రామాయంపేట అభివృద్ధి జనహృదయనేత సుప్రభాత్ రావు

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-16T143429.082.wav?_=1

 

రామాయంపేట అభివృద్ధి పథంలో “జనహృదయనేత” సుప్రభాత్ రావు పాత్ర..

రామాయంపేట, సెప్టెంబర్16 నేటి ధాత్రి (మెదక్)

రామాయంపేట అభివృద్ధి, ప్రజా సంక్షేమం దిశగా గత పదేళ్లుగా నిరంతరం కృషి చేస్తున్న నాయకుడిగా టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాత్ రావు పేరు రామాయంపేట ప్రజల్లో విశేష గుర్తింపు పొందింది. రాజకీయాల్లో సాధారణంగా పదవులు, వర్గ పరమైన లాభాల కోసం కృషి చేసే నాయకులు ఉన్నారనే అభిప్రాయం ప్రజలలో బలపడుతున్న తరుణంలో, అన్ని వర్గాలను కలుపుకుంటూ ప్రజల కోసం అహర్నిశలు శ్రమించే నేతగా సుప్రభాత్ రావు ప్రత్యేక స్థానం సంపాదించారు.

 

Development

రామాయంపేటకు పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనుల మంజూరులో ఆయన పాత్ర ప్రధానమని స్థానికులు చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రామాయంపేట అభివృద్ధి కోసం ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ని ఒప్పించి కోట్ల రూపాయల నిధులు విడుదల కావడంలో ఆయన కృషి కీలకమైందని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.
గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆరోగ్యశ్రీ పథకంను రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా రామాయంపేటలో ప్రారంభించడంలో సుప్రభాత్ రావు పట్టుదల నిర్ణయాత్మకమైంది . అంతేకాకుండా రామాయంపేటలో రెవెన్యూ డివిజన్ స్థాపన కోసం ఆయన చేపట్టిన నిరాహార దీక్ష తర్వాతే టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటన చేయడం గమనార్హం.
రామాయంపేట అభివృద్ధి దిశగా ఆయన సమన్వయంతోనే మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ప్రస్తుత ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు లు నిధుల మంజూరులో ముందడుగు వేసినట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా రోహిత్ రావు గెలుపులో సుప్రభాత్ రావు పోషించిన పాత్రను కాంగ్రెస్ వర్గాలు ప్రత్యేకంగా గుర్తిస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఆయన చేసిన శ్రమ ఆ విజయంలో కీలకమైందని చెబుతున్నారు.

 

Development

 

రాజకీయ ప్రయోజనాల కంటే ప్రజా ప్రయోజనాలను ముందు ఉంచే నాయకుడిగా, *“జనహృదయనేత”*గా సుప్రభాత్ రావు పేరు రామాయంపేట ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచింది. అభివృద్ధి మార్గంలో రామాయంపేటను తీసుకెళ్లడమే తన లక్ష్యమని ఆయన తరచూ చెప్పడం, ప్రజలు ఆయనను ఆశాకిరణంగా భావించడానికి ప్రధాన కారణమవుతోంది. అంతే కాకుండా రామాయంపేట పట్టణ ప్రజలు కలలో కూడా ఊహించని భారీ వరదలు వినాయక చవితి పండుగ రోజున అర్ధరాత్రి పట్టణాన్ని చుట్టుముడితే ప్రజలందరూ గాఢనిద్రలో ఉన్నప్పుడు అధికారులను అప్రమత్తం చేసి తనే స్వయంగా ముందుకు వచ్చి అధికారులకు ధైర్యాన్నిస్టు , ఎమ్మెల్యే కి, ఉన్నతాధికారులకు, ఎప్పటికి అప్పుడు సమాచారం అందిస్తూ ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా.300మంది గిరిజన డిగ్రీ కళాశాల పిల్లలను కాపాడటం పట్ల పట్టణ ప్రజలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

మళ్లన్న నారి శక్తి లోగో ఆవిష్కరణ…

హైదరాబాద్ లో రాష్ట్ర “నారి శక్తి” సంస్థ లోగోని లాంచ్ చేసిన ఎం ఎల్ సి తీన్మార్ మల్లన్న

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ కి చెందిన “నారి శక్తి” సంస్థ ఫౌండర్ అండ్ చైర్మన్ జ్యోతి పండాల్ గారి ఆధ్వర్యంలో హైదరబాద్ లోని బిసి పొలిటికల్ జె.ఏ సి రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ శ్రీ తీన్మార్ మల్లన్న గారిచే రాష్ట్ర “నారి శక్తి” సంస్థ లోగో ను ఆవిష్కరించి తీన్మార్ మల్లన్న జ్యోతి పండాల్ ను సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడతూ మహిళలు సాధికారత సాధించినప్పుడే దేశం,రాష్ట్రం అభివృద్ది చెందుతుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ బిసి పొలిటికల్ జె.ఏ సి కోఆర్డినేషన్ కమిటి చైర్మన్ సుదగాని హరిశంకర్ గౌడ్, జె.ఏ సి నాయకులు కొనదొడ్డి నర్సింహ్మ (జహీరాబాద్ ఇంచార్జ్), తీన్మార్ మల్లన్న టీం శ్రీకాంత్, జగన్నాథ్, నాయకులు శ్రీ బయ్య వెంకటేశ్వర్లు యాదవ్ సింగారం రవీందర్ కొట్ల వాసుదేవ్ సుతారపు రంగన్న తదితరులు పాల్గొన్నారు

హరీశ్‌రావుపై కవిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నాం…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-04T152314.808.wav?_=2

 

హరీశ్‌రావుపై కవిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నాం

ఇకనైన కవిత పునరాలోచించుకోవాలి

మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

పరకాల నేటిధాత్రి

 

మాజీ మంత్రి హరీశ్‌రావుపై జాగృతి అధ్యక్షురాలు కవిత చేసిన ఆరోపణలు సబబుకాదని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పేర్కొన్నారు.పార్టీ అధినేత కేసీఆర్‌తోపాటు హరీశ్‌రావుకు అండగా ఉంటామని చెప్పారు.
కేసీఆర్‌ మార్గదర్శకత్వంలో పనిచేస్తున్న హరీశ్‌రావుపై కవిత చేసిన ఆరోపణలను పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఒక ప్రకటనలో తప్పుబట్టారు.నాడు ఉద్యమంలో,పాలనలో,నేడు ప్రతిపక్షంలోనూ హరీశ్‌రావు అనునిత్యం కేసీఆర్‌కు వెన్నంటి ఉంటున్నారని తెలిపారు.బీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి పార్టీ పటిష్టత కోసం హరీశ్‌రావు ఎంతో కృషిచేశారని అన్నారు.అన్ని వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల కోసం ముందుండి పోరాటం చేసిన హరీశ్‌రావుపై కవిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నట్టు చెప్పారు.కన్న తండ్రిని కన్నతల్లిలాంటి పార్టీకి ద్రోహంచేయాలని చూస్తే సహించేదిలేదని అన్నారు.ఆనాటి నుండి నేటి వరకు బిఆర్ఎస్ కుటుంబ సభ్యులందరు ఒక సోదరిలాగానే భావించామని తెలిపారు.ఇప్పటికైనా కవిత పునరాలోచించుకోవాలని సూచించారు.పార్టీ ని విచ్చిన్నం చేయాలనిచూస్తే మాత్రం అందుకు బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు చూస్తూ ఊరుకోరని అందుకు ధీటుగా సమాధానం చెప్తామన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ కు ప్రాధాన్యత ఇవ్వాలి..

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-03T131603.110-1.wav?_=3

స్థానిక సంస్థల ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ కు ప్రాధాన్యతియ్యాలి

నియోజకవర్గ అధ్యక్షుడు తుమ్మలపెల్లి సందీప్

నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి వినతిపత్రం

నర్సంపేట,నేటిధాత్రి:

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో యువజన కాంగ్రెస్ నాయకులకు 20 శాతం సీట్లు కేటాయించి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు తుమ్మలపెల్లి సందీప్ కోరారు. రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జెక్కిడి శివచరణ్ రెడ్డి ఆదేశాలతో బుదవారం దొంతి మాధవరెడ్డిని హన్మకొండలోని సగృహంలో వరంగల్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొరవి పరమేష్ తో కలిసి తుమ్మలపెల్లి సందీప్ వినతిపత్రాన్ని అందించారు.ఈ సందర్భంగా సందీప్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ కు ప్రాధానత్య ఇవ్వాలని కోరగా సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు.స్పందించిన ఎమ్మెల్యే దొంతి యూత్ కాంగ్రెస్ తోనే కాంగ్రెస్ పార్టీకి, దేశానికి బంగారు భవిష్యత్ అని కొనియాడారన్నారు.యువత కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారని కష్టపడి పనిచేసే ప్రతి యూత్ కాంగ్రెస్ కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీలోనే అధిక ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్న.. తప్పక అమలు చేస్తానని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హమి ఇచ్చినట్లు సందీప్ తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ జాయింట్ సెక్రెటరీ మోడెం ఎల్లా గౌడ్,నల్లబెల్లి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పురుషోత్తం సురేష్, నర్సంపేట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బొంత రంజిత్, నర్సంపేట పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎస్కె షఫిక్,దుగ్గొండి మండల యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నరిగె ప్రవీణ్, శ్రీకాంత్, అవినాష్, ఇస్మాయిల్, తదితరులు పాల్గొన్నారు.

బంగారు పతకాలతో మెరిసిన మొగుళ్లపల్లి విద్యార్థులు.

బంగారు పథకాలతో మెరిసిన మొగుళ్లపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులు
– ప్రధానోపాధ్యాయులు  విజయ పాల్ రెడ్డి

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
పోలీసు శిక్షణ కళాశాల మామునూరు ఆవరణలో 4 వ తెలంగాణ  ఎయిర్ ఫోర్స్   వారి ఆధ్వర్యంలో నిర్వహించిన” కంబైన్డ్ అన్యువల్ ట్రైనింగ్ క్యాంపు”-7 లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మొగులపల్లి నుండి 12 మంది  ఎన్.సి .సి క్యాడేట్స్  పాల్గొన్నారు.
శిక్షణలో భాగంగా నిర్వహించిన ఆటల పోటీలలో  వాలీబాల్,  టాగ్ ఆఫ్ వార్, ఆటలలో  గోల్డ్  మెడల్ సాధించగా,  మెరుగు సంజయ్ 100 మీటర్ల పరుగు లో మొదటి స్థానము పొంది గోల్డ్ మెడల్ సాధించారని  పాఠశాల ప్రధానోపాధ్యాయులు , విజయ పాల్ రెడ్డి ఎన్సిసి అధికారి  జి. రాజయ్య లు తెలిపారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పింగిలి విజయపాల్ రెడ్డి మాట్లాడుతూ, ఇలాంటి విజయాలు ఇంకా ఎన్నో సాధించాలని, మంచి ప్రవర్తన, పట్టుదల, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకొని, పాఠశాలకు  మీ ఊరికి  రాష్ట్రానికి , దేశానికి  మంచి పేరు తీసుకురావాలని  సూచించారు. అదేవిధంగా దేశానికి ముగ్గురే ముగ్గురు  ఎలాంటి స్వార్థం లేకుండా సేవ చేసేవారు, సైనికుడు, రైతు, క్రీడాకారుడు
కావున  మంచి చదువుతోపాటు  ఆటలలో రాణించి మంచి దేశభక్తిని కలిగి ఉండాలని సూచించారు .
ఈ కార్యక్రమంలో గోల్డ్ మెడల్ సాధించిన ఎన్. సి.సి విద్యార్థులను  అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు  శ్రీమతి భాగ్యశ్రీ,   ,  శ్రీమతి ఏ.వీ. ఎల్ . కళ్యాణి,  జి .అనిల్ కుమార్, బి. కుమారస్వామి కే .ప్రవీణ్, ఎం. రాజు,  శ్రీమతి పి. లలిత, జి. విజయ భాస్కర్, శ్రీమతి  వై. శ్రీకళ  విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలు.. ఆ నియోజకవర్గాలపై బీఆర్ఎస్ ఫోకస్.

స్థానిక సంస్థల ఎన్నికలు.. ఆ నియోజకవర్గాలపై బీఆర్ఎస్ ఫోకస్

 

మరి కొద్ది రోజుల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు జరగనున్నాయి. అందుకు నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. ఆ ఎన్నికల్లో తన సత్తా చాటాలని బీఆర్ఎస్ అగ్రనాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.

హైదరాబాద్, ఆగస్టు 24: 10 ఏళ్ల పాటు అధికారాన్ని చేపట్టిన బీఆర్ఎస్ పార్టీ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షానికి పరిమితమైంది. ఇక సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటు సైతం ఆ పార్టీ గెలుచుకోలేక పోయింది. అయితే మరి కొద్ది రోజుల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు జరగనున్నాయి. అందుకు నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. ఆ ఎన్నికల్లో తన సత్తా చాటాలని బీఆర్ఎస్ అగ్రనాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా కీలక నిర్ణయం తీసుకొంటుంది.

అలాగే ప్రజల మధ్యకు వెళ్లి పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆ క్రమంలో రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నేతలు.. ఆ పార్టీకి రాజీనామా చేసి.. మరో పార్టీ గూటిలోకి చేరారు. అలాంటి నియోజకవర్గాలపై పార్టీ అగ్రనాయకత్వం ముఖ్యంగా దృష్టి కేంద్రీకరించింది.

దీంతో ఆ యా నియోజకవర్గాలకు చెందిన పార్టీ కేడర్‌తో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం కానున్నారు. ఆదివారం.. అంటే ఆగస్టు 24వ తేదీన శేరిలింగంపల్లి నియోజకవర్గ ముఖ్య కేడర్‌తో కేటీఆర్ సమావేశం కానున్నారు. ఈ రోజు ఉదయం 11.00 గంటలకు మియాపూర్‌లోని నరేన్ గార్డెన్స్‌లో నేతలు, కార్యకర్తలతో కేటీఆర్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు.

ఈ సమావేశంలో శేరిలింగంపల్లి నియోజకవర్గానికి పార్టీ ఇన్ ఛార్జ్‌ను కేటీఆర్ ప్రకటించనున్నారు. అయితే 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల అనంతరం అరికేపూడి గాంధీ.. బీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. అలాగే వివిధ నియోకవర్గాల కేడర్‌తో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి.. ఇన్‌ఛార్జ్‌లను నియమించాలని ఇప్పటికే ఆ పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ ముఖ్యనేతల సమావేశంలో ఆదేశించినట్లు ఓ చర్చ అయితే సాగుతోంది.

వనపర్తి జిల్లా గౌడ సంగం అధ్యక్షులు గా పలస రమేష్ గౌడ్…

వనపర్తి జిల్లా గౌడ సంగం అధ్యక్షులు గా పలస రమేష్ గౌడ్

వనపర్తి నేటిదాత్రి .

 

వనపర్తి జిల్లా గౌడ సంగం అధ్యక్షులు గా మాజీ మున్సిపల్ చైర్మన్ పలస రమేష్ గౌడ్ వనపర్తి పట్టణ అధ్యక్షులు గా వినోద్ గౌడ్ బాలరాజు అధ్యర్యములో వనపర్తి జిల్లా గౌడ సంఘము అదేవిధంగా మండల కమిటీ ని ఎన్నుకున్నారు

నేటి డిజిటల్ ఇండియా….నాటి రాజీవ్ గాంధీ విజన్

https://netidhatri.com/wp-content/uploads/2025/08/rajiv-gandhi-1.wav?_=4

నేటి డిజిటల్ ఇండియా….నాటి రాజీవ్ గాంధీ విజన్

టిపిసిసి సభ్యులు రఘునాథరెడ్డి, పట్టణ అధ్యక్షులు పల్లె రాజు

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

దేశంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చి పేదల అభ్యున్నతికి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఎంతో కృషి చేశారని టిపిసిసి సభ్యులు పి రఘునాథ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు లు అన్నారు. భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా బుధవారం రామకృష్ణాపూర్ పట్టణంలోని రాజీవ్ చౌక్ చౌరస్తాలో రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కేక్ కట్ చేసి కార్యకర్తలకు తినిపించారు. అనంతరం వారు మాట్లాడారు.

దేశంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చి పేదల అభ్యున్నతికి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఎంతో కృషి చేశారని అన్నారు.రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో దేశంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చి పేద ప్రజల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేశారని చెప్పారు. రాజీవ్ గాంధీ ఆశయాల సాధన నేడు తెలంగాణలో ప్రజాపాలన సాగుతుందని పేర్కొన్నారు.దేశం డిజిటల్ రంగంలో నేడు ముందుకు వెళ్లడానికి కారణం నాడు రాజీవ్ గాంధీ కమ్యూనికేషన్ రంగాన్ని పరిచయం చేసి అభివృద్ధి చేయడమే అన్నారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం వాణిజ్య వ్యాపార రంగాల్లో అభివృద్ధి చేసి ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకువచ్చారన్నారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గాండ్ల సమ్మయ్య, మాజీ వైస్ చైర్ పర్సన్ జంగం కళ, దీకొండ శ్యామ్ గౌడ్, గోపురాజం,పుల్లూరి కళ్యాణ్, కట్ల రమేష్,బత్తుల వేణు,శ్రీనివాస్, ప్రేమ్ సాగర్, మహిళా నాయకురాళ్ళు,కార్యకర్తలు పాల్గొన్నారు.

జాగృతి జిల్లా అధ్యక్షుడిగా రెండోసారి హరీష్ రెడ్డి ఎన్నిక

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-42-1.wav?_=5

జాగృతి జిల్లా అధ్యక్షుడిగా రెండోసారి హరీష్ రెడ్డి ఎన్నిక

భూపాలపల్లి నేటిధాత్రి

తెలంగాణ జాగృతి జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడిగా రెండోసారి మాడ హరీష్ రెడ్డి ఎన్నికైనారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నా మీద నమ్మకం తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నన్ను రెండోసారి అధ్యక్షుడిగా నియమించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని వారు అన్నారు తెలంగాణ జాగృతిని ద్వారా మరిన్ని కార్యక్రమాలు చేసి ప్రజల్లోకి తీసుకెళ్తానని వారు అన్నారు

ఉంజుపల్లి ఎస్టి బాయ్స్ హాస్టల్లో డాక్టర్ శ్రీధర్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం..

ఉంజుపల్లి ఎస్టి బాయ్స్ హాస్టల్లో డాక్టర్ శ్రీధర్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం

నేటిదాత్రి చర్ల

చర్ల మండల కేంద్రంలోని ఉంజుపల్లి ఎస్టి బాయ్స్ హాస్టల్ లో కొయ్యూరు ప్రాథమిక వైద్యశాల వైద్యులు డాక్టర్ శ్రీధర్ ఆధ్వర్యంలో ఆరోగ్య శిభిరం నిర్వహించి 60 మంది విద్యార్థులను పరీక్షించి మందులు ఇవ్వడం జరిగింది డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ హాస్టల్ చుట్టుపక్కల నీటి నిలువలు లేకుండా చూసుకోవాలని వేడి ఆహారాన్ని పిల్లలకు అందించాలన్నారు
విద్యార్థులు పడుకునేటప్పుడు పూర్తిగా వస్త్రాలు ధరించాలని దోమలు కుట్టకుండా చూసుకోవాలని
జ్వరం వస్తే వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్ కి వచ్చి రక్త పరీక్షలు చేయించుకుని వైద్యం తీసుకోవాలని అశ్రద్ధ చేయవద్దని తెలియజేశారు
ఈ కార్యక్రమంలో ఉంజుపల్లి హాస్టల్ ప్రధానోపాధ్యాయుడు విఘ్నేశ్వరరావు సూపర్వైజర్ రాంప్రసాద్ ఉంజుపల్లి హాస్టల్ ఏఎన్ఎం మౌనిక పాల్గొన్నారు

కంకర పరిచారు.. బీటీ మరిచారు

కంకర పరిచారు.. బీటీ మరిచారు

వెల్దండ/ నేటి ధాత్రి

నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం తిమ్మినోనిపల్లి గ్రామానికి బీటీ రోడ్డు నిర్మించాలని గ్రామ బీఆర్ఎస్ నాయకుడు గండికోట రాజు ఆధ్వర్యంలో.. బుధవారం గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు.. కాంట్రాక్టర్లు బీటీ రోడ్డు కోసం రోడ్డు తవ్వి కంకర పరిచారని నెలలు గడుస్తున్నా… బీటీ రోడ్డు నిర్మించకపోవడంతో కంకర రోడ్డుపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనాలు రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నత అధికారులు, ఎమ్మెల్యే స్పందించి బీటీ రోడ్డు పూర్తి అయ్యేలా చూడాలని కోరారు.

నాగేందర్ పటేల్ ఆధ్వర్యంలో నూతన ఎస్సై కి సన్మానం..

బి ఆర్ ఎస్ యువ నాయకులు నాగేందర్ పటేల్ ఆధ్వర్యంలో నూతన ఎస్సై కి సన్మానం

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-100.wav?_=6

జహీరాబాద్ నేటి ధాత్రి;

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన క్రాంతికుమార్ పటేల్ కు శుక్రవారం నాడు బోరేగావ్ బి ఆర్ ఎస్ యువ నాయకులు నాగేందర్ పటేల్ ఆధ్వర్యంలో సబ్ ఇన్స్పెక్టర్ కి పుష్ప గుచ్చం ఇచ్చి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా ఎస్ఐ క్రాంతికుమార్ పటేల్ మాట్లాడుతూ శాంతి భద్రతలు పరిరక్షణకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు వీరన్న బస్వరాజ్ జైకర్ రామచంద్ర నాగరాజ్ సి,మల్లన్న నాగేంద్ర పటేల్ తదితరులు పాల్గొన్నారు.

DR నగేష్ ఆధ్వర్యంలో బోదనెల్లి గ్రామంలో వైద్య శిబిరం.

డాక్టర్ నగేష్ ఆధ్వర్యంలో బోదనెల్లి గ్రామంలో వైద్య శిబిరం

నేటి ధాత్రి చర్ల

చర్ల మండలం సత్యనారాయణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న బోదనెల్లి గ్రామంలో
డాక్టర్ నగేష్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు
ముగ్గురు జ్వరం బాధితులకు రక్త పరీక్ష మరియు ఆర్డిటి చేసినారు మలేరియా లేదని నిర్దారణ చేసి చికిత్సచేసినారు
32 మందికి సాధారణ వ్యాధుల కు మందులు ఇచ్చినారు
గర్భిణీ స్త్రీలకు పరీక్షలు చేసినారు
అలాగే ప్రతి నెల గర్భిణీ స్త్రీల పరీక్షలు చేయించుట కొరకు ఆసుపత్రికి రావాలని మరియు సురక్షిత కాన్పు కొరకు ప్రాధమిక ఆరోగ్య కేంద్రము సత్యనారాయణపురంకి రావాలి అని తెలిపారు
ర్యాపిడ్ ఫీవర్ సర్వే చేసినామని తెలిపారు
డ్రై డే కార్యక్రమాలు చేపించి ప్రతి శుక్రవారం ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని తెలిపారు
జ్వరాలు వచ్చిన వెంటనే అశ్రద్ధ చెయ్యకుండా ఆసుపత్రికి కి రావలెనని చెప్పడం జరిగింది
దోమల వలన వచ్చే వ్యాధుల గురించి చెప్పడం జరిగినది
కాచి చల్లార్చిన నీళ్లు త్రాగాలి
నీటి నిల్వలు లేకుండా చూడాలని
దోమలనుంచి రక్షణ కొరకు దోమతెరలు కట్టుకోవాలి ప్రజలకు తెలిపారు ఈ కార్యక్రమంలో
హెచ్ఈఓ బాబురావు
యమ్ హెల్ హెచ్ పి
సంధ్య హెల్త్ అసిస్టెంట్స్ వరప్రసాద్
కవిత
ఆశా కార్యకర్తలు
పోతమ్మ తదితరులు పాల్గొన్నారు

డాక్టర్ నగేష్ ఆధ్వర్యంలో బట్టిగూడెం గ్రామంలో ఆరోగ్య .

డాక్టర్ నగేష్ ఆధ్వర్యంలో బట్టిగూడెం గ్రామంలో ఆరోగ్య శిబిరం

నేటి ధాత్రి చర్ల

సత్యనారాయణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల వలస ఆదివాసి గిరిజన గ్రామమైన బట్టిగూడెం గ్రామంలో డాక్టర్ నగేష్ హెల్త్ క్యాంపు నిర్వహించినారు రోగులకు మందులు ఇచ్చారు అనంతరం ప్రతి ఇంటిని పరిశీలన చేసి గ్రామానికి వచ్చే వారు చతిస్గడ్ నుంచి వచ్చే వారి నుండి రక్తనమూనాలను సేకరించాలని వారి నుండి మలేరియా మనకు సోకే అవకాశం ఉన్నoదున జాగ్రత వహించాలని మరియు పరిసరాలు పరిశుభ్రత పాటించాలని నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని దోమ తెరలు వినియోగించు కోవాలని పరిశుభ్రమైన మంచి నీరును తీసుకోవాలని నీటి నిల్వలలో యాంటి లార్వా టేమిఫోస్ వేయడం జరిగిందని ఈ కార్యక్రమంలో సత్యనారాయణపురం ప్రాథమిక వైద్యశాల సిబ్బంది
టీ బాబురావు హెచ్ ఈ ఓ
కే తిరుపతమ్మ యమ్ పి హెచ్ యస్టి వేణు హెల్త్ అసిస్టెంట్
కే విజయక్ష్మి యమ్ పి హెచ్ ఏ కే తిరుపతమ్మ ఆశా కార్యకర్త తదితరులు పాల్గొన్నారు

డాక్టర్ శ్రీధర్ ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరం

డాక్టర్ శ్రీధర్ ఆధ్వర్యంలో ఉయ్యాలమడుగు గ్రామంలో ఆరోగ్య శిబిరం

నేటి ధాత్రి చర్ల

మలేరియా ప్రభావిత ప్రాంతం మారుమూల ప్రాంతమైన ఉయ్యాల మడుగు గ్రామంలో డాక్టర్ శ్రీధర్ ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరం నిర్వహించారు
ఈ ఆరోగ్య శిబిరం లో నలభై అయిదు మందికి ప్రభుత్వఆరోగ్య సేవలు అందించారు
జ్వరంతో బాధపడుతున్న ఇద్దరు నుండి రక్త పరీక్షలు చేసి సాధారణ జ్వరం గా నిర్ధారించి వైద్యం అందించడం జరిగినది
అనంతరం ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్న సికిల్ సెల్ అనీమియా టెస్టులను పరిశీలించారు
అనంతరం గ్రామంలో జరుగుతున్న దోమల మందు పిచికారి కార్యక్రమాన్ని పరిశీలించడం జరిగినది
డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ ఉయ్యాల మడుగు గ్రామం చతిస్గడ్ రాష్ట్రానికి అతిసమీపంగా ఉండడం బంధు మిత్రులందరు సతీష్గడ్ రాష్ట్రం నుండి రాకపోకలు అధికంగా జరగడం వలన మలేరియా ప్రబలే అవకాశం ఉన్నది గనుక ఎవరైనా సతీష్గడ్ వెళ్లిన లేదా బంధువులు వచ్చి వెళ్లిన వెంటనే మలేరియా పరీక్షలు చేయించుకోవడం మంచిదని జ్వరం వచ్చినట్లయితే గవర్నమెంట్ హాస్పిటల్ కి మాత్రమే రావడం ద్వారా మలేరియా పరీక్షలు చేసి వైద్యం అందిస్తారని తెలియజేశారు
సీజనల్ వ్యాధులు పెరగకుండా సాధ్యమైనంత వరకు దోమలు కుట్టకుండా చూసుకోవాలని దోమతెరలు కంపల్సరీ వాడాలని కాచి చలార్చిన నీటిని మాత్రమే త్రాగాలని ఆహారం వేడివేడిగా ఉన్నప్పుడు మాత్రమే తినాలని తెలియజేశారు
ఈ కార్యక్రమంలో మొబైల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సచిన్ సబ్ యూనిట్ ఆఫీసర్ ధర్మారావు హెల్త్ సూపర్వైజర్ రాంప్రసాద్ ల్యాబ్ టెక్నీషియన్ గోపి మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ తులసి మొబైల్ స్టాప్ నర్స్ దీక్షిత ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు

శాస్త్రవేత్త ఆధ్వర్యంలో అన్నదాత అవగాహన.!

శాస్త్రవేత్త ఆధ్వర్యంలో అన్నదాత అవగాహన కార్యక్రమం…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి..,

 

 

 

 

తంగళ్ళపల్లి మండలం రాళ్లపేట గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అవగాహన కార్యక్రమాన్ని బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల ఆధ్వర్యంలో నిర్వాహరయమంగా కొనసాగిస్తున్నారు.

ఈ సందర్భంగా వ్యవసాయ దత్తత గ్రామమైన రాళ్లపేట గ్రామంలో.

వ్యవసాయ అధికారులు శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో.

రైతులకు అధిక దిగుబడుల గురించి చెప్పటాల్సిన .

అధునాతన వ్యవసాయ సాంకేతిక విధానాలపై అవగాహన కల్పిస్తూ.

శాస్త్రవేత్తలు మాట్లాడుతూ రైతులకు క్షేత్రస్థాయిలో అవసరమయ్యే ఆరు అంశాలు అనగా.

తక్కువ యూరియా వాడండి.

సాగు ఖర్చులు తగ్గించండి.

అవసరం మేరకే రసాయనాలు వినియోగించండి.

నెల. తల్లి ఆరోగ్యాన్ని కాపాడండి రసిదరులు భద్రపరచుకోండి.

కష్టకాలంలో నష్టపరిహాన్ని పొందండి.

సాగు నీటిని ఆదా చేయండి.

భవితరాలకు అందించండి.

పంట మార్పిడి పాటించండి.

సుస్థిర ఆదాయాన్నిపోద్దండి చెట్లను పెంచండి పర్యావరణాన్ని కాపాడండి.

అనే అంశాలపై అవగాహన కల్పించారు వీటితోపాటు వరిలోని వివిధ రకాల నూతన వంగడాలు కూరగాయలు సాగు పంటల్లో చీడపురుగు పీడలు నివారణ చర్యలు పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

డాక్టర్ ఆర్ సతీష్ మాట్లాడుతూ.

నైట్రోజన్ ఎరువులు మరియు పురుగుల మందులు సరైన నియోగం పచ్చి రొట్టఎరువుల.

ప్రాముఖ్యత మరియు వరి తెగులు. నెక్ బ్లాస్ట్ నివారణ సమగ్ర సస్యరక్షణ. Ipm.

పద్ధతులు నిర్వహించారు.

అలాగే. ఐ సి డి ఎస్. సూపర్వైజర్ శ్రీ నిర్మల దేవి మాట్లాడుతూ చంటి పిల్లల తల్లిదండ్రులు.

పిల్లల ఆహారం మరియు వారి ఆరోగ్యం పై తగినంత జాగ్రత్త వహించాలని తెలియజేస్తూ వ్యవసాయ అధికారి.

కే సంజీవ్ మరియు ఏఈఓ లు నాణ్యమైన విత్తనాలు వేసేసమయం గురించి రైతులకు సూచనలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో రైతుల తెగుళ్లు.

కోతుల బెడద.

మట్టి నమూనాలు.

పరీక్ష కేంద్రాలకు పంపించాలని కోళ్ల పెంపకం గురించి సందేహాలు నివృత్తి చేసుకున్నాడు ద్వారా పెరటిలో పెంచుకునే విత్తనాలు మరియు జగిత్యాల విత్తనాలను రైతులకు అందజేశారు.

ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా.పాక్స్.

చైర్మన్ బండి దేవదాస్.

మండల వ్యవసాయ విస్తరణ అధికారి డి సలీం.

ఏ కరుణాకర్. ఆర్ గౌతం. ఎం మౌనిక. అంగన్వాడి టీచర్. ఎన్ వినోద. విద్యార్థులు. అభిలాష్. రాకేష్. రాళ్ల పేట గ్రామ రైతులు ప్రజలు తదితరులు పాల్గొన్నా

మోడీ చిత్రపటానికి బిజెపి ఆధ్వర్యంలో పాలాభిషేకం.

మోడీ చిత్రపటానికి బిజెపి ఆధ్వర్యంలో పాలాభిషేకం

సిరిసిల్ల టౌన్: ( నేటిధాత్రి)

 

 

ఈరోజు సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో భారత దేశవ్యాప్తంగా కులగణనకు మోదీ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నందునా బుదవారం జరిగిన రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశంలో, జనాభా లెక్కలతోపాటే కులగణనను నిర్వహించాలని తీర్మానించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ, కర్ణాటకల్లో కులగణన తప్పుల తడకగా లెక్కలు చేసి మళ్లీ లెక్కిస్తామని ప్రకటన చేసిన కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఈ అంశాన్ని విస్మరించిందని అధికారం పోయాక విమర్శలు తప్ప చేసేది ఏం లేదు కానీ మోదీ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని దేశవ్యాప్తంగా బీసీ, sc, st లు మరియుప్రతి కులస్తులు అందరూ స్వాగతిస్తున్నారు ఈ కులగణణ ‘సమ్మిళిత వృద్ధి’ వేగం గా పుంజుకుంటుందని తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది సెప్టెంబరులో జన, కులగణనను ప్రారంభించి, రెండేళ్లలో ముగించనున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ చిత్ర పటానికి భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ మ్యాన రాంప్రసాద్ జిల్లా కార్యదర్శి గజ బింకర్ చందు, పట్టణ ప్రధాన కార్యదర్శి ఎనగంటి నరేష్ జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు పండగ మాధవి, బీజేవైఎం ఉపాధ్యక్షుడు దూడం శివప్రసాద్, పట్టణ ఉపాధ్యక్షులు చొప్పదండి అంజన్న, ఊరగొండ రాజు, మోర శ్రీహరి, పంపరి అర్జున్, చొప్పదండి శ్రీనివాస్, కోడం శ్రీనివాస్, ఇంజాపూరి మురళి, దుమాల శ్రీకాంత్, మహేశుని అనిల్, దూడం సురేష్, టవటం రాజలింగం, నాగుల శ్రీనివాస్, చొక్కి శీను, పచ్చునూరి సురేష్, వేముల సురేష్, గాలి శీను, కర్నే రేవంత్, కోడం రవి, తాటిపాముల విష్ణు, జింగం శ్రీనివాస్, వేముల పోశెట్టి, నల్లగొండ సాయిచంద్, భాగయ్య, ఆడెపు వేణుమాధవ్, చిలుక శ్రీకాంత్ కర్నె గణేష్, మరియు భారతీయ జనతా పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఎంపీ సురేష్ శెట్కార్ ఆధ్వర్యంలో బోర్.

ఎంపీ సురేష్ శెట్కార్ ఆధ్వర్యంలో బోర్.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గం న్యాల్కల్ మండలం హుమ్నపూర్ గ్రామంలో ఎంపీ సురేష్ శెట్కార్ ఆధ్వర్యంలో అక్కమహాదేవి మందిరం దగ్గర బోర్ వేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుణవంత్ పాటిల్, కార్యకర్తలు భీమన్న, వైజీనాథ్ పాటిల్, రాజు, సిద్దయ్య స్వామి, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

యువకుల ఆధ్వర్యంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల.

ఖానాపూర్ క్రైస్తవ యువకుల ఆధ్వర్యంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల గారికి కాండిల్స్ తో నివాళులు అర్పించి అర్పించిన క్రైస్తవులు

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

ఆర్ ఇ పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి అనుమాన స్పద మృతి పట్ల సంపూర్ణ విచారణ జరిపి దుండగులను శిక్షించాలని నిరసన తెలుపడం జరిగింది రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు రాబోయే రోజుల్లో క్రైస్తవులపై,, పాస్టర్లపై దాడులు జరగకుండా తగు కఠినమైన చట్టాలని తేవాలని ఖానాపూర్ యువకుల పక్షాన కోరడం జరిగింది. ఈ కార్యక్రములో పెద్ద ఎత్తున ఖానాపూర్ క్రైస్తవ యువకులు పాల్గొని క్యాండీల్స్ తో నిరసన తెలపటం జరిగింది జరిగింది
ఈ కార్యక్రమములో్ ఎక్స్ ఎంపీటీసీ అనిత సంపత్ కుమార్ గ్రామ పెద్దలు కులవస్తులు పాల్గొని వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరడం జరిగింది.

మోదీ నాయకత్వంపై విశ్వాసంతో బీజేపీలోకి వలసలు.

మోదీ నాయకత్వంపై విశ్వాసంతో బీజేపీలోకి వలసలు.

 

#రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పార్టీ బిజెపినే.

 

#ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం పై వ్యతిరేకత పవనాలు.

 

#జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రానా ప్రతాపరెడ్డి.

 

నల్లబెల్లి, నేటి ధాత్రి:

దేశంలో దశాబ్ది కాలంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమర్థ వంతంగా పలు సంక్షేమ పథకాలు చేపడుతూ భారత దేశపు ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టిస్తున్న నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరిచి అండగా నిలవడానికి పలువురు బిజెపి పార్టీ వైపు చూస్తున్నారని

జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాపరెడ్డి అన్నారు బుధవారం మండల పార్టీ అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్ ఆధ్వర్యంలో మండలంలోని దస్తగిరిపల్లి గ్రామానికి చెందిన బి ఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు రాణా ప్రతాపరెడ్డి సమక్షంలో పార్టీలో చేరగా వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ పరిపాలన విధానాన్ని గమనించి దేశ ఆర్థిక వ్యవస్థ, రక్షణ బీజేపీ పార్టీతోనే సాధ్యమవుతుందని నమ్మి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, బి ఆర్ఎస్ పార్టీల పరిపాలనపై విసిగిపోయిన ప్రజలు

రాష్ట్రానికి ప్రత్యామ్నయం బిజెపి పార్టీ అని భావించి నర్సంపేట నియోజకవర్గం లో భారీగా చేరికలు జరుగుతున్నాయని అన్నారు.

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అమలు కానీ హామీలను మేనిఫెస్టోలో పెట్టి అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారని రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పి బిజెపి జెండాను ప్రతి గ్రామంలో ఎగరవేసే విధంగా కార్యకర్తలు నాయకులు అహర్నిశలు కృషి చేయాలని ఆయన అన్నారు.

పార్టీలో చేరిన వారు మాజీ వార్డ్ మెంబర్ గుంపుల రాజు, బిఆర్ఎస్ మాజీ గ్రామ పార్టీ అధ్యక్షుడు గంగరబోయిన సాగర్, ముదిరాజ్ సంఘం అధ్యక్షు డు జక్కుల నరసింహ రాములు, మండల

కేంద్రానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త ఎద్దునరేష్, తదితరులు వాటిలో చేరారు

ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ బొద్దిరెడ్డి ప్రతాపరెడ్డి, నాయకులు ఊటుకూరి చిరంజీవి, బత్తిని కుమారస్వామి, కక్కెర్ల సమ్మయ్య, మురికి మనోహర్, దొమ్మటి శీను తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version