తోట సుధాకర్ కు పలువురి పరామర్శ…

తోట సుధాకర్ కు పలువురి పరామర్శ

నడికూడ,నేటిధాత్రి:

 

 

టియూడబ్ల్యూజేే జిల్లా ప్రధాన కార్యదర్శి,ప్రజాపక్షం ఉమ్మడి వరంగల్ జిల్లా బ్యూరో ఇంచార్జ్ తోట సుధాకర్ మాతృమూర్తి తోట వెంకటమ్మ ఇటీవల మృతి చెందగా గురువారం పలువురు సుధాకర్ తో పాటు వారి కుటుంబ సభ్యులను పలువురు పరామర్శించారు.ఈ సందర్భంగా హవ్రాను జిల్లా నడికూడ మండలం చౌటుపర్తి గ్రామానికి చేరుకుని తొలుత తోట వెంకటమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వెంకటమ్మ చిత్ర పటానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన వారిలో సీపీఐ,బీసీ హక్కుల సాధన సమితి నాయకులు, జర్నలిస్టు నాయకులు ఉన్నారు.పరామర్శించిన వారిలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి,బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్రంలో కార్యదర్శి ఎన్. రాజమౌళి,వరంగల్ జిల్లా నాయకులు పనాస ప్రసాద్, ల్యాదెళ్ల శరత్,సీనియర్ జర్నలిస్టులు ఎస్.శోభన్ బాబు,వెంకట్,మారుతి, ముత్యాల రఘు, కనకరాజు,పి.కిషోర్ కుమార్,టి.రజినీకాంత్,జిల్లా కార్యవర్గ సభ్యులు తాళ్ల రవి తదితరులు ఉన్నారు.

మెట్ పల్లి‌లో జర్నలిస్ట్ అక్రిడిటేషన్ కోసం బిజెపి డిమాండ్…

జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని బిజెపి కార్యాలయంలో బిజెపి సీనియర్ నాయకులు చిట్నేని రఘు విలేకరుల సమావేశం
మెట్ పల్లి సెప్టెంబర్ 27 నేటి దాత్రి

కోరుట్ల నియోజకవర్గం ప్రజలందరికీ దసరా బతుకమ్మ దీపావళి శుభాకాంక్షలు
జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డులు హెల్త్ కార్డుల వెంటనే ప్రభుత్వం జారీ చేయాలని
తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండు సంవత్సరాలు అవుతున్న జర్నలిస్టు అక్రిడేషన్ ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందింది
ఎలక్షన్ ముందు జర్నలిస్ట్ ల సంక్షేమం కోసం కాంగ్రెస్ జర్నలిస్ట్ లకు ఎన్నో హామీలు ఇచ్చింది కనీసం ఒక్క హామీ కూడనెరవేర్చలేదుజర్నలిస్టులకు వెంటనే కొత్త అక్కడేషన్ కార్డు ఇవ్వాలి జర్నలిస్టుల హెల్త్ కార్డులు రాష్ట్రవ్యాప్తంగా పలు సమస్యలతో ఉన్నవి ఆ సమస్యలను వెంటనే పరిష్కరించాలి ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చే ఒకే ఒక్క అవకాశం అక్రిడేషన్ మాత్రమే అది కూడా ఇవ్వకపోవడం దురదృష్టకరం జర్నలిస్టుల కుటుంబాలకు అందరికీ బస్సు పాస్ లు స్టేట్ పాస్ ఇవ్వాలి వెంటనే హెల్త్ కార్డులు జారీ చేసి హెల్త్ కార్డులో ఉన్న సమస్యలు అన్నీ తీర్చాలి ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యదర్శి పీసు రాజేందర్ బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శిలు సుంకేటి విజయ్ కుడుకల రఘు బీజేవైఎం నాయకులు గోపనవేని రమేష్ యాదవ్ చెక్కల శ్రీకాంత్ కోసగంటి మహేష్ తదితరులు పాల్గొన్నారు.

*ప్రజలను చైతన్య పరచడంలో మీడియాది ముఖ్యపాత్ర..

*ప్రజలను చైతన్య పరచడంలో మీడియాది ముఖ్యపాత్ర..

*కుటుంబాన్ని పక్కనబెట్టి సమాజం కోసం కృషి చేసే నిజమైన కార్మికులు జర్నలిస్టులు..

*తుడా ఛైర్మెన్ డాలర్స్ దివాకర్ రెడ్డి..

తిరుపతి(నేటిధాత్రి)సెప్టెంబర్
10:

 

 

 

వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబాన్ని, పక్కనబెట్టి సమాజ శ్రేయస్సు తమ కర్తవ్యం గా భావించి పనిచేసే నిజమైన కార్మికులు జర్నలిస్టులని తుడా చైర్మన్, టిటిడి బోర్డు సభ్యులు డాలర్స్ దివాకర్ రెడ్డి అన్నారు. ఆధునికరించిన తిరుపతి ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవానికి తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు, జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు, శ్యాప్ చైర్మన్ రవి నాయుడు, నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య, టిటిడి బోర్డు సభ్యులు భాను ప్రకాశ్ రెడ్డి, హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ పసుపులేటి హరి ప్రసాద్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుడా చైర్మన్ మాట్లాడుతూ కార్పొరేట్ స్థాయిలో తిరుపతి ప్రెస్ క్లబ్ ను ఆధునికరించడం సంతోషంగా ఉందన్నారు. మొదటినుంచి మీడియా మిత్రులు తన సోదరులుగా భావించి వారి కష్టసుఖాల్లో భాగస్వామ్యం అవుతున్నానని ఇకపై కూడా వారితో కలిసి ప్రయాణం చేస్తానని స్పష్టం చేశారు. ప్రజలను చైతన్యపరచడంలో మీడియా ముఖ్యపాత్ర పోషిస్తోందన్నారు. యువత చెడుదారి పట్టుకున్న వారిని మంచి మార్గంలో నడిపే బాధ్యతను మంచి కథనలతో మీడియా తీసుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ను అన్నిరంగల్లో భారత దేశంలో మొదటి స్థానంలో నిలపడానికి మీడియా కృషి చేయాలని సూచించారు. తిరుపతి మీడియా మిత్రులకు ప్రెస్ క్లబ్ కు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తాను ముందుంటానని హామీ ఇచ్చారు,
ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ కమిటీ తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డిని ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు..

పార్టీవ దేహానికి నివాళులర్పించిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం..

పార్టీవ దేహానికి నివాళులర్పించిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

V6 రిపోర్టర్ అయ్యుబ్ ఖాన్ సోదరుడు అహ్మద్ ఖాన్ అనారోగ్యంతో మంగళవారం మరణించిన విషయం తెలిసి ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం పట్టణంలోని ఈద్గా వద్దకు వెళ్లి వారి మృతదేహాన్నీ సందరర్శించి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియజేసారు,మాజీ కౌన్సిలర్ అబ్దుల్లా,ఆతార్ అహ్మద్ ఏఐఎంఐఎం నాయకులు, జర్నలిస్ట్ లు మహబూబ్, కరీం,తదితరులు ఉన్నారు,

సిరిసిల్ల మానేరు రచయితల సంఘం ఆధ్వర్యంలో కాళోజి జయంతి వేడుకలు…

సిరిసిల్ల మానేరు రచయితల సంఘం ఆధ్వర్యంలో కాళోజి జయంతి వేడుకలు

సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)

 

 

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈ రోజు మానేరు రచయితల సంఘం ఆధ్వర్యంలో మహతి కళాశాలలో మానేరు రచయితల సంఘం అధ్యక్షులు గెంట్యాల భూమేష్ తెలంగాణ ప్రజాకవి కాళోజి జయంతి సందర్భంగా కళాశాలలోని విద్యార్థులకు తెలంగాణ భాష దినోత్సవం పురస్కరించుకొని కాళోజి జయంతి వేడుకను పురస్కరించుకొని తాను మాట్లాడుతూ తెలంగాణ యాస భాష మన కాళోజీ అని నిజాం, నిరంకుశత్వానికి ఎదురుతిరిగిన కవితల యోధుడని, మా భాష,మన అస్తిత్వం, మన నేల భూమి మన తెలంగాణ పోరాటం అని తెలిపారు.అందులో భాగంగా ఆడెపు లక్ష్మణ్ మాట్లాడుతూ రాబోయే తరాలకు మన భాష మన ఆస్తిత్వం ఎంతో ఉపయోగమని అలాంటి ఈరోజున తెలుగు భాషా దినోత్సవం కాళోజి జయంతి వేడుక మనకెంతో గర్వకారణం అని తెలిపారు.
కవి రచయిత బూర దేవానందం కాళోజి పై కవిత గానం చేశారు. ఈ కార్యక్రమంలో మానేరు రచయితల సంఘం గౌరవ సలహాదారులు, అధ్యక్షులు జర్నలిస్టు టీవీ నారాయణ,చిటికెన కిరణ్ కుమార్, అల్లే రమేష్, కామవరపు శ్రీనివాస్, పోకల సాయికుమార్, ఎండి ఆఫీస్, అధ్యాపకులు వేణు,అంకారపు రవి కవులు,రచయితలు మరియు మహతి కళాశాల విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.

జర్నలిస్టులను తిట్టిన బెదిరించిన ఐదేళ్లు కఠిన శిక్ష…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-09T123112.547.wav?_=1

 

జర్నలిస్టులను తిట్టిన బెదిరించిన ఐదేళ్లు కఠిన శిక్ష

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

జర్నలిస్టులను తిట్టిన బెదిరించిన 50,000 వేల జరిమానా మరియు ఐదేళ్లు కఠిన కారాగార శిక్ష: అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు..
దేశంలోని వర్కింగ్ జర్నలిస్టులు. పాత్రికేయులను బెదిరించిన. తిట్టిన లేదా కొట్టిన. 50, వేల జరిమానా మరియు ఐదేళ్లు కఠిన కారాగార శిక్షకు వారు అర్హులవుతారని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది..
ఈ మేరకు గురువారం ఓ కేసు విచారణ సందర్భంగా స్పష్టం చేసింది. ఈ తీర్పుతో పలువురు జర్నలిస్టులు. తమ వృత్తిపరంగా ఎలాంటి భయాందోళనకు గురికా కుండా నిర్భయంగా ప్రజలకు వాస్తవ సమాచారం అందించే అవకాశం ఉంటుందని పలు జర్నలిస్టు సంఘాల నేతలు. సీనియర్ జర్నలిస్టులు ఈతీర్పును ఆహ్వానించారు.అలాగే రాజకీయ నాయకుల నుండి ఒక్కింత రక్షణగా సుప్రీంకోర్టు వారి ఈతీర్పు. ఉంటుందని సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు…

— టీ యు డబుల్యూజే ఐజేయు సభ్యత్వ నమోదు..

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-25T125222.828-1.wav?_=2

— టీ యు డబుల్యూజే ఐజేయు సభ్యత్వ నమోదు

నిజాంపేట, నేటి ధాత్రి

 

మండల కేంద్రంలో సోమవారం టియుడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షుడు శంకర్ దయాల్ చారి, రాష్ట్ర నాయకులు శ్రీనివాస్, డీజీ శర్మ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ.. జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. జర్నలిస్టులో ఇండ్ల స్థలాల సమస్యలను త్వరలోనే పరిష్కారమయ్యేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో జర్నలిస్టులు డీకే శర్మ, అజ్గర్, బాలరాజ్, శ్రీకాంత్, చంద్రకాంత్, సిద్దారములు, నవీన్ రెడ్డీ, భైరవరెడ్డి తదితరులు ఉన్నారు.

భూపాలపల్లిలో జర్నలిస్టుల పక్షంలో TSJU…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-37-5.wav?_=3

జర్నలిస్ట్ ల పక్షాన నిలిచేది టి.ఎస్ జే.యూ యూనియన్

జిల్లా అధ్యక్షులు సంతోష్,ప్రధాన కార్యదర్శి దొమ్మటి రవిందర్

భూపాలపల్లి నేటిధాత్రి

జర్నలిస్ట్ ల పక్షాన నిలిచేది తెలంగాణ స్టేట్ జర్నలిస్టు యూనియన్ ( ఎన్ యు జె ఐ) అని జిల్లా అధ్యక్షులు ఎడ్ల సంతోష్,జిల్లా ప్రధాన కార్యదర్శి దొమ్మటి రవీందర్ లు అన్నారు.కాకతీయ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు.జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జర్నలిస్ట్ ల పక్షాన టి ఎస్ జే యూ పోరడుతుందని స్పష్టం చేశారు.ఇప్పటికే వర్కింగ్ జర్నలిస్ట్ ల పిల్లలకు ప్రయివేటు,కార్పొరేట్ పాఠశాలల్లో 50% ఫీజు రాయితీ కల్పించిన ఘనత మాదే అన్నారు.జర్నలిస్ట్ ల భద్రత దృష్ట్య ఏ యూనియన్ చేయని విధంగా టి ఎస్.జే.యూ రాష్ట్ర అధ్యక్షులు నారగౌని పురుషోత్తం,ప్రధానం కార్యదర్శి తోకల అనిల్,రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పావుశెట్టి శ్రీనివాస్ ల సూచనతో యూనియన్ లో సభ్యత్వం తీసుకున్న ప్రతి జర్నలిస్ట్ కు రూ.5 లక్షల ప్రమా భీమా కల్పించిన ఏకైక యూనియన్ మాదే అన్నారు.అంతే కాకుండా టి ఎస్ జెయూ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పదార్థాల నియంత్రణపై విస్తృత కార్యక్రమం చేపట్టడం జరిగిందని గుర్తు చేశారు.వర్కింగ్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నామన్నారు.రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల కొన్ని యూనియన్లు మా యూనియన్ సభ్యులను మభ్యపెడుతూ తమ యూనియన్లో చేర్చుకుంటున్నట్లు తెలుస్తుంది.ఆ యూనియన్ నేతలు ఇప్పటివరకు జర్నలిస్టులకు ఏం చేశారో చెప్పాకే జర్నలిస్ట్ లు నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాము.మా యూనియన్ ఎప్పుడు జర్నలిస్ట్ ల సమస్యల పరిష్కారానికి పోరాడుతుందని జర్నలిస్టులు మిత్రులకు గమనించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ నేతలు..జిల్లా ఉపాధ్యక్షులు గట్టు రవీందర్ గౌడ్,జిల్లా
ప్రచార కార్యదర్శి కారుకూరి సతీష్
సంయుక్త కార్యదర్శి కడపక రవి,బోళ్లపల్లి జగన్ గౌడ్, మారపేల్లి చంద్రమౌలి,దేవేందర్ తదితరులు పాల్గోన్నారు.

విలేకరుల కష్టాన్ని గుర్తించండి..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-17-6.wav?_=4

 

విలేకరుల కష్టాన్ని గుర్తించండి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

మొహమ్మద్ ఇమ్రాన్ తెలంగాణ రాష్ట్ర జర్నలిస్ట్ ఆవేదన తెలంగాణ రాష్ట్రంలో వేలాది విలేకరులు జీతాన్ని ఆశించకుండా జీవితాలను పడంగా పెట్టి అన్యాయాన్ని ప్రశ్నించే గొంతుగా రాతతో సమాధానం చెబుతూ రాష్ట్ర భవిష్యత్తుకు బాటలు వేస్తూ మంచి చెడ్డ ప్రజల వరకు చేరవేస్తూ ఎల్లప్పుడు ప్రజాసేవ చేస్తున్న జర్నలిస్టులకు గుర్తించండి ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం విలేకరులకు ఇంటి నిర్మాణ స్థలాలను కేటాయించాలి మరియు జర్నలిస్టుల పిల్లలకు విద్య వైద్యరంగంలో 50% రాయితీ కల్పించాలి అలాగే అక్కడక్కడ విలేకరులపై దాడులు జరుగుతున్నాయి కాబట్టి చట్టపరమైన రక్షణ కల్పించాలి జహీరాబాద్ నియోజకవర్గం గత ప్రభుత్వం విలేకరులకు డబల్ బెడ్ రూమ్ మంజూరు చేస్తామని చెప్పింది అలాగే ఈ ప్రభుత్వం కూడా డబల్ బెడ్ రూములు కేటాయించాలి జహీరాబాద్ లో 60 డబల్ బెడ్ రూమ్ లో ఉన్నాయని విలేకరుల కేటాయించాలని ఇళ్ల స్థలాలు తప్పకుండా కేటాయించాలని ప్రభుత్వాన్ని మరియు అధికారులను విజ్ఞప్తి చేశారు

మాదిగ జర్నలిస్టుల ఫోరం పోస్టర్ ఆవిష్కరించిన సోదా..

మాదిగ జర్నలిస్టుల ఫోరం పోస్టర్ ఆవిష్కరించిన సోదా

పరకాల నేటిధాత్రి
ఆగస్టు 12వ తేదీన హైదరాబాదులోని రవీంద్ర భారతిలో జరిగే తెలంగాణ మాదిగ జర్నలిస్టుల ఫోరం 2వ మహాసభల పోస్టర్ ను జర్నలిస్ట్ లతో కలిసి పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ సోదా రామకృష్ణ ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ మాదిగ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర అధికార ప్రతినిధి పెండెల సుమన్,మాదిగ జర్నలిస్టుల ఫోరం హన్మకొండ జిల్లా అధ్యక్షులు చందల రాజు,జిల్లా ప్రధాన కార్యదర్శి కోడెపాక భాస్కర్,నడి కూడా మండల అధ్యక్షులు,జిల్లా కార్యవర్గ సభ్యులు చుక్క సతీష్,జిల్లా నాయకులు పెండెల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ.!

ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ జర్నలిస్టులు రాస్తారోకో

గణపురం నేటిధాత్రి

గణపురం మండలo చెల్పూరు గ్రామం లో ధర్నా చేసిన జర్నలిస్టు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు జర్నలిస్టులపై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలను నిరసిస్తూ కాకతీయ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కాకతీయ ప్రెస్ క్లబ్ నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. సెంటర్ లో ప్లకార్డ్ తో రోడ్డుపై బైఠాయిచి రాస్తారోకో చేశరు. నేడు జిల్లాలో కొనసాగుతున్న ముగ్గురు మంత్రుల పర్యటనను బహిష్కరించి నిరసన తెలిపారు. జర్నలిస్టుల పై ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాకతీయ ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే జర్నలిస్టులకు బే షరతు గా క్షమాపణ చెప్పాలి .

ఎమ్మెల్యే జర్నలిస్టులకు బే షరతు గా క్షమాపణ చెప్పాలి

బిజెపి మండల అధ్యక్షులు ఊర నవీన్ రావు

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలం జర్నలిస్టులను అవమానకరంగా మాట్లాడిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు వెంటనే క్షమాపణ చెప్పాలని బిజెపి మండల శాఖ అధ్యక్షుడు ఊర నవీన్ రావు డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ఆదివారం మంత్రుల రాక సందర్భంగా భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు జర్నలిస్టులను ఉద్దేశించి ఏం రాస్తారో రాసుకోండి అని ఏం పీకలేరని మాట్లాడడం దారుణం అన్నారు. జర్నలిస్టుల పట్లఅనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే వెంటనే క్షమాపణ చెప్పాలని బిజెపి మండల శాఖ అధ్యక్షులు ఊర నవీన్ రావు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.

అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ జర్నలిస్టులు రాస్తారోకో..

ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ జర్నలిస్టులు రాస్తారోకో

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-60.wav?_=5

భూపాలపల్లి నేటిధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు జర్నలిస్టులపై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలను నిరసిస్తూ కాకతీయ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కాకతీయ ప్రెస్ క్లబ్ నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. సెంటర్ లో ప్లకార్డ్ తో రోడ్డుపై బైఠాయిచి రాస్తారోకో చేశరు. నేడు జిల్లాలో కొనసాగుతున్న ముగ్గురు మంత్రుల పర్యటనను బహిష్కరించి నిరసన తెలిపారు.

MLA Gandra Satyanarayana Rao

జర్నలిస్టుల పై ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాకతీయ ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు పాల్గొన్నారు.

తూర్పు జర్నలిస్టుల ఔదార్యం..

తూర్పు జర్నలిస్టుల ఔదార్యం..

తోటి జర్నలిస్ట్ కు అండగా తూర్పు జర్నలిస్టులు.

రిపోర్టర్ శ్రీనివాస్ మాతృమూర్తీ అంతిమయాత్రను నిర్వహించిన తూర్పు రిపోర్టర్లు.

వరంగల్ తూర్పు, నేటిధాత్రి.

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-43.wav?_=6

జర్నలిస్టుకు సమస్య వస్తే తోటి జర్నలిస్టు అండగా ఉండాలి అని కోరుకుంటాం. వరంగల్ తూర్పులో జరిగిన సంఘటన అందుకు నిదర్శనం. తూర్పులో పనిచేసే వర్కింగ్ జర్నలిస్టులు తాము నిస్సహాయ స్థితిలో ఉన్న కూడా, కష్ట సమయాల్లో ఉన్న మిత్రుడికి అండగా నిలిచి అందరిచే మన్ననలు పొందారు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని వేచి చూడకుండా, సాటి మిత్రుడికి అండగా నిలబడి ఉన్నారు. వరంగల్ తూర్పులో పనిచేసే జర్నలిస్టులు మరోసారి తమ ఐక్యతను చాటుకున్నారు అని చెప్పొచ్చు. గతకొద్ది సంవత్సరాలుగా వరంగల్ తూర్పు ఎలెక్ట్రానిక్ మీడియాలో జర్నలిస్ట్ గా పనిచేస్తున్న చిత్తోజు శ్రీనివాస్ తల్లి గారు శుక్రవారం మధ్యాహ్నం చనిపోయారు అనే విషయం తెలువగానే, వెంటనే తోటి జర్నలిస్ట్ కు అండగా నిలిచిన వరంగల్ తూర్పు జర్నలిస్ట్ మిత్రులు చూపిన ఔదార్యం మాటల్లో చెప్పలేనిది. ఆర్థికంగా వెనుకబడిన రిపోర్టర్ శ్రీనుకు నా అనే వారు ఎవరు లేకపోయినా, మేము ఉన్నాం నీకు తోడు అంటూ, ప్రతి ఒక్క జర్నలిస్ట్ మిత్రుడు ఆర్ధికంగా, ఇంకా ఒక కుటుంబ సభ్యునిలాగా వ్యవహరించిన తీరు అద్భుతం. సదరు రిపోర్టర్ కిరాయి ఉండే ఇంట్లో ఓనర్ తో సైతం మాట్లాడి, దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించారు తూర్పు జర్నలిస్టులు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి జర్నలిస్ట్ కు పేరుపేరునా అభినందనలు తెలియచేశారు తోటి మిత్రులు. ఇలానే అందరూ కలిసి డబల్ బెడ్ రూముల కొరకు కలిసి నడవాలని, వరంగల్ లో సపరేట్ గా ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసుకునే వరకు ఇలా ఎప్పుడు అందరూ కలిసికట్టుగా ఉండాలని సూచించారు కొందరు సీనియర్ జర్నలిస్టులు.

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తాం.

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తాం

పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క)

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-28.wav?_=7

ములుగు జిల్లా, నేటిధాత్రి:

రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం చేసేందుకు ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు. శుక్రవారం తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ (టిఎస్ జెయు) ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో టిఎస్ జెయు రాష్ట్ర అధ్యక్షులు పురుషోత్తం నారగౌని, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్, ఎన్ యుజె (ఐ) జాతీయ కార్యదర్శి మెరుగు చంద్రమోహన్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీలు పావుశెట్టి శ్రీనివాస్, నాగపురి నాగరాజ్, ములుగు జిల్లా అధ్యక్షులు చల్లగురుగుల రాజు, ప్రధాన కార్యదర్శి సంఘ రంజిత్ కుమార్, ఉపాధ్యక్షులు నాగపురి హరినాథ్ గౌడ్, వరంగల్ జిల్లా అధ్యక్షులు కందికొండ మోహన్, ఉపాధ్యక్షులు కందికొండ గంగరాజు, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు రాము, ప్రధాన కార్యదర్శి హరికృష్ణ, జాయింట్ సెక్రెటరీ దాడి బిక్షపతి, జనగాం జిల్లా అధ్యక్షుడు యు. నరేందర్, మహబూబ్ బాద్ జిల్లా అధ్యక్షులు ఉదయ్ ధీర్, కార్యదర్శి సతీష్ చారి, భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు ఎడ్ల సంతోష్, కార్యదర్శి దొమ్మాటి రవి, ఉపాధ్యక్షులు బండారి రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా సమావేశం ములుగులో జరిగింది. టిఎస్ జెయు రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శిగా మాట్ల సంపత్, కార్యవర్గ సభ్యులుగా గండ్రాతి విజయాకర్, టిఎస్ జెయు మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మందాటి రజిని, ఉపాధ్యక్షురాలుగా పోచంపల్లి రజిత లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సభ్యులు ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా యూనియన్ సభ్యులు చల్లూరు మహేందర్ పెండం బిక్షపతి, ధనుంజయ్, రాము తదితరులు పాల్గొన్నారు.

సార్వత్రిక సమ్మెకు టీడబ్ల్యూజేఎఫ్ సంఘీభావం..

సార్వత్రిక సమ్మెకు టీడబ్ల్యూజేఎఫ్ సంఘీభావం..

వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:

కార్మికుల హక్కుల కోసం చేపట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సంఘీభావం తెలిపారు. బుధవారం వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమైన వామపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన మహా ర్యాలీలో టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బొక్క దయాసాగర్,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మచ్చిక వెంకటేశ్వర్లు, వరంగల్ జిల్లా అధ్యక్షులు పొడేటి అశోక్, ఉపాధ్యక్షులు ఈర్ల సురేందర్, కోశాధికారి గాయపు రాజురెడ్డి, చిలువేరు శ్రీకాంత్,గుర్రాల శ్రీనివాస్, సదిరం కుమార్,ఎండీ.అక్మల్ పాషా, మోడం హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

వర్కింగ్ జర్నలిస్ట్ లకు ఇంటి స్థలాలు కేటాయించి.

వర్కింగ్ జర్నలిస్ట్ లకు ఇంటి స్థలాలు కేటాయించి ఇందిరమ్మ పథకంలో ఇండ్లు ఇవ్వండి

ఎమ్మెల్యే కు వినతిపత్రం అందజేసిన టి డబ్ల్యూ జె ఎఫ్ నాయకులు

మంచిర్యాల,నేటి ధాత్రి

జర్నలిస్టులు ఏలాంటి ప్రతిఫలం ఆశించకుండా సమాజ జాగృతికి నిరంతరం కృషి చేస్తున్నారని, వర్కింగ్ జర్నలిస్ట్ లందరికీ షరతులు లేకుండా ఇంటి స్థలాలు కేటాయించి ఇందిరమ్మ పథకంలో ఇండ్లు మంజూరు చేయాలని కోరుతూ మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుకు బుధవారం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ పెడరేషన్ నాయకులు వినతిపత్రం అందజేశారు.

 

 

 

ఈ సందర్బంగా టి డబ్ల్యూ జె ఎఫ్ సంఘం జిల్లా అధ్యక్షులు మిట్టపల్లి మధు, కార్యదర్శి గడ్డం సత్యా గౌడ్ లు మాట్లాడుతూ భూముల ధరలు ఆకాశాన్ని అంటగా, వైద్యం చాలా పిరమైపోయిందని, ఈ నేపథ్యంలో వర్కింగ్ జర్నలిస్టులు ఇంటి స్థలం కొనలేని పరిస్థితిలో అద్దె ఇండ్లలో ఉండి చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారని తెలిపారు. నేటికీ పాత్రికేయుల సొంతింటి కల కలగానే మిగిలి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హాయంలో దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి కొందరికి ఇండ్ల స్థలాలు ఇచ్చారని గుర్తు చేశారు. గత పదేళ్ల కాలంలో

 

 

కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో జర్నలిస్టులకు తీవ్ర అన్యాయం జరిగిందని తెలిపారు. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తమకు ( జర్నలిస్టులకు) ఆశలు చిగురించాయని అన్నారు. అవినీతి అక్రమాలను వెలికితీసి ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పాటు పడుతున్న జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని తెలిపారు. గత ప్రభుత్వం మాట్లాడే హక్కును హరించినా.. మీడియా ఎంతో ధైర్యంగా ప్రజా సమస్యలను ఎత్తి చూపిందని తెలిపారు.

 

 

ప్రజలకు పూర్తి పారదర్శక పాలన అందించడంలో పాత్రికేయుల సహకారం ఎంతో అవసరమని, వారికి మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికీ అక్రిడిటేషన్లు మంజూరు చేయాలని కోరారు. ఏ ప్రభుత్వానికైనా చెవులు, కళ్లు మీడియానే కాబట్టి, మీడియాలో పనిచేసే విలేకరుల సంక్షేమాన్ని ప్రభుత్వం బాధ్యతగా తీసుకోవడం వల్ల పారదర్శకమైన ప్రజాస్వామ్యం ఏర్పడుతుందని వివరించారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా నిలిచి, సమాజహితం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసినట్లైతే వారి కుటుంబాల స్వంతింటి కళను సహకారం చేసినట్లు అవుతుందని తెలిపారు.

 

 

 

శాసనసభ్యులుగా తమ పరిధిలో ఉన్న సమస్యను పరిష్కరించి, ఈ జిల్లాలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇందిరమ్మ పథకంలో ఇల్లు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర స్థాయిలో పరిష్కారమయ్యే సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలనీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా ఉపాద్యక్షలు కామెర వెంకటస్వామి, జే సతీష్, కోశాధికారి సబ్బని భాస్కర్, జాయింట్ సెక్రెటరీ బి సుమన్, జి సురేందర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఈ సురేష్, ఈసీ మెంబర్స్ ఎం వేణుగోపాల్ గౌడ్, ఏ శ్రీనివాస్, వీరస్వామి, యూనియన్ సభ్యులు దేవరపల్లి ప్రభాకర్, మహమ్మద్ అమీరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

విలేకరిపై దాడి అనైతికం మండల కేంద్రంలో జర్నలిస్టులు నిరసన.

విలేకరిపై దాడి అనైతికం మండల కేంద్రంలో జర్నలిస్టులు నిరసన

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండల కేంద్రంలో ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేసే పత్రిక విలేకరులపై దాడి చేయడం అనైతికమైన చర్య అని మండల జర్నలిస్టులు, విద్యావంతుల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు రాదండి దేవేందర్, బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు కుమారస్వామి లు అన్నారు. తాడ్వాయి మండల ఆంధ్రజ్యోతి విలేకరి శ్రీకాంత్ రెడ్డి పై మంగళవారం జరిగిన దాడులు నిరసిస్తూ మండల కేంద్రంలోనీ చౌరస్తాలో బుధవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పత్రికా స్వేచ్ఛ భారత రాజ్యాంగంలో ఒక భాగమని, ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రజల సమస్యలను ప్రభుత్వానికి చేరవేసే పత్రిక విలేకరులపై కాంగ్రెస్ నాయకులు దాడి చేయడం సరికాదన్నారు. సమాజ హితం కోసం విలేకరులు స్వేచ్ఛపూరిత వాతావరణంలో పని చేసే విధంగా ప్రభుత్వాలు పనిచేయాలని కోరారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు యాదగిరి, శ్రీనివాస్, రవి, రామకృష్ణ, కుమార్, కిషోర్, మురళి, వెంకట్, రమేష్, విష్ణు, బాబు, శంకర్, ఎల్లయ్య, తదితరులు ఉన్నారు.

ప్రచురణార్ధం జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన.

ప్రచురణార్ధం జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన తప్పదు
రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య
ఘనంగా టీడబ్ల్యూజేఎఫ్ మంచిర్యాల జిల్లా తృతీయ మహాసభ

మంచిర్యాల జూన్ 19 నేటి ధాత్రి:తెలంగాణలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారంలో మరింత జాప్యం చేస్తే రాష్ట్రవ్యాపిత ఆందోళన తప్పదని ఆయన హెచ్చరించారు. శుక్రవారం మంచిర్యాలలోని నస్పూర్ సీసీసీ ప్రెస్ క్లబ్ లో టీడబ్ల్యూజేఎఫ్ మంచిర్యాల జిల్లా తృతీయ మహాసభ ఘనంగా జరిగింది. ఈ మహాసభలో రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…జర్నలిస్టులకు
అండగా నిలిచి సమస్యలపై పోరాడే ఏకైక యూనియన్
టీడబ్ల్యూజేఎఫ్ అని అన్నారు. రాష్ట్రంలోని జర్నలిస్టుల సంక్షేమం కోసం పాటుపడుతున్న యూనియన్ టీడబ్ల్యూజేఎఫ్ మాత్రమే అని అన్నారు. అన్ని జిల్లాల్లో టీడబ్ల్యూజేఎఫ్ యూనియన్ బలపడుతుందని, ఈ నేపథ్యంలో అవగాహన లోపంతో ఫెడరేషన్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వానికి
ఒక యూనియన్ వంతపాడితే.. ప్రస్తుత ప్రభుత్వానికి మరో యూనియన్ వంత పాడుతుందని ఎద్దేవా చేశారు. జిల్లాల్లో టీడబ్ల్యూజేఎఫ్ యూనియన్ బలోపాతానికి చేస్తున్న జిల్లా నాయకులను మామిడి సోమయ్య ఈ సందర్భంగా అభినందించారు.ఐఎఫ్ డబ్ల్యూజే జాతీయ కార్యదర్శి పులిపలుపుల ఆనందం మాట్లాడుతూ… రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టులందరికీ 20 వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి విజయ్ కుమార్ మాట్లాడుతూ…
జర్నలిస్టులకు గత ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ పథకాలు చేపట్టలేదని, జర్నలిస్టులకు అనేక సౌకర్యాలు కల్పిస్తామని అధికారంలోకి వచ్చిన ప్రస్తుత ప్రభుత్వం కూడా జర్నలిస్టులకు మొండి చేయి చూపిందని అన్నారు. కనీసానికి వర్కింగ్ జర్నలిస్టులకు కొత్తగా అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వకుండా మూడు నెలలకోసారి స్టిక్కర్ల పేరుతో కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా జర్నలిస్టుల సంక్షేమంపై ఆలోచించి వారికి న్యాయం చేయాలని కోరారు. ఈ మహాసభలో సీపీఐ రాష్ట్రదర్శి వర్గ సభ్యుడు శంకర్, ఫెడరేషన్ నేషనల్ కౌన్సిల్ మెంబర్, కరీంనగర్ జిల్లా కార్యదర్శి కుడితాడు బాపురావు, నేషనల్ కౌన్సిల్ సభ్యుడు యూసుఫ్, జిల్లా సన్నాహక కమిటీ కన్వీనర్ మిట్టపల్లి మధు, కో- కన్వీనర్లు వెంకట స్వామి గడ్డం సత్యా గౌడ్
మంచిర్యాల జిల్లా నూతన కమిటీ ఎన్నిక
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) మంచిర్యాల జిల్లా నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది.
అధ్యక్షుడుగా మిట్టపల్లి మధు(సూర్య), ఉపాధ్యక్షుడుగా వెంకటస్వామి(ప్రజాపాలన), కార్యదర్శిగా గడ్డం సత్యగౌడ్(నేటిధాత్రి), సంయుక్త కార్యదర్శులుగా నేరెళ్ళ నరేష్ గౌడ్, నరేందర్, సుమన్,రవి, కార్యనిర్వాహక కార్యదర్శులుగా ఎంఏ హఫీజ్, ఇప్ప సురేష్, సందలేని నర్సయ్య, సదానందం, శ్రీనివాస్,కోశాధికారి గా సబ్బని భాస్కర్,కార్యవర్గ సభ్యులుగా ఎండీ సుల్తాన్, ఎస్. మల్లేష్
తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరితో పాటుగా రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా శానగొండ శ్రీనాథ్ ఎన్నికైనట్లు ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య ప్రకటించారు.

జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ విద్యా సంస్థలలో ఉచిత విద్య.

జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ విద్యా సంస్థలలో ఉచిత విద్య అందించాలి

బహుజన స్టూడెంట్స్ యూనియన్(బి ఎస్ యు)

ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు మంద సురేష్

శాయంపేట నేటిధాత్రి:

shine junior college

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పత్రికా& ఎలక్ట్రానిక్ మీడియా పిల్లలకు ప్రైవేటు విద్యాసంస్థ లలో ఉచిత విద్యఅందించాలి నేడు ఏర్పాటుచేసిన విలేక రుల సమావేశంలో బహుజన స్టూడెంట్స్ యూనియన్ (బి ఎస్ యు) ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు మంద సురేష్ మాట్లాడుతూ ఎన్ని ప్రభుత్వా లు మారిన పత్రికా విలేకరు లకు ఇచ్చిన హామీలు ఏ ప్రభు త్వం నెరవేర్చ లేకపోతుంది సమాజంలో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండే పత్రికా విలేకరుల పిల్లల కు ఉచిత విద్య అందించలే కపోవడం చాలా బాధాకరం రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పత్రిక అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పిల్లలకు ప్రైవేటు విద్యాసంస్థ లలో ఉచిత విద్య ఆoదించాలి అని ప్రత్యేకమైన జీవో ఏర్పా టు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version