమ్మి మోసపోకండి 6గ్యారంటీ ల పేరుతో అన్ని మోసలే అన్ని అబద్దాలే

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-09T163331.189.wav?_=1

 

కాంగ్రెస్ ని నమ్మి మోసపోకండి 6గ్యారంటీ ల పేరుతో అన్ని మోసలే అన్ని అబద్దాలే

:— ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సర్పంచ్ ఎలక్షన్ సందర్భంగా ఝరసంఘం మండల కేంద్రం లో బి ఆర్ ఎస్ పార్టీ బలపరచిన అభ్యర్థి వినోద — బాల్ రాజ్ & వార్డ్ మెంబర్ ల తరఫున ప్రచారం నిర్వహించిన శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు గ్రామాలకు చాలా అభివృద్ధి పథకాలు అందించారు వీటిల్లో ముఖ్యంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతుబంధు రైతు బీమా మరియు ఎరువులు అందించడం, రైతులు పండించిన వడ్లు కొనుక్కోవడం వంటివి చేశారు అలాగే గ్రామాల్లో పచ్చదనాన్ని పెంచుతూ ఇతర అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేశారు రోడ్లు నీళ్లు ప్రజలకు సమస్యలను పరిష్కరించారు అలాగే ముందుచూపుతో ఇప్పుడు జరుగుతున్న సర్పంచ్ ఎలక్షన్లో మన పార్టీ అభ్యర్థి అయినటువంటి వాళ్లను గెలిపించాలని వాళ్ల వల్ల గ్రామాల అభివృద్ధి జరుగుతుంది అని వచ్చే ఎన్నికల్లో కెసిఆర్ గారి ముఖ్యమంత్రి అవుతారని ఏలాంటి అభివృద్ధి అయినా కేసీఆర్ తోనే సాధ్యమని అన్నారు ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించండి సరైన అభ్యర్థిని ఎన్నుకోండి మన గ్రామ అభివృద్ధి మనకు ముఖ్యం అని వ్యాఖ్యానించారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version