శివరాత్రి సందర్భంగా నాలుగు రోజుల పాటు నిర్వహించే ఝరాసంఘం కేతకీ సంగమేశ్వర స్వామి జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ పి. ప్రవీణ్య అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టర్ ఆఫీసులో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్మాట్లాడుతూ.. జాతరకు తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని, రద్దీకి అనుగుణంగా సౌకర్యాలు కల్పించాలన్నారు.ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు నడపాలని సూచించారు. జాతరకు వచ్చే మార్గాల్లో రోడ్ల రిపేర్పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయాలని సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు ఝరాసంగం గ్రామ సర్పంచ్ వినోద బాలరాజ్ మాజీ ఎంపీపీ సంగమేశ్వర్ మాజీ సర్పంచ్ జగన్ పటేల్ పాల్గొన్నారు.
ఇంద్రకీలాద్రిపై పదవ రోజుకు నవరాత్రి ఉత్సవాలు.. తరలివస్తున్న భక్తులు
అమ్మను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు. దుర్గమ్మ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. జై దుర్గా జై జై దుర్గా అన్న నామస్మరణతో ఇంద్రకీలాద్రి మార్మోగుతోంది.
ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయంలో దసర శరన్నవరాత్రి ఉత్సవాలు(Kanaka Durga Navaratri) ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. నవరాత్రి మహోత్సవాలు నేటితో పదవ రోజుకు చేరుకున్నాయి. తొమ్మిది రోజుల పాటు వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ… పదవ రోజు శ్రీ మహిషాసుర మర్దిని దేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు. దుర్గమ్మ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. జై దుర్గా జై జై దుర్గా అన్న నామస్మరణతో ఇంద్రకీలాద్రి మార్మోగుతోంది.నవరాత్రి మహోత్సవాల్లో వివిధ రూపాల్లో ఉన్న అమ్మవారి దర్శనం కోసం భారీగా భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. ముఖ్యంగా అమ్మవారి జన్మనక్షత్రం మూలా నక్షత్రం రోజున ఇంద్రకీలాద్రి భక్తులతో కిలకిటలాడింది. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్లలో భక్తులకు మంచి నీరు, పండ్లను అందజేశారు. ప్రతీరోజు ఒక్కో అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుని భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.
బతుకమ్మ దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు చేయాలి ఎమ్మెల్యే జి ఎస్ ఆర్
భూపాలపల్లి నేటిధాత్రి
ఈ నెల 21 నుండి ప్రారంభమయ్యే బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. సోమవారం ఐడిఓసి కార్యాలయంలో బతుకమ్మ సంబురాలు, దసరా ఉత్సవాల ఏర్పాట్లుపై జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుతో కలసి రెవెన్యూ, పోలీస్, పంచాయతీ రాజ్, మున్సిపల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బతుకమ్మ పండుగ రాష్ట్ర ప్రజల సాంప్రదాయ, సంస్కృతికి ప్రతీక అని, పూల పండుగ అని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 9 రోజులు జరుగనున్న నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా మహిళలు వివిధ రకాల పూలతో బతుకమ్మలు తయారు చేసి అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారని, బతుకమ్మలు ఆడిన తదుపరి చెరువుల్లో నిమజ్జనం చేస్తారు కాబట్టి గ్రామాలు, మండలాలు, మున్సిపాలిటీ పరిధిలో బతులమ్మ ఘాట్లు గుర్తించి విద్యుత్ సౌకర్యాలు కల్పించాలని సూచించారు. అన్ని శాఖల ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రహదారులు, వీధి లైటింగ్, తాగునీరు, పరిశుభ్రత, భద్రతా చర్యలు, వైద్య సేవలు వంటి అన్ని సౌకర్యాలను ముందుగానే సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మహిళలు, పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొనే ఈ వేడుకల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. ముఖ్యంగా అన్ని గ్రామాల్లో, భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లోని ముఖ్యమైన కూడళ్లను అందంగా తీర్చిదిద్దాలని సూచించారు. గ్రామాల్లో స్పెషల్ ఆఫీసర్లు, పంచాయతీ సెక్రటరీలు స్పెషల్ డ్రైవ్ చేపట్టి సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే సూచించారు. ముఖ్యంగా గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ, వీధులలో, ప్రధాన కూడళ్లలో వీధిలైట్ల వెలిగేలా చూడాలని తెలిపారు. దసరా ఉత్సవాల ముగింపు రోజైన అక్టోబర్ 2న జిల్లా కేంద్రంలోని డా బిఆర్ అంబేడ్కర్ క్రీడా మైదానంలో జరిగే వేడుకలకు సాంస్కృతిక సారథి కళాకారులచే కళాజాత నిర్వహించాలని డిపిఆర్వో ను ఆదేశించారు. అలాగే విద్యుత్, మంచినీటి సరఫరా, పారిశుధ్యం, భద్రత, ఆరోగ్య కేంద్రాలు, అగ్నిమాపక, ట్రాఫిక్ నియంత్రణ, ఫుడ్ కోర్ట్ ఏర్పాటు వంటి అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అవసరమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసులకు సూచించారు. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ ప్రజలు దసరా ఉత్సవాలను ఘనంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు ముందుగానే పూర్తిచేయాలని సూచించారు. అక్టోబర్ 2వ తేదీన దసరా ముగింపు వేడుకలకు డా బిఆర్ అంబేడ్కర్ మైదానంలో నిర్వహించడం జరుగుతుందని, వీక్షించేందుకు వచ్చే ప్రజలకు కుర్చీలు ఏర్పాటు చేయాలని సింగరేణి అధికారులకు సూచించారు. ఉత్సవాలు అందరికీ ఆనందాన్ని పంచేలా విజయవంతంగా నిర్వహించడమే మనందరి లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. బతుకమ్మ నిమజ్జన ప్రాంతాలను గుర్తించి రక్షణ ఏర్పాట్లు చేయాలని మున్సిపల్, పంచాయతి అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఎఎస్పీ నరేష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, సింగరేణి ఎస్ ఓ టు జిఎం కవీంద్ర తదితరులు పాల్గొన్నారు.
రేపటి నిమజ్జనానికి ఏర్పాట్లు చేయాలని కాంగ్రెస్ నాయకులని డిమాండ్
◆:- బిజెపి సీనియర్ నాయకురాలు జ్యోతి పండాల్
జహీరాబాద్ నేటి ధాత్రి:
తెలంగాణ అంతట కూడా నిమజ్జనం రేపు ఉండడం జరుగుతుంది. అలాగే మన జహీరాబాద్ నియోజకవర్గంలో కూడా నిమజ్జనం రేపు ఉండడంతో, కాంగ్రెస్ నాయకులు రేపటి నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేయాలని జ్యోతి పండాల్ కాంగ్రెస్ నాయకులను డిమాండ్ చేయడం జరిగింది. అలాగే మున్సిపల్ కమిషనర్ గారు వారి ఆఫీసులో నిద్రపోకుండా ఏర్పాట్లని దగ్గరుండి సమకూర్చాలని పర్యవేక్షించాలని జ్యోతి పండాల్ సూచించడం జరిగింది.
అలాగే మహిళల భద్రత కోసం షీ టీమ్స్ ని, మహిళా కానిస్టేబుల్స్ ని, మహిళా ఆఫీసర్స్ ని కూడా డిప్లాయ్ చేయాలని పోలీస్ శాఖ వారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది.
ఈ సారి ఖైరతాబాద్ వినాయకుడి దర్శనం కోసం వచ్చిన అమ్మాయిలని పోకిరీలు, ఆకతాయిలు వేధిస్తున్నందుకు, 7 రోజుల వ్యవధిలో 930 మందిని మఫ్టీలో షీ టీం వాళ్ళు పట్టుకోవడం జరిగింది. ఈ 930 మందిలో మైనర్లు, 20 సంవత్సరాలు ఉన్న అబ్బాయిలు మరియు 50 సంవత్సరాలు వయసు ఉన్న మగవాళ్ళు వేధించడం జరుగుతుందని షీ టీమ్స్ ఇన్చార్జ్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. 50 సంవత్సరాలు వయసు ఉన్న మగవారు కూడా అమ్మాయిలని ఏడిపిస్తున్నారంటే కామంతో కళ్ళు మూసుకుపోయి ప్రవర్తిస్తున్న వాళ్లు రోజురోజుకీ పెరుగుతిన్నారని మహిళలు గమనించాలి మరియు జాగ్రత్త వహించాలి.
జ్యోతి పండాల్ తప్పు లేకుండా ఎవరిపైన నిరాధారంగా ఆధారాలు లేకుండా విమర్శించదు అన్న విషయం, జహీరాబాద్ లో ఉన్న నాయకులు గాని కాంగ్రెస్ నాయకులు గానీ తెలుసుకోవాలి. వాస్తవాలు మాట్లాడుతుంటే ఇక్కడున్న లీడర్లకి ఎందుకు బాధ అవుతుందో నాకు అర్థం అవడం లేదు. నిన్న అమ్మాయిల భద్రత కోసం మాట్లాడినందుకు లీడర్లకు జీర్ణం అవడం లేదు కానీ ఖైరతాబాద్ లో జరుగుతున్న ఈవిటీజింగ్ కేసులను చూస్తే మీకు అర్థమవుతుందని జ్యోతి పండాల్ అన్నారు.
మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వాలి
అభ్యర్థుల తరలింపునకు తగిన ఏర్పాట్లు చేయాలి
హాజరైన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )
జీ.పీ.ఓ పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఈ నెల 5 వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి, ఇతర మంత్రుల చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేయనున్నట్లు సీసీఎల్ఏ లోకేష్ కుమార్ వెల్లడించారు. జీ.పీ.ఓ అభ్యర్థులకు నియామక పత్రాలు హైదరాబాద్ లో అందజేయనున్న సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లపై అన్ని జిల్లాల కలెక్టర్లతో బుధవారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించగా, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీసీఎల్ఏ లోకేష్ కుమార్ మాట్లాడారు. భూ భారతి చట్టం అమలులో భాగంగా జీపీఓల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పరీక్ష నిర్వహించిందని తెలిపారు. ఇందులో భాగంగా ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఈ నెల 5 వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి, ఇతర మంత్రుల చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. అన్ని జిల్లాల్లో పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు సమాచారం అందించాలని సూచించారు. వారిని హైదరాబాద్ తరలించేందుకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ఆదేశించారు.ఆయా జిల్లాల నుంచి ప్రత్యేక బస్ లలో వారిని నిర్ణీత సమయానికి తరలించాలని సూచించారు.వారికి కావలసిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. నియామకాలకు సంబంధించిన సమాచారాన్ని ఆయా జిల్లాల్లోని మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వాలని సూచించారు. తగిన అన్ని ఏర్పాట్లు చేయాలి జిల్లా నుంచి జీ.పీ.ఓ పరీక్ష రాసి 66 మంది ఉత్తీర్ణత సాధించారని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వెల్లడించారు. అభ్యర్థులను ఈ నెల 5 వ తేదీన జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి తరలించాలని సూచించారు.ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ను నోడల్ ఆఫీసర్ గా నియమించామని తెలిపారు. హైదరాబాద్ తరలివెళ్లే అభ్యర్థులకు కావల్సిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, కలెక్టరేట్ ఏ.ఓ. రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బిఆర్ఎస్ రాష్ట్రవర్కింగ్ ప్రెసిడెంట్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే
మొగులపల్లి నేటి ధాత్రి భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో :27/07/2025 న తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు,బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు భూపాలపల్లి నియోజకవర్గానికి విచ్చేస్తున్న సందర్భంగా మొగుళ్ళపల్లి మండలం, ఇస్సిపేట గ్రామ వాస్తవ్యులు మాజీ సర్పంచ్ కీ.శే కొడారి కొమురయ్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించి, అనంతరం మొగుళ్ళపల్లి లక్ష్మి సాయి గార్డెన్స్ నందు మండల ముఖ్య నాయకులతో కేటీఆర్ పర్యటన ఏర్పాట్లు మరియు కార్యకర్తల సమీకరణ పై సమీక్షా నిర్వహించిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి. వారి వెంట మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
డిఫాల్టర్ రైస్ మిల్స్, రేషన్ కార్డులు పంపిణీ ,భూభారతి దరఖాస్తు పరిష్కారం,వన మహోత్సవం ఏర్పాట్ల పై సమీక్షా..
వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:
వరంగల్ జిల్లా పరిధిలోని ప్రతి మండలంలో ఉన్న డిఫాల్టర్ రైస్ మిల్లర్ల జాబితాను సిద్ధం చేయాలని,
సంబంధిత మిల్లర్లపై రీవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారంగా చర్యలు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య నాదెళ్ల ఆదేశించారు.జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్ లో డిఫాల్టర్ రైస్ మిల్స్, రేషన్ కార్డులు పంపిణీ ,భూభారతి దరఖాస్తు పరిష్కారం,వన మహోత్సవం ఏర్పాట్లపై తహసిల్దార్లు, సివిల్ సప్లై డిఎం,డిసిఎస్ఓలతో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద,అదనపు కలెక్టర్ జి సంధ్యారాణిలు సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామసభలు,మీ సేవా కేంద్రాల ద్వారా స్వీకరించిన కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల వెరిఫికేషన్ వేగవంతం చేయాలని,రేషన్ కార్డుల్లో నెంబర్ యాడ్ చేయుట అంశాలపై పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.
రేషన్ షాప్ ల ఖాళీల భర్తీకై ప్రభుత్వ నిబంధనల మేరకు ఖాళీలను భర్తీ చేయుటకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆర్డీవోలను ఆదేశించారు.రేషన్ కార్డు లబ్ధిదారులలో డెత్ కేసులు ఉన్నట్లయితే గ్రామపంచాయతీల నుండి నివేదికలు సేకరించి వాటిని పర్యవేక్షించి పరిశీలించాలని సంబంధిత అధికారులకు సూచించారు.భూభారతి ధరకాస్తు పరిష్కారంపై సంబంధిత తాసిల్దార్లతో మాట్లాడుతూ వివిధ మండలాలలో రెవెన్యూ సదస్సుల నిర్వహణలో సేకరించిన దరఖాస్తుల ఆన్లైన్ నమోదు పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.
జిల్లాలో మహిళా శక్తి స్వయం సహాయక బృందాల ఆర్థిక స్వావలంబనకు తోడ్పాటు కల్పించే ఉద్దేశ్యంతో మహిళా పెట్రోల్ బంక్ స్థాపనకు ప్రభుత్వ స్థలాలను గుర్తించి నివేదికలు సమర్పించాలని తహసిల్దారులను ఆదేశించారు.పీఎం కుసుమ ప్రాజెక్ట్ కింద సోలార్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు.వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా విరివిగా మొక్కలు నాటేందుకు ఒక్కొక్క మండలానికి 5 ఎకరాల చొప్పున ప్రభుత్వ స్థలాన్ని సేకరించి గ్రీనరీ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ సమీక్షలో వరంగల్ ,నర్సంపేట ఆర్డీవోలు సత్యపాల్ రెడ్డి, ఉమారాణి, డీసిఎస్ఓ కిష్టయ్య, సివిల్ సప్లయ్ డిఎం సంధ్యారాణి, సంబంధిత మండలాల తహసీల్దార్లు,సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
బక్రీద్ పండుగ సందర్భంగా జిల్లా సరిహద్దుల వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ల వద్ద పకడ్బందీగా విధులు నిర్వహించాలి.
సిరిసిల్ల జిల్లా చెక్ పోస్టును ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐపీఎస్
సిరిసిల్ల టౌన్: (నేటి ధాత్రి)
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బక్రీద్ పండుగ సందర్భంగా గోవుల అక్రమ రవాణా అరికట్టడానికి జిల్లెళ్ల వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ని ఆకస్మిక తనిఖీ చేసి సిబ్బంది నిర్వహించే వాహనాల ఎంట్రీ రికార్డ్ లను పరిశీలించి,చెక్ పోస్ట్ లో గల సిబ్బందికి తగు సూచనలు చేయడం జరిగినది. అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. బక్రీద్ పండుగ సందర్బంగా జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందిగా చర్యలు తీసుకోవడం జరిగిందని, గోవుల అక్రమ రవాణా గోవధ నివారించేందుకు జిల్లా సరిహద్దుల జిల్లెళ్ల, పెద్దమ్మ, మానాల క్రాస్ రాడ్ వద్ద చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.చెక్ పోస్ట్ ల వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని,తనిఖీల్లో సరైన పత్రాలు ఉన్న రైతులకు సంబంధించిన లేదా వ్యవసాయనికి సంబంధించిన పశువుల రవాణాకు ఆటంకం కలిగించకుండా సిబ్బంది విధులు నిర్వహిచాలని తెలియజేశారు. చెక్ పోస్ట్ వద్ద ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ఇతర డిపార్ట్మెంట్ సిబ్బంది మరియు జిల్లా పోలీస్ యంత్రాంగామంతా సమన్వయముతో విధులు నిర్వహిస్తున్నామని తెలిపారు.జిల్లా ఎస్పీ వెంట ఎస్.ఐ శంకర్ నాయక్ , పోలీస్ సిబ్బంది ఉన్నారు.
సిరిసిల్ల జిల్లాలో జూన్ 2న నిర్వహించు రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల ఏర్పాట్ల పై జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే, సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు పరేడ్ గ్రౌండ్ లో జరుగుతాయని, జిల్లాలోని ప్రతి శాఖకు చెందిన అధికారులు , సిబ్బంది వేడుకలకు తప్పనిసరిగా హాజరు కావాలని కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు సంబంధించి జెండా ఏర్పాట్లు, గ్రౌండ్ సిద్దం చేయడం మొదలగు ఏర్పాట్లు పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలని అన్నారు. రాష్ట్ర అవతరణ వేడుకల డయాస్, సీటింగ్ ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రోటోకాల్ ప్రకారం సీటింగ్ ఏర్పాట్లు చేయాలని, అన్నారు.
Collector
వేడుకల వద్ద వైద్య బృందాలచే వైద్య శిభిరాలు ఏర్పాటు చేయాలని, అవసరమైన మేర త్రాగు నీటి సరఫరా పనులు మున్సిపల్ కమిషనర్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ తెలిపారు. వేడుకలకు ఆహ్వాన పత్రాలు ప్రోటోకాల్ ప్రకారం ప్రతి ఒక్కరికీ అందాలని అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని స్వశక్తి మహిళా సంఘాల ప్రతినిధులు హజరయ్యేలా మెప్మా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ముఖ్య అతిథి అందించే సందేశం రూపొందించేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల వివరాలను క్లుప్తంగా తయారు చేయాలని అన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ముఖ్య అతిథి గౌరవ వందనం, ఇతర బందోబస్తు ఏర్పాటు పకడ్బందిగా చేయాలని అన్నారు. ఈ సమావేశంలో సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు కలెక్టరేట్ ఏ ఓ రామ్ రెడ్డి, జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేయాలి
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి నేటిధాత్రి
రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహణకు చేయాల్సిన ఏర్పాట్లుకు సంబంధించి శుక్రవారం ఐడిఓసి కార్యాలయ సమావేశపు హాలులో అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ సమాచార, డిఆర్డీఏ, సంక్షేమ, అటవీ, ఉద్యాన, వ్యవసాయ తదితర శాఖలు స్టాల్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అమరవీరుల స్తూపం, డా బిఆర్ అంబేద్కర్, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలను పూలతో అందంగా ముస్తాబు చేయాలని సూచించారు. వేడుకలకు సంబంధించి ప్రోటోకాల్ పాటిస్తూ అతిధులు కూర్చోడానికి షామియానాలు, కుర్చీలు, సురక్షిత మంచినీరు ఏర్పాటు చేయాలని సూచించారు. ఉద్యాన, ఆర్ అండ్ బి శాఖల అధికారులు స్టేజ్ ఏర్పాట్లు చేయాలన్నారు, జిల్లా ప్రగతి సందేశాన్ని తయారు చేయాలని డిపిఆర్వోను ఆదేశించారు. అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా విద్యార్థినీ, విద్యార్థులతో పాటు తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల చే సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని డిపిఆర్వో ను, డీఈఓను కలెక్టర్ ఆదేశించారు. వేడుకల సందర్భంగా అంబులెన్సులు, అత్యవసర వైద్య కేంద్రం, అగ్నిమాపక వాహనం అందుబాటులో ఉంచాలని అన్నారు. మైదానంలో పారిశుద్ధ్య.కార్యక్రమాలు నిర్వహించి పరిశుభ్రం చేయాలని మున్సిపల్ కమీషనర్ ను ఆదేశించారు. వేడుకలకు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఆర్డిఓ కార్యక్రమాలు ఆసాంతం పర్యవేక్షణ చేయాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ అధికారి నవీన్ రెడ్డి, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఆర్డిఓ రవి, అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయాలి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి నేటిధాత్రి
https://youtu.be/dr-t8K7F4T0?si=Eu3RDNJ4v15WH_Br
సరస్వతి పుష్కరాలకు రానున్న రెండు రోజుల్లో లక్షలల్లో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున జిల్లా యంత్రాంగం అనునిత్యం అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. సరస్వతి పుష్కరాల కొనసాగుతున్న నేపథ్యంలో 10 వ రోజు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఏర్పాట్లను పరిశీలించి వాకి టాకీ ద్వారా రానున్న రెండు రోజులు చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సరస్వతి ఘాట్ లో భక్తల రద్దీని పరిశీలించి కొనసాగుతున్న పారిశుధ్య కార్యక్రమాలు, రక్షణ చర్యలు, విఐపిలు పుణ్య స్నానాలు ఆచరించడానికి ఏర్పాటు చేసిన ప్రాంతాన్ని, కంటైనర్ ను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. మెయిన్ ఘాట్ నుండి సరస్వతి ఘాట్ వరకు ఏర్పాటు చేసిన మట్టి రోడ్డులో వరద నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. విఐపిల కోసం ఏర్పాటు చేసిన కంటైనర్ లో క్రమం తప్పక నీటి సరఫరా ఉండే విధంగా చూడాలని సూచించారు. ఘాట్ ల వద్ద అధికారులు అప్రమత్తంగా ఉండి భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా సేవలు అందించాలని తెలిపారు. అనంతరం కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయానికి చేరుకుని భక్తుల రద్దీని పరిశీలించి పుష్కరాల సేవలు ఏవిధంగా ఉన్నాయని భక్తులను అడిగి తెలుసుకున్నారు. క్యూ లైన్ల రద్దీని దృష్టిలో ఉంచుకొని త్వర త్వరగా దర్శనాలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అక్కడి నుండి కాళేశ్వరం లోని పలుగుల జంక్షన్, తాత్కాలిక బస్టాండ్, ఇప్పల బోరు జంక్షన్, పార్కింగ్ స్థలాలను పరిశీలించి ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై పోలీసులతో మాట్లాడారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న దృష్ట్యా పోలీసులు అప్రత్తంగా ఉండాలని ఎలాంటి ప్రమాదాలు జరగ కుండా సురక్షిత ప్రయాణాలు చర్యలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ జామ్ కాకుండా వాహనదారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ నెల 23న ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన పూర్తిస్థాయి ఏర్పాట్లు పూర్తయ్యాయని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. గురువారం జహీరాబాద్ పార్లమెంటు సభ్యులు సురేశ్కుమార్ షెట్కార్, జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, శాసనసభ్యులు సంజీవరెడ్డితో కలిసి మంత్రి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా హెలిప్యాడ్, సీఎం చేతుల మీదుగా ప్రారంభించనున్న బసవేశ్వర విగ్రహం, నిమ్ రోడ్డు, కేంద్రీయ విద్యాలయ భవనం, సభా స్థలం తదితర ప్రాంతాలను వారు సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హెలిప్యాడ్ పనులు, ప్రజా వేదిక, వీఐపీ గ్యాలరీ, మీడియా గ్యాలరీ, వాహనాల పార్కింగ్ పనులు, రూట్ల వారీగా ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రణాళిక, గ్రీనరీ, స్టేజి ఏర్పాట్లు, స్టేజి అలంకరణ, పరిశుభ్రత, మిషన్ భగీరథ ద్వారా తాగునీరు, టాయిలెట్స్ వంటి అన్ని పనులు పూర్తయ్యాయని చెప్పారు. సభకు హాజరయ్యే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట ఎస్పీ పంకజ్ పరితోష్, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, ఆర్డీవోలు, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
జహీరాబాద్ పట్టణంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను ఎస్పీ పరతోష్ పంకజ్ మంగళవారం పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ సీఎం పర్యటనకు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని పోలీసు సిబ్బందికి సూచించారు. ఆయన వెంట డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం ఆమనగలులోని మార్కెట్ చైర్మెన్ శ్రీమతి యాట గీతా నర్సింహ సొంత డబ్బుతో రైతుల కోసం బోజనాలు ఏర్పాటు చేసి మంచి మనసు చాటుకున్న మార్కెట్ చైర్ పర్సన్ యాట గీతా నర్సింహ ముదిరాజ్ మార్కేట్ ఆవరణలోని రెైతులు బోజనాలు చేస్తూ సంతొషం వ్యక్తం చేశారు.
ఆమనగల్లు పట్టణంలో వ్యవసాయ మార్కెట్ లో వడ్లు అమ్మటానికి వచ్చిన రైతుల కోసం సోమవారం నుండి మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ యాట గీతా నర్సింహ బోజనాలు, మంచి నీళ్ళ వసతులు ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా రెైతులు బోజనాలు చేస్తూ సంతొషం వ్యక్తం చేస్తూ, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ యాట గీతా నర్సింహకు ధన్యవాదాలు తెలిపారు.
ఇప్పటి వరకు ఈ మార్కెట్ కమిటీ ఆవరణలో రైతుల కోసం ఎవ్వరూ బోజనాలు ఏర్పాటు చేయలేదు, మొదటి సారి రైతుల కోసం బోజనాలు ఏర్పాటు చేసిన మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ యాట గీతా నర్సింహ ముదిరాజ్ గారికి మరొక్కసారి ప్రత్యెక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.
అలాగే రైతుల కోసం క్వింటాల్ కి రూ 500 బోనస్ ఇస్తున్న ప్రజా ప్రభుత్వంకి ప్రత్యెక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అని అన్నారు.
రైతులను ఆదుకోవాలని సంకల్పంతో రైతుల కోసం ఎన్నో చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వనికి ఎప్పటికి రుణపడి ఉంటాము అని పలువురు రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం చేస్తున్న మంచి పనుల పై సంతొషం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ తో పాటు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గూడూరు భాస్కర్ రెడ్డి,మార్కెట్ కమిటీ డైరెక్టర్స్ వస్పుల శ్రీశైలం, తాళ్ళ రవీందర్, అజీమ్,రమేష్ గౌడ్, నరేష్ నాయక్,అంజయ్య గుప్తా, శ్యామసుందర్ రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ చేగురి వెంకటేష్, యూత్ కాంగ్రెస్ కల్వకుర్తి ఉపాధ్యక్షుడు షాబుద్దీన్ , మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వస్పుల శ్రీకాంత్, బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి డిగ్రీ కృష్ణ, మార్కెట్ కమిటీ సభ్యులు, వ్యాపారస్తులు పాల్గొన్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో బుధవారం రోజున ఎంఈఓ రఘుపతి మాట్లాడుతూ ఈనెల 21 నుంచి ఏప్రిల్ 4 వరకు నిర్వహించనున్న పదవ తరగతి వార్షిక పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయినట్లు మండల విద్యాశాఖ అధికారి కోడెపాక రఘుపతి తెలిపారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చాం. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రంలో 160 మంది విద్యార్థులు, బాలికల గురుకుల పాఠశాల కేంద్రంలో 190 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులకు తాగునీరు, విద్యుత్తు సౌకర్యం, వైద్య శిబిరాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామన్నారు. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలన్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు 1గంట ముందుగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.
నేటి నుండి ప్రారంభం కానున్న కొమ్మాల లక్సినరసింహస్వామి జాతర ఉత్సవాల నేపథ్యంలో జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సిఎఫ్ఓ కొమ్మాల పండుగా ముఖ్య కార్యనిర్వహణ అధికారిని ఆర్ సునీత గురువారం అందుకు సంబంధించిన పనులకు పరిశీలించారు.ముందుగా కొమ్మాల లక్ష్మి నరసింహస్వామిని దేవాలయ ఈ.ఓ నాగేశ్వర్ రావుతో కలిసి దర్శించుకున్నారు.ఈ సందర్భంగా దేవాలయ ప్రధాన అర్చకులు రామాచర్యులు,విష్ణు ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం దేవాలయ పరిసర ప్రాంతాలను పరిశీలించారు.జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురకాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నాగేశ్వర్ రావును ఆదేశించారు.కాగా జాతర పూర్తయ్యే వరకు ఎప్పటికప్పుడు నిర్వహణ పట్ల సమీక్షా చేయనున్నట్లు సిఎఫ్ఓ ఆర్ సునీత తెలిపారు.
CFO
జాతరలో ఏర్పాట్లు పూర్తి…ఈ.ఓ నాగేశ్వర్ రావు..
*నేటి నుండి ఈ నెల 20 వరకు జాతర నిర్వహణ ఉంటుందని అలాగే వచ్చే నెల మొదటివారం వరకు కొనసాగే అవకాశం ఉందని కొమ్మాల లక్ష్మినరసింహస్వామి దేవాలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నాగేశ్వర్ రావు తెలిపారు.వరంగల్ ఉమ్మడి జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల నుండి భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున జాతరలో భక్తులకు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.దేవాలయ పరిసర ప్రాంతాలలో అదనంగా విద్యుత్ లైట్ల ఏర్పాట్లు పూర్తైందన్నారు.జాతరలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా గీసుకొండ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బందోబస్తు కోసం 400 సిబ్బందితో పోలీస్ కమిషనరేట్ కేటాయించిందని ఈ.ఓ వివరించారు.
CFO
జాతరలో ఎలాంటి పారిశుధ్యం లోపించకుండా స్థానిక గ్రామ పంచాయితీ సిబ్బందితో పాటు గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ నుండి 20 మంది పారిశుధ్యం కార్మికులను కేటాయించడం జరిగిందన్నారు.అలాగే దేవాలయం పరిదిలో మండలంలోని అదనంగా గ్రామ పంచాయితీల కార్యదర్శులు ఉన్నతాధికారులు కేటాయించారని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నాగేశ్వర్ రావు తెలియజేశారు.ఈ కార్యక్రమాలలో దేవాలయ మాజీ చైర్మన్,ఆలయ సేవకులు వీరాటి రవీందర్ రెడ్డి,స్థానిక కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు సాయిలి ప్రభాకర్,అర్చకులు ఫణిందర్, దేవాలయ సిబ్బంది పాల్గొన్నారు.
లక్ష్మి నరసింహ స్వామి జాతరకు ఏరుపాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి నేటిధాత్రి
కొడవటంచ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో ఈ నెల 9వ తేదీ నుండి 16వ తేదీ వరకు జరుగుతున్న జాతర ఏర్పాట్లను బుధవారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పరిశీలించారు. జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమర్థవంతమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జాతర ఏర్పాటు పనులతో పాటు భద్రతా ఏర్పాట్లు, మంచినీటి సదుపాయాలు, పార్కింగ్, పారిశుద్ధ్య మరియు ఇతర ఏర్పాటు పనులను స్వయంగా పరిశీలించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, ట్రాఫిక్ నియంత్రణ, మెడికల్ క్యాంప్ల ఏర్పాటు, తాగునీరు, పారిశుద్ధ్య కార్యక్రమాలు, తాత్కాలిక మరుగుదొడ్లు, భక్తులు పుణ్య స్నానాలు చేసేందుకు సౌకర్యాలు వంటి తదితర పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. వాహనాలు పార్కింగ్ చేసేందుకు పార్కింగ్ స్థలాన్ని గుర్తించి వాహనాలు క్రమబద్దీకరణకు సైనేజి బోర్డ్స్ ఏర్పాటు చేయాలని సూచించారు.
అధికారులు, నిర్వాహకులు కలిసి సమన్వయంతో పనిచేసి భక్తులకు ఉత్తమ సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు తగిన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు.
అంతకు ముందు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దేవస్థానం అధికారులు, అర్చకులు దేవాలయ సంప్రదాయం ప్రకారం జిల్లా కలెక్టర్ కు స్వాగతం పలికి స్వామి వారి ఆశీర్వచనం అందచేశారు.
ఈ పరిశీలన కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఎఎస్పీ బోనాల కిషన్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా మధుసూదన్, ఆర్ డబ్ల్యూ ఎస్ ఈ ఈ నిర్మల, విద్యుత్ డీఈ పాపిరెడ్డి, ఆలయ ఈవో మహేష్ ఆలయ కమిటీ చైర్మన్ బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
మిడ్ మానేర్ నుంచి మల్కపేట రిజర్వాయర్ లోకి నీటి విడుదలకు ఏర్పాట్లు
– కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
– మల్కపేట రిజర్వాయర్, పంప్ హౌస్, కంట్రోల్ రూం తనిఖీ
కోనరావుపేట/సిరిసిల్ల(నేటి ధాత్రి): మిడ్ మానేర్ నుంచి మల్కపేట రిజర్వాయర్ లోకి నీటి విడుదలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వెల్లడించారు. కోనరావుపేట మండలంలోని మల్కపేట రిజర్వాయర్, గేట్స్, అండర్ టన్నెల్, పంప్ హౌస్, మోటార్లు, కంట్రోల్ రూం, విద్యుత్ సరఫరా వ్యవస్థలను కలెక్టర్ మంగళవారం తనిఖీ చేశారు. మల్కపేట రిజర్వాయర్ లో ప్రస్తుతం నీటి నిల్వ ఎంత ఉంది అని జిల్లా నీటి పారుదల శాఖ అధికారి అమరేందర్ రెడ్డి ని ఆరా తీయగా, ఈ రోజు 0.75 టీ ఎం సీ ల నీరు ఉందని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
water
అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బోయినపల్లి మండలంలోని మిడ్ మానేర్ నుంచి ఈ రోజు 0.5 టీఎంసీల నీటి విడుదలకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ నీరు మల్కపేట రిజర్వాయర్ కు చేరుకోగానే.. దీని పరిధిలోని ఎల్లారెడ్డిపేట మండలంలోని మైసమ్మ చెరువు, సింగసముద్రం చెరువుకు నీటిని తరలిస్తామని వివరించారు. ప్రాజెక్ట్ పరిధిలో పంటలు వేసిన రైతులు సాగు నీరు విషయమై ఎలాంటి ఆందోళన చెందవద్దని సూచించారు. ప్రాజెక్ట్ లో నీటి నిలువలు ఉన్నాయని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. నీటి పారుదల శాఖ అధికారులు సైతం నిత్యం అందుబాటులో ఉంటూ అప్రమత్తంగా ఉంటున్నారని కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ వెంట ఈఈ కిషోర్, డీఈఈలు సత్యనారాయణ, శ్రీనివాస్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఆలయ చైర్మన్ చిల్పూర్( జనగామ)నేటి ధాత్రి
చిల్పూర్ మండల కేంద్రంలోని శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి దేవాలయం దిన దినాభివృద్ధి చెందుతూ భక్తుల కోరిన కోరికలను తీర్చుతూ విరాజిల్లుతున్న శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు ఈ నెలలో అంగరంగ వైభవంగా జరగనున్నాయి.ఇందులో భాగంగా కళ్యాణ మహోత్సవానికి విచ్చేస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా శ్రీ బుగ్గులు వెంకటేశ్వర దేవస్థాన కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లను పరిశీలిస్తున్న దేవస్థాన చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు తోపాటు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ రంగాచార్యులు మరియు ఆలయ ధర్మకర్తల మండల సభ్యులు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు మాట్లాడుతూ శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.దీనిలో భాగంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో చలువ పందిళ్లతో పాటు వచ్చే భక్తులకు మంచినీటి సౌకర్యం ఇతర ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కోరిన కోరికలు తీర్చే శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భగవంతుని కృపకు పాత్రులు కావాలని చైర్మన్ శ్రీధర్ రావు కోరారు.
రంజాన్ మాసంలో ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చెయ్యాలి
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి నేటిధాత్రి
మార్చి 2వ తేదీ నుండి ప్రారంభం కానున్న రంజాన్ మాసం ఏర్పాట్లుపై సమీక్ష సమావేశం నిర్వహించడం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ శనివారం ఐడిఓసి కార్యాలయంలో మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రెవెన్యూ, పోలీస్, పంచాయతి రాజ్, మున్సిపల్, విద్యుత్, ముస్లిం మత పెద్దలతో సమావేశం నిర్వహించారు.
Ramzan
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. జిల్లాలోని అన్ని మసీదుల వద్ద పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించి పరిశుభ్రం చేయాలని మున్సిపల్, పంచాయతి అధికారులను ఆదేశించారు. సురక్షిత మంచినీటిని సరఫరా చేయాలని తెలిపారు. రంజాన్ మాసంలో నిర్వహించే ప్రత్యేక ప్రార్థనా సమయాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతర వ సరఫరా అయ్యేలా చర్యలు చేపట్టాలని విద్యుత్తు అధికారులకు సూచించారు. ఏదేని విద్యుత్తు సమస్య వచ్చినా తక్షణమే స్పందించేందుకు మసీదు పెద్దలకు ఆ ప్రాంతం యొక్క లైన్ మెన్ ఫోన్ నెంబర్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. భూపాలపల్లి, కాటారం, మహాదేవ పూర్ మండలాల్లో పోలీస్ పెట్రోలింగ్ నిర్వహించాలని పోలీస్ అధికారులకు సూచించారు. ప్రార్ధనా మందిరాల వద్ద పట్టిష్టమైన బందోబస్తు ఏర్పాటు ఉండాలని తెలిపారు. రంజాన్ మాసంలో ముస్లింలు ఉపవాస ప్రార్థనలు చేస్తారని వారికి ఎలాంటి ఆటంకాలు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ప్రశాంతమైన వాతావరణంలో సంతోషంగా రంజాన్ పండుగను ప్రజలందరూ జరుపుకోవాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు తెలియజేసిన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, మైనార్టీ సంక్షేమ అధికారి శైలజ, డిఎస్పి సంపత్ రావు, విద్యుత్ శాఖ ఎస్ ఈ మల్చూర్ నాయక్, డిపిఓ నారాయణ రావు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.