జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం తథ్యం..

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం తథ్యం

◆:- బీఆర్ఎస్ నాయకులు షేక్ సోహెల్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్. టిఆర్ఎస్ ప్రభుత్వం దశాబ్ద కాలంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు బిఆర్ఎస్ పార్టీకి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలుపుకు దారి కాబోతున్నారని గతంలో అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంతో పాటు హైదరాబాద్ మహానగర అభివృద్ధి కోసం ఎన్నో చర్యలు తీసుకున్నారని ఇప్పుడు అవే బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతమ్మ విజయానికి సూచిక కాబోతున్నాయని ఝరాసంగం మండల తుమ్మనపల్లి గ్రామ బీఆర్ఎస్ నాయకులు షేక్ సోహెల్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రతి మహిళా ఖాతాలో 2500 రుపాయలు, వృద్ధులకు 2 వెయ్యిల నుంచి 4 వెయ్యిలకు, వికలాంగులకు రెట్టింపు చేస్తామని విస్మరించారని అన్నారు.

గడపగడపకు వెళ్లి బిఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ అభ్యర్థి మాగంటి సునీత గారి గెలుపుకై…

గడపగడపకు వెళ్లి బిఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ అభ్యర్థి మాగంటి సునీత గారి గెలుపుకై

◆:- జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు ప్రచారం నిర్వహించారు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జూబ్లీహిల్స్ నియోజకవర్గం లోని రహ్మత్ నగర్ డివిజన్ లోని వివిధ బూత్ లలో ప్రచారం నిర్వహించారు.ప్రజావ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న, *కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ది చెప్పాలని బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని మాగంటి సునీత గారి కారు గుర్తుపై మీ అమూల్యమైన ఓటువేసి అత్యంత భారీ మెజార్టీతో గెలిపించాలని,తెలంగాణ లో రామ రాజ్యం రావాలంటే కెసిఆర్ పాలన రావాలని అందుకు ఈ ఎన్నిక గెలుపుతో ఆరంభం కావాలని ఈ గెలుపుతో తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ సత్తాను చాటాలని ఓటర్లను కోరారు.ఈ కార్యక్రమంలో జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి,కోహీర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు,ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్,బూత్ ఇంచార్జులు ,బి ఆర్ ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

జూబ్లీహిల్స్ బైపోల్.. రంగంలోకి గులాబీ బాస్>…

జూబ్లీహిల్స్ బైపోల్.. రంగంలోకి గులాబీ బాస్

 

జూబ్లీహిల్స్ బైపోల్స్ ప్రచారంలో కేసీఆర్ పాల్గొనటంపై సందిగ్ధత నెలకొంది. సిట్టింగ్ సీటును తిరిగి దక్కించుకోవటమే లక్ష్యంగా కేసీఆర్ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

 జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై (Jubilee Hills Bypoll) బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ (BRS Chief KCR) దృష్టిసారించారు. గులాబీ పార్టీ ముఖ్యనేతలు, జూబ్లీహిల్స్ బైపోల్స్ ఇంచార్జ్‌లకు కేసీఆర్‌ పిలుపునిచ్చారు. రేపు (గురువారం) ఫాంహౌస్‌లో పార్టీ నేతలతో గులాబీ బాస్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉప‌ఎన్నిక ప్రచారంపై నేతలకు కేసీఆర్‌ దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే 40 మందితో స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించింది బీఆర్‌ఎస్. అయితే జూబ్లీహిల్స్ బైపోల్స్ ప్రచారంలో కేసీఆర్ పాల్గొనటంపై సందిగ్ధత నెలకొంది. సిట్టింగ్ సీటును తిరిగి దక్కించుకోవటమే లక్ష్యంగా కేసీఆర్ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.కాగా.. మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైన కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉంది బీఆర్‌ఎస్ పార్టీ. అందుకు తగ్గ ప్రణాళిలను కూడా సిద్ధం చేసింది. ఇప్పటికే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జోరుగా ప్రచారం నిర్వహిస్తోంది గులాబీ పార్టీ. బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతకే టికెట్ ఇచ్చింది బీఆర్‌ఎస్. మాగంటి సునీత ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఎక్కడిక్కడ ర్యాలీలో, సభలు నిర్వహిస్తున్నారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు, బీఆర్‌ఎస్ ముఖ్య నేతలు ప్రచారంలో పాల్గొని బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని కోరుతున్నారు.మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఉపఎన్నికల్లో గెలుపు తమదే అంటూ కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తుండగా.. బైపోల్‌లో విజయం తమనే వరిస్తుందని బీజేపీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మరి ఈ మూడు పార్టీల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు ఎవరికి పట్టంకట్టనున్నారో చూడాలి మరి.

గతిశీలి..ప్రగతి శీలి.

జనం గుండెల్లో సారే బడి గుడి.

`జనసర్వస్వమంతా కేసీఆర్‌ మది.

`తెలంగాణ కోసం పడరాని పాట్లు పడిన నాయకుడు.

`తెలంగాణ కోసం అందరి మెట్లు ఎక్కి దిగిన నాయకుడు.

`తెలంగాణ విషయంలో బేషజాలకు పోలేదు.

`అభివృద్ధిలో ఎక్కడా రాజీపడలేదు.

`తెలంగాణ కన్నీరు తూడ్చడం కోసం పదేళ్లు కంటి నిద్ర పోలేదు.

`తెలంగాణ కోసం పద్నాలుగేళ్లు కడుపు సరిగ్గా తిన్నది లేదు.

`రాజకీయ విలువలకు ప్రాణం పెట్టిన నాయకుడు కేసీఆర్‌.

`అవకాశ వాద రాజకీయాలకు తావివ్వని నాయకుడు కేసీఆర్‌.

`గెలుపోటముల గురించి ఏనాడు మధనపడలేదు.

`ప్రజలు ఓడిపోవద్దని తాపత్రయ పడిన నాయకుడు కేసీఆర్‌.

`నా ప్రజలు మళ్ళీ మోసపోవద్దని భావించిన నాయకుడు.

`నా ప్రజలు కలలో కూడా గోస పడొద్దని కోరుకున్న నాయకుడు.

`ప్రజలు కష్టాలు పడుతుంటే చూడలేక తల్లడిల్లిపోతున్నాడు.

`పదేళ్లలో తెలంగాణను నందనవనం చేసిన నాయకుడు.

`మోడువారిపోతున్న తెలంగాణకు జీవం పోసే నాయకుడు కేసీఆర్‌.

`అందుకే మళ్ళీ జనమంతా కేసిఆర్‌ జపం చేస్తున్నారు.

`కేసీఆర్‌ మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు

`ఎక్కడ విన్నా కేసీఆర్‌ పాటలతో నృత్యాలు చేస్తున్నారు.

`కేసీఆర్‌ పై తమ అభిమానాన్ని ప్రపంచానికి చాటేలా తెలియజేస్తున్నారు.

`ఉరకలెత్తే ఉత్సాహం జై కేసీఆర్‌ అని నినదిస్తున్నారు.

`‘‘జూబ్లీ హిల్స్‌’’ జనమంతా ‘‘కేసిఆర్‌’’ నామస్మరణే చేస్తున్నారు.

హైదరాబాద్‌, నేటిధాత్రి:                        రాజకీయాలంటే కేసిఆర్‌కు ఆట విడుపు కాదు. అధికారం కోసం అసలేకాదు. ప్రజల కోసం. ప్రజల సంక్షేమం కోసం, ప్రజా చైతన్యంకోసం, వారి జీవితాల్లో వెలుగుల కోసం. ఇదీ కేసిఆర్‌ రాజకీయం. అందుకే తెలంగాణ సాదన కోసం ఎవరూ చేయని త్యాగం చేశారు. పోరాటం చేశారు. ఉద్యమాన్ని ఎత్తుకొని తెలంగాణ సాదించారు. జీవితమే పోరాటం చేసుకొని ముందుకు సాగారు. తెలంగాణ సాధనే జీవిత లక్ష్యంగా ముందుకెళ్లారు. తెలంగాణ మొత్తం ఏకం చేశారు. తెలంగా మొత్తం కేసిఆర్‌ గొంతుగా మార్చారు. అందుకే ఇప్పుడు ఎక్కడ విన్నా, ఎక్కడ చూసినా ఒకటే మాట. ఒకటేపాట. ఒకటే బొమ్మ. అది కేసిఆర్‌. సారే రావాలంటున్నది తెలంగాణ అంటూ ఉద్యమ కాలంలో ఎలా వినిపించిందో ఇప్పుడూ అదే వినిపిస్తుంది. అంతకన్నా వంద రెట్లు ఎక్కవ వినిపిస్తుంది. పండగైనా, పబ్బమైనా సరే కేసిఆర్‌ పాట లేకుండా జరగడం లేదు. పెండ్లిల్లో కేసిఆర్‌ పాటలు పెట్టుకొని డ్యాన్సులు చేస్తున్నారు. బరాత్‌లల కేసిఆర్‌ పాటలు పెట్టుకుంటున్నారు. ఆఖరుకు గణేష్‌ నవరాత్రి ఉత్సవాలలో, ఊరేగింపుల్లో కూడా ఎక్కడ విన్నా కేసిఆర్‌ పాటలే. బతుకమ్మ ఆడిన సందర్భాలలో కేసిఆర్‌ పాటలే వింటున్నారు. పల్లెల్లో ఎవరిని కదిలించినా కేసిఆర్‌ జపం చేస్తున్నారు. కేసిఆర్‌ను పదే పదే గుర్తుచేసుకుంటున్నారు. కేసిఆర్‌ను తల్చుకోకుండా రోజు గపడం లేదు. ఎక్కడో అక్కడ ఏదో సందర్భంలో తెలంగాణలోని మహిళలు, పెద్దలు, వృద్దులు, రైతులు అన్ని వర్గాలు కేసిఆర్‌ను గుర్తు చేసుకుంటున్నారు. పదేళ్ల పాలన గురించి చెప్పుకుంటున్నారు. తెలంగాణకు కేసిఆర్‌ తెచ్చిన నీళ్లను గురించి చెప్పుకుంటున్నారు. కేసిఆర్‌ నింపిన చెరువులు గురించి చెప్పుకుంటున్నారు. ఇంటింటికీ ఇచ్చిన మిషన్‌ భగీరధ నీళ్ల గురించే చెప్పుకుంటున్నారు. తెలంగాణకు కాలువలు తెచ్చిన కేసిఆర్‌ గురించే చర్చలు పెడుతున్నారు. పదేళ్లు పంటలు ఎండిపోకుండా చూసుకున్న కేసిఆర్‌ గొప్పదనాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఇరవై నాలుగు గంటల కరంటును తల్చుకుంటున్నారు. పదే పదే కరంటు పోతున్నప్పుడల్లా కేసిఆర్‌ వున్నప్పుడు ఒక్కసారి పోకపోతుండే అనుకుంటున్నారు. ఇలా ఏ సందర్భమైనా సరే కేసిఆర్‌ను ప్రతి పల్లె తల్చుకుంటోంది. ప్రతి పట్టణం గుర్తు చేసుకుంటోంది. అందుకే కేసిఆర్‌ కేసిఆరే అంటోంది. ఒకటా రెండా..కేసిర్‌ చేసిన మంచి పనులు జనం గుండెల్లో నిలిచిపోయాయి. వారికి ప్రతి క్షణం గుర్తుకు వస్తున్నాయి. ఒకప్పుడు రూ.200 వున్న పించన్‌ తెలంగాణ రాగానే ఒకేసారి రూ.1000కి పెంచారు. తర్వాత మళ్లీ రూ.2000 వేలు చేశాడు. దివ్యాంగులకు ఏకంగా రూ.6500 పించన్‌ ఇచ్చాడు. కుల వృత్తుల దారులకు పించన్లు ఇచ్చాడు. ఇలా 57 సంవత్సరాలు దాటిని సుమారు 46లక్షల మందికి పించన్లు ఇచ్చి, ఆ కుటుంబాలను అదుకున్నారు. ఇక కేసిఆర్‌ రైతులకు చేసిన మేలు ప్రపంచంలో ఏ పాలకులు చేయలేదు. ఏ నాయకులు రైతుల మేలు కోసం ఆలోచించలేదు. రైతు బంధు పేరు మీద పెట్టుబడి సాయం చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇలాంటి ఆలోచన ఒకటి చేయొచ్చని స్వతంత్ర భారతావినిలో ఏ నాయకుడు, పాలకుడు ఆలోచించింది లేదు. రైతుల మేలు కోరి సాయం చేసింది లేదు. రైతులు రుణగ్రస్తులు కాకుండా చూసుకున్నది లేదు. తెలంగాణ రాక ముందు రైతు అనే పేరు చెప్పుకోవడానికి కూడా కన్నీళ్ల పర్యంతమైపోయేవారు. పడావు బడ్డ భూములను చూసి దుక్కిస్తుండేవారు. ఎండిన దుక్కిని చూసి కళ్ళతో తడుపుకోవాలని అనుకునేవారు. ఆశాకం చేసి చూస్తూ, వానమ్మా రావమ్మా అంటూ పాటలు పాడుకుండే వారు. కరువు తప్ప కాలం కాకపోయినా, భూమిని నమ్ముకొని మన్ను తిని బతికారు. కూలీలుగా మారి జీవితాలు గడుపుకున్నారు. ధైర్యం వున్న వాళ్లు ఊరెళ్లిపోయారు. పొట్ట చేత పట్టుకొని అప్పులు చేసుకొని ఇతర రాష్ట్రాలకు వలసలు పోయారు. తెలంగాణ వచ్చిన వెంటనే తెలంగాణ రైతులంతా రాజులయ్యారు. కేవలం తెలంగాణ రాగానే రాజులైన రైతులకు అన్నీ సౌకర్యాలను కల్పించి, రారాజులను చేశాడు. రైతులు రారాజుల్లా కాలుమీద కాలేసుకొని బతికేలాచేశాడు. నీళ్లిచ్చాడు. పెట్టుబడి సాయం చేశాడు. సకాలంలో అవసరమైన ఎరువులు అందించాడు. పండిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాడు. పండిన పంటను కళ్లాలలోనే కొనుగోలు చేశాడు. మూడురోజుల్లో వడ్లపైకం బ్యాంకు ఖాతాల్లో వేశాడు. ప్రతి సారి టంగ్‌ టంగ్‌ మని పెట్టుబడి సాయం అందించాడు. పంటలు నష్టపోతే నష్టపరిహారం వెంటనే అందించాడు. ఇలా అన్ని రకాలుగా రైతులను ఆదుకున్న ప్రపంచంలోనే ఏకైక నాయకుడు కేసిఆర్‌. రాజకీయాల్లో నైతిక విలువలు అంటే అర్దం కేసిఆర్‌ అనే చెప్పాలి. తెలంగాణ కోసం ఎక్కే మెట్టు దిగే మెట్టు అన్నట్లు తన రాజకీయం కన్నా, తెలంగాణ రాష్ట్రమే ముఖ్యమనుకున్న ఏకైక నాయకుడు కేసిఆర్‌. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎక్కడా వెనకడుగు వేయలేదు. తెలంగాణ అభివృ ద్దిలోనూ ఎక్కడా రాజీ పడలేదు. తెలంగాణ తెచ్చి, ఎలా బంగారు తెలంగాణ చేయాలో తెలిసిన ఏకైక నాయకుడు కేసిఆర్‌. అందుకే తెలంగాణ అరవై ఏండ్లు గోసపడగింది చాలు. ఇంక ఎప్పుడూ గోస పడొద్దని అనుకున్న నాయకుడు కేసిఆర్‌. అరవై ఏళ్లలో తెలంగాణ పడిన గోసను, ఆరేళ్లలో తీర్చిన గొప్ప దార్శనికుడు కేసిఆర్‌. తెలంగాణ తేవడం కోసం కడుపు నిండా తిన్నది లేదు. తెలంగాణ బాగు కోసం కంటి నిండా నిద్రపోయింది లేదు. అందుకే తెలంగాణ ఇప్పుడు ఇలా వెలుగుతోంది. లేకుంటే అదే పాత కాలపు చీకట్లోనే మగ్గుతూ వుండేది. బిఆర్‌ఎస్‌ను వీడిన వాళ్లయినా సరే కేసిఆర్‌ వ్యక్తిత్వాన్ని ఎవరూ ప్రశ్నించిన సందర్భం లేదు. పార్టీలు మారిని ఎమ్మెల్యేలు కూడా కేసిఆర్‌ గొప్పదనమే గుర్తు చేస్తారు. తన జేబులో పెన్ను వున్నా, ఆఖరుకు అది కూడా ఇతరులకు ఇచ్చే మనస్తత్వం కేసిఆర్‌ది అని కేశవరావు చెప్పిన మాట అందరూ విన్నదే. అంటే రాజకీయంగా విభేదించి వెళ్లిన వారు కూడా కేసిఆర్‌ను పల్లెత్తు మాట అనాలంటే కూడా నోరు రాదు. అదీ కేసిఆర్‌ నాయకత్వం విశిష్టతకు సంకేతం. ఎప్పుడు ఉప ఎన్నికలు వచ్చినా ఆయన అనుసరించిన తీరు అందరి చేత ప్రశంసలు అందుకుంటూనే వుంటుంది. ఎమ్మెల్యేల మరణంతో వచ్చిన ఏ ఉప ఎన్నికైనా సరే వారి కుటుంబాలకు మాత్రమే ఇవ్వడం కేసిఆర్‌కు తెలుసు. రాజకీయాల కోసం ఆయన ఇతరులకు సీట్లు కేటాయించింది లేదు. గెలిచినా, ఓడినా నైతికతను ఆయన ఏనాడు వదిలిపెట్టలేదు. అయితే కేసిఆర్‌ వల్ల మేలు పొంది, రాజకీయంగా ఎదిగిన వారిలో కొంత మంది స్వార్ధపరులుంటారు. వారి అవకావాద రాజకీయాలను చూపిస్తుంటారు. తిన్నింటి వాసాలు లెక్కబెడుతుంటారు. అలాంటి వారు మాత్రమే కేసిఆర్‌ను విమర్శిస్తుంటారు. అంతే కాని తెలంగాణలోని ఏ పార్టీ నాయకులైనా, ఏ సమాజమైనా సరే కేసిఆర్‌ వ్యక్తిత్వాన్ని శంకించేందుకు ఇష్టపడరు. అంత గొప్పది కేసిఆర్‌ నాయకత్వం. కొందరు కురుచ గుణం వున్న నాయకులు చేస్తున్న విమర్శల వల్ల వాళ్లే చులకనౌతున్నారు. కేసిఆర్‌ గ్రాఫ్‌ మరింత పెంచుతున్నారు. నిజం చెప్పాలంటే రాజకీయ ప్రత్యర్ధులే ప్రజల కన్నా ఎక్కువగా కేసిఆర్‌ను గుర్తు చేసుకుంటున్నారు. కేసిఆర్‌ పేరు పదేపదే తల్చుకుంటూ రాజకీయం చేస్తున్నారు. ప్రస్తుత పాలక పెద్దలందరూ నిత్యం కేసిఆర్‌ జపం చేస్తూనే పూట గడుపుకుంటున్నారు. ప్రతి సందర్భంలోనూ పదే పదే పలు సార్లు గుర్తు చేసుకుంటున్నారు. తాము చేసిందేమీ చెప్పలేక, కేసిఆర్‌ను నిందించి పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారు. బొక్కా బోర్లా పడుతున్నారు. తెలంగాణ కథ మళ్లీ మొదలైంది. ఇప్పుడే మొదలైంది. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలతో మళ్లీ మొదలౌతోంది. జనమే చూసుకుందామని ఇతర పార్టీలకు సవాలు విసురుతున్నారు. కేసిఆర్‌ ఫోటోను పక్కన పెట్టుకొని కొండంత ధైర్యం యువత ప్రదర్శిస్తున్నారు. దటీజ్‌ కేసిఆర్‌ అని యువత నోట జాలు వారుతుంటే కేసిఆర్‌ గర్జన వినిపిస్తోంది.

నర్సంపేట బీసీ బంద్ విజయవంతం కావాలి

బిసి సంఘాల బంద్ ను విజయవంతం చేద్దాం

బిఆర్ఎస్వి నర్సంపేట పట్టణ అధ్యక్షులు దేవోజు హేమంత్..

నర్సంపేట,నేటిధాత్రి:

 

బీసీలకు రిజర్వేషన్ అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర బీసీ కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రేపు తలపెట్టిన తెలంగాణ రాష్ట్ర బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు బంద్
విజయవంతం చేద్దామని బిఆర్ఎస్వి నర్సంపేట పట్టణ అధ్యక్షులు దేవోజు హేమంత్ కోరారు.గత 60 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో బీసీలను విద్య, రాజకీయపరంగా అణిచివేస్తూ రాజకీయంగా వాడుకొని కాంగ్రెస్ పార్టీ కాలం గడుపుకుంటూ వచ్చిందని ఎద్దేవా చేశారు.బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ వచ్చేవరకు బీసీ విద్యార్థులు పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు..నాడు మాజీ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ సారధ్యంలో తెలంగాణ ఉద్యమం మాదిరిగానే.. బీసీ రిజర్వేషన్ బిల్లును ఢిల్లీ దాకా తీసుకెళ్లి రిజర్వేషన్ బిల్లును సాధించుకోవాలని పిలుపునిచ్చారు.బిసి విద్యార్థులతో ఆటలాడుకుంటున్న కాంగ్రెస్ పార్టీ రాజకీయ నాటకాలు ఇక బీసీల ముందు చెల్లవని..బిఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం బంద్ కు మద్దతుగా పాల్గొంటున్న నేపథ్యంలో నర్సంపేట పట్టణలోని ప్రభుత్వ,ప్రైవేట్ కళాశాలలు, విద్యాసంస్థలు బీసీ బందుకు సంపూర్ణ మద్దతు తెలపాలని హేమంత్ కోరారు.

భవిష్యత్తు బి ఆర్ఎస్ దే – దేవునూరి కుమార్”

భవిష్యత్తు బి ఆర్ఎస్ దే బిఆర్ఎస్ హయాంలో ఎన్నో గొప్ప అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు బి ఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు దేవునూరి కుమార్

మొగులపల్లి నేటి ధాత్రి

భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల బి ఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు దేవునూ రి కుమార్ మాట్లాడుతూ తెలంగాణలో భవిష్యత్తు టిఆర్ఎస్ పార్టీ అని తెలంగాణ లో బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన నుండి పదేండ్ల పాలనలో దేశంలో ఎక్కడ కని విని ఎరుగని అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి సబ్బండ వర్గాలకు అండగా నిలబడింది అనేక పరిపాలన సంస్కరణలకు సైతం నాంది పలికింది కొత్త జిల్లాలు మండలాలు పంచాయితీలను ఏర్పాటు చేసి పాలన సంస్కరణకు శ్రీకారం చుట్టింది విధానమైన నిర్ణయాలను తీసుకొని ప్రజలకు చెంతకు పాలనపారదర్శకంగా సేవలను అందిస్తూ దేశానికి ఆదర్శంగా నిలిచింది పదేండ్లలో ప్రజల అవసరాల గురించి ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులు నెలకొల్పింది ప్రజల భద్రత కోసం నేరాలను సమూలంగా అరికట్టేందుకు పోలీసు కమిషన్ లేట్లు సంఖ్యను పెంచింది భూముల రిజిస్ట్రేషన్ కోసం ధరణి పోస్టల్ అందుబాటులోకి తీసుకురావడంలో ఇష్ట రాజ్యాంగ రికార్డులు మార్చే సాంస్కృతికి చెక్కుబడింది ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో 52 మున్సిపాలిటీలు ఉండగా కొత్తగా మరో 76 పురపాలక సంఘాలను ఏర్పాటు చేసింది నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని 2018 సంవత్సరంలో తీసుకువచ్చి గ్రామాల్లో ప్రభుత్వ చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల అమలులో నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా చట్టాన్ని రూపొందించారు ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్ ట్యాంకర్ అందజేశారు ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాలేశ్వరం ప్రాజెక్టులు నిర్వహణకు ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ మొబైల్ ఈ యాప్ లను రూపొందించి రాష్ట్రంలో అన్ని వాగులపై సుమారు 1200 చెక్ డ్యాములు నిర్మించి ప్రజలకు రైతులకు అనేక సేవలు అందించడంలో బి ఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు వెనుకడుగు వేయలేదు కల్యాణ లక్ష్మి పెన్షన్ 2000 రైతు చనిపోయిన పది రోజుల వ్యవధిలోనే ఐదు లక్షల రూపాయలు రైతు బీమా అందించిన మహనీయుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో గత 10 ఏళ్లలో ఎన్నో అద్భుతాలు చేశారు అనేక చెరువుల మరమ్మతులు చేసి యాదవులకు గొర్లు ముదిరాజులకు చేప పిల్లలు పంపిణీ చేశారు చేపల విక్రయాలు కొరకు వాహనాలు పంపిణీ చేశారు ఎప్పుడు ఎలక్షన్ జరిగిన బిఆర్ఎస్ పార్టీ మెజార్టీ స్థానాలు విజయం సాధిస్తుందని దేవును రి కుమార్ స్వామి తెలిపారు

తెలంగాణా ప్రజల గుండె ల్లో కేసీఆర్

తెలంగాణా ప్రజల గుండె ల్లో కేసీఆర్

అన్ని వర్గాల ప్రజలు కాంగ్రె స్ ప్రభుత్వంలో విసుగు చెందారు

బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యం లో కాంగ్రెస్ బాకీ కార్డులు పంపిణీ

శాయంపేట నేటిధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

శాయంపేట మండల కేంద్రం లోని పలు గ్రామాల్లో భూపా లపల్లి మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి మరి యు వరంగల్ జిల్లా మాజీ జెడ్పిచైర్ పర్సన్& బిఆర్ఎస్ పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ఆదేశానుసారంబిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ బాకీ కార్డు ప్రజలకు ఇస్తూ, వివరిస్తూ ప్రచారం నిర్వహించడం జరిగింది.

రైతులకి ఇస్తామని చెప్పిన రైతు బంధు ఇవ్వలేదు, రైతు ఋణమాఫీ చేయలేదు,

మహిళలకు ఇస్తామన్నా రూ. 2500/- ఇవ్వలేదు, వృద్దుల కు, వితంతువులకి, వికలాం గులకి పెన్షన్స్ పెంచనులేదు, కళ్యాణలక్ష్మీ లక్ష రూపాయలు కేసీఆర్ ఇస్తే తులం బంగారం ఇస్తామని ఆశ పెట్టిండు ఇవ్వ లేదు.రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటేయ్యండి అంటూ వచ్చే కాంగ్రెస్ పార్టీ నాయకుల కు ఇదిగో మా బాకీ కార్డు,మా కు రావాల్సిన బాకీ ఇవ్వండి అంటూ అడగాలని కోరారు.

BR

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు మేకల వెంకన్న మరియు మాజీ ఎంపిటిసి మేకల శ్రీనివాస్, అట్ల రమేష్ అట్ల తిరుపతి మామిడి శంకర్ గారు మాజీ సర్పంచ్ తోట కుమారస్వామి పసునూటి రాజయ్య సామల విజయ్ చాడ రాజిరెడ్డి కొమురాజు ప్రశాంత్ దీండిగాల నాగార్జున్ కర్రు రవి, ఆకుల శంకర్, కొప్పుల బిఆర్ఎస్ పార్టీ గ్రామ యూత్ అధ్యక్షుడు పోతుల విష్ణు,మాస్ అనిల్, బండారి ఆనందం, ఆకుతోటరాజు పసునూటిరాజు, గరిగరమేష్, బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పసుల ప్రవీణ్, మాజీ మండల అధ్యక్షులు ఘంటా శ్యాంసుందర్ రెడ్డి, పత్తిపాక ముఖ్య నాయకులు బి.నారాయణరెడ్డి, పెద్దిరెడ్డి ఆదిరెడ్డి, వైద్యుల తిరుప తిరెడ్డి, సాంబరెడ్డి, చల్లా సమ్మిరెడ్డి, తుడుం వెంకటేష్, గజ్జి రమేశ్, పోతుగంటి సుభాష్, నక్క రాజు మరియు కార్యకర్తలు, ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.

దళిత బిడ్డను ముఖ్యమంత్రిని చేస్తానని మోసం చేసిన కేసీఆర్

దళిత బిడ్డను ముఖ్యమంత్రిని చేస్తానని మోసం చేసిన కేసీఆర్

గణపురం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రేపాక రాజేందర్

గణపురం నేటి ధాత్రి

Vaibhavalaxmi Shopping Mall

గణపురం మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రేపాక రాజేందర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ
తెలంగాణ ఇస్తే టిఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని డోకా మాటలు చెప్పింది కేసీఆర్
తెలంగాణలో తొలి ముఖ్యమంత్రి దళితుడే అని చెప్పి డోకా చేసింది కేసీఆర్
దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని డోకా చేసింది టిఆర్ఎస్ పార్టీ
నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 3000 ఇస్తానని డోకా చేసింది టిఆర్ఎస్ పార్టీ
తెలంగాణలో ఒక్క డీఎస్సీ వేయకుండా నిరుద్యోగులను డోఖ చేశారు
10సంవత్సరాల నుండి రేషన్ కార్డు లేకుండా డోకా చేసింది కెసిఆర్
తెలంగాణ ఇస్తే ఇలాంటి అధికార అనుభవించకుండా చేసింది రాష్ట్రానికి కాపలా కుక్కలా ఉంటా అని చెప్పి డోకా చేసింది కేసీఆర్
మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల చేసిన ఘనత మీది కెసిఆర్ అమరుల కుటుంబాలను ఉద్యమ కళాకారులను డోకా చేసింది మీరు
మహిళలకు పావలా వడ్డీ రుణాలు ఇస్తానని ఇవ్వకుండా మోసం చేసింది మీరు
బీసీ రిజర్వేషన్లను 34% నుండి 23% దానికి పడగొట్టింది మీరు ధరణి పేరుతో రైతులను ఇబ్బంది పెట్టి భూములను ఆక్రమణకు గురి చేశారు
యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని డోకా చేసిన మీరు కాంగ్రెస్ పార్టీ గురించి తప్పుగా మాట్లాడడం కరెక్ట్ కాదని, రాబోయే స్థానిక ఎలక్షన్లలో ప్రజలు బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా రేపాక రాజేందర్ మాట్లాడారు
ఈ కార్యక్రమంలో గణపురం మండలంలోని కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు సీనియర్ నాయకులు అందరూ పాల్గొన్నారు

స్థానిక ఎన్నికల్లో బిఆర్ఎస్ దే విజయం

స్థానిక ఎన్నికల్లో బిఆర్ఎస్ దే విజయం

తెలంగాణా ప్రజల గుండెల్లో కేసీఆర్

అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం లో విసుగు చెందారు

ఇంటింటికి కాంగ్రెస్‌ బాకీ కార్డు అందజేసి కాంగ్రెస్‌ వైఫల్యాలను ఎండకడుదాం-సుంకె రవిశంకర్

కరీంనగర్, నేటిధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ ఎస్‌ సత్తా చాటాలని, ఇంటింటికి కాంగ్రెస్‌ బాకీ కార్డు అందజేసి కాంగ్రెస్‌ వైఫల్యాలను ఎండగట్టాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేట్ హోటల్ లో చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలతో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది.

 

ఈసందర్బంగా చొప్పదండి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు సుంకె రవిశంకర్‌ మాట్లాడుతూ రెండేళ్లకే కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, దీనిని ఎన్నికల్లో చూపించేలా కార్యకర్తలు కలిసికట్టుగా పని చేయాలని కోరారు. రేవంత్‌ ప్రభుత్వం రైతులకు యూరియా ఇవ్వలేకపోయిందని విమర్శించిరు.

 

రైతులు, మహిళా రైతులు రోజుల తరబడి క్యూలైన్లలో నిలబడుతున్నారని, కొన్నిచోట్ల చెప్పులు కూడా క్యూలో పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై నిందలు వేస్తూ రేవంత్‌ సర్కారు కాలం వెళ్లబుచ్చుతోందని, రేవంత్‌ సర్కారు డైవర్షన్‌ పాలిటిక్స్‌తో రాష్ట్రంలో పరిపాలన కుంటుపడిందని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు గొప్పగా అమలు చేసిన కేసీఆర్‌ మళ్లీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.

 

స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగితే బీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధించడం తథ్యమన్నారు. పార్టీని మరింత బలోపేతం చేసి, అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి తెచ్చేలా నాయకులు, కార్యకర్తలు శ్రమించాలన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా 420 హామీలను, ఆరు గ్యారెంటీలను అమలు చేయలేకపోయిందని విమర్శించారు. యూరియా కోసం రైతన్నలు రోజుల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

 

పింఛన్లు పెంచుతామన్న హామీని గాలికొదిలేశారని దు య్యబట్టారు. బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై ప్రభుత్వం ఇప్పటికీ డ్రామాలాడుతోందని ధ్వజమెత్తారు.

 

ఈవిషయాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తలపైనే ఉందన్నారు. బిఆర్ఎస్ పార్టీ బిఫామ్ ఎవరికీ వచ్చిన క్రమశిక్షణ గల పార్టీగా అందరు బిఆర్ఎస్ అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలని ఈసందర్బంగా కోరారు.

ఎంబీబీఎస్ సీటు సాధించిన ఫిర్దోస్‌కు హరీష్ రావు సన్మానం…

ఎంబీబీఎస్‌‌ సీటు సాధించిన TMRIES (బుచినెల్లి) విద్యార్థిని సన్మానించిన మాజి మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్‌లో(బుచినెల్లి) చదివిన విద్యార్థి ఝరసంఘం మండలం బొప్పన్పల్లి గ్రామానికి చెందిన సయ్యద్ గారి కుమార్తె ఫిర్దోస్ నీట్‌లో క్వాలిఫై అయ్యి సిద్దిపేటలోని సురభి మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్‌లో ఉచిత సీటు పొందడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, మాజీ మంత్రివర్యులు , సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు ,స్థానిక జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్‌రావు విద్యార్థిని శాలువా పూలమాలతో సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, బి ఆర్ ఎస్ పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షులు నాగన్న తదితరులు..ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ 2021లో సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ మండలం భూచనల్లి తెలంగాణ ప్రభుత్వ మైనారిటీ గురుకులం (TMREIS) ప్రారంభం సందర్భంగా..
“ఫ్యూచర్ లో ఏం అవుతావు అమ్మా?” అని అడిగిన ప్రశ్నకు “డాక్టర్ అవుతాను” అని చెప్పింది విద్యార్థిని ఫిర్దోస్.చెప్పడమే కాదు, కష్టపడి చదివి అన్న మాట నిలబెట్టుకుంది. నేడు ఎంబీబీఎస్ సీటు సాధించింది.ఒక్క ఫిర్దోస్ మాత్రమే కాదు, జహీరాబాద్ నియోజకవర్గం లోని అదే మైనారిటీ గురుకులం నుండి మరో 8 మంది విద్యార్థినులు, అలాగే అల్గోల్ మైనారిటీ గురుకులం నుండి 7 మంది విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు సాధించారు.
ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఎందరో గురుకుల విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు సాధిస్తున్నారు.
కేసీఆర్ గొప్ప ఆలోచనతో ప్రారంభించిన గురుకులాలు, పేద మరియు మధ్యతరగతి విద్యార్థులకు వరంగా మారాయి.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బిడ్డల లక్ష్య సాధనకు తోడ్పాటు అందిస్తూ, వారి కలలను సాకారం చేస్తున్నాయి గురుకులాల్లో చదివిన విద్యార్థులు డాక్టర్లుగా, ఇంజినీర్లుగా, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా సేవలందిస్తున్నారు.
ఇది కేసీఆర్ గారి దూరదృష్టి, గురుకులాల ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయుల కృషి, తల్లిదండ్రుల విశ్వాసం వల్ల సాధ్యమైంది తెలంగాణ రాకముందు మొత్తం 290 గురుకులాలు మాత్రమే ఉండగా, కేసీఆర్ ప్రభుత్వం వాటిని 1020కి పెంచింది నాడు కేవలం 2 మైనారిటీ గురుకులలు ఉంటే ఆ సంఖ్యను 204కు పెంచింది .
మొత్తంగా గురుకులలో విద్యార్థుల సంఖ్యను లక్షన్నర నుండి ఆరున్నర లక్షలకు పెంచింది.
గతంలో ఇంటర్ చదువు గురుకులాల్లో అందుబాటులో ఉండేది కాదు. పది తరగతి పూర్తి చేసిన తర్వాత పేద విద్యార్థులు పనులకు వెళ్లేవారు.దీన్ని మార్చడానికి కేసీఆర్ గారు అన్ని గురుకులాలను జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేసి, ఉన్నత విద్యను చేరువ చేశారు.
ఇంటర్ తర్వాత డిగ్రీ చేయడం ఒకప్పుడు ఎంతో కష్టం, ముఖ్యంగా మహిళలకు. దీనికి పరిష్కారంగా కేసీఆర్ గారు 30 డిగ్రీ కాలేజీలను ప్రత్యేకంగా ప్రారంభించారు.దేశంలో తొలిసారిగా రెసిడెన్షియల్ లా కాలేజీని కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించి దేశానికి ఆదర్శంగా నిలిచింది.పేద పిల్లల విద్యపై పెట్టుబడి కూడా రాష్ట్ర అభివృద్ధిలో భాగమని కేసీఆర్ గారు నమ్మారు.రేపటి తరంపై పెట్టే పెట్టుబడిని అద్భుత సంపదగా భావించారు.విద్యార్థుల కోసం చేసే ఖర్చును క్యాపిటల్ ఎక్స్పెండిచర్ (Capital Expenditure) గా నిర్వచించారు.ఒక పేద ఇంట్లో ఒక ఇంజినీర్ లేదా ఒక డాక్టర్ చదివే అవకాశం రావడం గొప్ప విషయం.వారి వల్ల ఆ కుటుంబం మాత్రమే కాదు, ఒక తరం మొత్తంలో మార్పు వస్తుంది.
కేసీఆర్ గారు దీన్ని నమ్మారు కాబట్టి, విద్యార్థులకు ఉచిత భోజనం, వసతి కల్పించి చదువుకునే అద్భుత అవకాశాలు అందించారు.
మీరు మంచి స్థాయికి చేరుకుని, తిరిగి సమాజానికి ఇవ్వాలి.మీ ఊరికి, మీ స్నేహితులకు, పేదలకు, గురుకుల సొసైటీకి ఏదో విధంగా తోడ్పాటు అందించాలని విద్యార్థులకు పిలుపునిస్తున్నా.
ఒక్క ఫిర్దోస్ మాత్రమే కాదు, అల్గోల్ మైనారిటీ గురుకులం నుండి 7 మంది విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు సాధించారు .
కేసీఆర్ గారు గొప్ప ఆలోచనతో ప్రారంభించిన గురుకులాలు, పేద మరియు మధ్యతరగతి విద్యార్థులకు వరంగా మారాయి అని అన్నారు

బిఆర్ఎస్ కాండ్వా కప్పుకున్న మాజీ సర్పంచ్…

బిఆర్ఎస్ కాండ్వా కప్పుకున్న మాజీ సర్పంచ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం
ఝరాసంగం మండలం గినియర్ పల్లి గ్రామ మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి బిఆర్ఎస్ పార్టీ ఝరాసంగం అధ్యక్షుడు ఎం. వెంకటేశంతో కలిసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం జహీరాబాద్‌కు చేరుకుని బిజెపి పార్టీకి వీడ్కోలు పలికి బిఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్లమెంటు సభ్యుడు జహీరాబాద్ మాణిక్ రావు మరియు డిసిఎంఎస్ చైర్మన్ జిల్లా మెదక్ శివ కుమార్ బిఆర్ఎస్ పార్టీ ఖాండ్వాను ధరించి ఆయనతో అధికారికంగా చేరారు. ఈ సందర్భంగా, పార్లమెంటు సభ్యుడు జహీరాబాద్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరోసారి తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ను చూడాలని ఆసక్తిగా ఉన్నారని అన్నారు. ఈ సందర్భంగా, రైల్వే అడ్వైజరీ బోర్డు మాజీ సభ్యుడు షేక్ ఫరీద్, గుండప, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జహీరాబాద్, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్ నరసింహ, గౌర్ బి. సంగమేశ్వర్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పాలన రాకతో తెలంగాణకు స్వేచ్ఛ

కాంగ్రెస్ పాలన రాకతో తెలంగాణకు స్వేచ్ఛ
-కంచెలు తొలగించాం..మానసిక బానిసత్వ సంకెళ్లు తెంచాం..

– అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ద్విముఖ వ్యూహంతో రేవంత్ రెడ్డి పాలన

-ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో భూపాలపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

-విలేకరుల సమావేశంలో పోలినేని లింగారావు
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

 

ఆంధ్ర నుండి విడివడిన తెలంగాణ రాష్ట్రం పదేళ్లలో నియంత పాలనలో మగ్గిపోయిందని, రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత తెలంగాణకు స్వేచ్ఛ లభించిందని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణకు నయా నిజాంగా మారి భూములను, ప్రాజెక్టులను మింగేశాడని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు..మొగుళ్లపల్లి పీఏసీఎస్ మాజీ చైర్మన్ పోలినేని లింగారావు గత ప్రభుత్వ విధానాలపై ధ్వజమెత్తారు. గురువారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తర్వాత తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా అధికారాన్ని చేజిక్కించుకున్న కేసీఆర్ తెలంగాణ ప్రజల పాలిట నయా నిజాంగా మారాడన్నారు. పదేళ్లలో తెలంగాణ నియంత పాలనలో మగ్గిపోయిందని, ప్రజాస్వామ్యం పీక పీకేశారని ఆయన మండిపడ్డారు. ఎన్నికలకు ముందు పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం నియంత పాలన నుంచి తెలంగాణ ప్రజలను విముక్తి చేస్తామని చెప్పిన ప్రకారంగానే 2023 డిసెంబర్ 3న తెలంగాణకు కాంగ్రెస్ ప్రభుత్వం స్వేచ్ఛను ప్రసాదించిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాయంలో ఇందిరమ్మ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల ఫలితంగా అన్ని రంగాల్లో రాష్ట్రం సర్వతోముఖంగా అభివృద్ధి సాధిస్తుందన్నారు. సంక్షేమానికి కేరాఫ్ కాంగ్రెస్ పాలన అని, దీనికి చరిత్రే సాక్ష్యమన్నారు. తెలంగాణలో దొరవేసిన కంచెలను తెంచి..మానసిక బానిసత్వ సంకెళ్లను తెంచామన్నారు. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ద్విముఖ వ్యూహంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనను కొనసాగిస్తున్నారన్నారు. పాలనలో పారదర్శకత..అభివృద్ధిలో ఆధునికత..సంక్షేమంలో సరికొత్త చరిత్రను రాస్తూ..తెలంగాణ రాష్ట్రం సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో ఆదర్శవంతమైన రాష్ట్రంగా తెలంగాణ రూపుదిద్దుకుంటుందన్నారు. అదేవిధంగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్నిహితుడిగా ఉంటూ..నియోజకవర్గానికి అధిక మొత్తంలో నిధులను తీసుకువచ్చి..కనివిని ఎరుగని రీతిలో భూపాలపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తున్నాడని పోలినేని లింగారావు కొనియాడారు.

జాతీయ సమైక్యత దినోత్సవ మాజీ ఎమ్మెల్యే గండ్ర…

జాతీయ సమైక్యత దినోత్సవ మాజీ ఎమ్మెల్యే గండ్ర

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు కటకం జనార్దన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిధిగా పాల్గొన్ని జాతీయ జెండా ఎగురవేసి,జాతీయ గీతాన్ని ఆలపించిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.
జాతీయ సమైక్యత దినోత్సవాన్ని పురష్కరించుకుని యావత్ ప్రజానీకానికి శుభాకాంక్షలు తెలియచేస్తూ..
మనకు తెలిసిన చరిత్ర ప్రకారం 1947 ఆగష్టు 15వ తేదీన బ్రిటిష్ వారి చెర నుండి అనేక ఉద్యమాలు చేసి భారతదేశానికి స్వాతంత్య్రం సాధించుకున్నాం.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికి మన ప్రాంతానికి 13 నెలల తరువాత స్వాతంత్ర్యం వచ్చింది.
అఖండ భారతం కావాలనే ఉదేశ్యంతో ఆనాడు ప్రజలు నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి అసువులు బాసిన వారేందరో మన ప్రాంతం నుండి ఉన్నారు.
పరకాలలో రెండవ జలియన్ వాలా బాగ్ గా పేరుగాంచిన సంఘటన జరిగింది.
మరీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ ప్రాంతానికి వస్తున్న సందర్భంగా ప్రజలు తండోప తండాలుగా బయలుదేరి వస్తున్న వారిని విచక్షణా రహితంగా కాల్చి చంపడం జరిగింది.
నీళ్ళు, నిధులు,నియామకాలు మనవి మనకే కావాలని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమాలు చేసి ఆంధ్రపాలకుల చేర నుండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుని 10 ఏండ్ల పరిపాలన లో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో పురోగతిని సాధించుకున్నాం.
మనందరం కూడా మరొక్క ఉద్యమానికి ఈరోజు మనం పునఃరంకితం కావాల్సిన అవసరం ఉంది.
ఎందుకంటే కేసీఆర్ అంత గొప్పగా తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మాణం చేస్తే, ఈనాటి పాలకులు ఏ రకంగా వంచిస్తున్నారో చూస్తున్నాం, మరి ఆనాడు ఏ రకంగా వ్యవసాయ రంగానికి సంబంధించినట్టు వంటి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి,24 గంటల కరెంటు ఇచ్చి, రైతుబంధు ఇచ్చి,మరి ప్రతి గింజ కూడా కొనుగోలు చేసి, రుణమాఫీ చేసి గొప్పగా చేస్తే ఈనాటి ప్రభుత్వం చేసే పనులు చెప్పుకోడానికి చాలా సిగ్గు అనిపిస్తుంది.
జాబ్ క్యాలెండర్ ఓపెన్ చేసి అందులో కనీసం ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా, బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలకు సర్టిఫికెట్స్ ఇచ్చి మేము ఉద్యోగాలు ఇచ్చాము అని సిగ్గులేకుండా చెప్పుకుంటున్నారు అని ఏద్దేవా చేశారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు, పట్టణ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మతిభ్రమించి మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-09T144247.511.wav?_=1

 

 

మతిభ్రమించి మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి…
 ఎల్లంపల్లి ప్రాజెక్టును కట్టింది శ్రీపాదరావు అనడం విడ్డూరమే
ప్రాజెక్టులను పూర్తి చేసిన చరిత్ర మాజీ సీఎం కేసీఆర్‌దే
– పోరాడి సాధించుకున్నతెలంగాణ రాష్ట్రం పరువు తీస్తున్నరు
– సీఎం పక్కనే ఉండే మంత్రికి జ్ఞానం లేదని తెలుస్తోంది
– గవర్నర్‌..రాష్ట్రపతి స్పందించి ప్రభుత్వాన్ని రీకాల్‌ చేయాలే
– సీఎంను, మంత్రులను పిచ్చి ఆస్పత్రికి పంపించాలని కోరుతున్నా
– మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌

మంథని :- నేటి ధాత్రి

 

 

రాష్ట్రాన్ని ముందుకు నడిపించాల్సిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నాడని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం మంథనిలోని రాజగృహాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 23నెలల కాలంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తిట్టడం, ఒర్రడం తప్ప ఒక్క మంచి మాట మాట్లాడలేదని ఎద్దేవా చేశారు. ఎప్పుడు మాట్లాడినా హైట్‌ల గురించి వెయిట్‌ గురించి తప్పితే మరోమాట లేదని, అసలు మీ హైట్‌కు తగ్గ మెదడు ఉందా అని ఆయన ప్రశ్నించారు.ముఖ్యమంత్రి స్థాయిలో పిచ్చికూతలు కూస్తుంటే చూస్తూ ఊరుకోలేక, ఈ సమాజం కోసం ఆలోచన చేసే వ్యక్తిగా మాట్లాడవలసి వస్తుందన్నారు. హైదరాబాద్‌ నీళ్లు మూసి నది కి వెళ్లే కార్యక్రమ శంఖుస్థాపనలో ముఖ్యమంత్రి మాట్లాడిన తీరు ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు కట్టింది శ్రీపాదరావు అని, కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందంటూ మాట్లాడారని, అసలు ఎల్లంపల్లి ప్రాజెక్టుపై పూర్తిగా ముఖ్యమంత్రికి అవగాహన లేకపోవడం బాధాకరమన్నారు. 2004లో ఎల్లంపల్లి ప్రాజెక్టు పనులు ప్రారంబిస్తే 2016లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పూర్తి చేశారని గుర్తు చేశారు. 1999 ఏప్రిల్‌ 13న శ్రీపాదరావు మృతి చెందితే ఎల్లంపల్లి ప్రాజెక్టును ఎలా కట్టారో చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి మాట్లాడే సమయంలో పక్కనే ఉన్న మంత్రి అయినా చెప్పాలి కదా అది శ్రీపాదరావు కట్టించలేదని, అంటే చదువుకున్న మేధావి అని పక్కన ఉండే మంత్రికి కూడా తెలివి, జ్ఞానం లేదని తెలుస్తోందన్నారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రివర్గంలో ఉన్న వారికి తెలివి లేదని తేలిందని విమర్శించారు.ఆనాడు ఎల్లంపల్లిని పూర్తి చేసిన హైదరాబాద్‌కు నీళ్లు తీసుకుపోయేవాళ్లు కాదని, మొబలైజేషన్‌ అడ్వాన్స్‌లు తీసుకుని జేబులు నింపుకున్నారని, ఊర్లమీద పైపులు వేయడం తప్ప ఏమీ చేయలేదన్నారు. ఆనాడే జలయజ్ఞం ధనయజ్ఞమని ఊరూర ప్రచారం జరిగిందన్నారు. కాళేశ్వరం కూలిపోయిందని పదే పదే అంటున్న ముఖ్యమంత్రి ఇక్కడి వచ్చి చూస్తారా అని సవాల్‌ చేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీవద్దకు వచ్చి ఏం డ్యామేజ్‌ అయిందో చూపించాలని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా ఆనాడు కేసీఆర్‌ ఎల్లంపల్లి ప్రాజెక్టును పూర్తి చేశారని, నందిమేడారం గాయత్రీపంపుహౌజ్‌ పూర్తి చేసి అక్కడి నుంచి మిడ్‌ మానేరు, కొండపోచమ్మ, రంగనాయక్‌ సాగర్‌, మల్లన్న సాగర్‌, అన్నపూర్ణ రిజర్వాయర్‌లను ఎస్సారెస్పీ వరద కాలువలో కలిపిన చరిత్ర కేసీఆర్‌దేనన్నారు. ఈనాడు అధికారంలో వచ్చిన కాంగ్రెస్‌ పాలకులు తెల్లకళ్లు తాగిన కోతుల్లా ఎగురుతున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకు ఇచ్చిన ఏ ఒక్క హమీ నెరవేర్చలేదని, గొప్ప ప్రాజెక్టులను నిర్వీర్యం చేశారని, ఎక్కడ ఐదు వందల బోనస్‌ ఇవ్వాల్సి వస్తుందోనని యూరియా కొరత సృష్టించారని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రివర్గ వ్యవహరంపై బారత అత్యున్నత స్థానమైన ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ఇండియా, గవర్నర్‌లు స్పందించి ఈ ప్రభుత్వాన్ని రీకాల్‌ చేయాలని ఆయన కోరారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తన జీవితాన్ని త్యాగం చేసి ప్రపంచమంతా తిరిగి మనకు ప్రజాస్వామ్యం అందించారని, అలాంటి ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తున్నారని ఆయన వాపోయారు. సంవిధాన్‌ బచావ్‌ అంటూ దేశమంతా తిరుగుతున్న రాహుల్‌ గాంధీ తెలంగాణాపై దృష్టిపెట్టాలన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి పాలకులకు పాలన చేతకాకపోతే ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన అన్నారు. సమాజం తిరుగబడకముందే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కళ్లు తెరిచి మంచిగా మాట్లాడాలని, పక్కన తెలివికల వారిని కూర్చోబెట్టుకోవాలని హితవు పలికారు

జిల్లాల పర్యటనలకు సిద్ధమవుతున్న కేటీఆర్…

జిల్లాల పర్యటనలకు సిద్ధమవుతోన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

https://youtu.be/n8XtHC_g77I?si=37zwAlH0YSjCUecg

వారం రోజులుగా కేసీఆర్‌తో మంతనాలు జరిపినట్టు సమాచారం. పార్టీ వీడిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలను టార్గెట్ చేయడంతోపాటు, స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప..

హైదరాబాద్, సెప్టెంబర్ 7 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లాల పర్యటనలకు సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి వారం రోజులుగా ఎర్రవల్లి ఫాంహౌస్‌లో పార్టీ అధినేత కేసీఆర్‌తో.. కేటీఆర్ సుదీర్ఘ మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టాలని ఈ సందర్భంగా కేటీఆర్‌కు కేసీఆర్ సూచించినట్టు తెలుస్తోంది. కవితను సస్పెండ్ చేయటంతో పార్టీ క్యాడర్‌లో నెలకొన్న గందరగోళానికి తెరదించాలని బీఆర్ఎస్ భావిస్తున్నట్టు సమచారం.

మరోవైపు, పార్టీ వీడిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలను ముఖ్యంగా టార్గెట్ చేయాలని కేటీఆర్ భావిస్తున్నారు. వీటితోపాటు, స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కేటీఆర్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ‌నెల 10న కొత్తగూడెం, 11న భద్రాచలం నియోజకవర్గాల్లో కేటీఆర్ టూర్ ఉండబోతున్నట్టు తెలుస్తోంది. 13న‌ గద్వాల్ నియోజకవర్గంలో ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించాలని కేటీఆర్ భావిస్తున్నారు. దసరా లోపు వీలైనన్ని ఎక్కువ నియోజకవర్గాల్లో పర్యటించాలని కేటీఆర్ ప్లాన్ చేసుకుంటున్నారు.

లంగాణ లో బీఆర్‌ఎస్‌ దుకాణం బంద్అవుతుంది…

లంగాణ లో బీఆర్‌ఎస్‌ దుకాణం బంద్అవుతుంది

కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము

మొగులపల్లి (నేటిధాత్రి ):

 

 

భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో నడిగోటి రాము మాట్లాడుతూ. తెలంగాణలో టిఆర్ఎస్ దుకాణం బంద్ అవుతుందని ఆయన అన్నారు గంపగుత్తగా తెలంగాణ రాష్ట్ర ఆదాయాన్ని కల్వకుంట్ల కుటుంబం లక్షల కోట్ల ప్రజాధనాన్ని కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా గుంట నక్కల దోచుకొని దాచుకొని అవినీతి, దోపిడీ, దొంగతనాలను పిసి గోష్ కమిషన్ ద్వారా అసెంబ్లీ సాక్షిగా బయటపెట్టేసరికి ఏం చేయాలో అర్థం కాక లిక్కర్ రాణిని తెరపైకి తీసుకువచ్చి మళ్ళీ ఎవరిని మోసం చేయాలని చూస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రానికి మీ కల్వకుంట్ల కుటుంబం ద్వారా చాలా తీరని అన్యాయం జరిగింది. ఎన్నో అవినీతి అక్రమాలు ఎక్కడ చూసినా కమిషన్లు పదేళ్లు మీకు తెలంగాణ ప్రజలు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తియడమే కాకుండా లక్షల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేశారు. మీ కల్వకుంట్ల కుటుంబం బండారం బయట పడేసరికి వాళ్లు మోసం చేశారు వీళ్ళు మోసం చేశారు. అని నువ్వు అనడం మరునాడు నిన్ను మీ అధినేత సస్పెండ్ చేయడం ఇదంతా సినిమా లా అనిపిస్తుంది. స్క్రిప్ట్ ముందే రాయడం జరిగింది. కేసీఆర్ కాలేశ్వరం స్కామ్ కేటీఆర్ ఫోన్ టాపింగ్, ఈ రేసింగ్ స్కామ్, కవిత ఢిల్లీ లొ లిక్కర్ స్కాం,సంతోష్ కుమార్ హరితహారం లొ స్కామ్ హరీష్ రావు దండాలు సెటిల్మెంట్ ఇరిగేషన్ అక్రమాలు ఇలా ఒక్కొక్కరు ఒక్కో స్కాం ద్వారా ఒక్కో కమిషన్ల ద్వారా తెలంగాణ రాష్ట్ర ఆదాయాన్ని నలుమూలల ధ్వంసం చేశారు. బిఆర్ఎస్ పార్టీ అంటేనే తెలంగాణ ప్రజలు అసహ్యించుకుంటున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్ లొ బిఆర్ఎస్ పార్టీని నామరూపల్లెకుండా చేయడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు.
నేడు తెలంగాణ లొ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటుందని భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రజలకి సంక్షేమ పథకాలను ప్రతి గడపకు అందించడంలో నిరంతరం కృషి చేస్తున్నారని బిఆర్ఎస్ పార్టీ కావాలనేయూరియా కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని గతంలో కంటే ఎక్కువ యూరియాను జిల్లలో పంపిణి చేయడం జరిగిందణి రైతులకు తప్పుడు సమాచారం ఇస్తూ యూరియా కొరత ఉందంటూ ఆరోపణలు చేయడం తప్పా బి ఆర్ ఎస్ నాయకులు చేసేదేమి లేదని ఆయన అన్నారు. జిల్లా, మండల రైతులకు కావాల్సినంతా యూరియా వస్తుందని ఎవరూ కూడా అధైర్య పడవద్దని రైతులకు నడిగోటి రాము సూచించారు

హరీశ్‌రావుపై కవిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నాం…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-04T152314.808.wav?_=2

 

హరీశ్‌రావుపై కవిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నాం

ఇకనైన కవిత పునరాలోచించుకోవాలి

మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

పరకాల నేటిధాత్రి

 

మాజీ మంత్రి హరీశ్‌రావుపై జాగృతి అధ్యక్షురాలు కవిత చేసిన ఆరోపణలు సబబుకాదని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పేర్కొన్నారు.పార్టీ అధినేత కేసీఆర్‌తోపాటు హరీశ్‌రావుకు అండగా ఉంటామని చెప్పారు.
కేసీఆర్‌ మార్గదర్శకత్వంలో పనిచేస్తున్న హరీశ్‌రావుపై కవిత చేసిన ఆరోపణలను పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఒక ప్రకటనలో తప్పుబట్టారు.నాడు ఉద్యమంలో,పాలనలో,నేడు ప్రతిపక్షంలోనూ హరీశ్‌రావు అనునిత్యం కేసీఆర్‌కు వెన్నంటి ఉంటున్నారని తెలిపారు.బీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి పార్టీ పటిష్టత కోసం హరీశ్‌రావు ఎంతో కృషిచేశారని అన్నారు.అన్ని వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల కోసం ముందుండి పోరాటం చేసిన హరీశ్‌రావుపై కవిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నట్టు చెప్పారు.కన్న తండ్రిని కన్నతల్లిలాంటి పార్టీకి ద్రోహంచేయాలని చూస్తే సహించేదిలేదని అన్నారు.ఆనాటి నుండి నేటి వరకు బిఆర్ఎస్ కుటుంబ సభ్యులందరు ఒక సోదరిలాగానే భావించామని తెలిపారు.ఇప్పటికైనా కవిత పునరాలోచించుకోవాలని సూచించారు.పార్టీ ని విచ్చిన్నం చేయాలనిచూస్తే మాత్రం అందుకు బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు చూస్తూ ఊరుకోరని అందుకు ధీటుగా సమాధానం చెప్తామన్నారు.

రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేసిన బిఆర్ఎస్ నేతలు.

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-04T145638.080.wav?_=3

 

రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేసిన బిఆర్ఎస్ నేతలు.

కేసీఆర్ పై సిబిఐ విచారణ రద్దు చేయాలి

మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

రైతులు పడుతున్న బాధలు చూడలేని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం,రైతు బాంధవుడు తెలంగాణ రాష్ట్ర ముఖ చిత్రాన్ని తన రాజకీయ నైపుణ్యంతో అన్ని వర్గాల పేద ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తిగా, తన మార్క్ పాలనతో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ముందుంచిన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పై, కాళేశ్వరం ప్రాజెక్ట్ పై అవినీతి ఆరోపణలు చేస్తూ సిబిఐ విచారణకు ఆదేశించిన రేవంత్ రెడ్డి కుట్రపూరిత రాజకీయ ధోరణి అని మాజీ ఎమ్మెల్యే గండ్ర అన్నారు అనంతరం టేకుమట్ల మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సట్ల రవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి బిఆర్ఎస్ నేతలతో కలిసి రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వాన్నికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అనంతరం కేసీఆర్ పై సిబిఐ విచారణ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు యూరియా దొరకక షాప్ ల వద్ద చెప్పులను లైన్లో పెట్టుకొని ఎదురుచూస్తున్నారు కానీ రైతుల బాధలను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రైతులను అరిగోస పాలు చేస్తున్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రైతులు కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు అని వారు అన్నారు
ఈ కార్యక్రమంలో ఆకునూరు తిరుపతి మల్లారెడ్డి ఉద్దమరి మహేష్ ఆది రఘు మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ప్రాంతీయ పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి.

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-03T123441.263.wav?_=4

ప్రాంతీయ పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి :

◆:- యువనేత మొహమ్మద్ ముర్తజా

జహీరాబాద్ నేటి ధాత్రి:

జాతీయ పార్టీలు అయిన కాంగ్రెస్, బీజేపీ కలిసి మన ప్రాంతీయ పార్టీ తెలంగాణ రాష్ట్రము సాధించిన బిఆర్ఎస్ పార్టీ ని లేకుండా చేయాలని చేస్తున్న కుట్రలు సాగవు కెసిఆర్ కాళేశ్వరం నిర్మించి అపర భగీరతుడు అయ్యారు. కాంగ్రెస్, బీజేపీ నాటకాలు గట్టిగ ఎండగట్టాడు మరియు వీళ్ళ ఆటలు సాగాలేవు అందుకని కక్ష సాధింపు చర్యలకు కాంగ్రెస్ బీజేపీ లు కలసి కవిత ని కేసులు పేరుతో బెదిరించి పావుగా చేసి ఆడిస్తున్న నాటకం.
ఒక రకంగా చెప్పాలంటే ప్రాంతీయ పార్టీ లేకుండా చేసే కుట్ర ఇది.జాతీయ పార్టీ రాష్ట్రము లో అధికారం లో ఉంటే రాష్ట్రాన్ని వాళ్ళ చెప్పు చేతల్లో, ఢిల్లీ కి గులాం గిరి చేయిస్తారు, స్వతంత్ర నిర్ణయం తీసుకొనే అధికారం వీళ్లకు ఉండదు.
జాతీయ పార్టీల కన్నా, రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు, అవసరాలు, ప్రాధాన్యతలు ప్రాంతీయ పార్టీ బిఆర్ఎస్ కె బాగా తెలుసు. రాష్ట్రానికి ప్రత్యేకమైన ప్రాజెక్టులు, పథకాలు, నిధుల కోసం కేంద్రం దగ్గర బలంగా డిమాండ్ చేయగలదు.
స్థానిక సంస్కృతి, భాష, ఆర్థిక వ్యవస్థ, రైతాంగం, పరిశ్రమలు వంటి అంశాల్లో ప్రాంతీయ పార్టీలు ఎక్కువ దృష్టి ప్రాధాన్యత ఇస్తుంది.ప్రజల్లారా జాగ్రత్త బిఆర్ఎస్ పార్టీ మన ప్రాంతీయ పార్టీ, అందరు కలసి కట్టుగా మన ప్రాంతీయ పార్టీ అయిన బిఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేయాల్సిన సమయం ఇది, లేదంటే శాశ్వతంగా ఢిల్లీ గులాముల చేతిలో రాష్టం బందిగా ఉంటుంది.

 ఎమ్మెల్యేలు వసూల్ రాజాలు…

 ఎమ్మెల్యేలు వసూల్ రాజాలు

 

తెలుగునాట.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో పలువురు శాసనసభ్యులు వారి ముఖ్యమంత్రులకు కంట్లో నలుసుల్లా తయారవుతున్నారా? ఎం.ఎల్‌.ఎ. అంటే మెంబర్‌ ఆఫ్‌ లెజిస్లేటివ్‌ అసెంబ్లీ.. అంటే చట్టసభ సభ్యులు. చట్టసభల్లో చట్టాలు చేస్తూ ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి….

తెలుగునాట.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో పలువురు శాసనసభ్యులు వారి ముఖ్యమంత్రులకు కంట్లో నలుసుల్లా తయారవుతున్నారా? ఎం.ఎల్‌.ఎ. అంటే మెంబర్‌ ఆఫ్‌ లెజిస్లేటివ్‌ అసెంబ్లీ.. అంటే చట్టసభ సభ్యులు. చట్టసభల్లో చట్టాలు చేస్తూ ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారం కోసం కృషి చేయాల్సిన శాసనసభ్యులే ఇప్పుడు ప్రజలపాలిట సమస్యగా మారుతున్నారు. ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్‌లో కొంత మంది శాసనసభ్యులు లేని అధికారాలను సంక్రమింప జేసుకొని ఆయా నియోజకవర్గాలలో ప్రజలు గాలి పీల్చుకోవాలన్నా తమ అనుమతి తప్పనిసరి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. 2004 నుంచి ప్రారంభమైన ఈ ధోరణి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో వెర్రితలలు వేస్తోంది. జగన్మోహన్‌ రెడ్డి హయాంలో శాసనసభ్యులకు అపరిమిత స్వేచ్ఛను ఇవ్వడంతో వారు ప్రభుత్వ కార్యాలయాలను తమ అజమాయిషీలోకి తెచ్చుకున్నారు. ఇప్పుడు కూటమి ఎమ్మెల్యేలకూ అదే ఆదర్శమైంది. గతానికి భిన్నంగా ఈ జాడ్యం ఇప్పుడు తెలంగాణకు కూడా విస్తరించింది. 2009లో ఎమ్మెల్యేగా ఎన్నికైన లోక్‌సత్తా అధినేత జయప్రకాష్‌ నారాయణ మంచినీటి సరఫరా, డ్రైనేజీ వంటి స్థానిక సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చిన వారిని ఉద్దేశించి, వాటి గురించి స్థానిక ప్రజాప్రతినిధులైన కార్పొరేటర్లకు చెప్పాలని సూచించేవారు. ఇది ప్రజలకు రుచించలేదు. అది వేరే విషయం! 1983కు ముందు గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ ఉనికి ఉండేది కాదు. అక్కడి ప్రజా సమస్యలను స్థానిక సంస్థలే పరిష్కరించేవి. అప్పట్లో ఎమ్మెల్యేలు ప్రజలకు పెద్దగా అందుబాటులో ఉండేవారు కారు. ఎమ్మెల్యేలను కలుసుకోగలిగే పరిస్థితి జిల్లా స్థాయిలో కొద్దిమందికే ఉండేది. ఇక మంత్రులు, జిల్లా కలెక్టర్లను కలుసుకోవడం అరుదైన అవకాశంగా ఉండేది. అలా కలుసుకోగలిగిన వారికి పలుకుబడి ఉన్నట్టు పరిగణించేవారు. ఆ తర్వాత ఎన్టీఆర్‌ హయాంలో ప్రభుత్వాన్ని ప్రజలకు చేరువ చేశారు. దీంతో ఎమ్మెల్యేలు ప్రజల్లో తిరగక తప్పలేదు. ఫలితంగా ప్రజలు తమ వ్యక్తిగత సమస్యలను, కుటుంబ పంచాయితీలను పరిష్కరించవలసిందిగా కూడా ఎమ్మెల్యేలను కోరేవారు. మొగుడూ పెళ్లాల పంచాయితీలు తామెందుకు పరిష్కరించాలని ఆ రోజుల్లో ఎమ్మెల్యేలు విసుక్కొనేవారు. హైదరాబాద్‌లో ఉండే తమ ఎమ్మెల్యేలను తెలంగాణ జిల్లాలకు చెందిన ప్రజలు వచ్చి కలుసుకొని బాధలు చెప్పుకొనేవారు. కొంతమందైతే తిరుగు ప్రయాణాలకు చార్జీలు ఇవ్వవలసిందిగా ఎమ్మెల్యేలను కోరేవారు. తమను కలవడానికి వచ్చిన వారికి కాఫీ, టీలు తాగించడంతో పాటు భోజనం, వసతి కూడా ఏర్పాటు చేయవలసి రావడంతో శాసనసభ్యులు ఆర్థికంగా నలిగిపోయేవారు. పెళ్లిళ్లు, చావులకు వెళ్లడం విధిగా మారింది. అదే సమయంలో ఖర్చుల కోసం డబ్బు కూడా డిమాండ్‌ చేసేవారు. తెలంగాణలో ఇప్పటికీ ఈ పరిస్థితి ఉంది. కొంత కాలం క్రితం ఒక లారీ డ్రైవర్‌ తమ నియోజకవర్గ ఎమ్మెల్యేకు ఫోన్‌ చేసి తాను డ్యూటీ మీద దూరంగా ఉన్నాననీ, పురిటి నొప్పులతో బాధపడుతున్న తన భార్యను ఆస్పత్రిలో చేర్పించి ప్రసవం చేయించవలసిందిగా కోరారు. ఇలాంటి విచిత్రమైన అనుభవాలను శాసనసభ్యులు గతంలో పంచుకొనేవారు. ఇదంతా గతం. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాలకు సామంత రాజులుగా, దండ నాయకులుగా తయారయ్యారు. తెలంగాణలో కూడా ఈ పోకడలు మొదలయ్యాయి. తెలంగాణలో యూరియా కొరత ఇప్పుడు ప్రధాన సమస్యగా ఉంది.

రైతులు ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన రామగుండం ఎరువుల కంపెనీ తెలంగాణలో ఉన్నప్పటికీ సాంకేతిక సమస్యలు తలెత్తి ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో యూరియా కొరత మరింత తీవ్రమైంది. ఈ పరిస్థితుల్లో ఎవరైనా ఏమి చేస్తారు? ఎరువుల ఫాక్టరీలో మరమ్మతులను వేగంగా పూర్తిచేయించి ఉత్పత్తి తిరిగి ప్రారంభమయ్యేలా చేస్తారు. కానీ అధికార పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. మరమ్మతుల కాంట్రాక్టు పొందిన సంస్థ ప్రతినిధులు తనను కలసి తన సంగతి ఏమిటో తేల్చకపోతే ఎలా అని భీష్మించుకొని కూర్చున్నారు. ఈ వ్యవహారం మంత్రి, ముఖ్యమంత్రి వరకూ వెళ్లింది. దీంతో సంబంధిత శాఖ మంత్రి కల్పించుకొని సదరు ఎమ్మెల్యేను పిలిపించుకొని సర్దిచెప్పారు. ఈ ధోరణిని ఏమనాలి? ఇల్లు తగలబడుతుంటే బొగ్గులు ఏరుకోవడానికి ప్రయత్నించినట్టుగా లేదా? కేసీఆర్‌ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన కూడా తమ పార్టీ ఎమ్మెల్యేలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఈ విషయంలో ఒకరికొకరు ఆదర్శం అయ్యారు. ఫలితంగా తెలంగాణలో గతంలో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గాలలో ఎమ్మెల్యేల ఆధిపత్యం పెరిగిపోయింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు సంబంధించిన సమస్యల పరిష్కారం చేయాలన్నా ఎమ్మెల్యేల అనుమతి తప్పనిసరి చేశారు. పోలీస్‌ స్టేషన్లో ఎఫ్‌ఐఆర్‌ కట్టాలన్నా శాసనసభ్యుడి అనుమతి ఉండాలని నిర్దేశించారు. దీంతో యావత్‌ అధికార యంత్రాంగం రాజకీయ నాయకుల గుప్పిట్లోకి వెళ్లిపోయింది. ఒకవైపు లేని అధికారాలను అనుభవిస్తూ, మరోవైపు భూ కబ్జాలు, దందాలలో ఎమ్మెల్యేలు మునిగితేలారు. ఫలితంగా 2023 ఎన్నికలకు ముందు భారత రాష్ట్ర సమితికి చెందిన శాసనసభ్యులపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. అయినప్పటికీ ఆ ఎన్నికల్లో కేసీఆర్‌ అభ్యర్థులను మార్చకుండా పాతవాళ్లు అందరికీ టికెట్లు ఇచ్చారు. అప్రతిష్ఠపాలైన శాసనసభ్యులను మార్చి ఉంటే కేసీఆర్‌ అధికారం కోల్పోయి ఉండేవారు కాదన్న అభిప్రాయం భారత రాష్ట్ర సమితి ముఖ్యులలో ఇప్పటికీ ఉంది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version