బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి జిల్లా అధ్యక్షురాలు జ్యోతి రెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ హాజరైనారు అనంతరం మున్సిపల్ ఎన్నికలలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ 30 వార్డుల కౌన్సిలర్ అభ్యర్థుల లిస్టును ప్రకటించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థుల్లో రెబల్స్ లేకుండా అభ్యర్థులను ప్రకటించడం జరిగింది కావున భూపాలపల్లి మున్సిపాలిటీపై బిఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాను చేశారు అలాగే జిల్లాకు మెడికల్ కాలేజీ కలెక్టరేట్ ఎస్పీ కార్యాలయం ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేశారు భూపాలపల్లి మున్సిపాలిటీ ప్రజలు కారు గుర్తుపై ఓటు వేసి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేస్తున్నాను అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో 30 వార్డులకు సంబంధించిన కౌన్సిలర్ అభ్యర్థులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు
కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలాభిషేకం….
తంగళ్ళపల్లి నేటి ధాత్రి……
తంగళ్ళపల్లి మండలం టెక్స్టైల్ పార్క్ బద్దెనపల్లి ఇందిరమ్మ .కాలనీలొకాంగ్రెస్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇందిరమ్మ కాలనీ గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొంపెల్లిశ్యామ్.గ్రామ సర్పంచ్ గడ్డం రచన మధుకర్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేయడం జరిగిందని తెలియజేస్తూ. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ టాపింగ్ మేము చేయలేదు అని చెప్పిన కేసీఆర్ కు తన కూతురు కల్వకుంట్ల కవిత గారే స్వయంగా ముఖ్య సాక్షిగా నా ఫోను నా భర్త ఫోన్ టాప్ చేసింది మా నాన్న మాజీ సీఎం కేసీఆర్ అని చెప్పడం. గత ప్రభుత్వంలో ఇలాంటి అధికారులు ఎన్నో అక్రమాలు చేసిన వారిని వదల వద్దని. గతంలో ప్రభుత్వ పరిపాలన చేస్తూ టాపింగ్ చేస్తూ ఎన్నో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని. గత ప్రభుత్వం అనేది అవినీతి అక్రమాలకు నిలయంగా మారిందని అవినీతి అక్రమాలు ప్రజలకు. తెలవాలని. ఇలా తెలంగాణ పేరు చెప్పి ఎన్ని అక్రమాలు చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలను నిలువు దోపిడీ చేశారని దీనిపై సిట్ అధికారులు గత ప్రభుత్వంలొ జరిగినటువంటి అక్రమాలను ప్రజలకు తెలియజేసేలా సీట్ విచారణ చేస్తున్నారని. ఇలాంటి అవినీతి వెలికి తీయాలని రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కొరకు అన్ని విషయాలు బయటకు రావాలని మన సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం పేద ప్రజల శ్రేయస్సు కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చి మన ప్రజా ప్రభుత్వంలో ఎలాంటి అవినీతి అక్రమాలకు తావు లేకుండా ప్రజా పరిపాలన ప్రభుత్వంలో పెద్దల ఇతర మంత్రుల సహాయంతో అవినీతి అక్రమాలకు తావు లేకుండా ప్రజా పరిపాలన సాగిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే. ప్రభుత్వ సంక్షేమ పథకాలు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తున్న రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేయడానికి నిరసిస్తూ. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ. ప్రజల అభివృద్ధి ధ్యేయంగా ప్రజా పరిపాలన సాగిస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డిని ప్రభుత్వాన్ని ఓర్వలేక అనేక అబండాలు వేస్తూ. వారు అధికారంలో ఉన్నప్పుడు చేసిన అవినీతి అక్రమాలు బయటకు రాకుండా. ఇలా. ఇలా చేస్తే వ్యతిరేకత రాదు అనే ఉద్దేశంతో చేస్తున్నారని. ప్రజాక్షేత్రంలో తప్పు ఎవరు చేసినా శిక్ష అనుభవించాల్సిందే తప్ప తప్పించుకునే ప్రయత్నం చేయకూడదని. ఎలాంటి తప్పు చేయని మీకు భయం ఎందుకని సిట్ విచారణ చేస్తే తప్పేము ఉంటుందని దానికి సహకరించాలి తప్ప ఇలా ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు మానుకోవాలని ఇకనైనా తెలుసుకోవాలని సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో. ఉపసర్పంచ్ కొండ శ్రీకాంత్. వాటి సభ్యులు. వడ్డేపల్లి రామా. ముందాటి శారద. భరత్. కాంగ్రెస్ నాయకులు. శ్రీరామ్. నరేష్. లక్ష్మిపతి. రంగయ్య. సుదర్శన్. రాజు. శ్రీనివాస్. రమేష్. కిషన్. గురునాథ్. రవి. రామచంద్రం. రాజు. కిరణ్. శ్రీనివాస్. లక్ష్మణ్. మహిళ నాయకులు. యమునా. భాగ్యలక్ష్మి. జ్యోతి. తదితరులు పాల్గొన్నారు
ఆ వ్యాఖ్యలు కౌశిక్ రెడ్డికి ఉన్న ద్వేషాన్ని బయటపెట్టాయన్న మండల అధ్యక్షులు షేక్ రబ్బాని
◆-: కేసీఆర్ నాయకత్వంలోని పార్టీ ఎమ్మెల్యే నుంచి ఇలాంటి వ్యాఖ్యలు శోచనీయమని వ్యాఖ్య
◆-: బీఆర్ఎస్ అధిష్ఠానం ఈ వ్యాఖ్యలపై ఆలోచన చేయాలని సూచన
జహీరాబాద్ నేటి ధాత్రి:
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ మజ్లిస్ పార్టీ ఝరాసంగం మండల అధ్యక్షులు షేక్ రబ్బాని తీవ్ర విమర్శలు చేశారు. విధి నిర్వహణలో ఉన్న అధికారిపై మతం పేరుతో వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. ఐపీఎస్ అధికారిని ఉద్దేశించి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ముస్లింల పట్ల ఆయనకున్న ద్వేషాన్ని బయటపెట్టాయని అన్నారు.మొదటిసారి ఎమ్మెల్యే అయిన వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటే, ఆయనను ఆరెస్సెస్ భావజాలం ఆవహించి ఉంటుందని చురక అంటించారు. పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్లో ఉంటూ కౌశిక్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం శోచనీయమని అన్నారు. ఆయన వ్యాఖ్యలను బీఆర్ఎస్ ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తిని ఉప ముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా చేశారని గుర్తు చేశారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసిన గూడెం మధుసూదన్ రెడ్డి..
మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేయాలి..
క్షేత్రస్థాయిలో పనిచేయండి.. ప్రతి అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించండి..
సిట్ విచారణ అనంతరం ప్రత్యేక భేటీ..
నేటి ధాత్రి, పఠాన్ చేరు:
పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆదివారం సాయంత్రం సిట్ విచారణ అనంతరం హైదరాబాదులోని నంది నగర్ లో గల కెసిఆర్ నివాసంలో కలిశారు. మున్సిపల్ ఎన్నికలలో స్థానిక శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి నాయకత్వంలో పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ఐదు మున్సిపాలిటీలలో బిఆర్ఎస్ జండా ఎగరవేసి క్లీన్ స్వీప్ సాధించాలని సీఎం కేసీఆర్ సూచించారని గూడెం మధుసూదన్ రెడ్డి తెలిపారు. గత దశాబ్ద కాలంలో బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో.. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించి క్షేత్రస్థాయిలో పని చేసి బిఆర్ఎస్ అభ్యర్థులందరినీ భారీ మెజారిటీతో గెలిపించుకొని వస్తామని గూడెం మధుసూదన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
నందినగర్లోని నివాసంలో మాజీ సీఎం కేసీఆర్ను సిట్ అధికారులు విచారిస్తున్నారు. విచారణకు ముందు పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో కేసీఆర్ భావోద్వేగానికి గురయ్యారు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఆన్ కెమెరా విచారణ జరుగుతోంది. అయితే, సిట్ విచారణకు ముందు పార్టీ నాయకులతో లంచ్ మీట్లో పాల్గొన్నారు కేసీఆర్. ఈ సందర్భంగా గులాబీ బాస్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. నందినగర్ నివాసం నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఊపిరి పోశానని.. ఉద్యమ రచన చేసిన ఈ ఇంటి గదిలోనే విచారణ ఎదురుకోవాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ రాశుల వారికి గుడ్ న్యూస్.. ఇకపై తిరుగు లేదు!
ఢిల్లీలో ఘోరం.. మహిళా కమాండోను కొట్టి చంపిన భర్త..
స్వామితో పెట్టుకుంటే భూస్థాపితమేనని చరిత్ర చెబుతోంది: మంత్రి
టీ20 వరల్డ్ కప్-2026 నుంచి బంగ్లా ఔట్.. తొలిసారి స్పందించిన
దానం నాగేందర్ కేసు విచారణ.. పాడి కౌశిక్రెడ్డి ఏమన్నారంటే?
వచ్చే బడ్జెట్లో బంగారం కొనుగోళ్ల మీద పాన్-ఆధార్ పరిమితి పెంచ
మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా జాతిపితకు ప్రధాని మోదీ ఘన ని
పీటీ ఉష కుటుంబంలో విషాదం.. భర్త శ్రీనివాసన్ కన్నుమూత
రేవంత్ నయా రికార్డ్.. హార్వర్డ్ నుంచి సర్టిఫికెట్ పొందిన తొ
మహాత్మాగాంధీ వర్థంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళి
మైక్రోసాఫ్ట్కు షాక్.. 424 బిలియన్ డాలర్లు ఆవిరి!
మహాత్మునికి సీఎం చంద్రబాబు ఘన నివాళి
రాష్ట్ర సాధన కోసం ఇదే గదిలో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని అన్నారు. ఇదే గదిలో ఎంతో మందితో చర్చలు జరిపానని.. అలాగే ఈ గదిలోనే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వ్యూహ రచన చేశామని ఆనాటి సంగతులను గుర్తుచేసుకున్నారు మాజీ ముఖ్యమంతి. ఇప్పుడు ఇదే గదిలో విచారణను ఎదుర్కోవడం దురదృష్టకరమంటూ పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో కేసీఆర్ ఉద్వేగానికి గురయ్యారు.కాగా.. నందినగర్లోని నివాసంలో కేసీఆర్ను ఐదుగురు సభ్యుల సిట్ బృందం ప్రశ్నిస్తోంది. భవనంలోని రెండో ఫ్లోర్లో విచారణ జరుగుతోంది. విచారణ నేపథ్యంలో నందినగర్ నివాసం పరిసరాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావును సిట్ విచారించి, స్టేట్మెంట్ను రికార్డ్ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు కేసీఆర్ను సిట్ విచారణకు పిలిచిన నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎక్కడికక్కడ వారిని అడ్డుకుని అరెస్ట్లు చేశారు.
ప్రభుత్వ సంక్షేమ హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి
హాస్టల్ లో విద్యార్థునిలు కుళ్ళిన ఆహారం తినడం వల్ల
అస్వస్థతకు గురైన విద్యార్థినులను పరామర్శించిన బీ ఆర్ ఎస్ నేతలు బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందిం చాలి
వనపర్తి నేటిధాత్రి .
వనపర్తి జిల్లా కొత్తకోట మండల కేంద్రంలో ప్రభుత్వ సాంఘీక సంక్షేమ హాస్టల్ నందు కుళ్ళిన కూరగాయల తో వంటలు వండడము వల్ల కురాగాయలు విద్యార్థులకు పెట్టడము వల్ల ఆహారం విద్యార్థినులకు ఫుడ్ ఫాయిజిన్ అయిందని రాష్ట్ర బి.ఆర్.ఎస్ నాయకులు అభిలాష్ రావు జిల్లా బీ ఆర్ ఎస్ అధ్యక్షులు మాజీ మున్సిపల్ చైర్మన్ గట్టు యదవ్ విలేకరుల కు తెలిపారు ప్రభుత్వ హాస్టల్ బాలికలు పప్పులో వాసన వస్తుంది అని వార్డెన్ కు తెలిపిన హాస్టల్ వార్డన్ నిర్లక్ష్యం గా సమాదానం చెప్పారని వారు పేర్కొన్నారు అధికారుల పై చర్యలు తీసుకోవాలని అభిలాష్ రావ్ గట్టు యాదవ్ రాష్ట్ర ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా బడుగు బలహీన హాస్టల్స్ పట్ల నిర్లక్ష్యం చేస్తూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నదని వారు ఆరోపించారు మాజీ ముఖ్యమంత్రి .కె.సి.ఆర్ సాంఘిక రాష్ట్రంలో సంక్షేమ హాస్టల్స్ తోపాటు 1100వందల గురుకుల పాఠశాలలు స్థాపిం చారని హరిజన,గిరిజన,బడుగు,బలహీన ,మైనార్టీ వర్గాలవిద్యార్థులకు నాణ్యమైన భోజనం, బువ్వ అందించారని తెలిపారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గురుకులాలను,సాంఘిక సంక్షేమ హాస్టల్స్ ను పట్టించుకోవడము లేదని వారు విమర్శించారు ప్రభుత్వ హోసిల్ బాలికలను మాజి మున్సిపల్ వైస్ ఛైర్మన్ వాకిటి.శ్రీధర్ వనపర్తి జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ వామన గౌడ్,మాజీ జెడ్.పి.టి.సి విశ్వేశ్వర్,జిల్లా బి.ఆర్.ఎస్ నాయకులు ప్రశాంత్,జిల్లా బి.ఆర్.ఎస్.వి కోఆర్డినేటర్ హేమంత్ ముదిరాజ్ తదితరులు ఉన్నారని జిల్లా మీడియా కన్వీనర్ నంది మల్ల అశోక్ తెలిపారు
నిప్పులాంటి కేసీఆర్ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్న రేవంత్ రెడ్డి.. ఖబర్దార్!
రాష్ట్ర సివిల్ సప్లై మాజీ చైర్మన్ నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
నర్సంపేట,నేటిధాత్రి:
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడం కాంగ్రెస్ ప్రభుత్వ అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అని బిఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నేత, రాష్ట్ర సివిల్ సప్లై మాజీ చైర్మన్ నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.కేసీఆర్ తెలంగాణ తెచ్చినందుకే నోటీసులా?. తెలంగాణను ప్రగతి పథంలో నడిపించినందుకే నోటీసులా?.. రైతుబంధు ఇచ్చినందుకే నోటీసులా? రైతన్న వ్యవసాయాన్ని పండుగలా మార్చినందుకు కేసీఆర్ కు నోటీసులా?..అని ప్రశ్నించారు.బిఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ సిఎం కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడం పట్ల నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి వెంటనే స్పందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజల కోసం ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యమం చేసిన నాయకుడిపై ప్రతీకార రాజకీయాలు చేయడం ప్రజాస్వామ్యానికి మచ్చ అని పేర్కొన్నారు.రైతులకు భరోసా ఇచ్చిన నాయకుడిపై కుట్రలు పన్నడం రైతుల హృదయాలను అవమానించడమే అని అన్నారు. బిఆర్ఎస్ పాలనలో పదేండ్ల అద్భుత ప్రగతి తొలి సీఎం కేసీఆర్ విజన్కు సాక్ష్యం..ఆయన పాలనలో రాష్ట్రం అనేక రంగాల్లో చారిత్రాత్మక అభివృద్ధి సాధించిందని అభిప్రాయం వ్యక్తం చేశారు.రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలతో రైతుకు గౌరవం తెచ్చింది కేసీఆర్ ప్రభుత్వం,సాగునీటి ప్రాజెక్టులు, కాళేశ్వరం, మిషన్ కాకతీయ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చిన దూరదృష్టి.. కేసీఆర్ ది అని పేర్కొన్నారు.మౌలిక వసతులు అభివృద్ధిలో భాగంగా.. సాగునీరు, త్రాగునీరు,విద్యుత్ రంగాల్లో విప్లవాత్మక మార్పులు చేసిండు కేసీఆర్.. గ్రామీణాభివృద్ధి, పట్టణ విస్తరణ, రహదారుల అభివృద్ధి చేసి, పరిశ్రమలు, ఐటీ, పెట్టుబడులతో రాష్ట్ర ఆర్థిక బలం పెంపు చేసిండు… కేసీఆర్…దళిత బంధు, ఆసరా పింఛన్లు, కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ వంటి పథకాలతో దేశానికి ఆదర్శవంతమైన సామాజిక సంక్షేమం అమలు చేసినందుకా కేసీఆర్ కు నోటీసులా అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడిగారు.పేదల సంక్షేమానికి అంకితమైన పాలన చేసి..విద్య, వైద్య రంగాల్లో మౌలిక మార్పులు చేసి తెలంగాణ ఆత్మగౌరవం పెంచి ప్రపంచానికి చాటిన మాజీ సిఎం కేసీఆర్..సంస్కృతి, సంప్రదాయాలకు గౌరవం పెంచి,ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెంచిన కేసీఆర్ పై ప్రజాపాలన పేరుతో రేవంత్ రెడ్డి ప్రతీకార పాలన చేస్తున్నాడని పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు.ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. రోజుకో డ్రామా, రోజుకో డైవర్షన్ రాజకీయాలతో ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తోందని ఎద్దేవా చేశారు. నిప్పు లాంటి కేసీఆర్ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్న రేవంత్ రెడ్డి ఖబర్దార్! అని హెచ్చరించారు.రేవంత్ రెడ్డి పాలనలో సింగరేణి టెండర్లలో అవకతవకలు, సృజన్ రెడ్డి వ్యవహారం పై సిట్ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.కేసీఆర్ పై చేస్తున్న కుట్రలు — ప్రజల మద్దతుతో విఫలం అవుతాయి..నాలుగు కోట్ల తెలంగాణ సమాజంలో 60 లక్షలమంది బి ఆర్ ఎస్ సైన్యం నీ కుట్రలను తిప్పికొడతారని పేర్కొన్నారు.కేసీఆర్ పై రాజకీయ కక్షతో చేస్తున్న ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు.
కేసీఆర్ను ముట్టుకుంటే రాష్ట్రం అగ్నిగుండం: నాజియా అంజుమ్ షేక్ సోహెల్
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఉద్యమ నేత కేసీఆర్ను ముట్టుకుంటే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని బిఆర్ఎస్ పార్టీ ఝరాసంగం మండల తుమ్మనపల్లి గ్రామ నూతన సర్పంచ్ నాజియా అంజుమ్ షేక్ సోహెల్ హెచ్చరించారు. గాంధీ వారసులమని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కుతుందని, సీఎం రేవంత్ రెడ్డి పాలన అస్తవ్యస్తంగా ఉందని విమర్శించారు. సంక్షేమాన్ని, అభివృద్ధిని గాలికి వదిలేసి కేసీఆర్ను మానసికంగా వేధించే కుట్రలో భాగమే ఈ నోటీసులు అని, తాటాకు చప్పుళ్లకు కేసీఆర్ బెదరరని అన్నారు.
బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముఖ్య అతిథిగా హాజరైనారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ నాయకుడు కేసీఆర్ 11 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాడు అనంతరం తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయినారు పరిపాలన సౌలభ్యం కోసం నూతన జిల్లాలను నూతన మండలాలను గ్రామపంచాయతీలను ఏర్పాటు చేసి అలాగే జయశంకర్ సార్ పేరు మీద భూపాలపల్లి జిల్లాను ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఇప్పుడు కొంతమంది నాయకులు భూపాలపల్లి జిల్లాను తీసేస్తామని అంటున్నారు ఇప్పటికైనా పట్టణ ప్రజలు ఆలోచించాలి భూపాలపల్లి మున్సిపాలిటీ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి భూపాలపల్లి అభివృద్ధికి సహకరించాలని పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేకపోయింది భూపాలపల్లి మున్సిపాలిటీకి ఒక్క రూపాయి కూడా నిధులు తీసుకురాలేదు ఎన్నికలు వచ్చిన సమయాన మంత్రులను తీసుకువచ్చి చిలాపాలకాలు వేసి హడావిడి చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కావున పట్టణ ప్రజలు ఆలోచించి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ వెంకటరాణి సిద్దు మాజీ వైస్ చైర్మన్ గండ్ర హరీష్ రెడ్డి మేకల సంపత్ బుర్ర రమేష్ రజిత తిరుపతి రాజు తదితరులు పాల్గొన్నారు
అజిత్ పవార్ మరణం మహారాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు: కేసీఆర్
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి పట్ల పలువురు తెలంగాణ రాజకీయ నేతలు సంతాపం తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్, మంత్రి సీతక్క, టీపీసీసీ చీఫ్, కేటీఆర్ తదితరులు.. అజిత్ మృతిపై ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్(Maharashtra Deputy CM Ajit Pawar) బుధవారం ఉదయం బారామతి వద్ద జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మృతి చెందారు. ఆయన మృతిపట్ల ప్రధాని మోదీ సహా కేంద్రమంత్రులు, ప్రముఖ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, మంత్రి సీతక్క, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మాజీ మంత్రి కేటీఆర్ తదితరులు పవార్ మృతికి సంతాపం తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
రమణన్న బస్తీబాట కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర దంపతులు
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డు ఆకుదారివాడ, ఫకీర్ గడ్డలో పట్టణ అధ్యక్షుడు కటకం జనార్దన్ అధ్యక్షతన నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి వరంగల్ జిల్లా జడ్పీ మాజీ ఛైర్పర్సన్ & భూపాలపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపాలిటీ విషయానికి వస్తే మనం అక్కడ కేవలం మాటలకే పరిమితం కాలేదు. మున్సిపాలిటీని తీసుకురావడం మాత్రమే కాదు 30వార్డులో అన్ని రోడ్లు, సైడ్రైన్ లు, సెంట్రల్ లైటింగ్ వంటి మెరుగైన వసతులు, ప్రతి ఇంటికి మంచినీటి వసతి తో పాటు ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించడం జరిగింది. కేసీఆర్ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి, మెప్పించి మేడలు వంచి చివరకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం.
రాష్ట్రం వచ్చిన తరువాత కేసీఆర్ మాటలతో కాదు పది సంవత్సరాల పాటు పాలించి తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే దిశగా తీసుకెళ్లారు. సాగునీటి ప్రాజెక్టులు, రైతు సంక్షేమ పథకాలు, విద్యుత్, రహదారులు, పట్టణాలు, గ్రామాల అభివృద్ధి ఇలా ప్రతి రంగంలో తెలంగాణను ముందుకు నడిపించిన ఘనత కేసీఆర్ దే. “కేసీఆర్ 2,000 రూపాయల పెన్షన్ ఇస్తే, నేను 4,000 రూపాయల పెన్షన్ ఇస్తాను, అందుకే నాకు ఓటు వేయండి” అని చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. టిడిపి పార్టీ నుండి వచ్చి అడ్డదారులో పదవులు చేపట్టిన రేవంత్ రెడ్డి కి అసలు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలే తెలియని పరిస్థితి కనిపిస్తోంది. నిన్నటివరకు టీడీపీ పార్టీలో ఉండి, అక్కడి నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన ఆయనకు తెలంగాణ ఉద్యమ చరిత్రపై అవగాహన ఉందా లేదా అనేది గుర్తేరగాలే. తెలంగాణ ఉద్యమ సమయంలో రమణారెడ్డి కాంగ్రెస్లో ఉండగానే తెలంగాణ వస్తుందని, ప్రజల మధ్య తిరుగుతూ ఉద్యమానికి పిలుపునిచ్చారు. తెలంగాణ సాధన కోసం నిరంతరం పోరాటం చేశారు. కానీ తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులపై రైఫిల్ ఎక్కుపెట్టిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడంటే ఇది దురదృష్టకరం. తెలంగాణ ప్రజలు ఎవరు రాష్ట్రం కోసం నిజంగా త్యాగాలు చేశారో, ఎవరు అధికారానికి కోసం మాటలు మార్చుకుంటున్నారో బాగా తెలుసు. ప్రజలను మోసగించే రాజకీయాలను ఇకనైనా ఆపాలి. రేవంత్ రెడ్డి కి రాష్ట్ర ప్రజలపైన ప్రేమ లేదు ఆయన కుర్చీ మీద అపారమైన ప్రేమ ఉంది. అందుకే అభివృద్ధి చేసిన బిఆర్ఎస్ పార్టీని గెలిపిద్దాం, అబ్బద్దాల పునాదులపై నిలిచిన కాంగ్రెస్ పార్టీని పునాదులు కదిలించాలి అంటే మీ అమూల్యమైన ఓటు కారు గుర్తుపై వేసి మీ అందరి కోసం పనిచేసే బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ని అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.
తండ్రి కేసిఆర్,అన్న కేటీఆర్ పదేండ్లలో అభివృద్దేమో శూన్యం..
కార్మిక, ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
తండ్రి కేసిఆర్, అన్న కేటీఆర్ అని గొప్పలు చెప్పుకునే చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పదేండ్ల బిఆర్ఎస్ పాలనలో క్యాతన్ పల్లి మున్సిపాలిటీకి, చెన్నూర్ నియోజకవర్గానికి ఏం అభివృద్ధి చేశారని గొప్పలు చెప్పుకుంటున్నారో అర్థం కావడం లేదని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఎద్దేవచేశారు.శుక్రవారం ఆయన క్యాతన్ పల్లి మున్సిపాలిటీ లోని 1,2,7,8,9,12,13,14,17 వార్డులలో రోడ్లు డ్రైనేజీ నిర్మాణ పనులకు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి శంకుస్థాపనలు చేశారు. సుమారు 45 కోట్ల టి,యు,ఐ,ఎఫ్డిసి, సి ఎస్ ఆర్ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలకు చేశారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్దే ధ్యేయంగా అనేక పథకాలు ప్రవేశపెట్టి, సమర్థవంతంగా అమలు చేస్తోందని అన్నారు. క్యాతన్ పల్లి మున్సిపాలిటిని మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని అన్నారు. ప్రజలకు సేవ చేయడానికి తన జీవితం అంకితం చేస్తున్నానని తెలిపారు. కమీషన్ల కోసం పనిచేసే ఎమ్మెల్యేను కాదని స్పష్టం చేశారు. రాబోయే మున్సిపాలిటీ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే మునిసిపాలిటీని మరింత అభివృద్ధి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మందమర్రి ఎమ్మార్వో సతీష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, యూత్ నాయకులు,పార్టీ కార్యకర్తలు,ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
`పార్టీ కష్టాలలో వున్నప్పుడు ముంచాలనుకునే వారు దెయ్యమా?
`కేసీఆర్ పాలన ను వేలెత్తి చూపిన వారు ఎవరూ లేరు?
`కన్న కూతురు ఎక్కడైనా తండ్రి కి ద్రోహం చేయడం చూశామా?
`కష్టాలలో పార్టీని పట్టుకొని కాపాడుతున్న వారే అసలు వారసులు?
`పార్టీ కి అసలైన సైనికులు… పదవుల కోసం ఆశపడే వాళ్ళు కాదు!
`గుంట నక్కలే పార్టీని చిన్నభిన్నం చేయాలని చూస్తారు!
`దొంగే దొంగా దొంగా అని అరుస్తారు?
`ఇంకా కవిత విషయం లో కెసిఆర్ కూతురు గానే చూస్తున్నారు!
`ఒకప్పుడు షర్మిల రాజకీయం చూసి కవిత చాలా నయం
అనుకున్నారు!
`ఇప్పుడు కవిత కన్నా షర్మిల లక్ష రేట్లు మెలనుకుంటున్నారు!
`రాజకీయాలలో హత్యలుండవు, ఆత్మ హత్యలే వుంటాయని కవిత
మరోసారి నిరూపించింది.
హైదరాబాద్,నేటిధాత్రి:
రాజకీయాలలో హత్యలుండవు. ఆత్మహత్యలు మాత్రమే వుంటాయని రాజకీయ పండితులు ఏనాడో తేల్చేశారు. అతిగా ఆశపడే నాయకులు తమ రాజకీయ జీవితాలను తామే తుంచుకుంటారు. తమకు తాము అతిగా ఊహించుకుంటారు. తమకేం తక్కువ అనుకుంటారు. అందరికన్నా తామే ఎక్కువ అనుకుంటారు. తమకు ప్రాదాన్యత దక్కడం లేదన్న భావనలోకి వెళ్లపోతారు. తమకు ఆదిపత్యం కరువౌతుందని ఆలోచనల్లో ముగినిపోతుంటారు. దాంతో వారికి రాజకీయంగా ఎదురులేకున్నా తనను పట్టించుకోవడం లేదన్న భ్రమల్లోకి వెళ్లిపోతుంటారు. పార్టీలో ఏదైనా తనకు తెలియకుండా ఏదైనా నిర్ణయం జరిగితే చాలు నన్ను తొక్కిపెడుతున్నారని ఆందోళన చెందుతుంటారు. పైగా తనకు వున్న ఆశలు ఎవరో ఎగిరేసుకుపోవచ్చన్న భయంలో బతుకుతుంటారు. తను మాత్రమే పార్టీకి గొప్ప నమ్మకస్తుడిని అనుకుంటారు. ఇతరులు పార్టీ అదినేతల వద్ద చనువుగా వుంటే ఓర్చుకోలేరు. తనకు దక్కని ప్రాదాన్యం ఇతరులకు దక్కుతుంటే సహించలేరు. ఇవి సహజంగా సాధారనంగా అందరికీ వుండే అవలక్షణాలే..ఇదే కొంప ముంచుతాయి. ప్రతి ఇంట్లోనూ వుండేవే. కాని రాజకీయ నాయకుల కుటుంబాలలో వెంటనే బైటకు వస్తాయి. కుటుంబంలో చీలికలు తెస్తాయి. కుటుంబాన్ని వీదిన పడేస్తాయి. తనకు దక్కనిది వేరే ఇతరులకు కూడా దక్కొదన్నంత పట్టుదలను ప్రదిర్శించేలా చేస్తాయి. ఇలా రాజకీయాల్లో లేని పోని అపోహలతో జీవితాలు తలకిందులు చేసుకున్న వారిలో మాజీ ఎంపి. దేవనపల్లి కవితతే కాదు, చిరిత్రలో చాలా మంది వున్నాయి. అయితే అదికారంలో వున్నప్పుడు పార్టీలో వుండి, పదవులున్నీ అనుభవించి, పొందాల్సిన గౌరవాలన్నీ అందరికన్నా ఎక్కువగా పొందినా వారికి తృప్తి వుండదు. అధికారం చూసిన కళ్లతో ఖాళీగా వుండాలంటే మనసు నొప్పదు. అలా తమ రాజకీయ జీవితాలను తుంచుకున్న వారిలో ముందుగా మనకు కనిపించేది మేనకాగాంధీ. ఇందిరాగాందీ చిన్న కుమారడు సంజయ్ గాందీని పెళ్లి చేసుకున్నారు. సంజయ్గాందీ మరణానంతరం ఆమె కీలకం కావాలనుకున్నారు. అత్త ఇందిరాగాందీని వ్యతిరేకిస్తూ వచ్చారు. పార్టీని గుప్పిట్లోకి తీసుకోవాలని ప్రయత్నం చేశారు. ఆఖరుకు ఇందిరాగాందీ కుటుంబానికి దూరమయ్యారు. ఏకండా రాష్ట్ర సంజయ్మంచ్ అనే పార్టీని ఏర్పాటు చేశారు. ఆమె కూడా ఆ పార్టీ నుంచి గెలవలేకపోయింది. నిజానికి ఆమె ఆనాడు కొంత ఓపికతో వుంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆమె చేతుల్లో వుండేది. ఆమె ప్రదానమంత్రి అయ్యి వుండేది. కాని చేజేతులా తన రాజకీయ జీవితాన్ని కొంత నష్టం చేసుకున్నది. తన వారసుడు వరుణ్ గాందీకి కూడా గాందీ వారసత్వం లేకుండా చేసుకున్నది. ఆ మధ్య షర్మిల కూడా ఇదే తరహాలో తన అన్న మీద ఆరోపణలు గుప్పిస్తూ ఆయనకు దూరమైంది. ఆఖరుకు తనకు రాజకీయమే లేకుండా చేసుకున్నది. ఆ సమయంలో కల్వకుంట్ల కవిత కుటుంబ పరంగా షర్మిలకన్నా చాల బెటర్ అని అందరూ అనుకున్నారు. కాని ఇప్పుడు కవిత కన్నా, షర్మిల వెయ్యి రెట్లు బెటర్ అనుకునే స్ధితిని కవిత కొని తెచ్చుకున్నారు. తన అన్న జగన్ కోసం షర్మిల సుమారు పది సంవత్సరాలు తన వ్యక్తి గత జీవితాన్ని కూడా వదిలేసుకున్నది. అన్నను రాజకీయంగా బలవంతుడిని చేసేందుకు అహర్నిషలు కృషి చేసింది. జగన్ జైలుకు వెళ్లడంతో అర్ధాంతరంగా ఆగిపోయిన ఓదార్పు యాత్రను పూర్తి చేసింది. అన్నకు కొండంత అండగా నిలిచింది. అన్న కోసం ఏకంగా పాదయాత్ర కూడా చేసింది. కాని తన అన్న అదికారంలోకి వచ్చినా పదవి ఇవ్వకపోవడం తోపాటు, తనకు ప్రాదాన్యతనివ్వడం లేదన్న కోపంతో ఎదురుతిరిగింది. షర్మిల విషయంలో అన్న కోసం త్యాగం కనిపిస్తుంది. కాని కేటిఆర్ విషయంలో కవిత త్యాగం ఎక్కడా లేదు. అన్న ఎంతో తాను అంతే.. అన్న తనకంటే ఎక్కువేం కాదన్న దోరణి కనిపిస్తుంది. తాను ముఖ్యమంత్రి కావాలన్న కలలు కనిపించాయి. అన్నను ముఖ్యమంత్రి చేస్తానని ఎక్కడా చెప్పలేదు. తానెందుకు ముఖ్యమంత్రి కావొద్దన్న ఆలోచనలు మాత్రమే చేసిందనేది అర్దమౌతోంది. అందుకే అన్నను సిఎం. కాకుండా కూడా అడ్డుకున్నట్లు కూడ కనిపిస్తోంది. అయితే కవిత ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. చాలా రాష్ట్రాలలో కుటుంబ రాజకీయ చీలికలువేరు. తెలంగాణలో కేసిఆర్ కుటుంబ రాజకీయం వేరు. అన్ని రాజకీయాలు వేరు..కేసిఆర్ రాజకీయంవేరు. అన్ని పార్టీలు వేరు. బిఆర్ఎస్ పార్టీ వేరు. బిఆర్ఎస్కు కొన్ని ప్రత్యేకతలున్నాయి. ప్రత్యేకమైన గుణాలున్నాయి. అవి ఏ ఇతర పార్టీలకు లేదు. మరో తెలుగు రాష్ట్రమైన ఆంద్రప్రదేశ్లో వున్న తెలుగుదేశం, వైఎస్ ఆర్సీపిలు వ్యక్తులుగా నిర్మాణం చేసుకున్న పార్టీలు. కాని బిఆర్ఎస్ వ్యక్తిగా కేసిఆర్ నిర్మాణం చేసుకున్న పార్టీ కాదు. తెలుగు వారి ఆత్మగౌరవం అంటూ చెప్పి, తాను ముఖ్యమంత్రి కావాలని ఎన్టీఆర్ ఏర్పాటు చేసుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ సమయంలో పార్టీ నిర్మాణం అప్పటికి జరగలేదు. ఎన్టీఆర్ ఎవరికి టికెట్ ఇస్తే వాళ్లు గెలిచారు. వాళ్లే పార్టీకి తర్వాత నాయకులయ్యారు. కాని బిఆర్ఎస్ అలా కాదు. బిఆర్ఎస్ తొలి తరంలో నాయకులను తయారు చేయలేదు. నాయకులంతా కలిసి బిఆర్ఎస్కు రూపకల్పన చేశారు. కేసిఆర్కు పూర్తి సహాకారమందించారు. తెలంగాణ ఉద్యమంలో కేసిఆర్తో కలిసి నడిచారు. అందులో అప్పటికే ఎమ్మెల్యేలు, ఎంపిలు, మంత్రులుగా పని చేసిన వాళ్లు కూడా వున్నారు. అలా బలమైన నాయకులతో బిఆర్ఎస్ బలమైన పునాదులు వేసుకున్నది. తర్వాత కాలంలో ఉద్యమకారుల చేత తిరుగులేని శక్తిగా మారిపోయింది. ఆ సమయంలో బలంగా వున్న నాయకుడు దూరమౌతూ వచ్చారు. కొత్త నీరు నాయకులయ్యారు. అయినా బిఆర్ఎస్ అదికారంలోకి వచ్చాక కూడా చాలా మంది ఇతర పార్టీల నాయకులు చేరారు. పార్టీకి బలం పెంచారు. ఈ విషయం కవిత మర్చిపోయింది. పార్టీ నాదే అనేంత దైర్యం ఆమెకు వచ్చిందంటనే ఆమెకు పార్టీలో పట్టు, ప్రాధాన్యత ఎంతో వున్నట్లు లెక్క. ఒక దశలో గులాబీ జెండా నాది అని ఉద్యమకారుడిగా ఈటెల రాజేందర్ మాట్లాడితే ఆయనను పార్టీ నుంచి బైటకు పంపించారు. ఆ సమయంలో ఉద్యమకారుల ఆత్మగౌరవం కవితకు గుర్తుకు రాలేదు. పార్టీ నాది, మనందరిదీ అని నాయకులు అనుకోకలేకపోతే ఏ పార్టీ పది కాలాలపాటు బలంగా వుండదు. అందుకే ఉద్యమ కారుడిగా ఈటెల, పార్టీకి చేసిన సేవను దృష్టిలో పెట్టుకొని ఏదో ఆయాచితంగా అన్న మాటలు మాత్రమే. కాని అది ఆయన పార్టీనుంచి బైటకు వెళ్లాల్సిన పరిస్తితి వచ్చింది. అప్పుడైనా కవిత తెలుసుకోవాల్సింది. పార్టీ మనందరదీ..అయినా అదినేత తన తండ్రి కావడం వల్ల తనకు ఎనలేని ప్రాదాన్యత దక్కుతుందని గుర్తించుకోలేకపోయింది. తాను పార్టీ కోసం ఎంతో చేశాను. తనను దూరం పెడుతున్నారని అనుకున్నది. నిజానికి ఎవరూ ఆమెను దూరం పెట్టలేదు. తనకు తానుగానే దూరమౌతూ వచ్చింది. తనకు ప్రాదాన్యత లేని పార్టీ వుంటే ఎంత? లేకుంటే ఎంత? అనుకున్నది. బిఆర్ఎస్లో తాను సిఎం. అయ్యే అవకాశం లేదన్నది ఆమె తెలుసుకున్నది. తనుకు సిఎం. పదవి దక్కని పార్టీ వుంటే ఎంత లేకుంటే ఎంత? అనుకొన్నట్లువుంది. తాను సిఎం. కాకపోయినా ఫరవాలేదు. కాని తన అన్న కాకూడదన్న నిర్ణయానికి వచ్చినట్లు వుంది. అందుకే అన్నకు పార్టీలో దక్కుతున్న ప్రాదాన్యత చూసి అసూయ చెందినట్లుంది. కేసిఆర్ చుట్టూ దెయ్యాలున్నారని మొదలు పెట్టింది. నిజానికి ఇప్పుడు పార్టీ అదికారంలో లేదు. ప్రతిపక్షంగా ఐదేళ్ల పాటు చేసేదేమీ లేదు. కేసిఆర్ చుట్టూ నాయకులు వుండడం వల్ల వారికి వచ్చే లాభమేమీ లేదు. పైగా ఇంత మంది నాయకులు కేసిఆర్ చుట్టూ వుంటే పార్టీకే బలం. పార్టీ అదికారంలో వున్నప్పుడు ఎలాగూ కేసిఆర్కు దగ్గ్ణర కాలేకపోయాం..ఇప్పుడైనా దగ్గరగా వుంటే భవిష్యత్తులో తమకు ప్రాదాన్యత వుంటుందన్న ఆలోచనతో కూడా నాయకులు వుండొచ్చు. అలా పార్టీకి, కేసిఆర్కు మనో ధైర్యంగా వున్న నాయకులను దెయ్యాలు, దొంగలు, గుంట నక్కలు అంటూ సంబోదించి తన గోతి తానే తవ్వుకున్నది. తన రాజకీయానికి తానే కుంపటి పెట్టుకున్నది. పార్టీ కష్టకాలంలో వున్నప్పుడు అండగా నిలబడాల్సిన సమయంలో పార్టీ మీద అబాంఢాలు వేస్తూ, ఏకంగా కేసిఆర్ పాలననే తూర్పారపడుతూ, పదేళ్ల ఏం పీకారని కవిత మాట్లాడడం చాల తప్పు. అందుకే వారసురాలిని అని చెప్పుకోవాల్సిన కవిత, పగదారురాలై పార్టీకి దూరమైంది.
`ఎవరి ‘‘పదవి’’ ఎప్పుడు పోతుందో ‘‘గ్యారెంటీ లేదు’’!
`నీళ్లిచ్చిండు..కరంటు తెచ్చిండు..కడుపు నింపిండు.
`నీళ్ళాపిండు..నిలువ చేసిండు..చెరువులు నింపిండు.
kcr leader of telangana
`అనుమతుల కోసం ప్రయత్నస్తూనే… ప్రాజెక్టులు కట్టిండు.
`తెలంగాణా దిశ మర్చిండు… దశ మర్చిండు.
`నీటి గోస తీర్చిండు.. తెలంగాణ నెంబర్ వన్ చేసిండు.
`తిండికి గతి లేని తెలంగాణను అన్నపూర?ను చేసిండు.
`పంజాబ్ ను పక్కకు తోసిండు.
`బెంగాల్ ను కిందికి తోసిండు.
`పదేళ్లలో తెలంగాణ రైతును రాజును చేసిండు.
`శాపనార్ధాలతో సమస్యలు పరిష్కారం కావు.
`తెలంగాణా దేవుణి? తిట్టి తప్పు చేస్తుండ్రు.
చావు భాష ఎవరు మాట్లాడినా మంచిది కాదు.
`ప్రజాస్వామ్యంలో ఆహ్వానించదగ్గది కాదు.
`పదవులు ఎవరికీ శాశ్వతం కాదు.
`ఆ మాత్రం దానికి మిడిసిపాటు ఎవరికీ తగదు.
`ఉన్నత పదవుల్లో వున్న వారికి అసలే మంచిది కాదు.
`తిట్లు కాదు కనీసం తెలివైన సమాధానం వెతకండి.
`జనం చేత శబాష్ అనిపించుకోండి!
`ఎన్నికల ముందు ఆరోపణలు వేరు?
`ఇప్పుడు ‘‘కెసిఆర్’’ ను దూషిస్తే జనం మెచ్చుకోరు.
`‘‘కెసిఆర్’’ ను పాలకులు తక్కువ చేసి మాట్లాడినంత మాత్రనా గొప్ప వారు కారు.
మళ్ళీ జన్మేత్తినా ‘‘కెసిఆర్’’ చరిత్ర చేరపలేరు.
హైదరాబాద్, నేటిధాత్రి:
మంత్రాలకు చింతకాయలు రాలవు. శాపనార్దాలకు నీళ్లు రావు. తిట్టుకుంటే వచ్చే తుప్పిళ్లు నీళ్లు కావు. నీళ్లంటే మాటలు కాదు. మాటలు చెప్పినంత సులువుగా నీళ్లు రావు. మాటల మూటలు కట్టుకంటూ పోతే కాలం చాలదు. ప్రజాస్వామ్యంలో పాలకులు ఎవరూ శాశ్వతంకాదు. ప్రాణాలే శాశ్వతం కానప్పుడు పదవులెంత? ప్రాపకాలెంత? వైభవాలెంత? ఇవి తెలిస్తే ఏ వ్యక్తి మరో వ్యక్తిని దూషించడు. చావులు కోరుకోరు. పాలకులా లేక ప్రత్యర్ధులను తిట్టుకుంటూ, శాపనార్థాలు పెట్టుకుంటూ, చావులు కోరుకునే వాళ్లా? ఇవెక్కడి దిక్కుమాలని రాకీయాలు. ప్రజలు ఎంతో నమ్మకంతో బాధ్యతలు అప్పగించారు. అది నాయకుల పుణ్యం కాదు. ప్రజల దయాదాక్షిణ్యం. ఏ వ్యక్తికైనా కొపం వుంటే ఒకసారి తిట్టొచ్చు. రెండుసార్లు తిట్టొచ్చు. కాని పదే పదే మాటకు ముందు ఒకసారి, మాటకు వెనకొకసారి, నోరు తెరిస్తే తిట్ల పర్వం తప్ప మరొక పని లేదా? ప్రజలు పని చేయమని పట్టం కట్టారా? లేక కేసిఆర్ ను తిట్టుకుంటూ కాలం గడపమని గెలిపించారా? రెండేళ్లుగా ఒకటే పనా? కేసిఆర్ను దూషించడం తప్ప మరో పని లేదా? ఇన్ని తిడుతున్నా, ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నా ఎంతో హుందాగా కేసిఆర్ మౌనంగానేవుంటున్నారు. ప్రజలు చక్కటి అవకాశమిచ్చారు. మాకంటే బాగా పనిచేయండి. నేను ఒక దారి చూపాను. తెలంగాణ భవిష్యత్తు మీది అని ఎంతో హుందా కేసిఆర్ సూచించారు. అయినా సరే మేం మేం మారమన్నట్లు సాగుతున్నారు. అటు బూతులు, ఇటు తిట్లతోనే పుణ్యం కాలం గడిపేస్తారా? ఎంత కాలం కేసిఆర్ మీద పడి ఏడుస్తారు? కేసిఆర్ చేసిన తప్పేంటి? కేసిఆర్ చేసిన అన్యాయమేమిటి? కేసిఆర్ ఒక యోగి. తెలంగాణ త్యాగి. తెలంగాణ మూర్తి. తెలంగాణ స్పూర్తి. తెలంగాణ ఆర్తి. తెలంగాణ దీప్తి. కేసిఆర్ గురించి ఎన్ని మాటలు చెప్పినా తక్కువే. ఎన్ని పదాలు రాసిన తక్కువే. అంత గొప్పది కేసిఆర్ చరిత్ర. ప్రజల గురించి ఆయన ఆలోచించినంతా మరే నాయకుడు ఆలోచించరు. తెలంగాణ కోసం కొట్లాడిరడు. తెలంగాణ తెచ్చిండు. 60 ఏళ్లుగా సాద్య పడని తెలంగాణ సాధన సుసాద్యం చేసిండు. తెచ్చిన తెలంగాణను పదేళ్లలో కనకం చేసిండు. తెలంగాణను అన్ని రంగాల్లో పరుగులు తీయించిండు. ఎప్పుటి నుంచో పరుగులు తీస్తున్న రాష్ట్రాలను దాటుకొని, పదేళ్లలో అన్ని రాష్ట్రాలను దాటేలా చేసింది. అభివృద్ది అంటే ఇదీ అని చూపించిండు. విఫల రాష్ట్రం చేయాలని చూసి, కళ్లలో నిప్పులు పోసుకున్న వారి కనువిప్పు కలిగేలా చేసిండు. తెలంగాణ వైపు కన్నెత్తి చూస్తే కర్రు కాల్చి వాత పెట్టింతన పని చేసిండు. అలా భయం పెట్టి, తెలంగాణను కాపాడిరడు. అదీ కేసిఆర్. తెలంగాణ ద్రోహులు కపట పన్నాగాలు పన్నుతుంటే, కాళ్లల్లో కట్టెలు పెడుతుంటే కూడా క్షమించిండు. తన కర్తవ్యమే ముఖ్యమని ముందుకు సాగిండు. తెలంగాణను బంగారు తునక చేసిండు. ఇదీ ఒక పాలకుడికి వుండాల్సిన లక్షణం. కాని ఇప్పుడు తెలంగాణలో ఏం జరుగుతోంది. అసలు కేసిఆర్ తెలంగాణ తేవడమే తప్పనుకుంటున్నారా? కేసిఆర్ తెలంగాణ కోసంకొట్లాడడమే పాపమనుకుంటున్నారా? అరవై ఏళ్లలో కాంగ్రెస్, తెలుగుదేశం చేసిన విద్వంసం నుంచి తెలంగాణను కాపాడినందుకా? కాంగ్రెస్ పార్టీ ఎందుకు అసహనమో అర్దం కావడం లేదు. అరవైఏళ్లు పాలించి, తెలంగాణను సర్వనాశనం చేసి, తెలంగాణ ప్రజలను అన్నమో రామ చంద్రా అని ఏడిపించిన కాంగ్రెస్ పార్టీ పదేళ్లలో కేసిఆర్ తెలంగాణను నాశనం చేశాడడనడంలో ఔచిత్యమేమిటో కనిపించడం లేదు. 50 ఏళ్లు తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే కళ్లు చూడలేక, నోరు మాట్లాడలేక, పదవుల్లో వుండి పనులు చేయలేక చేష్టలుడిగిన నాయకులు కూడా ఇప్పుడు కేసిఆర్ను తిడుతున్నారు. ఉమ్మడి రాష్ట్ర నాయకులను ఇంకా నెత్తి మీద పెట్టుకుంటున్నారు. వాళ్ల వల్లనే రాజకీయ జీవితాలు వచ్చాయని కృతజ్ఞతలు చూపిస్తున్నారు. ఓట్లేసేసి గెలిపించేది తెలంగాణ ప్రజలు. కాని ఊడిగం ఇంకా ఆంద్రా నాయకులకు చేద్దామనుకే నాయకులు వుండడం దౌర్భాగ్యం. కేసిఆర్ ఏం చేసిండు? ఏం చేసిండు? అని పదే పదే ప్రశ్నించే వారికి కళ్లు లేవా? చూడడం లేదా? కనిపించడం లేదా? ప్రగతి అంటే ఏమిటో చూడకుండానే రాజకీయాలు చేస్తున్నారా? పదేళ్ల కింద పచ్చ గడ్డికి కూడా దిక్కులేని భూముల్లో పచ్చని పైర్లు కనిపించడం లేదా? నీటి చుక్క జాడ లేని చోట పచ్చని పంటలు కనిపించడం లేదా? ఉమ్మడి రాష్ట్రంలోనే పాలమూరు పచ్చబడితే ప్రజలు వలసలెందుకు వెళ్లేవారు? పంటలు లేని భూముల్లో పలుగు రాళ్లెందుకు తేలేవి? తొండలు కూడా గుడ్లుపెట్టవని ఆంద్రా నాయకులు ఎందుకు ఎగతాళి చేసేవారు? ఇవన్నీ నాయకులు మర్చిపోయినా, జనం మర్చిపోరు. కుప్ప మీద కూర్చొని, తిండికి గతి లేదని ఏడ్చేవారు, గుప్పెడు మెతుకులు చూడని కాలం మర్చిపోతారు. అవకాశ వాద రాజకీయాలు చేస్తారు. కేసిఆర్ లాంటి నాయకుడు దేశంలోనే కాదు ప్రపంచంలోనే లేరు. ప్రపంమంతా వెతికినా కనిపించరు. అంత గొప్ప పాలకుడు కేసిఆర్. అరవై ఏళ్లలో సాద్యం కానిది ఐదేళ్లలో చూపించారు. తెలంగాణ తెచ్చి నీళ్లిచ్చిండు. అదే ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ఎందుకివ్వలేదు? కాని తెలంగాణ తెచ్చిన ఆరు నెలల్లోనే నీళ్లిచ్చిండు. మిషన్ కాకతీయ తేవడానికి ముందే ప్రయోగం చేసిండు. గొలుసు కట్టు చెరువులు నింపడం మొదలు పెట్టిండు. చెరువులన్నీ నింపేందుకు తెలంగాణలో మిషన్ కాకతీయ తెచ్చిండు. 46వేల చెరువులకు పూర్వ వైభవం తెచ్చిండు. వాగులు వంకల ద్వారా చెరువులు నింపిండు. వాగుల్లో నీళ్లు పారించిండు. భూగర్భ జలాలు సమృద్ది చేసిండు. వంకలు, ఒర్రెలు, కుంటలలో కూడా నీళ్లు పారించిండు. అదీ సంకల్పమంటే…అదీ పుట్టిన గడ్డ మీద మమకారమంటే…కరంటు కష్టాల నుంచి ఒక రాష్ట్రాన్ని మూడు నెలల్లో గట్టెక్కించిన నాయకుడు, దార్శనికుడు ప్రపంచంలో ఎవరూ లేరు. ఆరు నెలల్లో ఒట్టిపోయిన తెలంగాణను గంగాళం చేసిండు. అలాంటి పాలకుడు మరొకరు లేరు. తలాపున పారుతున్న గోదారికి తన కాళ్లు అడ్డం పెట్టి ఆపిండు. వాటిని నిలువ చేసిండు. చెరువులు నింపిండు. కాళేశ్వరం కట్టిండు. తెలంగాణ మొత్తం పారించిండు. అటు ఖమ్మందాకా, ఇటు కోదాడ దాక, చిట్ట చివరి పాలమూరు ఊరు దాకా కాళేశ్వరం నీళ్లు పారించాడు. ఎండి ఎండి డొక్కలీడ్చుకుపోయి వున్న తెలంగాణ కడుపు నింపిండు. తెలంగాణ రైతు కన్నీళ్లు తుడిచిండు. అరవై ఏళ్లు ఎండిన బీళ్లకు దాహం తీర్చిండు. తొండలు కూడా గుడ్లు పెట్టవని ఎగతాళి చేసిన నేలన పుట్లకొద్ది వడ్లు పండిరచిండు. తెలంగాణలో ఒక్క గుంట కూడా పంట లేకుండా వుండకుండా సాగయ్యేలా నీళ్లిచ్చిండు. పంటతో పాటు పాడి పెంచాడు. పాడి పంటలతో తెలంగాణ తులతూగేలా చేసిండు. తెలంగాణ కన్నీళ్లు తుడిచేందుకు ఆగమేఘాలమీద ప్రాజెక్టులు కట్టిండు. కేంద్రం కొర్రీలు పెడుతున్నా, అనుమతులలో జాప్యం చేస్తున్నా లెక్క చేయలేదు. తన తెలంగాణ ప్రజలే తనకు ముఖ్యమని నీళ్లను మళ్లించిండు. అనుమతులు కోసం ఎదురుచూసుకుంటూ కూర్చోలేదు. అటు అనుమతులు కోసం ప్రయత్నాలు సాగిస్తూనే మరో వైపు ప్రాజెక్టులు పూర్తి చేసిన గొప్ప పాలకుడు కేసిఆర్. అన్నమో రామచంద్రా అని ఆకలి కేకలు పెట్టిన తెలంగాణను అన్న పూర్ణను చేశారు. అన్న పూర్ణ అని పేరున్న ఆంద్రా ప్రాంతాన్ని వెనక్కి నెట్టేశాడు. దేశంలోనే నెంబర్ వన్ అని చెప్పుకున్న పంజాబ్ను పక్కకు నెట్టేశాడు. బెంగాల్ను కిందకు తోసేశాడు. సాగు రంగంలో తెలంగాణలో పదేళ్లలో పంటల విప్లవాన్ని సృష్టించారు. ఎడారిలా మారిన తెలంగాణను ఒయాసిస్సు చేసిండు. అన్ని రంగాలలో తెలంగాణ నెంబర్ వన్ చేసిండు. ఒకప్పుడు బియ్యమే లేని కాలం. అందులోనూ సన్న బియ్యం అంటే ఆంద్రా నుంచి రావాలని అనుకునే సందర్భం. ఇప్పుడు తెలంగాణ అంతా సన్నబియ్యమే. అందుకు కారణం కేసిఆర్. అలాంటి నెంబర్ వన్ రాష్ట్రాన్ని పాలిస్తూ, కేసిఆర్కు శాపనార్దాలు పెట్టడం సరైంది కాదు. నీళ్ల విషయంలో కేసిఆర్ను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ తప్పుల మీద తప్పు చేస్తోంది. కేసిఆర్ మీద నిందలేస్తూ పొరపాట్ల మీద పొరపాట్లు చేస్తోంది. కేసిఆర్ ఆకాశమంత మహా మనిషీ. ఆయనను కన్నెత్తి చూసే అర్హత లేని వాళ్లు కూడా కవ్విస్తున్నారు. అదే సమయంలో కలలో కేసిఆర్ను గర్తుచేసుకుంటూ జడుసుకుంటున్నారు. పైకి మేక పోతు గాంబీర్యం ప్రదర్శిస్తున్నారు. కేసిఆర్ ముందే కుప్పి గంతులేస్తున్నారు. అసాధ్యాన్ని సుసాద్యం చేసిన యోధుడు. ప్రజలకు సంక్షేమం అందించిన వారే నిజమైన పాలకుడు. ఆ పాలకుడు ఒకే ఒక్కడు. కేసిఆర్. ఆ పేరే తెలంగాణకు సూపర్ పవర్.
బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ కీలక భేటీ.. చర్చించిన అంశాలివే
నందినగర్లోని నివాసంలో బీఆర్ఎస్ నేతలతో మాజీ సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై సమావేశంలో చర్చించారు.
బీఆర్ఎస్ నేతలతో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (Former CM KCR) ఈరోజు (మంగళవారం) సమావేశమయ్యారు. నందినగర్ నివాసంలో జరిగిన ఈ భేటీలో మాజీ మంత్రులు కేటీఆర్ (KTR), హరీష్ రావు (Harish Rao), పలువురు బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు గులాబీ బాస్ దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ప్రధానంగా పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్కు సంబంధించి అసెంబ్లీ వేదికగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఎండగట్టాలన్నదే బీఆర్ఎస్ వ్యూహం.ఇందులో భాగంగానే ఈ అసెంబ్లీ సమావేశాలను పూర్తిగా ఉపయోగించుకోవాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్ విషయంలో గత పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందని, ఈ ప్రాజెక్ట్ను పక్కన పెట్టి కేవలం కాళేశ్వరం ప్రాజెక్ట్ను మాత్రమే నిర్మించిందని అధికార కాంగ్రెస్ పార్టీ ఆరోపణ. బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల కాలంలో అటు కృష్ణా, ఇటు గోదావరి రెండు నదులపై చేపట్టిన ప్రాజెక్టులు, నీటి వాటాలు పరిష్కరించామని ఆ పార్టీ చెప్పుకొస్తోంది.ఇదే విషయంపై కొద్దిరోజులుగా సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం మధ్య మాటల యుద్ధం వ్యక్తిగత దూషణలకు దారి తీసింది. వీటన్నింటికీ అసెంబ్లీ వేదికగా సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ గట్టి పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగానే కాసేపటి క్రితమే కేసీఆర్తో కేటీఆర్, హరీష్ రావు, ఇతర నాయకులు సమావేశమయ్యారు. ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది?.. ప్రభుత్వం చెప్పే ప్రతీ అంశంపై సమాధానంతో సిద్ధంగా ఉండాలని ఇప్పటికే పార్టీ నేతలకు కేసీఆర్ చెప్పినట్లు తెలుస్తోంది.
తెలంగాణ రాష్ట్ర మాజి ముఖ్యమంత్రి కె.సి.ఆర్ రావడంతో స్వగతం చెప్పాడానికి వెళ్లినానని కార్యకర్తల తోపులాట జేరిందని మాజీ ఎంపి రావు ల చంద్ర శేఖర్ రెడ్డి తెలిపారు ఆయన స్వల్పంగా గాయపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న వనపర్తి నేటిదాత్రి దినపత్రిక జర్నలిస్ట్ మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డిని హైదరాబాద్ హిమాయత్ నగర్ లో పరమార్శి oచారు టి.వి లో స్క్రోలింగ్ రావడంతో ప్రజలు అభిమానులు కార్యకర్తలు ఆందోళన చెందారని స్వల్ప గాయలు అయ్యావని గాయాలు తగ్గాయని ప్రజలు అభిమానులు బీ ఆర్ ఎస్ కార్యకర్తలు ఆందోళన చెందవద్దని మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి ఒక ప్రకటన లో కోరారు
ఏలేటి మహేశ్వర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు వారం రోజుల్లో అపాలజీ చెప్పాలని.. లేదంటే కోర్టుకి ఈడుస్తామని జాగృతి అధ్యక్షురాలు కవిత వార్నింగ్ ఇచ్చారు. హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ను ఒక్క సహాయం కూడా అడగలేదని తెలిపారు.
మాజీ మంత్రి హరీష్ రావు, బీఎర్ఎస్ టార్గెట్గా జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఏలేటి మహేశ్వర్ రెడ్డి, మాధవరం కృష్ణారావుతో హరీష్, బీఆర్ఎస్ తనపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతల అక్రమాలు తన దృష్టికి వస్తున్నాయని… అసలు కథ ముందుంది అంటూ కామెంట్స్ చేశారు. ‘నేను మంచి దాన్ని కాదు. కాళ్ళు విరగొడతాను’ అంటూ హెచ్చరించారు. అధికారంలో ఉన్న పదేళ్లలో తాను, తన భర్త ఒక్క పని అయినా అడిగామా అని ప్రశ్నించారు. తాను ఏ తప్పూ చేయలేదని.. బీఆర్ఎస్లో 10 ఏళ్లలో ఒక్క రూపాయి సంపాదించలేదని స్పష్టం చేశారు.
హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ను ఒక్క సహాయం కూడా అడగలేదని తెలిపారు. ఉద్యమంలో ఎవరు ఏమి చేశారనేది తాను ఎప్పుడూ చెప్పలేదన్నారు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు వారం రోజుల్లో అపాలజీ చెప్పాలని.. లేదంటే కోర్టుకి ఈడుస్తామని వార్నింగ్ ఇచ్చారు. తనను పార్టీ నుంచి పంపించారని.. అయినా వాళ్ల కళ్ళు చల్లబడలేదా అని వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ కిటికీలు తెరిచిందని.. కాంగ్రెస్ డోర్స్ ఓపెన్ చేసిందన్నారు. తనపై ఎవ్వరు ఎలాంటి ఆరోపణలు చేసినా జవాబు చెబుతానన్నారు.బీఆర్ఎస్ హయాంలో చాలా తప్పిదాలు జరిగాయని… అవి తన దృష్టికి వస్తున్నాయని తెలిపారు. బీఆర్ఎస్ వాళ్ళు తప్పు చేశారనే.. రేవంత్ అధికారంలోకి వచ్చారని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన లావాదేవీలకు, కాంగ్రెస్కు సంబంధం ఉందని ఆరోపించారు. ‘నేను ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి అవుతా. హరీష్ రావు.. విజ్ఞత అని తప్పించుకుంటున్నారు. లైన్లు నేను దాట లేదు. నేను ఇంకా ఊరుకోను ’ అంటూ కవిత సంచలన కామెంట్స్ చేశారు.
ఆటో డ్రైవర్లకు ఇన్సూరెన్స్ బాండ్ల పంపిణీ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
– ఆటోడ్రైవర్లకు బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ భరోసా
– ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఎమ్మెల్యే కేటీఆర్
సిరిసిల్ల(నేటి ధాత్రి):
సిరిసిల్లలో మాజీమంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా ఆటోడ్రైవర్ల తో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆత్మీయ భరోసా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకు రూ.5 లక్షల ప్రమాద బీమా ఇచ్చిన ఘనత కేసీఆర్దే అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆటో డ్రైవర్లకు ప్రమాద బీమా కల్పించామని కార్మికుల పక్షపాతి కేసీఆర్ అన్నారు. అధికారంలో లేనప్పటికీ ఆటో డ్రైవర్ల సమస్యలపై బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు స్పందిస్తుందని వారి వెన్నంటే ఉండి వారి సమస్యలపై పోరాడుతామన్నారు. కేసీఆర్ను మరోసారి గెలిపిద్దామని ప్రజలు అనుకుంటున్నరని ఆటోడ్రైవర్లను ఆదుకుంటామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రజలను అన్ని విధాలుగా తప్పుడు ప్రచారాలు చేసి మోసం చేసిందన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని, ఇచ్చిన హామీలను ఒక్కటీ కూడా ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు.
ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇవ్వలేదన్నారు. రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేసిందన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, ప్రజలందరికీ మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తోట ఆగయ్య, కార్మిక విభాగం అధ్యక్షులు రాంబాబు యాదవ్, వేములవాడ బిఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీ నరసింహారావు, బిఆర్ఎస్ పార్టీ కార్యదర్శి మాజీ టెక్స్టైల్ చైర్మన్ గూడూరు ప్రవీణ్, మాజీ టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీందర్రావు మాజీ గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, మాజీ జడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, అరుణ రాఘవరెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి,సిరిసిల్ల బీ.ఆర్.ఎస్ పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి, ఆటో యూనియన్ అధ్యక్షులు అల్లే శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులు బొల్లి రామ్మోహన్, కార్మిక విభాగం అధ్యక్షులు వెంగళ శ్రీనివాస్ చైర్మన్ చిక్కాల రామారావు మండలాల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పార్టీ కార్యకర్తలు ఆటో యూనియన్ నాయకులు కార్మికులు పాల్గొన్నారు
#తెలంగాణ ప్రజల చిరకాల ఆంక్షను నెరవేర్చిన నాయకుడు కేసీఆర్.
#మండల పార్టీ అధ్యక్షుడు బానోతు సారంగపాణి.
నల్లబెల్లి,నేటిధాత్రి:
తెలంగాణ స్వరాష్ట్ర సాధన లో దీక్ష దివస్ అపూర్వఘట్టమని బీ ఆర్ఎస్ మండల అధ్యక్షుడు బానోతు సారంగపాణి అన్నారు.దీక్ష దివస్ కార్యక్రమం నేపద్యంలో మండలంలోని గోవిందపురం గ్రామంలో ఉద్యమకారుల చిత్రపటానికి పూలమాలలతో అమరులకు నివాళులర్పించారు.ఈ సందర్భంగా సారంగపాణి మాట్లాడుతూ తెలంగాణ వచ్చుడో… కేసీఆర్ సచ్చుడో” అని నినదించి తన ప్రాణాలను సైతం లెక్కచేయనీ, ఉద్యమ నాయకుడు కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ సాధనే లక్ష్యంగా 2009 నవంబర్ 29న ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన రోజునే దీక్ష దివస్ గా అని పేర్కొన్నారు.తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన ఒక అపూర్వ ఘట్టమని అన్నారు.ఈ నేపథ్యంలో యావత్ తెలంగాణ ప్రజలని,తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాలను ఏకం చేసిన దీక్ష అని తెలిపారు.తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర సాధనలో అత్యంత కీలకమైన ఘట్టంగా ఈ దీక్ష దివస్ నిలుస్తుందని స్పష్టం చేశారు.2009 నవంబర్ 29వ తేదీన భారత రాష్ట్ర సమితి (అప్పటి టీఆర్ఎస్) అధ్యక్షులు కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షతో మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి, స్వరాష్ట్ర సాధనకు బలమైన పునాదులు వేసిందన్నారు. దీక్షకు వెళ్లే ముందు కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ వచ్చుడో – కేసీఆర్ సచ్చుడో అనే తెగింపుతో చేపట్టిన ఈ దీక్ష సబ్బండ వర్గాల తెలంగాణ ప్రజలను ఏకం చేసిందన్నారు.సమగ్ర భారత దేశ రాజకీయ వ్యవస్థను కదిలించి, దశాబ్దాల తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చిందని పేర్కొన్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి, మెప్పించి.. కులాలకు, మతాలకు అతీతంగా అందరినీ దీక్షా దివస్ కలిపిందన్ని వివరించారు. ప్రత్యేక తెలంగాణ కళ కలగానే మిగిలిపోతుందే మో అన్న సమయంలో, అమరవీరుల నెత్తురుతో వారి త్యాగాలతో తెలంగాణ నేల తడిసి ముద్దవుతున్న సమయంలో ఎత్తిన జెండా విడవకుండా, పదవులను గడ్డి పోచల్లా విసురుతూ తెలంగాణ ప్రజల్లో స్వరాష్ట్ర నినాదం ఇంకా బలంగానే ఉందని అనేకసార్లు నిరూపించి త్యాగాలకు తొవ్వచూపిన తీరు చరిత్ర పుటల్లో పదిలమన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ చైర్మన్ చెట్టుపల్లి మురళీధర్, మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీనివాస్ గౌడ్, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ఉడుగుల ప్రవీణ్ గౌడ్, మాజీ సర్పంచ్ కరివెదుల వెంకట్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ దేవ్ సింగ్, గ్రామ పార్టీ అధ్యక్షులు మోతిలాల్, మంజిలాల్, నాయకులు సురేష్, సంపత్ రావు,పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
◆:- ఎమ్మెల్యే మాణిక్ రావు , డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్
◆:- జహీరాబాద్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు ,ఉద్యమకారులు ….
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు సంగారెడ్డి శాసనసభ్యులు చింత ప్రభాకర్ గారి అధ్యక్షతన జరిగిన దీక్ష దివస్ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు , డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్,మాజి బెవెరేజస్ చైర్మన్ దేవీప్రసాద్,మాజి జిల్లా పరిషద్ చైర్మన్ మంజు జైపాల్ రెడ్డి, మాజి ఎమ్మెల్యే లు భూపాల్ రెడ్డి,చంటి క్రాంతి కిరణ్,బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉద్యమకారులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి ,కేసీఆర్ గారి చిత్ర పటానికి పాల అభిషేకం నిర్వహించారు అనంతరం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం కోసం చేసిన ఫోటో గ్యాలరీని వీక్షించి అనంతరం వారు చేసిన త్యాగాలను మరియు రాష్ట్రం సాధించిన తర్వాత ప్రగతిని నాయకులతో కలిసి వీక్షించారు అనంతరం ఎమ్మెల్యే ,చైర్మన్ గార్లు మాట్లాడుతూ.. ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా 2009 నవంబర్ 29 నాడు కేసీఆర్ సచ్చుడో – తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో కేసీఆర్ ఆమరణ నిరాహారదీక్ష చేసి నేటికి 16 ఏండ్లు గడిచాయని అన్నారు. ఆనాడు కేసీఆర్ చేసిన ప్రాణ త్యాగ ప్రయత్నం వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి అభివృద్ధి, ప్రగతి సాధించిందన్నారు. టి బీజేపీ, టి కాంగ్రెస్ లకు పదవులు కేసీఆర్ పెట్టిన భిక్ష అని అన్నారు కేసీఆర్ ఆనాడు ఉద్యమం ప్రారభించకపోయి ఉంటే ఈ కాంగ్రెస్ నాయకులను ఎవరైనా గుర్తుపట్టేవారా అని అన్నారు.ఈ కార్యక్రమంలో న్యాలకల్ మండల పార్టీ అధ్యక్షులు రవీందర్, మాజి కేతకీ సంగమేశ్వర ఆలయ చైర్మన్ నీల వెంకటేశం,సీనియర్ నాయకులు నామ రవికిరణ్,మాజి పట్టణ అధ్యక్షులు మొహియుద్దీన్,ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్,బి ఆర్ ఎస్వీ అధ్యక్షులు రాకేష్, నాయకులు నాగన్న పటేల్ వెంకట్,నరసింహ రెడ్డి ,రాజ్ కుమార్,రాజు పటేల్,మారుతి,నరేష్ రెడ్డి,అలీ, జుబేర్,జాకీర్, లవన్, మధు,తదితరులు పాల్గొన్నారు..
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.