మాటలకు అంతు లేదు..చేతలకు చింత రాదు!?

`ఆదరించిన ప్రజలకు సేవ చేయడం మర్చిపోతున్నారు.

`దిక్కు మాలిన రాజకీయాలు చేస్తున్నారు.

`రాజకీయాలు వదిలేశారు.

`వ్యక్తిగత విమర్శలకే ప్రాధాన్యతనిస్తున్నారు.

`ప్రజాక్షేత్రంలోకి వెళ్లే శక్తి లేదు.

`ఎన్నికలుంటే తప్ప సభలు పెట్డుకోలేరు.

`కార్యకర్తలను కలుసుకోలేరు.

`ఒకరినొకరు పరస్పర విమర్శలు చేసుకోవడం అలవాటు చేసుకున్నారు.

`అయితే అవినీతి ఆరోపణలు!

`లేకుంటే నీతి మాలిన ఆరోపణలు!

`నిత్యం అవే ఆరోపణలా!?

`నాయకులు రాసలీల బాగోతాలా!

`చెప్పుకోవడానికి కూడా సిగ్గు పడడం లేదు!

`విమర్శలు చేయడానికి ముందూ వెనుకా ఆలోచించడం లేదు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:
తెలంగాణ రాజకీయాలలో నాయకుల మాటలకు హద్దూ బద్దూ లేకుండాపోతోంది. గతంలో ప్రతిదానిని రాజకీయం చేయడం అలవాటైందని పార్టీలు అంటుండేవి. ఇప్పుడు రాజకీయాలు మానేసి, అశ్లీలాలు మాట్లాడుకుంటున్నారు. ఆ నాయకుడు వ్యవహరం ఇలా, ఈ నాయకుడి చీకటి బాగోతం ఇలా అనే మాటలు తప్ప మరేం వినిపించడం లేదు. అసలు సమాజం ఏమనుకుంటోంది? అన్న ఆలోచన కూడా లేకుండాపోతోంది. ముఖ్యంగా సోషల్‌ మీడియా పెరిగిన తర్వాత రాజకీయాలలో కూడా విపరీత ధోరణలు పెరిగిపోతున్నాయి. ఇది సమాజానికి ఎంత మాత్రం మంచిది కాదు. అసలు నాయకుల వ్యక్తిగత జీవితాలలోకి ఎందుకు తొంగి చూస్తున్నారన్నది పెద్ద ప్రశ్నగా మిగిలిపోతోంది. నిజంగానే నాయకులు ఎవరి జీవితాలనైనా నాశనం చేస్తే సమాజమే ఊపేక్షించదు. కాని లేని పోని బురదను జల్లుతూ, పేరున్న మహిళలను జీవితాలను ఎందుకు రోడ్లమీదకు తెస్తున్నారో అర్దం కావడంలేదు. ఇలాంటి విషయాలు ప్రజలు కోరుకుంటున్నారనుకోవడం రాజకీయ పార్టీల అవివేకానికి పరాకాష్ట. ఓ పక్క ప్రజా సమస్యలు నలుగుతున్నా పట్టించుకోవడం లేదు. ఎంత సేపు ఆధిప్యత రాజకీయాలు..కక్షపూరిత రాజకీయాలకు దారులు వేస్తున్నారు. పాలక ప్రతిపక్ష పార్టీలు ఒక రోజు నిందించుకున్నారంటే వేరు. నిత్యం నిందలేనా? రాసలీలల కధనలేనా? మొన్నటి దాకా కేటిఆర్‌ గురించి చెప్పిందే చెప్పి, రాసిందే రాసి అటు నాయకులు, మీడియా దుర్మార్గంగా వ్యవహరించింది. అసలు ప్రభుత్వ పెద్దలు కూడా ఇలాంటి విషయాలపై మాట్లాడడడం సరైంది కాదు. నిజంగా ఫోన్‌ ట్యాపింగ్‌ లో కేటిఆర్‌ దోషిగా తేలితే శిక్ష పడుతుంది. కాని అది నిజమే కాదో తెలుసుకోకుండానే రకరాల వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక తాజాగా హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌషిక్‌ రెడ్డి మేమేం తక్కువ తిన్నామా? అన్నట్లు ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మీద ఆరోపణలుగుప్పించారు. నిజానికి ముఖ్యమంత్రి పదవిలో వున్న నాయకుడు అర్దరాత్రులు ఒంటరి ప్రయాణం చేసే అవకాశం వుంటుందా? రాజకీయ నాయకుడిగా, ప్రజా ప్రతినిధిగా కౌషిక్‌ రెడ్డికి తెలియదా? గతంలో మేం బురద జల్లుతాం తుడుచుకోండి? అనే రాజకీయాలు చేసేవారు. ఇప్పుడు మేం బురదే జల్లుతాం..మీరు బురదే చల్లండి.. చూసుకుందాం? అన్నట్లు వుంది. ఇవేనా ప్రజా సమస్యలు లేవా? అవి పాలక , ప్రతిపక్షాలకు పట్టవా? ప్రజలు ఎనుకున్న ప్రభుత్వాలు ఏంచేయాలి? ప్రతిపక్షంలో కూర్చున్న పార్టీలు ఏం చేయాలన్నదానిపై స్పష్టత వుంది. కాని తెలంగాణలో ఏం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటై ఇప్పటికీ 18నెలలు గడుస్తోంది. అనేక కార్యక్రమాలు రూపకల్పన జరుగుతున్నాయి. కాని అవి ప్రజల్లోకి చేరడంలేదు. కాని నిత్యం అదికార, ప్రతిపక్షాల మద్య జరుగుతున్న వివాదాలు మాత్రం మీడియాలో వార్తలౌతున్నాయి. పెద్ద పెద్ద హెడ్డింగులౌతున్నాయి. గతంలో ఎప్పుడూ ఇలా లేదు. ప్రతిపక్షాలను పాలక పక్షాలు నిందించడం వేరు. వేదించడం వేరు. గతంలో ఇదే జరిగింది. ఇప్పుడూ అదే జరుగుతోంది. ప్రజా సమస్యలు గాలికి వెళ్తున్నాయి. నిజంగా ప్రజల కోసం ఆలోచించే పార్టీలు ఏవైనా వున్నాయా? ఎన్నికల ముందు ఓడిపోయిన బిఆర్‌ఎస్‌ ఇచ్చిన హమీలు, గెలిచిన పార్టీ కాంగ్రెస్‌ ఇచ్చిన హమీల ఎక్కడైనా చర్చ జరుగుతోందా? లేదు. కేవలం నిందలు, ఆరోపణలు తప్ప నిజాయితీ మాటలు ఎక్కడా లేవు. ఎంత సేపు రాష్ట్రాన్ని బిఆర్‌ఎస్‌ దోచుకున్నది అంటూ అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచి కాంగ్రెస్‌ పార్టీ ఆరోపిస్తోంది. అదికారంలోకి వచ్చిన ఈ పద్దెనమి నెలల్లో లెక్కలేనంత అవినీతి జరుగుతోందని బిఆర్‌ఎస్‌ ఆరోపిస్తోంది. మధ్యలో బిజేపి చోద్యం చూస్తోంది. ప్రతిపక్షంగా వున్న బిజేపి కూడా ఏ ప్రజా సమస్య మీద స్పందిస్తున్న దాఖలాలు లేవు. ఏ క్షణాన ఏ పార్టీ ఎటువైపు మాట్లాడుతుందో అర్దం కావడంలేదు. ఇక్కడ విచిత్రమైన విషయమేమిటంటే బిజేపి పాలక పక్షం మీదకన్నా, ప్రతిపక్ష బిఆర్‌ఎస్‌ మీదనే యుద్దం చేస్తోంది.. బిఆర్‌ఎస్‌గతంలోనే చేసిన తప్పులనే తవ్వితీస్తోంది. రాష్ట్రంలో ఎన్నికల ముందు ఇచ్చిన హమీల మీద ఇప్పటి వరకు బిజేపి ప్రస్తావించపోవడం గమనార్హం. బిఆర్‌ఎస్‌ పార్టీకి ప్రశ్నించే నైతికలేదనే అనుకుందాం? కాని బిజేపి ఏం చేస్తోంది. ఎందుకు మౌనంగా వుంటోంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం మీద ఎందుకు ఒత్తిడి తేవడం లేదు. పైగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బిఆర్‌ఎస్‌ను ఎంత కార్నర్‌ చేస్తున్నారో అంతే విధంగా బిజేపిని కూడా కార్నర్‌ చేస్తున్నారు. అయినా బిజేపిలో ఎలాంటి చలనం లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారెంటీలు ఇచ్చింది. వాటితోపాటు మరో 420 హామీలు కూడా ఇచ్చింది. వాటిపై ఏ ఒక్క బిజేపి నాయకుడికైనా అవగాహన వుందా? ఎప్పుడైనా కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో చదివారా? అందులోని అంశాలపై చర్చించారా? కార్యచరణ ప్రకటించారా? లేదు. కనీసం ఆరు గ్యారెంటీలలో ఎన్ని అమలౌతున్నాయి. ఎన్ని అమలు కావడం లేదన్న వాటిపైనైనా బిజేపికి అవగాహన వుందా? సహజంగా ప్రబుత్వం మీద యుద్దంచేసేప్పుడు ప్రతిపక్షాలు అన్నీ కలిసి రాకపోయినా సరే, ఒకే ఎజెండాతో ఉద్యమాలు సాగిస్తాయి. కాని ఇప్పుడు పరిస్దితి భిన్నంగా వుంది. బిఆర్‌ఎస్‌ అధికారంలో వున్నప్పుడు ఆపార్టీని దింపడానికి, కేసిఆర్‌ను గద్దెదించడానికి ఏక కాలంలో రెండు పార్టీలు చేయాల్సినంత పోరాటం చేశాయి. అన్ని విషయాల మీద పోరాటంలో ఎవరి పై చేయి అన్నట్లుగా సాగాయి. కాని ఇప్పుడు ఆ బిజేపిలో ఆ దూకుడు లేదు. అసలు ప్రజా సమస్యల మీద స్పందనే లేదు. ముఖ్యంగా రైతుల సమస్యల మీద కూడా బిజేపి మాట్లాడలేకపోతోంది. రైతులకు రైతు భరోసాపై బిజేపి స్పందనలేదు. వృద్దాప్య పించన్లు ఎప్పుడు పెంచుతారని అడిగింది లేదు. మహిళలకు నెలకు రూ. 2500 ఇస్తామన్నారు. అది ఎంత వరకు వచ్చిందని ప్రశ్నించిన బిజేపి నాయకుడు లేడు. విద్యార్ధినులకు లాప్‌ టాప్‌లు ఇస్తామన్నారు. విద్యార్దులందరికీ విద్యా భరోసా కార్డులిస్తామన్నారు. వీటి మీద బిజేపి ఎందుకు మాట్లాడడం లేదు. ఎందుకు మౌనంగా వుంటున్నారు. నిజంగా బిఆర్‌ఎస్‌ పార్టీ పదేళ్లకాలంలో తప్పులు చేస్తే శిక్షించేందుకు ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోంది. నిజంగా కేసిఆర్‌ తెలంగాణకు తీరని అన్యాయం చేసినట్లైతే ఎందుకు ఉపేక్షిస్తున్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటే ఎలాంటి ఆధారాలు అవసరం లేదు. ప్రజలు కేసిఆర్‌ పాలన వద్దనుకున్నారు. కేసిఆర్‌ నాయకత్వం అవసరమే లేదనుకున్నారు. ఫామ్‌ హజ్‌ పాలన వద్దని నిర్ణయంతీసుకున్నారు. ప్రజలను కలవని కేసిఆర్‌ వద్దనే ఓడిరచారు. ఇంకెందుకు కేసిఆర్‌ ప్రస్తావన. ఓ వైపు కేసిఆర్‌ సిఎం. రేవంత్‌రెడ్డి పేరు కూడా ప్రస్తావించడానికి కూడా ఇష్టపడడం లేదు. అయినా కేసిఆర్‌ పేరుతో కాంగ్రెస్‌ పార్టీకి ఏం పని. ప్రజలు బిఆర్‌ఎస్‌ పార్టీని మర్చిపోయారు. కాంగ్రెస్‌ను గెలిపించారు. కేసిఆర్‌ వద్దనుకున్నారు. ఇంట్లో రెస్టు తీసుకునేలా చేశారు. ఓడిస్తే ఇంట్లో కూర్చుంటానని కేసిఆర్‌ చెప్పారు. అదే చేస్తున్నారు. వదిలేయండి? అధికారంలోవున్నప్పుడు గెలిపించిన ప్రజలే కేసిఆర్‌ బైటకు రావాలని ఉద్యమాలు చేశారు. ప్రగతి భవన్‌ దాటి రావాలని డిమాండ్‌ చేశారు. ఆయన రాకపోతే ప్రజలే ప్రజాస్వామ్య పద్దతిలో ఓడిరచి, ప్రగతి భవన్‌ నుంచి గెంటేశారు. ఇంకా ఎందుకు కేసిఆర్‌ పేరును కాంగ్రెస్‌ కలవరిస్తోంది. పలవరిస్తోంది. కేసిఆర్‌ ముచ్చట చెప్పకుండా వుండలేరా? కేసిఆర్‌ ప్రస్తావన లేకుండా ప్రభుత్వం నడపలేరా? కేసిఆర్‌ పేరెత్తకుండా పార్టీ కార్యక్రమాలు నిర్వహించలేరా? రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పదే పదే కేసిఆర్‌ పేరును గుర్తు చేస్తుంటే ప్రజలు కూడా ఇష్టపడడం లేదు. కాంగ్రెస్‌ నాయకులు కూడా కేసిఆర్‌ గురించి మనకెందుకు అంటున్నారు. ప్రజలు మర్చిపోదామనుకున్నా, కేసిఆర్‌ను కాంగ్రెస్‌ నాయకులే మర్చిపోకుండాచేస్తున్నారు. కేసిఆర్‌ను పదే పదే గుర్తు చేసి జపం చేస్తున్నారు. అలాంటప్పుడు కేసిఆర్‌పై కేసులు పెట్టినా జనం పట్టించుకోరు. పైగా కేసిఆర్‌ను ఇబ్బంది పెడుతున్నారన్న సంకేతాలు వెళ్లే అవకాశం వుంటుంది. కేసిఆర్‌ ఆనవాలు చెరిపేస్తామంటూనే నిత్యం బిఆర్‌ఎస్‌ నాయకులకన్నా, కాంగ్రెస్‌ నాయకులే కేసిఆర్‌ జపం చేస్తున్నారు. పొద్దుకు పదుల సార్లు గుర్తు చేస్తున్నారు. కేసిఆర్‌ తప్పులు నిత్యం ఎత్తి చూపుతూ పోతుంటే లాభం లేదు. కేసిఆర్‌ కన్నా మంచి పాలన అందించే ప్రయత్నం చేయండి. కేసిఆర్‌ చేయని సంక్షేమాన్ని అందించండి. అంతే కాని పూట పూటకు, కేసిఆర్‌ ప్రస్తావన ఎందుకు? అంతే కాదు కాంగ్రెస్‌ నాయకులకన్నా సిఎంతోపాటు, ఇతర నాయకులంతా బిఆర్‌ఎస్‌ నాయకులు కేటిఆర్‌, హరీష్‌రావు, కవితల పేర్తు ప్రస్తావిస్తూ జనం వారి పేర్లను మదిలో నింపుకునేలా చేస్తున్నారు. తెలంగాణ ప్రజలకు బిఆర్‌ఎస్‌ నాయకుల పేర్తు తప్ప, కాంగ్రెస్‌ నాయకుల పేర్లు మర్చిపోయేలా పాలకులే చేస్తున్నారు. ఈ మధ్య జరిగిన ఓ రైతు సభలో వేదిక మీద వున్న పెద్దలెవరో తెలియదని ఓ రైతు అన్నాడంటే అర్దం ఏమిటి? రెండేళ్లు దగ్గరకు వస్తున్నా, మంత్రుల పేర్లు కూడా జనం నాలుకల మీద ఆడడంలేదు. కాంగ్రెస్‌ పార్టీ వల్ల బిఆర్‌ఎస్‌ నాయకులను ప్రజలు మర్చిపోవడం లేదు. ఇప్పటికైనా బిఆర్‌ఎస్‌ను గుర్తు చేసుకోవడం కాంగ్రెస్‌పెద్దలు మర్చిపోండి. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు ప్రచారం చేసుకోంది.

కమిటీలకు దిక్కు లేదు..కార్యకర్తలకు గుర్తింపు లేదు!

`వాళ్ల కష్టానికి ఫలితం లేదు.

`అన్ని పార్టీలది అదే తీరు.

`ఎన్నికలప్పుడు మాత్రమే గుర్తుకొస్తారు.

`ఏళ్లకేళ్లు వెట్టి చాకిరి చేయించుకుంటారు.

`కడుపు కట్టుకొని పార్టీ కోసం కార్యకర్తలు పని చేస్తారు.

`జెండాలు కట్టడానికి, నాయకులకు సలాం కొట్టడానికి పనికొస్తారు.

`సభలు పెడితే జేజేలు కొట్టడానికి అవసరౌతారు.

`పథకాల అమలులో కూడా వివక్షకు గురౌతారు.

`సొంత పార్టీ వాళ్లకే ప్రయోజనమౌతుందని కార్యకర్తలను పక్కన పెడతారు.

`ఓట్లేయించేందుకు మాత్రమే కార్యకర్తలు అవసరమౌతారు.

`పార్టీ కోసం ఏం ఆశించకుండా పని చేస్తారని గొప్పలు చెప్పి నోరు మూయిస్తారు.

`అడుగడుగునా మాయ చేసి చెప్పు చేతుల్లో వుంచుకుంటారు.

`నాయకులు గ్రూపులు కట్టి కార్యకర్తలను విభజిస్తారు.

`సొంత పార్టీలలోనే కార్యకర్తలు శత్రులయ్యేలా చేస్తారు.

`నాయకులు మాత్రం చెట్టా పట్టాలేసుకొని తిరుగుతారు.

`గ్రామ, మండల కమిటీలు వేయకుండా కార్యకర్తలను ఆశల పల్లకిలో ఊరేగిస్తారు.

`కమిటీలెప్పుడు వేసినా పదవి నీకే అని అందరికీ చెప్పి కాలయాపన చేస్తారు.

`పై స్థాయిలో వున్న వాళ్లు ఒక్కొక్కరు నాలుగు పదవులు చేపడతారు

`కుటుంబంలో వున్న వాళ్లకు పదవులు పంచుకుంటారు.

………………………..

`పదేళ్లు అధికారంలో వున్నా ‘‘బిఆర్‌ఎస్‌’’ కార్యకర్తలు బతికింది లేదు.
`అప్పుల పాలై దివాళా తీసినా ఒక్కరినీ ఆదుకున్నది లేదు.
`నామినేటెడ్‌ పదవులిచ్చి గౌరవించింది లేదు.
`కనీసం పార్టీ కమిటీలు వేసి పదవులు అప్పగించింది లేదు.
`ఇప్పటికీ ‘‘బిఆర్‌ఎస్‌’’ కమిటీలు వేయాలన్న సోయి లేదు.
……………………….
`కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు కావొస్తోంది.
`పార్టీ కమిటీలకు దిక్కు లేదు..
`పూర్తి స్థాయిలో నామినేట్‌ పదవులు పంచింది లేదు.
…………………..
`బిజేపి ఇందుకు తీసిపోయిందేమీ లేదు.
`ఆ పార్టీ అనుసరిస్తున్నది అదే తీరు.
`మూడు పార్టీలలో కమిటీలకు దిక్కు లేదు.
`ఎన్నికల పేరు చెప్పుకొని నాయకులు ఎగేసుకొస్తారు.
`గెలిపించే బాధ్యత మీదే అని కార్యకర్తలను ఆకాశానికెత్తురు.
`మీరు లేకుండా పార్టీయే లేదని ఉబ్బిస్తారు.
`ఎన్నికలైపోయిన తర్వాత ముఖం చాటేస్తారు.
`కార్యకర్తలు కరివేపాకులు..రాజకీయాలలో గోలించి పడేస్తారు!

హైదరాబాద్‌,నేటిధాత్రి:
రాజకీయ నాయకులు, కార్యకర్తలు అనగానే ఖద్దరు చొక్కాలు. రేబాన్‌ కళ్లజోళ్లు. కాళ్లకు ఖరీదైన చెప్పులు. అయితే టూవీలర్‌, లేకుంటే కారు. కాలు తీసి బైట పెడితే చాలు గౌరవాలు. మర్యాదలు. పైరవీలు. ప్రజ సమస్యలు. అబ్బో ఆ సెటప్పే వేరు. కనిపించిన వాళ్లను పలకరించడం. వారికి టీలు తాగిపించడం. అవసరమైతే టిఫిన్లు చేయించడం. ఇలా చెప్పుకుంటూ పోతే నిత్యం అదో సంతర్పణ కార్యక్రమం. ఇదంతా ఎలా? అనుకుంటే సమాధానం చెప్పడానికి నోరు రాదు. కడుపు చించుకుంటే కాళ్లమీద పడేంత దుఖం. కాని పైకి మాత్రం చెరగని చిరునవ్వు. నోరు తెరిస్తే కోట్ల రూపాయల రియల్‌ వ్యాపారం మాటలు విన పక్కవాళ్లు అబ్బో అనుకోవాలి. అంతే కాని అబ్బా..అనేలా వుండకూడదు. అలా మెంటైన్‌ చేయకపోతే నాయకుడే కాదు. కార్యకర్త కూడా కాదు. కాని ఇంత హడావుడి చేస్తున్నా ఆయా రాజకీయ పార్టీలలో వారి పదవులు ఏమిటని మాత్రం ఎవరూ అడగొద్దు. ఎందుకంటే కొంచెం వయసు చిన్నదైతే కార్యకర్త. కాస్త పెద్ద వయసైతే సీనియర్‌ కార్యకర్త. ఇక వాళ్లు పార్టీల కోసం పడే కష్టం అంతా ఇంత కాదు. ఆ పార్టీకి చెందిన సీనియర్‌ నాయకులు కేక వేస్తే చాలు జీ హుజూర్‌ అని వాలిపోవాల్సిందే. చేతులు కట్టుకొని నిలడాల్సిందే. నోరు నొచ్చేదాకా ఆ పార్టీ నాయకులు జేజేలు కొట్టాల్సిందే. పార్టీ కండువాలు మెడలో వేసుకొని, జెండా కూడా మోయాల్సిందే. ఇంతగా పార్టీకి సేవ చేస్తున్నా పదవులు ఇస్తారా? ఇస్తాం..ఇస్తామంటూ ఊరిస్తారు. పుణ్యకాలం పూర్తయ్యేదాకా వాయిదా వేస్తూ వెళ్లాల్సిందే. అధికారంలో వున్నప్పుడు నాయకులు ఊడిగం చేయాలి. ప్రతిపక్షంలో వున్నప్పుడు పార్టీకి రక్షణ కవచాలు కావాలి. ఒక రకంగా చెప్పాలంటే మొత్తానికి పార్టీ కార్యకర్తలు వెట్టి చాకిరీ చేసే కూలీలుగా మారిపోవాలి. ఇంతకు మించి రాజకీయం అంటే చెప్పుకోవడానికి ఏదీ వుండదు. పార్టీ పేరు చెప్పి బతికే కొంత మంది లైక్యం తెలిసిన కారకర్తలుంటారు. చిన్నా చితక పైరవీలతో నాలుగు రూపాయలు సంపాదించుకుంటారు. నాయకులు చెప్పి పనులు చేయించుకుంటారు. ఇది కూడా ఏ ఐదు శాతమో వుంటారేమో? కాని మిగతా నాయకులంతా జేజేలు కొట్టడం మాత్రం చేస్తుంటారు. ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా పదవి రాకపోతుందా? అని జీవితాంతం ఎదురు చూస్తుంటారు. జీవితాంతం కార్యకర్తగానే మిగిలిపోయిన వాళ్లు కొన్ని లక్షల మంది వుంటారు. కడుపు కట్టుకొని పార్టీకి సేవ చేస్తుంటారు. అప్పులు చేసిన పార్టీ కోసం పనిచేస్తుంటారు. ఆస్ధులు అమ్ముకొని రాజకీయాల్లో సాగుతుంటారు. ఇంత చేస్తున్నా నాయకులకు సలాం కొట్టడానికి మాత్రమే వుంటారు. నాయకుడు ఫోన్‌ చేస్తే క్షణాల్లో వాలిపోతారు. నాయకుడు కదలమని చెప్పేదాకా అక్కడే పడిగాపులు కాస్తారు. నిజం చెప్పాలంటే ఇది రాజకీయం కాదు. నాయకులకు ఊడిగం చేయడం. సరే ఇంత చేస్తున్నా ప్రభుత్వ పథకాలనైనా కార్యకర్తలకు అందుతాయా? అదీ వుండదు. ఎందుకంటే అడుక్కుంటే చులకనౌతాడు. పట్టుబట్టి తీసుకుందామంటే నాయకుల ఆగ్రహానికి గురౌతారు. మనం పంచే స్దితిలో వున్నాం. అడుక్కుంటామా? అని చెప్పే నాయకుల మాటలకు తలవంచేవాళ్లుంటారు. సర్ధుకుపోయే మనస్తత్వమే అలవాటు చేసుకుంటారు. పథకాలు పార్టీ కార్యకర్తలకే పంచుకుంటున్నారన్న అవపాదు మోయొద్దని నాయకులు చెప్పే మాటలు విని ఆశలు చంపుకుంటారు. ఇది అన్ని పార్టీలలో వుండే కార్యకర్తల దీనస్ధితికి నిదర్శనం. కనీసం పార్టీ పదవులు ఇచ్చారా? అంటే అదీ లేదు. బిఆర్‌ఎస్‌ పార్టీ పదేళ్ల కాలం అదికారంలో వున్నా ఇప్పటి వరకు సంస్ధాగత నిర్మాణం ఎక్కడా జరగలేదు. మాటలకు మాత్రం 60లక్షల మంది కార్యకర్తలున్నారని గొప్పగా చెబుతారు. కాని ఎంత మంది కార్యకర్తలకు పదవులిచ్చారన్నది చెప్పరు. ఇప్పటికీ గ్రామస్దాయి నుంచి రాష్ట్ర స్దాయి వరకు పదవుల పంపకాలు లేవు. పదేళ్ల అదికారంలో నామినేటెడ్‌ పదువులు కొద్ది మందికి తప్ప పూర్తిగా ఇచ్చింది లేదు. నాయకుల ఇంట్లో ఒక్కొక్కరికి నాలుగు పదవులు పంచారు. అదే కుంటుంబంలో నలుగురున్నా పదవులు పంచారు. కాని పార్టీ కోసం పనిచేసిన ఎంతో మంది కార్యకర్తలకు ఆఖరులోకూడా పదవులు పంచలేదు. వారి జీవితాలను నిలబెట్టలేదు. కార్యకర్తలంటే ఎన్నికల సమయంలో మాత్రమే గుర్తుకొచ్చే వాళ్లుగా మారిపోయారు. ఎన్నికల సమయంలో జనాన్ని పోగేసుకునేందుకు పడే అవస్దలు కార్యకర్తలతో తీర్చుకుంటున్నారు. వారిని కూరలో కరివేపాకులు చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు వచ్చిన కష్టాలు పగ వాడికి కూడా రాకూడదనుకుంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఓ వెలుగు వెలిగిన నాయకులకు కూడా పదవులు లేదు. గుర్తింపు లేదు. కొత్త నీరుకు పెద్దగా పని లేదు. పదేళ్ల తర్వాత అదికారంలోకి వచ్చామన్న సంతోషమే తప్ప, పదువులు అందక ఇబ్బందులు పడుతున్నారు. రేపు, మాపు అనుకుంటూ ఇప్పటికీ ఏడాదిన్న కాలం చూస్తుండగానే కరిగిపోయింది. పార్టీ అదికారంలోకి వస్తే అంతా ఇక మా కాలామే..మా రాజ్యమే అనుకున్న ఎంతో మంది నాయకులు, కార్యకర్తలు పదవుల రాక యాతన పడుతున్నారు. కనీసం చెప్పుకోవడానికిపార్టీ పదవులు కూడా ఇంకా పూర్తి స్ధాయిలో పంపకాలు జరగలేదు. మాకు ఎప్పుడు అవకాశాలు వస్తాయో అని ఎదరుచూస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే పదవులు అందుకుంటామనుకున్నారు. కాని రెండేళ్ల దగ్గర పడుతున్నా ఎదరు చూపులు తప్పడం లేదు. ..పదవులకోసం పడిగాపులు తప్పడం లేదు. అదికారంలోకి వచ్చి ఏడాదిన్నరౌతుంటే ఆశలు ఆవిరౌతాయేమోనన్న ఆందోళనలో వున్నారు. వాస్తవం చెప్పాలంటే ఇప్పుడున్న పరిస్ధితుల్లో రియల్‌ వ్యాపారం కూడా సాగడం లేదు. కాంగ్రెస్‌ నాయకులకు ఆ రకంగా కూడా కలిసి రావడం లేదు. రేవంత్‌ సర్కారు తీసుకొస్తున్న కొన్ని సంస్కరణల మూలంగా వున్న ఉపాధి కూడా పోయిందని రియల్‌ వ్యాపారం చేసే కాంగ్రెస్‌ నాయకులు గగ్గోలు పెడుతున్నారు. హైడ్రా వల్ల హైదరాబాద్‌లో భూముల అమ్మకాలు,కొనుగోలు ఆగిపోయింది. భూములు కొనాలంటేనే జనం భయడిపోవాల్సి వస్తోంది. వారికి భరోసా ఇచ్చే ధైర్యం ఎవరూ చేయలేకపోతున్నారు. ఇక ధరణి పేరుతో బిఆర్‌ఎస్‌ నాయకులు, అధికారులు కొంత బాగు పడ్డారు. భూ భారతి వచ్చినా, కాంగ్రెస్‌ నాయకుల సమస్యలు తీరడం లేదు. వారికి ఏదీ కలిసి రావడం లేదు. దాంతో పార్టీపరమైన పదవులు వచ్చినా చెప్పుకోవడానికి ఒక హోదా వుంటుందని అనుకుంటున్నా అవీ రావడం లేదు.ద అన్ని స్దాయిలో నాయకులకు ఎప్పుడొస్తాయో పదవులు అని ఎదురుచూస్తున్నారు. పైగా తమకు వస్తాయా? లేక ఇతరులకు వస్తాయా? కూడా అర్ధం కాక తలలు పట్టుకుంటున్నారు. అదే సమయంలో ఎక్కడిక్కడ నాయకులనే నిలదీసేంద ధైర్యం చేస్తున్నారు. ప్రభుత్వ పధకాలు అందక, పార్టీ పరమైన పదవులు అందక, ఎలాంటి అభివృద్ది కార్యక్రమాలు చేతికి రాక ఆర్ధికంగా నాయకులు చితికిపోతున్నారు. అప్పుల పాలౌతున్నారు. చిన్నా చితక కాంట్రాక్టులు వచ్చిన బాగుండని అనుకుంటున్నారు. పల్లెల్లో మొరం పనులు కూడా రాక సతమతమౌతున్నారు. రోడ్డెక్కితే వందలు ఖర్చవున్నాయి. నాయకులు చుట్టూ తిరిగేందుకు వేలకు వేలు ఖర్చవుతున్నాయి. నాయకులు మాటలు నమ్మి తిరిగాల్సిన పరిస్తితి ఎదురౌతోంది. ఇంట్లో కూర్చోలేరు. చేతిలో వున్న పైకం ఖర్చు చేసుకుంటూ సాగలేరు. ఇక పదవులు, పదువులు అని కలవరిస్తూ, ఏ కార్యక్రమం పెట్టినా పై స్దాయి కాంగ్రెస్‌ నాయకులకు ఎదురీతలు తప్పడం లేదు. కార్యకర్తల ప్రశ్నలు ఎదుర్కొ తప్పించుకునే పరిస్దితి లేదు. ఇక కాంగ్రెస్‌ అంటేనే గ్రూపులు. ఆ గ్రూపుల మధ్య సమన్వయం నాయకులకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. పదేళ్ల తర్వాత అదికారంలోకి వచ్చినా కష్టాలు తీరడం లేదని కార్యకర్తలు మొత్తుకుంటున్నారు.. అధికార పార్టీలో నాయకులుగా వుంటూ కూలీ చేసుకోలేరు. ఊరికి పరిమితమై వుండలేరు. నాయకుల పర్యటనల్లో పాలు పంచుకోక వుండలేరు. ఎక్కడా పనులు లేవు…చేతికి పైకం అందింది లేదని మదనపడుతున్నారు. ఒకరి కష్టాలు ఒకరు చెప్పుకుంటూ ఓదార్చుకుంటున్నారు. అధికారంలోవున్నామన్న మాటే కాని అణా సంపాదన లేదంటూ నిట్టూర్చుతున్నారు. . ఖర్చులు మాత్రం ఆగడం లేదు..కార్యకర్తల పోషణ తప్పడం లేదు. ప్రజల్లోకి వెళ్తే ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇంటికొచ్చి కార్యకర్తలు విసుక్కుంటున్నారు. మంత్రుల మందే నాయకులు తిట్టుకుంటున్నారు. కొన్నిచోట్ల నాయకులు కొట్లాడుకుంటున్నారు. సెక్యూటిరీని కూడా నెట్టేసుకుంటే కష్టాలు చెప్పుకుంటున్నారు. గందరగోళంలో పార్టీ శ్రేణులు. స్దానిక సంస్దల ఎన్నికలు రావడం లేదు..పదువుల అందుతాయా అన్నదిగులు. అధికారంలోవున్న మాటే గాని, సంతోషం ఎక్కడా కనిపించడం లేదు. బిజేపి నాయకులు, కార్యకరర్తల పరిస్ధితులు ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. అక్కడ కూడా అదే పరిస్దితి. కార్యకర్తలకు పదవులు ఇచ్చింది లేదు. కేంద్రంలో పార్టీ అదికారంలోవున్నా గ్రామీణస్దాయి నాయకులకు నామినేటెడ్‌ పదవులు పంచింది లేదు. కార్యకర్తలు కూరలో కరివేపాకులు..రాజకీయాల్లో గోలించి పడేస్తున్నారు.

మాగంటి మృతి పట్ల కేసీఆర్ సంతాపం.

BRS: మాగంటి మృతి పట్ల కేసీఆర్ సంతాపం..

 

నేటిధాత్రి:

 

 

 

 

 

బీఆర్ఎస్ సీనియర్ నేత, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి పట్ల.. ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. సంతాపం ప్రకటించారు. మాగంటి మరణం పార్టీకి తీరనిలోటు అని అన్నారు.

బీఆర్ఎస్ సీనియర్ నేత (BRS Senior Leader), జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే (Jubilee Hills MLA) మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath) మృతి పట్ల.. ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ (Ex CM KCR) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. సంతాపం (Tribute) ప్రకటించారు. మాగంటి మరణం పార్టీకి తీరనిలోటు అని అన్నారు. ఎంతో కష్టపడి రాజకీయాల్లో అంచలంచెలుగా ఎదిగిన మాగంటి గోపీనాథ్ ఎంతో సౌమ్యుడుగా ప్రజానేతగా పేరు సంపాదించారని అన్నారు. జూబ్లీహిల్స్ నియోజక వర్గ ఎమ్మెల్యేగా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, హైదరాబాద్ నగర సీనియర్ రాజకీయనేతగా మాగంటి తనదైన స్థానాన్ని సంపాదించుకున్నారని కేసీఆర్.. మాగంటి జ్ఞాపకాలను స్మరించుకున్నారు.

ప్రగాఢ సానుభూతి…

మాగంటి గోపీనాథ్‌ను కాపాడుకునేందుకు వైద్యులు చేసిన కృషి, పార్టీ తరఫున చేసిన ప్రయత్నాలు ఫలించక పోవడం దురదృష్టకరమని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. మాగంటి గోపీనాథ్ మరణానికి చింతిస్తూ.. శోకతప్తులైన ఆయన కుటుంబ సభ్యులు, మిత్రులు, అభిమానులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మాగంటి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కేసీఆర్ ప్రార్థించారు.

కాగా బీఆర్ఎస్ సీనియర్ నేత, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. ఆదివారం ఉదయం 5.45 గంటలకు తుది శ్వాస విడిచారు. ఈ నెల 5న గుండెపోటుతో ఏఐజీ ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారు జామున మృతి చెందారు. ఈ మేరకు వైద్యులు అధికారికంగా ప్రకటించారు.

కేసీఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర.

కేసీఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర

-చదువు అన్నారెడ్డి
మొగులపల్లి నేటి ధాత్రి

 

కాలేశ్వరం కమిషన్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ పై కుట్రలకు తెరలేపిందని సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు చదువు అన్నారెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నాడని దుయ్యబట్టారు. కాలేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణను కేసీఆర్ సస్యశ్యామలం చేశాడని, రైతుల సాగునీటి ఘోష తీర్చేందుకు భగీరథుడిలా కంకణం కట్టుకున్నారన్నారు. తెలంగాణను ధాన్యకారంగా మార్చిన ఘనత కేసీఆర్ దేనని కొనియాడారు. కేసీఆర్ తెలంగాణకు ఏం అన్యాయం చేశాడని నోటీసులు ఇస్తారని ప్రశ్నించారు. వీటిని ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వ కక్ష సాధింపు నోటీసులుగానే పరిగణిస్తామని తెలిపారు. విచారణ పేరుతో కేసీఆర్ ను ఇబ్బంది పెట్టాలని చూస్తే..తెలంగాణ మరోసారి మర్ల పడుతుందని హెచ్చరించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా..ప్రజల వ్యతిరేకతను మూటగట్టుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చిన తెలంగాణ జాతిపిత కేసీఆర్ ను ఇబ్బందులు పెడితే..నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం పై తిరగబడేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.

కెసిఆర్ కాలనీలో ఒకరు ఆత్మహత్య…

కెసిఆర్ కాలనీలో ఒకరు ఆత్మహత్య…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

 

తంగళ్ళపల్లి మండలం మండపల్లి కేసీఆర్ కాలనీలో రోడ్ నెంబర్ 2 లో కేసీఆర్ నగర్ లో తాడూరు రాము కుమార్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మిత్రునికి భార్య ముగ్గురు కుమారులు ఉన్నారు. మృతికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు

లక్షల కోట్లు అవినీతి చేసి నీతులు మాట్లాడుతున్న కెసిఆర్.

లక్షల కోట్లు అవినీతి చేసి నీతులు మాట్లాడుతున్న కెసిఆర్

గంగారం, నేటిధాత్రి

బిఆర్ఎస్ పార్టీ ఆదివారం నిర్వహించిన రజత్సోహ సభ కార్యక్రమం లో నీతి వ్యాక్కలు మాట్లాడిన కెసిఆర్ మా ప్రశ్నలకు జవాబు చెప్పాలని కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ అధ్యక్షులు జాడి వెంకటేశ్వర్లు మరియు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సుంకర బోయిన మొగిలి సంయుక్త ప్రకటన చేశారు..

బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పెద్ద ప్రాజెక్టులు కట్టాము, సంక్షేమ పథకాలు అమలు చేశామని కేసీఆర్ గారు చెప్పుకున్నారు. కానీ ఈ పథకాలు, ప్రాజెక్ట్‌ల పేరు చెప్పి 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన విషయాన్ని, వాటి ద్వారా కేసీఆర్ గారి కుటుంబం కమీషన్లు తీసుకున్న విషయాన్ని మాత్రం దాచేశారు. ఇలా కేసీఆర్ గారి కుటుంబం కమిషన్ల రూపంలో దోచుకున్న ప్రభుత్వ సొమ్మును తిరిగి ఖజానాకు రాబట్టగలిగితే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీలను అమలు చేయడానికి నిధులు అవసరం కన్నా ఎక్కువే సమాకూరుతాయి. అసెంబ్లీకి వస్తే, కాంగ్రెస్ సభ్యులు ఈ విషయంపై నిలదీస్తారనే భయంతో.. తప్పించుకు తిరుగు వాడు ధన్యుడు సుమతి అన్నట్లు కేసీఆర్ గారి వైఖరి ఉంది.
కాంగ్రెస్ ప్రభుత్వానికి తొత్తులుగా మారి, హద్దులు దాటవద్దని కేసీఆర్ గారు పోలీస్ వారికి వార్నింగ్ ఇవ్వడం చాలా విడ్డూరం. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పోలీసులను తొత్తులుగా వాడుకుని, చట్ట విరుద్ధంగా పోలీసులతో ప్రత్యర్థుల ఫోన్లు టాప్పింగ్ చేయించారు. మీ ఉచ్చులో పడిన కొందరు పోలీసు అధికారులు హద్దులు దాటడం వల్ల, ఇప్పుడు దేశ సరిహద్దులు దాటి, దొంగల మాదిరిగా దాక్కోవాల్సిన దుస్థితి వచ్చింది.
బీఆర్ఎస్ హయాంలో వరంగల్ బిడ్డలు శృతి, సాగర్‌లను కిరాతకంగా ఎన్కౌంటర్ చేయించిన కేసీఆర్ గారు, గద్దర్ గారు కలవడానికి వస్తే ప్రగతిభవన్ గేట్లను కూడా తెరవని కేసిఆర్ గారు… ఇప్పుడు మావోయిస్టులను చర్చలకి పిలవాలని కేంద్రాన్ని డిమాండ్ చెయ్యడం కేవలం అవసరవాదం.పాతికేళ్ళ బీఆర్ఎస్ ప్రస్థానంలో తెలంగాణను అభివృద్ధి చేశామని కేసిఆర్ గారు చెప్తున్నారు ఈ పాతిక సంవత్సరాలలో తెలంగాణ ఆర్ధిక అభివృద్ధి కంటే కేసిఆర్ గారి కుటుంబ సభ్యుల ఆర్ధిక స్థోమత ఎన్ని వేల రెట్లు పెరిగిందో చర్చిండానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధం. బీఆర్ఎస్ పార్టీ పెట్టడానికి ముందు కేసిఆర్ గారి కుటుంబ సభ్యుల ఆస్తులు ఎంత.. ఇప్పుడు ఒకొక్కరి ఆస్తులు ఎన్ని వేలకోట్లకు చేరాయో సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించడానికి బీఆర్ఎస్ అధినాయకత్వం సిద్ధమా…అని
వారు ప్రశ్ననించారు…

తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి.! 

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే నే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి. 

సోషల్ మీడియా వేదిక గా ప్రచారం నిర్వహించాలి

మాజీమంత్రి నిరంజన్ రెడ్డి

వనపర్తి నేటిదాత్ర

 

కె.సి.ఆర్ గారి నాయకత్వములో ఏప్రిల్ 27న వరంగల్ లో జరగనున్న బి.ఆర్.ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రన్ని అభివృద్ధి చేశారని మాజి మంత్రి అన్నారు వనపర్తి జిల్లా బీ ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో సమావేశం జరిగింది.ఈ భారీగా వచ్చిన కార్యకర్తలకు నిరంజన్ రెడ్డి గారు దిశ నిర్దేశం చేశారు
రజతోత్సవ సభను విజయవంతం చేయుటకు గ్రామగ్రామాన సమావేశాలు సోషల్ మీడియా వేదికగా ప్రచారం నిర్వహించి కార్యకర్తలను,ప్రజలను సమాయత్తం చేయాలని పిలుపునిచ్చారు. 25.సంవత్సరాల బి.ఆర్.ఎస్ ప్రస్థానాన్ని రజతోత్సవ సభ ద్వారా భావితరాలకు స్పూర్తి కలిగించాలని కోరుకున్నారు.
తెలంగాణ ఆస్తి కె.సి.ఆర్ అని 14ఏండ్ల ఉద్యమ చరిత్ర,10ఏండ్ల అధికారంలో తెలంగాణ కె.సి.ఆర్ నాయకత్వములో సుభిక్షంగా మారిందని కొంతమది కుట్రలు కుతంత్రాల వల్ల అధికారం కోల్పోయిన ప్రజలలో అభిమానం తగ్గలేదని అధికార కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని కె.సి.ఆర్ విలువ బి.ఆర్.ఎస్ పార్టీ అవసరం ప్రజలకు తెలిసివచ్చింది అని అన్నారు. 20రోజులలో నాయకులు మండల,గ్రామ సమావేశాలు పార్టీ పతాక ఆవిష్కరణ చేసి సభ విజయవంతం చేయుటకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
నాయకులు ఎల్లపుడు ప్రజల మధ్యన ఉండి వారి సమస్యలలో పాలుపంచుకోవాలని అటువంటి నాయకులకే పార్టీ ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. రజతోత్సవ సభ విజయవంతంతో పాటు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు రైతు బంధు రైతు రుణ మాఫీ రైతు భరోస,మహిళలకు 2500,తొలం బంగారం,నిరుద్యోగ భృతి వంటి అంశాలు ప్రజలకు వివరించాలని అన్నారు.రజతోత్సవ సభ విజయవంతంతో రాష్ట్ర రాజకీయాలలో పెను మార్పులు వస్తాయని సకల జనులు బి.ఆర్.ఎస్ వైపు చూస్తారని గౌరవ నిరంజన్ రెడ్డి అన్నారు.
వనపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. ఈ సమావేశములో జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ పట్టణ అధ్యక్షుడు పలస రమేష్ గౌడ్ అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్,మీడియా కన్వీనర్ నందిమల్ల. అశోక్, చంద్రశేఖర్ నాయక్,కురుమూర్తి యాదవ్, మార్క్ ఫెడ్ డైరెక్టర్ విజయ్ కుమార్,పార్టీ అధ్యక్షులు పలుస.రమేష్ గౌడ్,దిలీప్ రెడ్డి,వనం.రాములు,రాళ్ళ.కృష్ణయ్య,మాణిక్యం,వేణు యాదవ్,వెంకటస్వామి,మాజీ ప్రజాప్రతినిధులు రఘుపతి రెడ్డి,బోర్ల.భీమయ్య,కృష్ణా నాయక్, లక్ష్మమా రెడ్డి, కర్రేస్వామి, రాజశేఖర్,మాజీ కౌన్సిలర్లు బండారు కృష్ణ, పెండం నాగన్న యాదవ్,ఉంగ్లం. తిరుమల్ నాయుడు ,ప్రేమ్ నాథ్ రెడ్డి,సమద్, స్టార్.రహీమ్,ఇమ్రాన్,హేమంత్ ముదిరాజ్,సూర్యవంశం.గిరి జోహెబ్ హుస్సేన్, చిట్యాల రాము,సునీల్ వాల్మీకి మహిళా నాయకురాలు నందిమల్ల.శారద ,నాగమ్మ,జమ్ములమ్మ, సాయిలీలా,కవితా నాయక్ తదితరులు పాల్గొన్నారని
జిల్లా మీడియా కన్వీనర్
నందిమల్ల అశోక్ తెలిపారు

కేసీఆర్ వల్లే తెలంగాణకు స్వేచ్ఛ,.! 

కేసీఆర్ వల్లే తెలంగాణకు స్వేచ్ఛ, స్వపరిపాలన సిద్ధించింది. 

-ప్రజా సంక్షేమమే పరమావధిగా కేసీఆర్ పాలన సాగింది

-విలేకరుల సమావేశంలో చదువు అన్నారెడ్డి
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

తెలంగాణ ఆస్తి కేసీఆర్ అని 14ఏండ్ల ఉద్యమ చరిత్ర, 10ఏండ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ నాయకత్వములో తెలంగాణ సుభిక్షంగా ఉందని, కొంతమది చేసిన కుట్రలు, కుతంత్రాల వల్ల అధికారం కోల్పోయిన ప్రజలలో కేసీఆర్ కు అభిమానం తగ్గలేదని సర్పంచుల ఫోరం మొగుళ్లపల్లి మండల మాజీ అధ్యక్షులు చదువు అన్నారెడ్డి అన్నారు. సోమవారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని ముల్కలపల్లి గ్రామంలో గల తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అధికార కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని, కేసీఆర్ విలువ బీఆర్ఎస్ పార్టీ అవసరం ప్రజలకు తెలిసివచ్చిందన్నారు. నాయకులు ఎల్లపుడు ప్రజల మధ్యన ఉండి వారి సమస్యలలో పాలుపంచుకోవాలని అటువంటి నాయకులకే పార్టీ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు రైతుబంధు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, మహిళలకు రూ.2500, తులం బంగారం, నిరుద్యోగ భృతి వంటి అంశాలు ప్రజలకు వివరించాలన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు వస్తాయని సకల జనులు బీఆర్ఎస్ వైపు చూస్తారని అన్నారెడ్డి అన్నారు.

కెసిఆర్ సమక్షంలో సన్నాహక సమావేశం.

సమావేశానికి హాజరైన ఎంపీ “వద్దిరాజు”

“నేటిధాత్రి” ఎర్రవెల్లి.
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)రజతోత్సవం ఈనెల 27వతేదీన జరుగనున్న భారీ బహిరంగ సభ నేపథ్యంలో పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధ్యక్షతన ఖమ్మం, నల్లగొండ,మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల పార్టీ ముఖ్య నాయకులతో శనివారం సన్నాహాక సమావేశం జరిగింది.
కేసీఆర్ ఎర్రవెల్లి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,
మాజీ మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్,గుంతకండ్ల జగదీష్ రెడ్డి,వీ.శ్రీనివాస్ గౌడ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, లక్ష్మారెడ్డి,మాజీ ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్,రావుల చంద్రశేఖరరెడ్డి,బడుగుల లింగయ్య యాదవ్,మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య,వనమా వెంకటేశ్వరరావు తదితర ప్రముఖులతో కలిసి హాజరయ్యారు.అలాగే,ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు కందాళ ఉపేందర్ రెడ్డి,రేగా కాంతారావు,బానోతు మదన్ లాల్,మెచ్చా నాగేశ్వరరావు,కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి,కంచర్ల భూపాల్ రెడ్డి,బానోతు హరిప్రియ హరిసింగ్ నాయక్, ఖమ్మం మాజీ జేడ్పీ ఛైర్మన్ లింగాల కమల్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.

vaddiraju ravichandra

అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గత కెసిఆర్ ప్రభుత్వాన్ని.

అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గత కెసిఆర్ ప్రభుత్వాన్ని ఎండగట్టిన చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం

గంగాధర నేటిధాత్రి :

 

KG to PG విద్యను ప్రారంభిస్తా, కార్పొరేట్ కళాశాల కాళ్లు విరుస్తాం అని చెప్పి అధికారంలోకి వచ్చిన కెసిఆర్, గత దశాబ్ద కాలంలో విద్యా విధ్వంసానికి పాల్పడ్డాడు. కెసిఆర్ తీర్పుతో విద్యా వ్యవస్థ రెండు దశాబ్దాలు వెనక్కి వెళ్ళి. ది అన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్-2024 ప్రకారం 2వ తరగతి నుండి 5వ తరగతి చదువుతున్న 82% విద్యార్థులకు 2వ తరగతి బుక్స్ చదవడం రావడం లేదు, 8వ తరగతి చదువుతున్న 65% మంచి విద్యార్థులకు బేసిక్ మ్యాథమెటిక్స్ పైన అవగాహన లేదు, బీహార్ జార్ఖండ్,ఛత్తీస్గడ్ వంటి రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రం విద్యావ్యవస్థలో అధమ స్థానంలో ఉంది. నేషనల్ అచీవ్మెంట్ సర్వేలో 3వ, 5వ, 8వ,10వ తరగతి విద్యార్థుల సామర్ధ్యాన్ని రాష్ట్రాల వారిగా నిర్వహించే పరీక్షలో టాప్-5 వరస్ట్ పర్ఫామెన్స్ రాష్ట్రాల్లో తెలంగాణను ఉంచిన ఘనత కేసిఆర్ కు దక్కుతుంది. ప్రభుత్వం ఆధ్వర్యంలో 2017-18 నుండి పర్ఫామెన్స్ ఆఫ్ గ్రేడింగ్ ఇండెక్స్ సూచిక ద్వారా రాష్ట్రాల విద్య వ్యవస్థ పనితీరుకు ర్యాంకులు కేటాయించడం జరుగుతుంది, ఈ ఇండెక్స్ ద్వారా తెలంగాణ రాష్ట్రం జాతీయలోనే అధమ స్థానంలో నిలిచింది. 2022 సూచిక ప్రకారం సెకండరీ విద్య తర్వాత డ్రాప్ అవుట్ లలో తెలంగాణ రాష్ట్ర మొదటి స్థానంలో ఉంది, జాతీయస్థాయిలో ఈ సగటు 13.2% గా ఉంటే,తెలంగాణ రాష్ట్రంలో 22.2% గా ఉంది. గత కేసీఆర్ ప్రభుత్వంలో ఆనాటి ప్రభుత్వ పెద్దలు నారాయణ,శ్రీ చైతన్య వంటి కార్పొరేట్ పాఠశాలలను ప్రోత్సహించి, ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేశారు.

కెసిఆర్ హయంలో విధ్వంసానికి గురైన విద్యా వ్యవస్థను గాడిలో పెట్టడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యకు అధిక నిధులు కేటాయిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బడ్జెట్లో విద్యాభివృద్ధికి రూ.23,108 కోట్ల రూపాయలను ప్రభుత్వం కే ప్రతిపాదించింది. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ లను ప్రారంభించాలని సంకల్పించి సీఎం రేవంత్ రెడ్డి చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో విద్యార్థుల డైట్ చార్జీలను 200 శాతం పెంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుంది. గత ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో 8 వేల పై చిలుకు టీచర్ ఉద్యోగాలనే భర్తీ చేయగా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 11 వేలకు పైగా ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేసింది. దశాబ్ద కాలంగా ఉపాధ్యాయ బదిలీలు, మోషన్లు చేపట్టలేదు, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధ్యాయులను బదిలీ చేయడంతో పాటు ప్రమోషన్లను కల్పించింది. విద్యా వ్యవస్థను పర్యవేక్షణ చేయడానికి గత ప్రభుత్వం హాయంలో డీఈవోలు, డిప్యూటీ డీఈవోలు, ఎంఈఓ లను నియమించలేదు. కేజీ టు పీజీ విద్య నేపంతో ప్రారంభించిన సంక్షేమ పాఠశాలల్లో వసతి సౌకర్యాలు సరిగా లేక విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. ఆనాటి బిఆర్ఎస్ నాయకుల జేబులు నింపడానికి వారి కోళ్ల ఫారాలు, అభ్యభవనాల్లో పాఠశాలలను ఏర్పాటు చేసి విద్యార్థుల జీవితాలను పణంగా పెట్టింది ఆనాటి బిఆర్ఎస్ ప్రభుత్వం. గత దసరా సమయంలో టిఆర్ఎస్ నాయకుల కనుసన్నల్లో ఉన్న భవనాలకు అద్దె చెల్లించలేదని ధర్నాలు చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ గ్రీన్ ఛానల్ ద్వారా భవనాలకు మధ్య చెల్లిస్తామని, పాఠశాలలు నడవకుండా చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించడంతో తిరిగి ప్రారంభించారు. శాస్త్రీయ ప్రమాణాలు పాటించకుండా ప్రారంభించిన ఈ పాఠశాలలతో రాష్ట్రంలో ఉన్న జిల్లా పరిషత్, మండల పరిషత్ ప్రభుత్వ పాఠశాలలు చాలావరకు మూతపడ్డాయి, ఉన్న పాఠశాలల్లో సరైన విద్యార్థులు లేకుండా పోయింది.

కెసిఆర్ హయంలో నిర్వీర్యమైన విద్యావ్యవస్థను తిరిగే గాడిలో పెట్టడానికి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం కృషి చేస్తోంది. కులం,మతం,ఆర్థిక సంబంధం లేకుండా ప్రతి విద్యార్థికి విధమైన విద్యను అందజేయడానికి ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను ప్రారంభించాలని నిర్ణయించడం చారిత్రక నిర్ణయం. విద్య ద్వారానే జీవితానికి సార్థకత ఏర్పడుతుందన్న అంబేద్కర్ ఆలోచన విధానం మేరకు డబ్బులు ఉన్న పిల్లలకే ఐఐటీ,నీట్ అనే విధానం పోవాలనే గొప్ప ఆలోచనతో ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను ప్రారంభిస్తుంది. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు సంబంధించిన మధ్యాహ్న భోజనం బిల్లులను ప్రభుత్వం సకాలంలో చెల్లించకపోవడంతో నీళ్ల చారు అన్నం తినవలసి వచ్చింది. విద్యార్థులకు పౌష్టికరమైన ఆహారం అందించడానికి డైట్ చార్జీలను 200 శాతం పెంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుంది.

ఉప ఎన్నికలొస్తే ఉద్యమకారులకే టిక్కెట్లు?

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలమే అని అఫిడవిట్లు ఇచ్చిన వారిపై రాజీనామాకు ఒత్తిళ్లు?

`ఎలాగైనా ఉప ఎన్నికలు తేవాలన్నదే కేసిఆర్‌ ఎత్తుగడ!

`పది సీట్లు గెలుచుకుంటేనే బిఆర్‌ఎస్‌ మనుగడ!

`ఉప ఎన్నికలు వస్తే జగిత్యాల నుంచి ‘‘కవిత’’ పోటీ.

`ఉప ఎన్నికలు తెచ్చి ఒక్క సీటు ఓడిపోయినా బిఆర్‌ఎస్‌ అడ్రెస్‌ గల్లంతే!

`ప్రజలు బీజేపి వైపు చూస్తున్నారని సంకేతాలు వెళ్లినట్లే!

`ఇప్పటి నుంచే కార్యాచరణ మొదలు పెట్టాలని ఆదేశాలు.

`అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెడుతున్నట్లు సమాచారం.

`తాము బీఆర్‌ఎస్‌ లో వున్నామని చెప్పినా సుప్రీం కోర్టు అంగీకరించినా, పార్టీ పరంగా అంగీకరించకూడదని నిర్ణయం.

`అందరూ అఫిడవిట్లు దాఖలు చేసేదాకా ఎదురు చూడాలనుకుంటున్నారు.

`అదును చూసి రాజీనామాలు చేయించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

`అఫిడవిట్లు ఇస్తే అటు కాంగ్రెస్‌ ఆదరించదు.

`ఇటు బీఆర్‌ఎస్‌ దరి చేరనివ్వదు.

`రాజీనామా చేయని గత్యంతర పరిస్థితుల్లోకి ఎమ్మెల్యేలు.

`నియోజకవర్గాల వారిగా ఇప్పటికే నివేదికలు.

`కొన్ని నియోజకవర్గాలలో నాయకులకు కేసిఆర్‌ అభయం.

`ఆశావహులను కూడా పరిగణలోకి తీసుకొని, సమిష్టి నిర్ణయం తీసుకోనున్నారు.

`నాయకుల అభిప్రాయాల మేరకు టిక్కెట్లు కేటాయించాలని అనుకుంటున్నారు.

`అటు కేటిఆర్‌, ఇటు హరీష్‌ రావులు అదే పనిలో నిమగ్నమై వున్నారు.

`కేటిఆర్‌ జిల్లాల పర్యటన కూడా అందులో ఒక భాగమే అంటున్నారు.

`ప్రజాభిప్రాయ సేకరణ నేరుగా సేకరించాలనుకుంటున్నారు.

`పార్లమెంటు ఎన్నికల సమయంలో తొందరపడి పరువు పోగొట్డుకున్నారు.

`ఆ తొందరపాటు మళ్లీ పునరావృతం కాకుండా అడుగులేయాలనుకుంటున్నారు.

`ఇక కొడితే రాజకీయాలు షేక్‌ కావాలని చూస్తున్నారు.

`బీఆర్‌ఎస్‌ బలం రుచి చూపించాలని వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

 రాజకీయాలలో తొందరపాటు ఎంత అనర్ధ దాయకమో పది మంది జంపింగ్‌ ఎమ్మెల్యేలను చూస్తే అర్దమౌతుంది. ఇప్పుడు లాక్కొలేక, పీక్కోలేక నానా తంటాలు పడుతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్దితి వస్తుందని ఊహించలేదు. ఆసల్యం అమృతం విషమనుకున్నారు. తొందరపాటు మొదటికే మోసమని గ్రహించలేకపోయారు. పరిస్దితులను అర్ధం చేసుకోలేకపోయారు. భవిష్యత్తు గురించి ఆలోచించుకోలేకపోయారు. పార్టీ మారితే ప్రాదాన్యత పెరుగుతుందనుకున్నారు. పదవులు, పనులు వచ్చి ఒళ్లో వాలుతాయని కలలుగన్నారు. వరుస పెట్టి క్యూ కట్టారు. వరద ఆగిపోగానే దిక్కులు చూస్తున్నారు. తమ పలాయనం తర్వాత బిఆర్‌ఎస్‌ ఖళీ అవుతుందనుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీలో ఎనలేని ప్రాదాన్యత లభిస్తుందనుకున్నారు. నియోజక వర్గ అభివృద్దికి నిధుల వరద పారుతుందనుకున్నారు. అదనంగా పదవులు, అనుచరులకు మేలు కల్గుతుందని అనుకున్నారు. కాని డామిట్‌ కధ అడ్డం తిరిగింది. కాంగ్రెస్‌లో చేరి ఇంత కాలమైనా గుర్తింపు లేదు. ఆదరింపు లేదు. అలకపూనినా పలకరించేవారు లేదు. ఆపద వస్తున్నా అయ్యే అనేవారు లేదు. అసలు కాంగ్రెస్‌ నేతలకు తప్ప కప్పదాటు నాయకులకు పార్టీలో చోటే లేదని తెలుసుకున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు పదవులు ఇచ్చే ప్రసక్తి లేదని కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి నటరాజన్‌ తేల్చి చెప్పడంతో దిక్కు తోచని స్తితిలోకి నెట్టేయబడ్డారు. ఇదిలా వుంటే బిఆర్‌ఎస్‌ అధినేత సైలెంటుగా తన వ్యూహాలు తాను చేసుకుంటూ పోతున్నారు. ఇవ్వాల కాకపోయినా, రేపైనా సరే ఉప ఎన్నికలు ఖాయమన్న నమ్మకంతో కేసిఆర్‌ వున్నారు. పైగా సుప్రింకోర్డులో బలంగానే పార్టీ తరుపున వాదనలు వినిపిస్తున్నారు. దాంతో ఏ క్షణమైనా పిరాయింపు ఎమ్మెల్యేపై వేటు పడొచ్చన్న ఆశతో బిఆర్‌ఎస్‌ నాయకులున్నారు. ఇదిలా వుంటే సుప్రింకోర్టు కూడా ఈ విషయంలో సీరియస్‌గానే వున్నట్లు కనిపిస్తోంది. పార్టీ పిరాయింపుల చట్టం అమలు కోసం డైరెక్షన్‌ ఇచ్చేలానే వుంది. జంపింగ్‌ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకునేలా కనిపిస్తోంది. అందుకే ఎమ్మెల్యేల అనర్హతపై ఇంకెంత కాలమంటూ తెలంగాణ స్పీకర్‌ కార్యాలయానికి నోటీసులు కూడా పంపింది. ఈ నెల 22 లోపు ఏదో ఒక సమాధానం చెప్పాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. గతంలోనే సుప్రింకోర్టు స్పీకర్‌కు సైతం నోటీసులు జారీ చేసింది. అప్పుడు కొంత సమయం కావాలంటూ స్పీకర్‌ తరుపున న్యాయవాదులు సమయం కోరారు. అదే సమయంలో ఇంకెంత కాలం కావాలంటూ సుప్రింకోర్టు ప్రశ్నించింది. సరైన సమయం చూసి నిర్ణయం తీసుకుంటారని స్పీకర్‌ తరుపు న్యాయవాదులు చెప్పడంతో, సరైన సమయం అంటే ఎంత కాలం..పుణ్యకాలం వెళ్లిపోయేంత వరకా? అంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ నెల 22 డెడ్‌ లైన్‌ పెట్టింది. దాంతో స్పీకర్‌ కార్యాలయం ఈ నెల22లోపు ఏదో ఒక సమాధానం చెప్పలేని పరిస్ధితి ఎదురైంది. ఆలోపు తాము పార్టీ మారలేదంటూ కొంత మంది ఎమ్మెల్యేలు సుప్రింకోర్టుకు వ్యక్తిగతంగా లిఖితపూర్వక సమాదానాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. స్పీకర్‌తోపాటు, ఎమ్మెల్యేలకు కూడా సుప్రింకోర్టు విడివిడిగా నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. తాము పార్టీలోనే వున్నామని, కాకపోతే అభివృద్దిపనులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలవడం మాత్రమే జరిగిందని నోటీసులకు సమాదానం చెప్పినట్లు కూడా సమాచారం. అయితే ఈ సమాధానాలు సుప్రింకోర్టు అంగీకరిస్తుందా? బిఆర్‌ఎస్‌ పార్టీ తరుపున న్యాయవాదులు ప్రశ్నించకుండా వుంటారా? ఎమ్మెల్యేలుకండువాలు మార్చకున్న ఫోటోలు, వీడియాలో సుప్రింకోర్టుకు సమర్పించకుండా వుంటారా? అయితే ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ ఒకడుగు ముందుకేసి కాంగ్రెస్‌ పార్టీ నుంచి సికింద్రాబాద్‌ ఎంపిగా పోటీచేశారు. బిఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయలేదు. ఎమ్మెల్యే పదవిని వదులుకోలేదు. కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి ఎంపి ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ తరుపునపోటీ చేసి ఓడిపోయారు. ఆయనపై ఖచ్చితంగా వేటు పడుతుందని అంటున్నారు. ఇక మరో ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై కూడా వేటు పడుతుందనే అనుకుంటున్నారు. ఆయన స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యేగా బిఆర్‌ఎస్‌ నుంచి ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పుకున్నారు. తన కూతురుకు కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎంపి టికెట్‌ తెచ్చుకున్నారు. ఎంపి ఎన్నికల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. ఒక పార్టీ ఎమ్మెల్యేగా వుంటూ మరో పార్టీకి ప్రచారం చేయడం తప్పు. అది ఎన్నికల నియమావళికి విరుద్దం. అందువల్ల కడియం శ్రీహరి ఎన్నిక రద్దయ్యే అవకాశం లేకపోలేదు. ఇక మిగతా ఎమ్మెల్యేలలో కొంత మంది మళ్లీ బిఆర్‌ఎస్‌ గూటికి చేరుకునేందుకు సిద్దంగా వున్నారు. అయినా బిఆర్‌ఎస్‌ ఎప్పుడో డోర్స్‌ క్లోజ్‌ చేసింది. వారికి శిక్ష పడాలనే కోరుకుంటోంది. రాజకీయాల్లో కక్షసాదింపులు, వేధింపులు కొత్త కాదు. రాజకీయాలు పుట్టిన నాటి నుంచే వున్నాయి. వాటిని తట్టుకొని నిలబడినప్పుడే రాజకీయాలలో ఎదుగుతారు. ఇవన్నీ తెలియకుండానే రాజకీయాల్లోకి ఎవరూ రారు. సామాన్యంగా క్షేత్ర స్దాయి రాజకీయాలను చేసే వారే అధికార పార్టీ నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. అయినా తట్టుకొని పార్టీకోసం పనిచేస్తారు. అలాంటిది ఎమ్మెల్యే స్ధాయి నాయకులు కూడా తమ స్వలాభాపేక్ష కోసం పార్టీ మారడాన్ని ఎవరూ సహించరు. ఈ సంగతి ఇలా వుంటే పది స్ధానాలకు ఉప ఎన్నికలు వస్తాయన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆ స్ధానాలలో ఎవరిని నిలబెట్టాలన్న దానిపై కూడా బిఆర్‌ఎస్‌లో చర్చల మీద చర్చలు జోరుగా సాగుతున్నాయి. అంతే కాకుండా ఈ పది సీట్లలో ఉద్యమ కారులను నిలబెట్టి, బిఆర్‌ఎస్‌ ఉద్యమకారుల పార్టీయే అని మరోసారి నిరూపించాలని అనుకుంటున్నారు. బిఆర్‌ఎస్‌ పేరు మారినా తెలంగాణ ఆత్మ నిండా నింపుకొని వున్న ఏకైక పార్టీ బిఆర్‌ఎస్‌ మాత్రమే అని ఇతర పక్షాలకు తెలిసొచ్చేలా చేయాలని అనుకుంటున్నారు. అందుకే అవకాశ వాదులకు కాకుండా ఉద్యమ కారులైన బిఆర్‌ఎస్‌ నాయకులకు ఈసారి పది టిక్కెట్లు ఇవ్వాలని పార్టీ కోరుకుంటోంది. బిఆర్‌ఎస్‌ అధినేత కేసిఆర్‌ కూడా అదే అనుకుంటున్నారు. దాంతో ఆశావహులు పెరుగుతున్నారు. ఇప్పటికే కొన్ని నియోజక వర్గాలలో నాయకులకు పనులు చేసుకొమ్మని కూడా కేసిఆర్‌ హమీ ఇచ్చినట్లు కూడా సమాచారం. ఎలాగైనా ఉప ఎన్నికలుతేవాలి. మళ్లీ బిఆర్‌ఎస్‌ ఊపు తగ్గలేదని నిరూపించాలన్న కసితో బిఆర్‌ఎస్‌ వుంది. నాయకులు కూడా అదే స్ధాయిలో పనిచేయాలని చూస్తున్నారు. ఎందుకంటే ఉప ఎన్నికల్లో పదికి పది బిఆర్‌ఎస్‌ గెలవకపోతే ఆ పార్టీ బలహీనపడినట్లే అని అనుకోవాల్సి వస్తుంది. ఏ ఒక్క సీటు కోల్పోయినా అంతర్మధనంలో పడాల్సివస్తుంది. వచ్చేనాలుగేళ్లు బాగా కష్టపడాల్సి వస్తుంది. ఉప ఎన్నికల్లో గెలిస్తేనే తెలంగాణ రాజకీయాల్లో బిఆర్‌ఎస్‌ది పై చేయి అవుతుంది. లేకుంటే అవతలి నుంచి బిజేపి తరుముకొస్తుంది. ఇప్పటికే పార్లమెంటు ఎన్నికల్లో 8 సీట్లు గెలిచి బలం పెంచుకున్నది. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన మంచి ఊపు మీద వుంది. బిఆర్‌ఎస్‌ బలహీనపడిరదన్న సంకేతాలు అందితే ఇక బిజేపి దూకుడు పెంచుతుంది. గ్రామ గ్రామాన బలపడుతుంది. బిఆర్‌ఎస్‌ ద్వితీయశ్రేణి నాయకులను ఆకర్షిస్తుంది. ఉప ఎన్నికల్లో ఏమాత్రం బిఆర్‌ఎస్‌ గెలుపుకు అవరోధం ఏర్పడినా, ఒక్క సీటునైనా కాంగ్రెస్‌, బిజేపిలు కైవసం చేసుకుంటే బిఆర్‌ఎస్‌లో ముందడుకున్నా వెనుకడుగే ఎక్కువ వేయాల్సి వస్తుంది. అందుకే బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంటు క్షేత్ర స్ధాయి పర్యటలను మొదలు పెట్టారు. వాటి పర్యవేక్షణ, రాజకీయాలను హరీష్‌రావు దగ్గరుండిచూసుకుంటున్నారు. ఇద్దరు రెండు వైపుల నుంచి రాజకీయాలను కనుసైగల్లోకి తెచ్చుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. రాష్ట్రంలో వున్న రాజకీయ పరిస్దితులను అవగతం చేసుకునేందుకు బయలు దేరారు. ఇక ఉప ఎన్నికలలో జగిత్యాల నుంచి ఎమ్మెల్సీ కవిత పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెట్టాలని చూస్తున్నారు. నిజానికి గత ఎన్నికల్లోనే ఆమె జగిత్యాల నుంచి పోటీ చేయాలని అనుకున్నారు. కాని త్యాగం చేశారు. కాగల కార్యం గందర్వులే తీర్చినట్లు ఎమ్మెల్యే సంజయ్‌ పార్టీ మారి, కవితకు అవకాశం కల్పించనట్లైంది. మిగతా స్ధానాలలో ఎవరిని ఎంపిక చేసి రంగంలోకి దింపుతారో చూడాలి. కాని జంపింగ్‌ ఎమ్మెల్యేలకు మళ్లీ కాంగ్రెస్‌ అవకాశం కల్పిస్తుందా? లేదా అన్నది కూడా తేలాల్సి వుంది. ఎందుకంటే పదవులు ఇచ్చేందుకే కాంగ్రెస్‌ పార్టీ సుముఖంగా లేనప్పుడు, ఎమ్మెల్యే టికెట్లు ఇస్తుందన్న గ్యారెంటీ మాత్రం కనిపించడం లేదు. స్వయం కృతాపరాధమంటే ఇదే! మరి.

వరంగల్ తూర్పులో కేసీఆర్ 72వ జన్మదిన వేడుకలు

కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్

పోచంమైదాన్ లో కేసీఆర్ భారీ కటౌట్ కు పాలాభిషేకం, పులాభిషేకం, పండుగ వాతావరణంల కేసీఆర్ జన్మదిన వేడుకలు.

72వ జన్మదినం సందర్బంగా 72 కిలోల భారీ కేక్ కట్టింగ్ చేసి శుభాకాంక్షలు తెలిపిన నన్నపునేని నరేందర్.

కార్యకర్తలతో, ఫ్లెక్సీలతో, బిఆర్ఎస్ జెండాలతో గులాబీ మయమైన పోచమ్మమైదాన్ జంక్షన్.

నేటిధాత్రి, వరంగల్ తూర్పు

తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 72వ జన్మదినం సందర్బంగా సోమవారం వరంగల్ తూర్పు పొచమ్మమైదాన్ సెంటర్ లో, మాజీ మేయర్, మాజీ శాసనసభ్యులు నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో కేసీఆర్ భారీ కటౌట్ ఏర్పాటు చేసి, ఆ కటౌట్ కు భారీ ఎత్తున పాలాభిషేకం, పులాభిషేకం నిర్వహించి ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నాడు. అనంతరం కార్యకర్తలతో కలిసి భారీ కేక్ ను ఏర్పాటు చేసి కార్యకర్తల నడుమునా వారితో కలిసి కేక్ కట్టింగ్ చేసి కేసీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కార్యకర్తలు అందరూ కలిసి కేసీఆర్ పాటలతో పోచమ్మమైదాన్ జంక్షన్ లో పండుగా వాతావరణంలో ఈ వేడుకలను నిర్వహించుకున్నారు. అనంతరం మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు వృక్షర్చనలో భాగంగా వరంగల్ తూర్పు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో కలిసి సీకేఎం కళాశాల మైదానంలో మొక్కను నాటి కేసీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నరేందర్ మాట్లాడుతు ఈ రోజు మా బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందిరికి ఒక పండుగ రోజు ఒక బీసీ బిడ్డను అయినా నన్ను కేసీఆర్ పేదింటి బిడ్డకూ మేయర్, ఎమ్మెల్యేను చేసి నన్ను ఈ రోజు ఈ స్థాయిలో ఉంచిన కేసీఆర్ కి నా జీవితం మొత్తం రుణపడి ఉంటాను అని అన్నారు.

ఈ రోజు ప్రజలందరూ ఒక్కటే కోరుకుంటున్నారు. మళ్ళీ కేసీఆర్ సారే రావాలి మా జీవితాల్లో వెలుగులు నింపాలి అని ప్రతి వ్యక్తి కోరుకుంటున్నారు, రానున్న రోజుల్లో బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అప్పుడు ఈ జన్మదిన వేడుకలు మరింత ఘనంగా నిర్వహించుకుంటాం అని నరేందర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో 34 వ డివిజన్ కార్పొరేటర్ దిడ్డి కుమారస్వామి, మాజీ కార్పొరేటర్ బయ్య స్వామి, మాజీ మార్కెట్ చైర్మన్ టి. రమేష్ బాబు, మాజీ కార్పొరేటర్ కుందారపు రాజేందర్, డివిజన్ అధ్యక్షులు, మహిళా నాయకురాలు, యూత్ నాయకులు, బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

బి ఆర్ ఎస్ ఆధ్వర్యంలో మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు.

చిట్యాల, నేటి ధాత్రి :

తెలంగాణ రాష్ట్ర సాధకుడు, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను జయశంకర్ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు అల్లం రవీందర్ కేక్ కట్ చేసి, మిఠాయి పంచుకుంటూ సంబరాలు జరుపుకున్నారు అనంతరం మండల కేంద్రంలోని చిట్యాల సివిల్ దవఖానాలో రోగులకు, బాలింతలకు పండ్లు, బ్రెడ్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు.
ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన మాజీ జెడ్పిటిసి గొర్రె సాగర్ మాట్లాడుతూ..కేసీఆర్ రాష్ట్రం కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడి రాష్ట్రం సాధించారని తెలిపారు. ప్రాంత అభివృద్ధి, అన్నివర్గాలకు సమన్యాయం చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని తెలిపారు. తెలంగాణ ప్రజలు కన్న కలలు సాకారం కావాలంటే రాబోవు రోజుల్లో కేసీఆర్‌ మళ్లీ అధికారంలోకి రావాలని ఆకాక్షించారు.
భగవంతుడి ఆశీర్వాదంతో నిండు నూరేళ్లు చల్లగా, ఆయురోగ్యాలతో ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కొత్తూరి రాజిరెడ్డి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పిట్ట సురేష్ బాబు మండల యూత్ అధ్యక్షులు టౌటం నవీన్ మహిళా అధ్యక్షురాలు ఈర్ల మల్లక్క శ్రీదేవి ఎరుకొండ రాజేందర్ మడికొండ రవీందర్ రావు కట్రేవుల కుమార్ సాద మల్లయ్య నాగరాజు పాండ్రాల విరాస్వామి చిలుముల రమణ చారి దుదిపాల తిరుపతి రెడ్డి పెరుమడ్ల రవీందర్ ఏరుకొండ రఘు వెంకట్ నాయక్ పల్లే శశిధర్ రెడ్డి దామర రాజు రాకేష్ భానోత్ శ్రీనివాస్ నాయక్ పోషాల రాజు నరేష్ మొగిలి కట్టేకొల్ల పెద్ద రాజు సాదా రాజు కుస ప్రశాంత్ కట్కూరి రాజేందర్ అశోక్ ప్రశాంత్ పార్టీ నాయకులు మహిళా నాయకులు యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మెదక్‌ మొనగాడు వెంకట్రామ్‌ రెడ్డే!

https://epaper.netidhatri.com/view/251/netidhathri-e-paper-2nd-may-2024%09/3

అటు కేసిఆర్‌, ఇటు హరీష్‌ ఇద్దరి ఆశీస్సులు.

ఆది నుంచి మెదక్‌ బిఆర్‌ఎస్‌కు కంచుకోట.

కాంగ్రెస్‌ హయాంలో మెతుకుకు దిక్కులేని సీమ.

పదేళ్ల బిఆర్‌ఎస్‌ కాలంలో మెదక్‌ అన్నపూర్ణ.

కాంగ్రెస్‌ వచ్చింది…కరువొచ్చింది.

మెదక్‌ మెతుకుకోసం మళ్ళీ తల్లడిల్లుతోంది.

నిన్నటి దాక మంజీర పరవళ్లు తొక్కింది.

కాంగ్రెస్‌ రాగానే ఎండిపోతోంది.

బిఆర్‌ఎస్‌ హయాంలో మెదక్‌ అంతా సస్యశ్యామలం.

కాంగ్రెస్‌ రాగానే ఎడారి మయం.

ఆనాడు ఇందిరా గాంధీ గెలిచినా చేసిందేమీ లేదు.

ఇప్పుడు కాంగ్రెస్‌ ఒరగబెట్టేదేమీ లేదు.

వనరులను వినియోగించడం కాంగ్రెస్‌కు చేతకాదు.

బిఆర్‌ఎస్‌ గెలిస్తే అభివృద్ధికి తిరుగుండదు.

మెదక్‌ మేలు కోరేది బిఆర్‌ఎస్సే.

మెదక్‌ గడ్డ ఎప్పుడైనా బిఆర్‌ఎస్‌దే

కాంగ్రెస్‌ కాలంలో మెతుకు కోసం ఎడ్చిన సీమ!

కేసిఆర్‌ చలువతో మెదక్‌ పచ్చని పొలాల కోనసీమ!!

హైదరాబాద్‌,నేటిధాత్రి:
ఎన్నికల దగ్గర పడుతున్న కొద్ది బిఆర్‌ఎస్‌ జోరు మరింత పెరుగుతోంది. ముఖ్యంగా మెదక్‌ జిల్లాలో ఆది నుంచి కారు జోరే వుంది. పార్లమెంటు ఎన్నికల్లో ఈసారి కూడా కారుదే హవా కనిపిస్తోంది. ఓ వైపు ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఉమ్మడి సొంత జిల్లా. 2014లో ఆయన కూడా మెదక్‌ నుంచి పోటీ చేసి నాలుగు లక్షల పై చిలుకు రికార్డు మెజార్టీని సాధించారు. ఆ తర్వాత ప్రభాకర్‌రెడ్డి రెండు సార్లు గెలిచారు. ఈసారి బరిలో మాజీ కలెక్టర్‌, ఎమ్మెల్సీ వెంకట్రామ్‌ రెడ్డి బిఆర్‌ఎస్‌ తరుపున బరిలో వున్నారు. వెంకట్రామ్‌రెడ్డికి మెదక్‌ జిల్లాతో ఎంతో అనుబంధం వుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన గ్రూప్‌ ఆఫీసర్‌ గా మెదక్‌ జిల్లాకు వివిధ హోదాలలో సేవలందించారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన సిద్దిపేట,సిరిసిల్ల జిల్లాలకు కలెక్టర్‌గా సేవలందించారు. ఆయన కలెక్టర్‌గా వున్న సమయంలో సిద్దిపేట జిల్లాలో ఎంతో ప్రతిష్టాత్మకమైన మల్లన్న సాగర్‌, రంగనాయక సాగర్‌ల నిర్మాణంలో జరిగింది. వాటి పూర్తికి వెంకట్రామిరెడ్డి కృషి ఎంతో వుందని చెప్పాలి. అధికారిగా ఎంతో మంచి పేరు ఆయనకు వుంది. ప్రభుత్వాలు చేపట్టే పనులు ఎంత సమర్ధవంతంగా పూర్తి చేసే చురుకైన అధికారులల్లో ఒకరుగా గుర్తింపు వుంది. ఆయన ఎక్కడ పనిచేసినా అక్కడ అనేక అవార్డులు, రివార్డులు అందుకుంటుండేవారు. సామాజిక సేవ అంటే ఆయనకు ఎంతో ఇష్టం. అందుకే ఆయన ఉన్నతోద్యోగిగా ఎప్పుడూ పేదల గురించి ఎక్కువగా ఆలోచించేవారు. వారికి మేలు చేసేందుకు కృషి చేసేవారు. అంతటి మంచి పేరున్న వెంకట్రామిరెడ్డి ఇప్పుడు బిఆర్‌ఎస్‌ అభ్యర్ధిగా మెదక్‌ నుంచిపోటీ చేస్తున్నారు. ఒక సమర్ధవంతమైన అధికారిగా వున్న వెంకట్రామిరెడ్డి కలెక్టర్‌గా సిద్దిపేట జిల్లాకు ఎనలేని సేవలు చేశాడు. ఆ గుర్తింపుతోనే కేసిఆర్‌ వెంకట్రామి రెడ్డి చేత రాజీనామ చేయించి, ఎమ్మెల్సీని చేశాడు. గత శాసన సభ ఎన్నికల్లో మళ్లీ బిఆర్‌ఎస్‌ గెలిచి వుంటే, వెంకట్రామ్‌ రెడ్డి మంత్రి అయ్యేవారు. ఎందుకంటే అధికారిగా ఆయనకు వున్న అనుభవం, విసృతమైన సేవల మూలంగా ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు కేసిఆర్‌ తప్పకుండా వెంకట్రామ్‌రెడ్డిని మంత్రిని చేసేవారు. ఇది గత శాసన సభ ఎన్నికల ముందు పెద్ద ఎత్తున జరిగినచర్చ. అంతటి విశిష్ట వ్యక్తిత్వం వున్న వెంకట్రామ్‌ రెడ్డిని ఇప్పుడు కేసిఆర్‌ పార్లమెంటు ఎన్నికల బరిలో మెదక్‌ నుంచి నిలిపారు.
మెదక్‌ జిల్లాలో ఆది నుంచి బిఆర్‌ఎస్‌కు వున్నంత పట్టు ఏ పార్టీకి లేదు.
బిఆర్‌ఎస్‌ ఆవిర్భావం తర్వాత మెదక్‌ ఎంపిసీటును ఎక్కువ సార్లు గెల్చుకున్న పార్టీ బిఆర్‌ఎస్‌. తెలంగాణవచ్చిన తర్వాత మూడుసార్లు కూడా బిఆర్‌ఎస్సే గెల్చుకున్నది. తెలంగాణ వచ్చిన తర్వాత కేసిఆర్‌ బంపర్‌ మెజార్టీతో గెలిచారు. తర్వాత కూడా బిఆర్‌ఎస్‌ గెలుస్తూనే వచ్చింది. మెదక్‌ పార్లమెంటులో బిఆర్‌ఎస్‌కు తప్ప మరో పార్టీకి చోటు లేదు. ఎదుకంటే తెలంగాణ ఉద్యమ కారుడు, తెలంగాణ సాధకుడు, తెలంగాణ ప్రగతి ప్రధాత కేసిఆర్‌. ఆయన తెలంగాణ ఉద్యమం ఉమ్మడి మెదక్‌ జిల్లా నుంచే మొదలు పెట్టారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాను బిఆర్‌ఎస్‌కు కంచుకోటను చేశారు. గత శాసన సభ ఎన్నికల్లో కూడా మెజార్టీ సీట్లు బిఆర్‌ఎస్సే గెల్చుకున్నది. అందువల్ల మెదక్‌లో బిఆర్‌ఎస్‌ అభ్యర్ధి వెంకట్రామ్‌రెడ్డి గెలుపు నల్లేరు మీద నడకే అంటున్నారు. అయితే మెదక్‌లో బిఆర్‌ఎస్‌ను ఎదుర్కొవడం ఏ పార్టీ వల్ల కాదు. అందువల్ల బిఆర్‌ఎస్‌ను మానసికంగా దెబ్బతీసే ఎత్తుగడంలో, వెంకట్రామ్‌రెడ్డి కొంత మంది ఉద్యోగులను కలవడం రాజకీయం చేశారు. ఆ కలయికపై ఎన్నికల సంఘానికి పిర్యాదు చేయడం వంటి, కుట్రలు చేశారు. ఎలాంటి విచారణ లేకుండానే, నిబంధనలు సరి చూసుకోకుండానే ఎన్నికల సంఘం కొంత మంది ఉద్యోగులను అప్పటికప్పుడు సస్పెండ్‌ చేయడం వంటి చర్యలు చకచకా జరిగిపోయాయి. ఆ సమయంలో ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం తప్పని, చెప్పిన ఏకైక పత్రిక నేటిధాత్రి. ఉద్యోగులు ఓటర్లు కాదా…వారు సమావేశమయ్యే హక్కు లేదా? అంటూ నేటిధాత్రి కధనాలు రాసింది. నేటిధాత్రి వార్తను చూసిన ఉద్యోగులు కోర్టును ఆశ్రయించారు. న్యాయం వారి పక్షాన వుంది. ఉద్యోగులకు శభవార్త అందింది. వారికి న్యాయం జరిగింది. దాంతో ఉద్యోగ వర్గాలు బిజేపికి, కాంగ్రెస్‌కు వ్యతిరేకమయ్యారు. ఆ వార్గలు బిఆర్‌ఎస్‌కు మరింత దగ్గరయ్యారు.
ఇక అటు మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్‌, ఇటు మాజీ మంత్రి హరీష్‌రావులకు మెదక్‌ జిల్లా మీద పూర్తి పట్టువుంది.
తెలంగాణ ఉద్యమానికి ముందు కేసిఆర్‌ మంత్రిగా వున్నప్పుడు మెదక్‌ జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ది చేసేందుకు విశేష కృషి చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత అటు ముఖ్యమంత్రి కేసిఆర్‌, ఇటు జిల్లా మంత్రిగా హరీష్‌రావులు ప్రత్యేక దృష్టి పెట్టడంతో మెదక్‌ జిల్లా రూపు రేఖలే మారిపోయాయి. ఒకప్పుడు మెతకు కోసం అల్లాడిన మెదక్‌ జిల్లా అన్నపూర్ణగా మారుతుందని ఎవరూ ఊహించలేదు. కనీసం కల కూడా కనలేదు. కాని మెదక్‌ జిల్లాను అన్ని రంగాలలో ముందు వరసలో నిలబెట్టిన ఘనత కేసిఆర్‌కు, హరీష్‌రావులకే దక్కుతుంది. అయితే కలెక్టర్‌గా ఉమ్మడి మెదక్‌ జిల్లా అభివృద్దిలో వెంకట్రామ్‌ రెడ్డి పాత్ర కూడా వుండడం విశేషం. దాంతో వెంకట్రామ్‌ రెడ్డి ఎక్కడికెళ్లినా ప్రజలు విశేషంగా ఆదరిస్తున్నారు. మెదక్‌ జిల్లా నుంచి మెజార్టీ ఎమ్మెల్యేలు బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలే వుండడం గమనార్హం. అందులో సిద్దిపేట, గజ్వెల్‌, సంగారెడ్డి నియోజవర్గాలు మెదక్‌ పార్లమెంటు పరిధిలోనే వున్నాయి. ఈ మూడు నియోజకవర్గాలు బిఆర్‌ఎస్‌కు కంచుకోటలు. అందువల్ల వెంకట్రామ్‌రెడ్డి ఈ పార్లమెంటు ఎన్నికల్లో గెలుపే కాదు..బంపర్‌ మెజార్టీ సొంతం చేసుకోబోతున్నారన్నవార్తలు వినిపిస్తున్నాయి. గత శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను నమ్మినందుకు ప్రజలకు మూడు నెలల్లోనే అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రజలే స్వయంగా ఆ విషయాలు మీడియాకు వివరిస్తున్నారు. బిఆర్‌ఎస్‌ అధికారుంలో వున్న కాలంలో, ముఖ్యమంత్రి కేసిఆర్‌ రెప్పపాటు కూడా కరంటు పోకుండా నిరంతరం విద్యుత్‌ ప్రసారం చేయడంలో విజయం సాదించారు. దేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా తెలంగాణలో ప్రసరించేంత నాణ్యమైన,నిరంతర కరంటు ఎక్కడా సరఫరా వుండదని అంతర్జాతీయ పత్రికలు కూడా శ్లాఘించాయి. కాని కాంగ్రెస్‌ ఫ్రభుత్వం తెలంగాణలో అదికారంలోకి వచ్చిన మరునాటి నుంచే కరంటు కోతలు మొదలయ్యాయి. సక్రమంగా కరంటు సరఫరా లేకపోవడం మూలంగా పంటలు కూడా ఎండిపోయినట్లు రైతులు ఆరోపించిన సందర్బాలున్నాయి.
ఒకనాడు మెతకు కూడా లేక అల్లాడిన మెదక్‌ జిల్లా నుంచి ఎంతో మంది పార్లమెంటుకు ఎన్నికయ్యారు.
దేశ ప్రధానిగా పనిచేసిన ఇందిరాగాంధీ అమెధీలో ఓడిపోవడం వల్ల పోయిన పరువును కాపాడిని జిల్లా మెదక్‌. అప్పటి ఎంపి. బాగారెడ్డి తన సీటును త్యాగం చేసి, ఇందిరాగాంధీతో మెదక్‌ నుంచి పోటీ చేయించి గెలిపించారు. అయినా ఆమె మెదక్‌ను బాగు చేయలేదు. అలా కాంగ్రెస్‌ పార్టీ ఏనాడు మెదక్‌ జిల్లా ప్రగతిని కాంక్షించలేదు. తెలంగాణకు అడుగడుగునా అన్యాయం చేసిన కాంగ్రెస్‌కు తెలంగాణలో చోటు లేకుండా చేసి, తెలంగాణ రాష్ట్రం సాధించి, అభివృద్ది చేసిన నాయకుడు కేసిఆర్‌. దాంతో మెదక్‌ బిఆర్‌ఎస్‌కు పెట్టని గోడలా తయారైంది. హరీష్‌రావుకు పూర్తి బాధ్యతలు చేపట్టి, మెదక్‌నుంచి మరోసారి కారును గెలిపించేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. వెంకట్రామ్‌రెడ్డికి తోడుగా విసృత ప్రచారం చేస్తున్నాడు. ప్రజలు కూడా వెంకట్రామ్‌రెడ్డిని అంతే విధంగా సాదర స్వాగతం పలుకుతున్నారు. ఆయనకు అభయమిస్తున్నారు. ఖచ్చితంగా గెలిపిస్తామని మాటిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే సాగు నీరివ్వక పదేళ్లు ఇబ్బంది లేని సాగును చిద్రం చేసింది కాంగ్రెస్‌. రైతును గోస పుచ్చుకున్నది కాంగ్రెస్‌. అందుకే మెదక్‌ ప్రజలు మరోసారి కారును పార్లమెంటుకు పంపించేందుకు సిద్దపడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మిగతా రెండు పార్టీలు చేతులెత్తేశాయనే అంటున్నారు.

విముక్తి విధాత…ప్రగతి ప్రధాత!

https://epaper.netidhatri.com/

` అరవై ఏళ్ల అమావాస్య చీకటిని పారద్రోలాడు.

` తెలంగాణ కు వెలుగులు పంచిన సూర్యుడు.

 

`సమైక్య పాలకులు ఎడారి చేస్తే, తెలంగాణ తెచ్చి సస్యశ్యామలం చేశాడు.

`పచ్చదనం లేని తెలంగాణను వన రాష్ట్రం చేశాడు.

` తెలంగాణను హరితహారంతో పచ్చని పందిరి చేశాడు.

`తొండల గుడ్లు తప్ప పంటలా? అన్న చోటును మాగాణం చేశాడు.

`తెలంగాణ కు నీళ్లు తెచ్చి పాడి పంటల సిరులు కురిపించాడు.

`నిత్యం చీకట్లలో గడిపిన తెలంగాణ కు కరంటు జిలుగులు తెచ్చాడు.

`పగలంతా, రేయంతా వెలుగులు నింపాడు.

`రైతుకు ఇరవై నాలుగు గంటల ఉచిత కరంటు ఇస్తున్నాడు.

`ఆసరా ఫెన్షన్లతో పెద్దకొడుకయ్యాడు.

`కళ్యాణ లక్ష్మి తో మామయ్యగా మారాడు.

`తెలంగాణ తెచ్చి తెలంగాణ పితగా కీర్తి నందుకున్నారు.

`మా సారు అని వేనోళ్ల కొనియాడబడుతున్నాడు.

` కేసిఆర్‌ చేతిలోనే తెలంగాణ పదిలమని ప్రజలు నమ్ముతున్నారు.

`మరో సారి కూడా మన సారునే గెలిపించుకుంటామంటున్నారు.

`సారు సర్కారే కావాలనుకుంటున్నారు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

చీకటోళ్ల లోకంలో కొత్త పొద్దు పొడుపురా! అమావాస్య చీకటిలో దీపావళి జాతరా!! అంటూ ఓ కవి రాసిన జీవనచిత్రం సరిగ్గా తెలంగాణ పడిన గోసను తెలియజేస్తుంది. అయితే తెలంగాణకు చీకట్లు సహజంగా రాలేదు. తెలంగాణ చీకటోళ్ల లోకం ఒట్టిగనే కాలేదు. పరాయి పాలకులు పగబట్టి చేశారు. తెలంగాణ జీవితాలను చీకటి చేశారు. బతుకులు ఆగంచేశారు. ఒకనాడు ఎటు చూసినా ఏమున్నది నా తెలంగాణ. ఊర్లన్నీ వలసపోయి, ఇళ్లన్నీ కూలిపోయి, చేతివృత్తులు మాయమైపోయి, దిక్కులేని బతుకుల కాలం చూసి గొడగొడ ఏడ్చిన తెలంగాణ. ఎటు చూసినా బీడువారి నోర్లు తెరిచి నీటి చుక్క కోసం ఎదురుచూసిన తెలంగాణ. దుబ్బలుగా మారి, పంటలకు పనికి రాకుండాపోయిన తెలంగాణ. ఏ చెలక చూసినా ఎడారే…ఏ చెరువు చూసినా మొలిచిన తుమ్మలే…పల్లెల్లో నీటి కటకటలే… సగటు తెలంగాణ వాది కడుపు రగిలినా, ఆకలి ముందు కోపం దిగమింగుకొని బతికిన రోజులవి. నేడు నీటి జాడలకు కొత్త నడకలు నేర్పిన తెలంగాణ. నీటి పరవళ్ల తెలంగాణ. పంటల పరవశంలో తెలంగాణ. కరువు పారిపోయిన తెలంగాణ. బీడుకానరాని తెలంగాణ. చెరువులు బాగు పడ్డ తెలంగాణ. చెరువులు గంగాళాలైన తెలంగాణ. కాళేశ్వరం నీరు కాలువల్లో పరుగులు పెడుతున్న తెలంగాణ. సాగు సస్యశ్యామల తెలంగాణ. పడావు బడ్డ భూముల్లో పుష్కలమైన పంటల తెలంగాణ. పల్లె మురుస్తున్న తెలంగాణ. పచ్చదనం వెల్లివిరిసిన తెలంగాణ. అరవైఏళ్ల గోసను తెలంగాణ పొలిమేరలకు తరిమిన తెలంగాణ. సంక్షేమ తెలంగాణ. సాధికారిత సాధించిన తెలంగాణ. చేతి వృత్తులకు మళ్లీ జీవమైన తెలంగాణ. పల్లెబతుకుల్లో వెలుగులు నిండిన తెలంగాణ. పల్లె మరుస్తున్న తెలంగాణ. పట్నం ప్రగతి తెలంగాణ. పల్లెల్లో వెలుగుల తెలంగాణ. వేకువలో వెండి వెన్నెల తెలంగాణ. ప్రగతి తెలంగాణ. బంగారు తెలంగాణ. పదేళ్లలో దార్శనికుడు కేసిఆర్‌ ఆవిష్కరించిన బంగారు తెలంగాణ. బాగు పడిన తెలంగాణ. బంగారు మాగాణం నా తెలంగాణ. పాడ పంటల తెలంగాణ. పచ్చదనంతో మురుస్తున్న తెలంగాణ.

సమైక్య పాలకుల దాష్టికానికి కకావికలమైన తెలంగాణ కేసిఆర్‌ రూపంలో తిరిగి వెలుగులు నింపుకున్నది.

ఆగమైన చెరువులు నీళ్లునింపుకున్నవి. . ఆనవాలు లేకుండాపోయిన చెరువులు గంగాళాలైనవి. రూపు చెదిరిపోయిన పల్లెలు పండగ చేసుకుంటున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో పరాయి బతుకులైన తెలంగాణ జీవితాలు ఆత్మ గౌరవాన్ని నిలుపుకున్నాయి. పరాయి పాలనలో బిక్కుబిక్కు జీవితాలు వెలుగులు నింపుకున్నాయి. మన రాష్ట్ర్రం మన తెలంగాణ అని తలెత్తుకున్నాయి. నాడు విద్య లేదు.విలువ లేదు. నేడు తెలంగాణ వ్యాప్తంగా 1000 గురుకులాలు. నాడు ఉపాధి లేదు. నేడు తెలంగాణ యువతుక ఐటి కొలువులు. నాడు పంటలకు దిక్కులేదు. నేడు కరువుకు తెలంగాణలో చోటు లేదు. నాడు ఆకలి తీరింది లేదు. నేడు దేశానికి అన్నం పెడుతున్నాం. నాడు కరువు కాటుకు బతికింది లేదు. నేడు కరువునే కాటేసేంత అన్నపూర్ణ అయ్యింది. నాడు కొట్లాడినా లాభం లేదు. పల్లెల్లో ఎండుటాకుల అలజడి…పట్టణాల్లో కానరాని ప్రగతి. ఇదీ నాటి తెలంగాణ దుస్దితి. సమైక్య పాలనలో తెలంగాణ పల్లెల్లో కరంటు లేక, రాక, సాగుకు ఎప్పుడొస్తుందో తెలియక, ఎండుతున్న పంటలను చూసిన విలవిలలాడిన తెలంగాణ.
ఉమ్మడి పాలకుల చీకటి నుంచి తెలంగాణ విముక్తి చెందింది.
కేసిఆర్‌ పట్టుదల ముందు, పంతం ముందు, ఆత్మగౌరవ నినాదం ముందు ముందు, ఉద్యమం ముందు, పోరాటం తట్టుకోలేక సమైక్య పాలన విరగడైంది. తెలంగాణ రాష్ట్రం సిద్దించింది. పారే ఏరు ఎండిపోయి వెక్కిరిస్తుంటే తెలంగాణ గుండె పగిలిపోయింది. ఒట్టిపోయి వాగు చుక్క నీరు మోసుకుపోలేక పోతే కేసిఆర్‌ కంట తడినుంచి కన్నీరొలికింది. ఆ క్షణం జై తెలంగాణ అని ఆ కన్నీరు నినదించింది. కేసిఆర్‌ గొంతులో నుంచి ప్రపంచానికి వినిపించింది. కేసిఆర్‌ కంటి నుంచి జారి పడిన కన్నీటి చుక్క పోరాటం మొదలు పెట్టింది.

ఆ చుక్కే తెలంగాణ భూమిని తడిపేందుకు మొదటి చినుకైంది.

ఆ నాడు ఎత్తిన పిడికిలి కేసిఆర్‌ తెలంగాణ తెచ్చేదాకా విప్పలేదు. ఎత్తిన జెండా దించలేదు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా చలించలేదు. బెదిరింపులకు అదరలేదు. కేసులకు బెదరలేదు. ప్రాణాలను సైతం లెక్క చేయలేదు. తెలంగాణ సాదనే జీవిత పరమావధి చేసుకున్నాడు. తెగించి కొట్లాడి తెలంగాణ తెచ్చి వీరుడయ్యాడు. తెలంగాణ తల రాత మార్చిన విధాతయ్యాడు. పట్టిన పట్టు విడవకుండా, ఒక్కడుగా మొదలై, ఒక్కటే అడుగై, ఒకరినొకరు ఆయనలో అడుగులో అడుగై, లక్షల మంది కేసిఆర్‌లను తయారు చేసిండు. పద్నాలుగేళ్ల నిరంతర పోటారం చేశాడు. రక్తపు చుక్క చిందించకుండా తెలంగాణ సాధించాడు. అరవై ఏళ్ల తెలంగాణ కల నెరవేర్చాడు. తెచ్చిన తెలంగాణ బంగారు తెలంగాణ చేశాడు. సాగుకు ఇరవైనాలుగు గంటల కరంటు ఇచ్చి రైతన్నను రాజునే చేశాడు. నా తెలంగాణ కోటిన్నర సాగు మాగాణ చేశాడు. మిషన్‌ కాకతీయతో 46వేల చెరువులకు మళ్లీ జీవం పోశాడు. కాకతీయుల కాలం కళ్ల ముందుకు తెచ్చాడు. చెరువులన్నీ నిండగ, ఎండాకాలంలో మత్తళ్లు దుంకంగ, వాగులు ఒర్రెలు గోదారి జలాలు పారంగ, జలజలగలగలలు కళ్ల ముందు కదలాడంగా తెలంగాణ నిజప్రపంచమైంది. సంక్షేమంలో మేటిగా అడుగులేస్తోంది. ప్రగతిలో పరుగులు పెడుతోంది.

ఆకుపచ్చ తెలంగాణ ఆవిష్కారమైంది.

మిషన్‌ భగీరధతో తెలంగాణ పల్లెల్లోకి గోదారి పరవళ్లు పరుగులు తీసి, ఆడ పడుచుల కాళ్లు కడుగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ చరిత్రను పదిలం చేసి, పది కాలాలపాటు తెలంగాణకు నీటి గోస తీరింది. సస్యశ్యామల తెలంగాణలో బంగారు సిరులు పండుతున్నాయి. స్వపరిపాలనతో ఆత్మ గౌరవం వెల్లివిరిస్తోంది. నోటితో నవ్వి, నొసటితో వెక్కిరించిన వారు కూడా అబ్బుర పడేలా తెలంగాణ తలెత్తుకొని నిలబడిరది. పల్లెలు ప్రగతికి పట్టుగొమ్మలు. పల్లె వికాసమే దేశ వికామని నాయకులు నమ్మితే చాలు…పల్లె సింగారించుకుంటుంది. పచ్చదనంతో సిరులారబోసుకుంటుంది. పసిడి పంటలకు నెలవౌతుంది. పాడి పంటలకు కొదువ లేకుండాపోతుంది. దేశానికి అన్నం పెట్టే ధైర్యం రైతన్నలో కనిపిస్తుంది. వారి మోములో ఎప్పుడూ చిరునవ్వు తొనికిసలాడుతుంది. సాగు అనగానే పులకించేంది…తరించేది రైతే…ఆ రైతు మేలు కోరిన రాజ్యాలు కళకళలాడాయి.
పల్లె కష్టం, పాడి కష్టం, ఆకలి వేధనలు, ఆక్రందనలు తెలిసిన నాయకుడు పాలకుడైతే కరువు పారిపోతుంది.
కష్టం పొలిమేర దాటి రావాలంటే భయపడుతుంది. సంతోషం ఇంటింటా వెల్లివిరిస్తుంది. అది మన తెలంగాణలా వుంటుంది. పల్లె శోభితమై మురుస్తోంది. పంటల రాశులు చూసి పరవశిస్తుంది. పారుతున్న నీళ్లు, పచ్చని చేలు, సంబురపడుతుంది. పాడి పంటలతో తెలంగాణ కళకళలాడుతోంది. తన కన్నీటి పొరల్లో నాలుగు దశాబ్దాల పాటు దాచుకున్న తెలంగాణ స్వప్నం నిజంచేసిన ముఖ్యమంత్రి కేసిఆర్‌, సువర్ణ పాలనతో స్వర్ణయుగం తెచ్చాడు. బీడు వారిన భూములను సస్యశ్యామం చేశాడు. తొండలు కూడా గుడ్లు పెట్టవని ఎగతాళి చేసిన భూములకు కోట్ల ధరలు పలికేలా చేశాడు. అటు సాగు, ఇటు నీరు, కరంటు, ఉపాధి, సంక్షేమ, ప్రగతి రంగాలన్నీ ఏకకాలంలోనే సాక్ష్యాత్కరించాడు. ఒక్క తెలంగాణలోనే…పచ్చని ప్రకృతిలో తెలంగాణ పుడమి పులకించుతోందిజ తెలంగాణ జాతి సగర్వంగా బతుకుతన్నది. కేసిఆర్‌ చేతుల్లోనే తెలంగాణ పదిలంగా వుంటానని పాఠం నేర్పిస్తోంది.

యుద్ధానికి సిద్ధమైన గులాబీ దళపతి.. క్యాడర్ లో జోష్.. విపక్షాల్లో గుబులు..!!

బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్ గ్రౌండ్ లోకి దిగబోతున్నారు. హ్యాట్రిక్ కొట్టడానికి సుమారు 110 నియోజకవర్గాల్లో కేసీఆర్ ప్రచార సభలు నిర్వహించేలా ప్రణాళిక చేశారు. రోజుకు రెండు, మూడు సభల్లో కేసీఆర్ పాల్గొంటారు. ఈ నెల 15 నుంచి నవంబరు 9 వరకు 41 నియోజకవర్గాల్లో కేసీఆర్ ప్రచార షెడ్యూలును బీఆర్​ఎస్​ ప్రకటించింది. సభలకు భారీగా జన సమీకరణ జరిగేలా బీఆర్​ఎస్​ కసరత్తు చేస్తోంది. ఓ వైపు అభివృద్ధి, సంక్షేమం వివరిస్తూ.. మరోవైపు హామీలు ఇస్తూ.. ఇంకో వైపు కాంగ్రెస్, బీజేపీపై విరుచుకుపడుతూ గులాబీ దళపతి ప్రచారం జరగనుంది.

ఈ నెల 16న జనగామ, భువనగిరి, 17వ తేదీన సిరిసిల్ల, సిద్ధిపేట,18న జడ్చర్ల, మేడ్చల్​లో కేసీఆర్ ప్రచారం నిర్వహించనున్నారు. బతుకమ్మ సంబురాలు, దసరా పండుగ ఉన్నందున ఈ నెల 25 వరకు కేసీఆర్ సభలకు విరామం ఇచ్చారు. ఈ నెల 26న అచ్చంపేట, నాగర్ కర్నూలు, మునుగోడు, 27వ తేదీన పాలేరు, స్టేషన్ ఘన్​పూర్​లో బహిరంగ సభలు ఉంటాయని బీఆర్​ఎస్​ తెలిపింది. ఈ నెల 29న కోదాడ, తుంగతుర్తి, ఆలేరు, 30న జుక్కల్, బాన్సువాడ, నారాయణఖేడ్, 31వ తేదీన హుజూర్ నగర్, మిర్యాలగూడ, దేవరకొండలో కేసీఆర్ ప్రచారం నిర్వహిస్తారు.

నవంబరు 1న నిర్మల్, బాల్కొండ, ధర్మపురి, 3వ తేదీన భైంసా, ఆర్మూర్, కోరుట్ల, 5న కొత్తగూడెం, ఖమ్మం సభల్లో సీఎం పాల్గొంటారు. నవంబరు 6న గద్వాల, మక్తల్, నారాయణపేట, 7న చెన్నూరు, మంథని, పెద్దపల్లి, 8వ తేదీన సిర్పూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లిలో గులాబీ దళపతి సభల్లో ప్రసంగిస్తారు. నవంబరు 9న గజ్వేల్, కామారెడ్డిలో కేసీఆర్ నామినేషన్లు వేస్తారు. తన సెంటిమెంట్ ప్రకారం కోనాయపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి మధ్యాహ్నం ఒంటిగంటకు గజ్వేల్​లో కేసీఆర్ నామినేషన్ వేయనున్నారు.

ప్రతీ సభలోనూ సుమారు గంట పాటు కేసీఆర్ ప్రసంగించనున్నారు. ఎన్నికల ప్రసంగాలపై బీఆర్​ఎస్​ అధినేత ప్రత్యేక కసరత్తు చేస్తున్నారు. తొమ్మిదేళ్లలో రాష్ట్ర ప్రగతి, సంక్షేమాన్ని వివరించి.. మళ్లీ అధికారంలోకి వస్తే చేయనున్న పథకాలపై హామీ ఇవ్వనున్నారు. జాతీయ, రాష్ట్ర అంశాలతో పాటు.. నియోజకవర్గానికి సంబంధించిన పలు అంశాలను ప్రత్యేకంగా ప్రసంగాల్లో ప్రస్తావించనున్నారు. మరోవైపు కాంగ్రెస్, బీజేపీలపై విమర్శనాస్త్రాలతో గులాబీ దళపతి విరుచుపడేలా బహుముఖ వ్యూహంతో ప్రసంగాలు కొనసాగనున్నాయి.

https://youtube.com/shorts/adGjxOiLdeE?si=U6o02sX0Oqj8LiTz

తెలంగాణలో కారు జోరు హ్యాట్రిక్ దిశగా పరుగులు

మరికొద్దిరోజుల్లో అసెంబ్లీ ఎన్నికల యుద్ధం మొదలుకాబోతుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు… వ్యూహలు, ప్రతివ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి. పోటీలో నిలిచి గెలిచే వారి జాబితాను కూడా రెడీ చేసుకునే పనిలో పడ్డాయి. కీలకమైన స్థానాల విషయంపై కూడా మేథోమథనం చేస్తున్నాయి. ప్రత్యర్థిని ఢీకొట్టే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఎన్నికల యుద్ధం కోసం ఇప్పటికే 115 మంది అభ్యర్థులను ప్రకటించి… టాప్ గేర్ వేసేసింది గులాబీ పార్టీ. ఓవైపు అసంతృప్తులను లైన్ లోకి తీసుకొచ్చే పనిలో ఉండగానే… మరోవైపు ప్రచారాన్ని షురూ చేసేసింది.

కేటీఆర్, హరీశ్‌రావు సుడిగాలి పర్యటనలతో జోష్ పెంచారు. ఓవైపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థానలు.. మరోవైపు పార్టీ కార్యక్రమాలతో కొన్ని నెలలుగా క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వస్తోంది. మిగతా పార్టీల కన్నా ముందుగానే ఒకేసారి 115 అభ్యర్థులను ప్రకటించింది. అభ్యర్థులను ప్రకటించిన తర్వాత కేటీఆర్ కొన్ని రోజులు అమెరికా పర్యటనలో ఉండటం.. ఆ తర్వాత జమిలి ఎన్నికలపై ప్రచారం నేపథ్యంలో కొన్ని రోజులు స్తబ్దుగా కనిపించింది. వారం రోజుల్లో ఎన్నికల షెడ్యూలు విడుదల కావచ్చునన్న ప్రచారంతో బీఆర్ఎస్ ఒక్కసారిగా వేగం పెంచింది.

ఇద్దరు మంత్రులు సుమారు 50 నియోజకవర్గాల్లో పర్యటించారు. ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూనే రాష్ట్ర, జాతీయ రాజకీయాలపై వాడివేడి ప్రసంగాలు చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీని మళ్లీ ఆశీర్వదించాలంటూ కోరుతున్నారు. కాంగ్రెస్, బీజేపీలపై కేటీఆర్, హరీశ్​రావు విరుచుకు పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కాలం చెల్లిందని.. వారంటీ లేని ఆ పార్టీ చెబుతున్న గ్యారంటీలను ఎవరు నమ్ముతారని చురకటిస్తున్నారు. బీజేపీకు మతం తప్ప మరో అంశం తెలియదని మండిపడుతున్నారు.

ఇక టికెట్లు దక్కని నేతలకు హామీలు ఇస్తున్నారు గులాబీ పెద్దలు. ఇప్పటికే పలు నామినేటెడ్ పదవులను భర్తీ చేయగా… మరికొన్నింటిని కూడా భర్తీ చేయాలని చూస్తోంది గులాబీ దళం. ఇక ఇప్పుడు కుదరకపోతే మరోసారి అధికారంలోకి రాగానే అవకాశాలు ఇస్తామనే భరోసా కల్పిస్తున్నారు. విబేధాలు పక్కన పెట్టి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని సూచిస్తున్నారు. ఈ విషయంలో కేటీఆర్, హరీశ్ రావు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఇద్దరు నేతలు… మరిన్ని నియోజకవర్గాల్లో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు. మొత్తంగా చూస్తే.. హ్యాట్రిక్ విక్టరీనే లక్ష్యంగా బీఆర్ఎస్ అడుగులు వేస్తోంది.

అక్టోబర్ 15న హుస్నాబాద్ బహిరంగ సభలో బీఆర్ఎస్ పార్టీ మానిఫెస్టో ప్రకటించనున్న కేసీఆర్

అక్టోబర్ 15వ తేదీన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో, తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం
.. అదేరోజు అభ్యర్థులకు బీ ఫారాలను అందించి పార్టీ మేనిఫెస్టో విడుదల

నవంబర్ 9న రెండు చోట్ల నామినేషన్ వేయనున్న కేసీఆర్

అక్టోబర్ 15, 16, 17, 18 తేదీల్లో జిల్లాలు, నియోజకవర్గాల పర్యటన.

అక్టోబర్ 15న హైద్రాబాద్ నుంచి బయలుదేరి., హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సాయంత్రం 4 గంటలకు సీఎం కేసీఆర్ పాల్గొంటారు.

తెల్లారి…అక్టోబర్ 16 నాడు జనగామ, భువనగిరి నియోజకవర్గాల కేంద్రాల్లో బహిరంగ సభలో సిఎం పాల్గొంటారు.

17న సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించే బహిరంగ సభలో సిఎం కేసీఆర్ గారు పాల్గొంటారు.

అక్టోబర్ 18 నాడు.. మధ్యాహ్నం 2 గంటలకు జడ్చర్ల నియోజకవర్గ కేంద్రం లో., అదే రోజు సాయంత్రం 4 గంటలకు మేడ్చల్ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించే బహిరంగ సభల్లో సిఎం పాల్గొంటారు.

తెలంగాణ స్వాభిమాన పతాక

https://epaper.netidhatri.com/

`స్వావలంబన అభిమాన గీతిక.

`తెలంగాణ ప్రగతి ఆత్మ గౌరవ ప్రతీక.

` కేంద్ర సాయం మీద ఆధారపడకుండా నిలిచిన వేధిక.

`విభజన హామీలు అమల కోసం ఎదురు చూడకుండా ఎదిగిన అభివృద్ధి నమూన.

` కేసిఆర్‌ నిరంతర శ్రమ..అహర్నిశలు పడిన తపన.

`ఇంత వేగవంతమైన అభివృద్ధి ఒక్క కేసిఆర్‌ తోనే సాధ్యమైంది.

`ఉమ్మడి పాలకులు పీల్చి పిప్పి చేశారు.

`పదేళ్లలో కేసిఆర్‌ నిలబెట్టి చూపించారు.

`తెలంగాణ బాగు పడడం గిట్టని వాళ్ల కళ్లు కుళ్లుకుంటున్నాయి.

`తెలంగాణను దోచుకోవాలని చూస్తున్నాయి.

`తెలంగాణకు మళ్ళీ పాత రోజులు తేవాలని చూస్తున్నాయి.

తెలంగాణ పోరాటి సాధించుకున్న ఆత్మ గౌరవ పతాక. స్వాభిమాన వీచిక. గుండె ధైర్యం నిండిన విజయ వేధిక. ఉద్యమమే నినాదమైన, తెలంగాణ పదమే వేదమైన కరదీపిక. దేశానికే వెలుగు రేఖ. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల స్వావలంబన గీతిక. ఇంత గొప్పది నా తెలంగాణ. ఆ తెలంగాణ రావడానికి, నేడు బంగారు తెలంగాణ నిర్మాణం జరిగింది ఒక్కరితోనే. ఆ ఒక్కరే ముఖ్యమంత్రి కేసిఆర్‌. అసలు తెలంగాణ అంటేనే పోరాటాల గడ్డ. ఆత్మాభిమాన ఉద్యమ బాట. తెలంగాణకు పోరాటం కొత్త కాదు. గెలవడం కొత్త కాదు. సమస్యలు కొత్త కాదు. వాటిని అధిగమించడం కొత్త కాదు. గెలిచి నిలబడిన చరిత్ర కొత్త కాదు. ఎప్పుడూ ఏదో ఒక చరిత్ర సృష్టించడమే తెలంగాణ గొప్పదనం. ప్రపంచ దేశాలకే పోరాట విలువలు నేర్పిన ఏకైక ప్రాంతం తెలంగాణ. నిజాం కాలంలో రైతంగా సాయధ పోరాటమైనా, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమమైనా వ్యవస్ధలకు పట్టుదలను రుచి చూపించిన నిఘంటువు నా తెలంగాణ. భూమికోసం , భుక్తి కోసం, బానిస సంకెళ్ల విముక్తికోసం పోరాటాలు ఎన్ని జరిపినా అలసిపోలేదు. అలాగే అభివృద్దిలోనూ ఆగిపోలేదు. పోరాటమైనా, ప్రగతి దారైనా ముందుకే. తెలంగాణ ఎవరి సహాకారం కోరదు. తెలంగాణ ఎవరి మీద ఆధారపడదు. ఇది నిరూపించిన నాయకుడు ముఖ్యమంత్రి కేసిఆర్‌.
తెలంగాణ రాక ముందు ఉద్యమ సమయంలో సీమాంధ్ర నేతలు ఎన్ని మాటలు అన్నారో విన్నాం.
తెలంగాణ వచ్చిన తర్వాత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గత పదేళ్లుగా తెలంగాణ గురించి మాట్లాడుతున్న మాటలు వింటున్నాం. అయినా ఎక్కడా వెరవలేదు. ఆగిపోలేదు. అలసిపోలేదు. దేశంలో అన్ని రాష్ట్రాలను దాటకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఏనాడో గుజరాత్‌ను వెనక్కి నెట్టేశాం. ఇదే బిజేపికి నచ్చని విషయం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును బిజేపి సహకరించిందన్న మాట మినహా…2014 నుంచి తెలంగాణ కోసం కేంద్రం ఏ సహాయం చేయలేదన్నది తెలుసుకోవాలి. 2014 ఎన్నికల్లో సాక్ష్యాత్తు తిరుమల వెంకటేశ్వర స్వామి కొండ కింద ప్రధాని మోడీ మాట్లాడుతూ తల్లిని చంపి బిడ్డను బ్రతికించారని అన్నారు. ఆ తర్వాత ఆ మాటను అనేక మార్లు ఉటంకించారు. అవకాశం దొరికనప్పుడల్లా తెలంగాణ మీద విషం కక్కారు. తెలంగాణ ఏర్పాటు కావడం తనకు ఇష్టం లేదన్నంతగా పరక్ష వ్యాఖ్యలు చేశారు. 1998లో కాకినాడలో జరిగిన బిజేపి పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలలో ఒక ఓటు రెండు రాష్ట్రాలు అంటూ తీర్మాణం చేసి, ఉత్తరాధిన మూడు రాష్ట్రాలు ఇచ్చింది. కాని తెలంగాణను వదిలేసింది. నిజానికి బిజేపి ప్రభుత్వ హాయంలో ఇచ్చిన మూడు రాష్ట్రాలకన్నా ముందు నుంచి సాగుతున్న ఉద్యమం తెలంగాణది. 1956లోనే నాటి ప్రధాని నెహ్రూ తెలంగాణ ప్రజలు వద్దనుకున్న నాడు ప్రత్యేకమైపోవచ్చు. అని కూడా చెప్పారు. కాని ఆయన హయాంలో కుదరలేదు. ఆ తర్వాత ఇందిరాగాంధీ ఇవ్వలేదు. ఎవరూ ఇవ్వలేదు. ఆఖరకు ముఖ్యమంత్రి కేసిఆర్‌ సారధ్యంలో సాగిన పద్నాలుగేళ్ల నిరంతర పోరాటం తర్వాత తెలంగాణ వచ్చింది. దీన్ని కూడా ప్రధాని నరేంద్ర మోడీ జీర్ణించుకోవడం లేదు. గతంలో పాత పార్లమెంటులో పలుసార్లు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తప్పుపట్టారు. ఆఖరుకు ఇటీవల కొత్త పార్లమెంటు తొలి రోజున కూడా తెలంగాణ రాష్ట్రం ఇవ్వడంతో రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు సంతోషంగా లేరన్నారు. ఇదే ఒక ప్రధాని చేయాల్సిన వ్యాఖ్యలు. అయినా సరే తెలంగాణ ప్రజలు భరిస్తూనే వున్నారు.
ఇక తెలంగాణ ఇస్తే చిమ్మ చీకట్లౌతుందని సీమాంధ్ర నేతలు అన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి అసలు తెలంగాణ మనుగడే సాధ్యం కాదన్నారు. తెలంగాణ వస్తే ఇక అంధకారమే అంటూ కర్ర పట్టుకొని చీకట్లో నిలబడి కరంటు లెక్కలు చెప్పాడు. ఇప్పుడు ఆ కిరణ్‌కుమార్‌ రెడ్డే తెలంగాణ వెలుగులను చూస్తున్నారు. తెలంగాణ వస్తే కనీసం పెండిరగ్‌ ప్రాజెక్టులు కూడా పూర్తి చేసుకోలేరనాన్నరు. హైదరాబాద్‌లో మత కల్లోలాలు వస్తాయన్నారు. అసలు తెలంగాణ భూములు తొండలు గుడ్లు పెట్టడానికి కూడా పనికిరావన్నారు. ఇలా ఎవరికి ఇష్టమెచ్చినట్లు వాళ్లుమాట్లాడారు. తెలంగాణ పూర్వ చరిత్ర ఏమిటో తెలుసుకోకుండా ఎవరికి తోచించి వారు మాట్లాడారు. కాని తెలంగాణకు ఒక చరిత్ర వుంది. తొలి తెలుగు చరిత్ర మొదలైందే తెలంగాణలో…కరీంనగర్‌ జిల్లాలోని కోటి లింగాలలోనే తొలి శాతవాహన చరిత్రకు శ్రీకారం జరిగింది. ఆ తర్వాతే ధాన్య కటకానికి వెళ్లింది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ చరిత్రను కనుమరుగు చేశారు. అలా మొదలైన తెలంగాణ ప్రస్తానం కాకతీయ కాలంలో ఉచ్చదశకు చేరుకున్నది. సంపన్న ప్రాంతమై విలసిల్లింది. సుమారు 300 సంవత్సరాలకు పైగా సాగిన కాకతీయ చరిత్రలోనూ తెలంగాణది స్వర్ణయుగమే. ఆ తర్వాత మొగలులపాలనైనా, నిజాం పాలన దాకా తెలంగాణలో కరువు లేదు. ఎందుకంటే నిజం కాలంలో హైదరాబాద్‌ వజ్రాల వ్యాపారానికి పేరెన్నిక కగన్నది. లండన్‌ మహారాణికి అత్యంత విలువైన వజ్రాల హారాన్ని బహూకరించింది నిజాం రాజు. లండన్‌ వీధుల్లో తిరిగే రోల్స్‌ రాయిస్‌ కార్లతో హైదరాబాద్‌ వీధులు ఊడిపించిన చరిత్ర తెలంగాణది. అలాంటి తెలంగాణపై ఎవరు వ్యాఖ్యలు చేసినా వాళ్లే చరిత్ర హీనులయ్యారు.
అలాంటి తెలంగాణను తెచ్చింది కేసిఆర్‌. నిలబెట్టింది కేసిఆర్‌.
పదేళ్లలో తెలంగాణ ప్రగతి రాకెట్‌ కన్నా వేగంగా దూసుకెళ్లింది. అసలు తెలంగాణలో తాగు నీరే దొరకదు. ఇక సాగు నీటి సంగతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదన్నారు. అలాంటి తెలంగాణలో కేంద్రం నుంచి రూపాయి సాయం లేకున్నా,ఎలాంటి సహాకారం లేకున్నా కాళేశ్వరం లాంటి అధ్భుతమైన ప్రాజెక్టును ఎవరూ ఊహించని రీతిలో నిర్మాణం జరిగింది. తెలంగాణ మొత్తం సస్యశ్యామం చేసేందుకు కారణమైంది. అసలు తెలంగాణ సాధించిన మూడేళ్లకే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు పూర్తి చేయడం అంటే మాటలు కాదు. మంత్రి హరీష్‌రావు రాత్రింబవళ్లు పర్యవేక్షణ, ముఖ్యమంత్రి కేసిఆర్‌ పరిశీలన, అంకిత భావం వున్న తెలంగాణ ఇంజనీరింగ్‌ వ్యవస్ధ కలిసి సృష్టించిన భగీరధ నిర్మాణం కాళేశ్వరం. అదే సమయంలో నిర్మాణం మొదలైన పోలవరం అక్కడే ఆగిపోయింది. కాళేశ్వరం పూర్తి చేసుకున్న తర్వాత మొదలు పెట్టిన పాలమూరు..రంగారెడ్డి కూడా పూర్తియ్యింది. దాంతో తెలంగాణ మొత్తం నీటి గంగాలమైంది. వీటి నిర్మాణం సాగుతుండగానే తెలంగాణలోని నలభై ఆరు చెరువులకు పూర్వ వైభవం తేవడం జరిగింది. అనేక రిజర్వాయ్యర్లు నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఎన్నేళ్ల కలగానో మిగిలిపోయిన మానేరు ప్రాజెక్టులన్నీ పూర్తయ్యాయి. ఖమ్మంలో సీతారామా లాంటి ప్రాజెక్టులు కూడా నీళ్లందిస్తున్నాయి. నీటి చుక్కకు కోసం కన్నీళ్లు కార్చిన తెలంగాణ కళ్లలో ఆనందభాష్పాలు చూస్తున్నామంటే అది కేసిఆర్‌. ఆయన సాగునీటి రంగాన్ని, వ్యవసాయ రంగాన్ని ఒక యజ్ఞంగా చేపట్టారు. తెలంగాణ మొత్తం నీరందించి, సస్యశ్యామలం చేశారు. ఇక కరంటు కష్టాలు తెలంగాణ తెచ్చిన మూడు నెలల్లో తీర్చాడు. రైతాంగానికి దేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటల కరంటు ఇస్తున్నారు. హైదరాబాద్‌ను పెట్టుబడుల స్వర్గధామం చేశాడు. ప్రపంచమంతా హైదరాబాద్‌ వైపు చూసేలా చేశాడు. ఐటి రంగానికి కేరాఫ్‌ చేశాడు. పార్మా రంగంలో తెలంగాణను అగ్రగామి చేశాడు. హైదరాబాద్‌లో ట్రాపిక్‌ సమస్యకు పరిష్కారం చూపెట్టారు. ఈ పదేళ్ల కాలంలో 37 కొత్త ప్లైఓవర్లు నిర్మాణం చేశారు. కొత్త కొత్త నిర్మాణాలు చేసి, హైదరాబాద్‌ రూపు రేఖలు మార్చేశారు. కొత్త సెక్రటెరియేట్‌, ముప్పై మూడు జిల్లాల్లో కొత్త జిల్లా కలెక్టర్ల సముదాయ భవనాలు. అమర వీరుల స్మృతి వనం. 125 అడుగుల అంబెద్కర్‌ విగ్రహంతో కొత్త హైదరాబాద్‌ను ఆవిష్కరించారు. తెలంగాణను ఆరోగ్యవంతమైన రాష్ట్ర్రంగా తీర్చిదిద్దుతున్నారు. 33 జిల్లాల్లో కొత్తగా వైద్య విద్యాలయాలు ఏర్పాటుచేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే కేంద్రం సహాకారం లేకుండా, పైసా సాయం లేకుండా నిలబడిరది తెలంగాణ. దాన్ని రూప శిల్పి ముఖ్యమంత్రి కేసిఆర్‌. ఆయన పేరే ఒక బ్రాండ్‌. హైదరాబాద్‌ ఇప్పుడు సరికొత్త ట్రెండ్‌. దటీజ్‌ తెలంగాణ…దిసీజ్‌ ముఖ్యమంత్రి కేసిఆర్‌ పాలన. ఎనీ డౌట్‌!

(PRLIS) సీఎం కేసీఆర్ ప్రారంభించడంతో పాలమూరుకు కొత్త అధ్యాయం

నీటి ఎద్దడి ఉన్న ప్రాంత ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ, సీఎం కేసీఆర్ తన కీలకమైన వెట్ రన్‌ను ప్రారంభించి, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అత్యధిక శక్తితో కూడిన 145-మెగావాట్ల పంపింగ్ సిస్టమ్‌లలో ఒకదానిని ఆన్ చేశారు.

దేశంలోని అత్యంత వెనుకబడిన ప్రాంతాలలో ఒకటైన దక్షిణ తెలంగాణ పరివర్తనలో కొత్త దశకు తెరతీసిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు శనివారం మెగా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌ను ప్రారంభించారు. నీటి కొరత ఉన్న ప్రాంత ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ, అతను అధిక శక్తితో కూడిన 145-మెగావాట్ల పంపింగ్ సిస్టమ్‌లలో ఒకదానిని ఆన్ చేశాడు, ఇది ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఉపయోగించబడింది, దాని కీలకమైన వెట్ రన్‌ను ప్రారంభించింది.

శ్రీశైలం ప్రాజెక్టు ఆఫ్‌షోర్‌ పాయింట్‌ నుంచి 3,200 క్యూసెక్కులకుపైగా నీటిని తీసి, మముత్‌ టన్నెల్‌ సిస్టమ్‌, సర్జ్‌ పూల్‌ ద్వారా రూ. 35,000 కోట్ల ప్రాజెక్టులో స్టేజ్‌-1లో భాగంగా నిర్మించిన అంజనగిరి రిజర్వాయర్‌లోకి పంపింగ్‌ చేశారు. ప్రాజెక్టు వద్దకు భారీగా తరలివచ్చిన జనం సంబరాల్లో మునిగిపోయారు. అవిభాజ్య రాష్ట్రంలో ఒకప్పుడు నీరు, జీవనోపాధి కోసం లక్షలాది మంది ప్రజలు వలసలు వెళ్లడాన్ని చూసిన పాలమూరు విషయంలో ఆయన చూపిన నిబద్ధతకు ముఖ్యమంత్రిని కీర్తిస్తూ నినాదాలు చేశారు.

ఆరు రిజర్వాయర్లతో ఐదు దశల్లో నిర్మించిన ఈ ప్రాజెక్ట్ మొదటి దశలో ఆరు జిల్లాల్లో విస్తరించి ఉన్న 1220 గ్రామాలకు తాగునీటి సరఫరా కోసం 7.15 టీఎంసీల నీటిని ఇవ్వడానికి ఉద్దేశించబడింది. అన్ని అనుమతులు పొందడం ద్వారా రెండవ దశలో 73 టిఎంసిల నీటితో నీటిపారుదల అవసరాలను తీర్చడానికి ఇది ఒక నిబంధనను కలిగి ఉంది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version