మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం కు చెందిన కాంగ్రెస్ పార్టీ టి.పిసిసి ప్రధాన కార్యదర్శి ఎస్. వినోద్ కుమార్ ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ అబ్జర్వర్ గా రెండవసారి బుధవారం నియామకమయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎక్కువ అనుభవం ఉన్న వ్యక్తిగా చాలా సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్తూ ఓ నిజమైన నాయకుడిగా ఆయన ఎన్నో పదవులు పొందినారు .ఖైరతాబాద్ నుంచి మరోసారి కాంగ్రెస్ పార్టీ తరఫున అబ్జర్వ్ గా ఆయనను నియమించడం జరిగింది.ఈ మేరకు టి.పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంకితభావంతో పని చేసినందుకు తనకు కాంగ్రెస్ పార్టీ రెండవసారి ఖైరతాబాద్ అబ్జర్వర్ గా నియమించినందుకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. కాంగ్రెస్ పార్టీ నిరుపేదల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు. పేదల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం అన్నారు.
మండల కేంద్రంలోని రెండవ వార్డ్ అభ్యర్థిగా పోటీలో నిలబడి వార్డు ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో మీ ముందుకు వస్తున్నానని రెండో వార్డ్ అభ్యర్థిగా తాళ్ళ అశోక్ ముదిరాజ్ తెలిపారు. వారు మాట్లాడుతూ మీ ఇంటి బిడ్డగా వస్తున్న మీ కష్టసుఖాలలో పాలుపంచుకుంటా,వార్డు ప్రజలకు సేవ చేస్తా,వార్డ్ అభివృద్ధే నా లక్ష్యమని ఎప్పటికప్పుడు ప్రజల మధ్యలో ఉండి సమస్యలు పరిష్కరిస్తా వార్డును ఆదర్శ తీర్చిదిద్దేందుకు అహర్నిశలు కష్టపడతా మీ అందరి సహాయ సహకారాలతో సమష్టిగా ముందుకెళ్దా ఆని అన్నారు.
రాంనగర్ కాంగ్రెస్ పార్టీలో రగడ అభ్యర్థి ఎంపికపై వివాదం తీవ్రం
కొత్త వ్యక్తికి ప్రాధాన్యం ఎందుకు? కేడర్లో ఉత్కంఠ… ప్రజల్లో అనుమానాలు…
నేటిధాత్రి ఐనవోలు :-
అయినవోలు మండలం రాంనగర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపికపై తీవ్ర చర్చ జరుగుతోంది. గ్రామంలో కష్టపడి పనిచేసిన నాయకులు పక్కనపడిపోగా, కొత్తగా పార్టీలో చేరిన వ్యక్తిని అభ్యర్థిగా నిలబెట్టాలని ఉన్నత నాయకత్వం ఆలోచిస్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై స్థానిక కేడర్, ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.
పార్టీలోకి కొత్త – మాట నిలకడపై ప్రశ్నలు
అభ్యర్థిగా పరిగణనలో ఉన్న వ్యక్తి ఇటీవలే కాంగ్రెస్లో చేరిన వ్యక్తి కావడం ప్రధాన అభ్యంతరంగా మారింది.పార్టీ కోసం కష్టపడిన నాయకులను విస్మరించి, కొత్తగా వచ్చినవారికి అవకాశం ఇస్తారా?” అని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. అంతేకాక, మాట నిలకడ లేకపోవడం, గతంలో పలుమార్లు పార్టీల మార్పు చేయడం వంటి ఆరోపణలు కోలాహలం సృష్టిస్తున్నాయి.ఈ నేపథ్యం వల్ల గ్రామ ప్రజల్లో కూడా ఆ అభ్యర్థిపై నమ్మకం లోపిస్తున్నట్లు సమాచారం.అంతేగాకుండా గతంలో కొన్ని సి(ఏ)విల్ వివాద విమర్శలు ఉన్నాయి.ఈ అంశం అభ్యర్థి నమ్మకార్హతపై మరో పెద్ద ప్రశ్నార్థకంగా నిలుస్తోంది.
ప్రజాభిప్రాయానికి వ్యతిరేక ఎంపికా??? పార్టీకి సంవత్సరాలుగా కష్టపడిన నాయకులకే టికెట్ ఇవ్వాలి అనే అభిప్రాయాన్ని ఎమ్మెల్యే బలంగా చెబుతున్నా, కూడా ప్రజాభిప్రాయం ప్రకారం,స్థానిక నాయకులు కొత్తగా వచ్చిన వ్యక్తి పట్ల విశ్వాసం ఎక్కువ గా చూపడం వాస్తవానికి అభ్యర్థి పట్ల ప్రజల్లో విశ్వాసం తక్కువగా ఉండడం వల్ల కాంగ్రెస్ ఓటు బ్యాంక్ దెబ్బతినే అవకాశం ఉందని నాయకులు ఆందోళన చెందుతున్నారు.
ఎమ్మెల్యేకు తప్పు సమాచారం చేరిందా అనే అనుమానం
అభ్యర్థి ఎంపిక ప్రక్రియలో కొంతమంది నాయకులు తమకనుకూలంగా సమాచారం అందజేస్తున్నారన్న భావన పార్టీ శ్రేణుల్లో పెరుగుతోంది. గ్రామ వాస్తవ పరిస్థితులు, ప్రజాభిప్రాయం, కేడర్ కృషి ఈ విశ్లేషణలేవీ స్థానిక ఎమ్మెల్యే నాగరాజు కు వాస్తవ విరుద్ధంగా వెళ్తున్నాయి అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అంతర్గత రగడ – ప్రత్యర్థి పార్టీకి లాభమా?
కాంగ్రెస్లో కొనసాగుతున్న ఈ అంతర్గత తగాదాల వల్ల బిఆర్ఎస్ కు ప్రత్యక్షంగా లాభం కలగవచ్చని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
కేడర్లో విభజన, అసంతృప్తి, అంతర్గత రగడ పై కేడర్ అభిప్రాయం ఏమిటంటే..
గ్రామంలో కట్టుబడి పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.అభ్యర్థి నమ్మకార్హత, క్రమశిక్షణ, గత అనుభవం వంటి అంశాలను బేరీజు వేసుకోవాలి లేకపోతే రాబోయే ఎన్నికల్లో రాంనగర్ కాంగ్రెస్కు గట్టి ఎదురుదెబ్బ తగలవచ్చని కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు.
పిఆర్పి మంచిర్యాల మైనార్టీ విభాగం అధ్యక్షుడిగా ఎండీ ఇలియాస్
మంచిర్యాల,నేటి ధాత్రి:
రాజ్యాధికార పార్టీ మంచిర్యాల జిల్లా మైనారిటీ విభాగం అధ్యక్షులుగా ఎం.డి.ఇలియాస్ ను నియమించారు.జిల్లా కార్యాలయంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షులు మహేష్ వర్మనీ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించడం జరిగింది.అనంతరం ఇలియాస్ మాట్లాడుతూ..నాపై నమ్మకంతో అప్పజెప్పిన ఈ బాధ్యతలను సక్రమంగా నిర్వహించి పార్టీ అభ్యుదయానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.ఈ అవకాశాన్ని కల్పించినందుకు తీన్మార్ మల్లన్నకి,ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ కొమ్ముల ప్రవీణ్ కి,జిల్లా అధ్యక్షులు మహేష్ వర్మకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.పార్టీ బలోపేతానికి కృషి చేసి,మైనారిటీల సమస్యలు పరిష్కారం దిశగా పని చేస్తానని తెలపడం జరిగింది.వచ్చేది బీసీల రాజ్యమే అని మైనారిటీలు అందరు తెలంగాణ రాజ్యాధికార పార్టీ పై తీన్మార్ మల్లన్న సారధ్యంలో మన రాజ్యాధికారం వస్తుందని విశ్వసిస్తున్నారని తెలిపారు.అనంతరం ఎం.డి.ఇలియాస్ ని శాలువాతో సత్కరించి పార్టీ బలోపేతానికి కృషిచేయాలని జిల్లా అధ్యక్షులు మహేష్ వర్మ సూచించారు.
ఏఐసిసి కార్యదర్శిగా నియమితులైన జెట్టి.కుసుమకుమార్ ను సన్మానించిన
◆:- తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గ నవంబర్ (13) ఏఐసీసీ కార్యదర్శిగా ఒడిశా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జిగా నియమితులైన జెట్టి, కుసమకుమార్ వారి నివాసంలో గురువారం మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్, గిరిధర్ రెడ్డి వారితో పాటు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి పాల్గొన్నారు.
ఎస్టిపిపి బ్రాంచ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన డి.పంతులా
జైపూర్,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్లో శుక్రవారం సిఎంఓఎఐ జనరల్ బాడి మీటింగ్,జనరల్ మేనేజర్ అధ్యక్షతన జరిపించారు.ఈ సమావేశంలో లో జనరల్ సెక్రటరీ సంతోష్ ఇదివరకు జరిగిన కార్యక్రమాలను జరగబోయే కార్యక్రమాలను గురించి వివరించారు.తదుపరి జిఎం ఎస్టిపిపి ఎం.నరసింహారావు,జీఎం(పిసిఎస్) &(ఓ&ఎం) మదన్మోహన్ ఆదేశాల మేరకు ఖాళీగా ఉన్న ప్రెసిడెంట్,వైస్ ప్రెసిడెంట్,జాయింట్ సెక్రటరీ పదవులకు నామినేషన్ కోరడమైనది.దీనికి అధికారుల సంఘం సభ్యులందరూ సిఎంఓఎఐ ఎస్టిపిపి బ్రాంచ్ ప్రెసిడెంట్ గా డి.పంతులా ని ఏకగ్రివంగా ఎన్నుకున్నారు.వైస్ ప్రెసిడెంట్ గా జనగామ శ్రీనివాస్ ని,జాయింట్ సెక్రటరీ గా శ్యామల ని ఎన్నుకోవడం జరిగింది.అనంతరం నూతనంగా ఎన్నికైన ప్రెసిడెంట్ ధారావత్ పంతులా మాట్లాడుతూ.. అధికారుల సంఘం సభ్యులకి ఎస్టిపిపి యాజమాన్యానికి ప్రత్యెక ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే కాలంలో అందరి సహాయ,సహకారాలతో సెంట్రల్ కమిటి సభ్యులతో,యాజమాన్యాన్ని సమన్వయ పరుస్తూ పెండింగ్ లో ఉన్న పనులను, ఉద్యోగులకు సంబంధించిన సమస్యలను సాధించుకోవడానికి తనవంతు కృషి చేస్తానని తెలియజేసారు.ఈ కార్యక్రమానికి ఎస్టీపీపీ ఈడి సిహెచ్.చిరంజీవి,జిఎం ఎస్టిపిపి ఎం.నరసింహారావు,జీఎం(పిసిఎస్) & (ఓ&ఎం)మదన్మోహన్,ఏజిఎం (ఫైనాన్స్)మురళీధర్,డిజిఎం (సివిల్) ఆజాజుల్లా ఖాన్,డీజీఎం(పర్సనల్),డి కిరణ్ బాబు,కార్యవర్గ సభ్యులు డి.పంతులా,సంతోష్ కుమార్,జనగామ శ్రీనివాస్,అప్పారావు,రమేష్,శ్యామల,మోబిన్ పాల్గొన్నారు.
సంక్షోభాలను సవాళ్లను ఎదుర్కొని గెలిచిన ఉక్కు మహిళ ఇందిరాగాంధీ- వెలిచాల రాజేందర్ రావు
కరీంనగర్, నేటిధాత్రి:
స్వాతంత్య్ర పోరాటయోధురాలు, దేశ మహిళా శక్తికి ప్రతీక నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయురాలు మాజీ ప్రధానమంత్రి, భారతరత్న స్వర్గీయ ఇందిరా గాంధీ అని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. శుక్రవారం ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని డిసిసి కార్యాలయంలో ఆమహానీయురాలు చిత్రపటానికి వెలిచాల రాజేందర్ రావు కాంగ్రెస్ నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈసందర్భంగా రాజేందర్ రావు మాట్లాడుతూ పేదల పక్షపాతి, బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి ఇందిరా గాంధీ అని, సంక్షోభాలను సవాళ్లను ఎదుర్కొని గెలిచిన ఉక్కు మహిళ ఇందిరాగాంధీ అని గుర్తు చేశారు. ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా వారి దివ్య స్మృతికి నివాళులు అర్పించామని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఆర్ష మల్లేశం, అనంతుల రమేష్, పలువురు కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
*ముఖ్యమంత్రి చంద్రబాబు అపార అనుభవం వల్లే ప్రాణ నష్టాన్ని నివారించగలిగాం..
*చిత్తూరు పార్లమెంటు పరిధిలో ప్రజలకు బాసటగా నిలిచిన ప్రజాప్రతినిధులు, అధికారులకు అభినందనలు.
*చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు..
చిత్తూరు(నేటి ధాత్రి)అక్టోబర్
ఆంధ్ర ప్రదేశ్ ను వణికించిన మొంథా తుఫాన్ను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన అపార అనుభవంతో ఎదుర్కొన్న తీరు మహా అద్భుతమని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు ఓ ప్రకటనలో కొనియాడారు. మొంథా తుఫాన్ బలహీన పడడంతో రాష్ట్రానికి ముప్పు తప్పిందని ఆయన అన్నారు. మొంథా తుఫాన్ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న ముందస్తు చర్యలను చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు గురువారం ఓ ప్రకటనలో అభినందనలు, ధన్యవాదాలు తెలియజేశారుమా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు అపార అనుభవం, పాలనా దక్షత వల్లే మొంథా తుఫాన్ ప్రమాదం నుంచి ఆంధ్రప్రదేశ్ను కాపాడుకోగలిగామన్నారు. ఏపీ ప్రజల పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకున్న చిత్తశుద్ధికి ఇదో తార్కాణమన్నారు.
మొంథా తుఫాన్ బలహీన పడిన తర్వాత సీయం ఏరియల్ సర్వే నిర్వహించడం.
తుఫాను వల్ల నష్టపోయిన ప్రజలను స్వయంగా పరామర్శించడంతోపాటు బాధితులకు ముఖ్యమంత్రి సహాయం అందించి, వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపడం స్ఫూర్తిదాయకమన్నారు. తుఫాను వల్ల పునరావాస కేంద్రాలకు తరలివచ్చిన ప్రతి కుటుంబానికి రూ.3,000 ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందనీ చెప్పారాయన. పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి, మత్స్యకార కుటుంబాలకు 25 నుంచి 50 కిలోల బియ్యంతో పాటు,పప్పు, నూనె, ఉల్లిగడ్డలు, బంగాళాదుంపలు, చక్కెర వంటి నిత్యావసర వస్తువులను పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారనీ..ఆపదలో ఉన్న ఆప్తులకు ఆపన్న హస్తాన్ని అందించడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి మించిన సియంను తాను చూడలేదన్నారు. అదేవిధంగా తుఫాను కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందజేయనున్నట్లు సీఎం ప్రకటించారని తెలియజేసిన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు. దాదాపు 87 వేల హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు అంచనాలను అధికారుల ద్వారా తక్షణం సమాచారాన్ని సేకరించడం సీఎం పాలనా దక్షతకు నిదర్శనమని కొనియాడారు. తుఫాను తీరం దాటిన తర్వాత కూడా అప్రమత్తంగా ఉండాలని, సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించడం కర్తవ్య నిర్వహణలో ఆయనకున్న చిత్తశుద్ధిని, సమయస్ఫూర్తిని తెలియజేసిందన్నారు. మొంథా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో చిత్తూరు పార్లమెంటు పరిధిలో అప్రమత్తతో వ్యవహరించి, ప్రజలకు బాసటగా నిలిచిన ఎమ్మెల్యేలు, అధికారులను చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు ఈ సందర్భంగా అభినందించారు.
మైసూర్ లో వెస్టీజ్ కంపెనీ మైండ్ సెట్ శిక్షణ ఏర్పాటు
విజయవంతం చేసిన మంచిర్యాల టీం
హైదరాబాద్,నేటి ధాత్రి:
మైసూర్ లో వెస్టీజ్ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ కంపెనీ మైండ్ సెట్ శిక్షణ క్లాసులు మంగళవారం,బుధవారం రెండు రోజులుగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి వి.ఎం.సి.ఎం సుబ్బయ్య శెట్టి ముఖ్య అతిథిగా పాల్గొని వి.ఎం.సి.ఎం ఎం.ఎస్.ఆర్ తో కలసి మైండ్ సెట్ శిక్షణ క్లాసులు 300 మందికి పైగా మైసూర్ ప్రెసిడెంట్ హోటల్ లో ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా వి.ఎం.సి.ఎం సుబ్బయ్య శెట్టి మాట్లాడుతూ.. మైండ్ సెట్ క్లాస్ అంటే ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని సాధించడానికి మనస్తత్వాన్ని ఎలా మార్చుకోవాలి అనే దానిపై శిక్షణ,విధివిధానాలు తెలిపారు.సుబ్బయ్య శెట్టి మాటలు విన్న చాలా మంది నిరు పేదలు వారి మైండ్ సెట్ మార్చుకొని వెస్టీజ్ కంపెనీలో నిలబడి పనిచేస్తూ వాళ్ళ జీవితాలను మార్చుకొని గొప్పగా జీవిస్తూ వారి ఆశయాలను సాధిస్తున్నారని అన్నారు.
మన జీవనశైలి విధానంలో మార్పు రావాలి
ప్రతి ఒక్క వ్యక్తి తన జీవన విధానంలో అనేక మార్పులు చోటు చేసుకున్న వారి ఆర్థిక ఇబ్బందులను,సమస్యలను నిలుదొక్కుకొని వేస్టేజ్ సిస్టం ను ఫాలో అవ్వడం వల్ల వారి లక్ష్యాన్ని చేరుకుంటారని అన్నారు.
ప్రతి పనిలో పట్టుదలతో పనిచేయాలి
మానవ జీవన విధానంలో ఏ పని చేసిన పట్టుదలతో,ఒక సంకల్పం లాగా పని చేసినప్పుడే విజయాలు చేకూర్తాయని అన్నారు.అలాగే నీతి,నిజాయితీ,ఏకాగ్రత,నిబంధనతో పనిచేస్తూ తోటి వారికి సహాయం చేస్తూ ప్రేమగా,ఆప్యాయంగా ఉంటూ విజయాలను సాధించాలని తెలిపారు.
ఎంపీ వద్దిరాజు ఎమ్మెల్సీ పోచంపల్లితో కలిసి కార్యకర్తలకు దిశానిర్దేశం
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్,రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తదితర ప్రముఖులతో కలిసి ముఖ్య కార్యకర్తలతో సమావేశమై వారికి దిశానిర్దేశం చేశారు.
ఈ సమావేశానికి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆశీస్ కుమార్ యాదవ్,మంగళారపు లక్ష్మణ్,పుస్తె శ్రీకాంత్,వాసాల వెంకటేష్,పర్వతం సతీష్ తదితర ప్రముఖులు హాజరయ్యారు.
చుంచుపల్లి మండలం రామాంజనేయ కాలనీ నుండి ఎంపీటీసీ బరిలో పోకల శ్రీలత
బి.ఆర్.యస్ పార్టీకి కట్టుబడి నియమ నిబద్ధతతో ఉంటూ కార్యక్రమంలో ముందంజ పోకల శ్రీలత
గతంలో వార్డు నంబరు గా ఇండిపెండెట్ అభ్యర్ధి అత్యధిక మెజార్టీ తో గెలుపొందారు
గతంలో ఎంపీటీసీ,జెడ్పీటీసీ అభ్యర్ధులు గెలవడంలో కీలకపాత్ర పోషించిన శ్రీలత
కొత్తగూడెం నియోజకవర్గం చుంచుపల్లి మండలం రామాంజనేయ కాలనీ నుండి
ఎంపీటీసీ అభ్యర్ధిగా పోటీచేస్తున్న పోకల శ్రీలత బి.ఆర్.యస్ పార్టీకి కట్టుబడి నియమ నిబద్ధతో పార్టీకి కష్టపడి ఒక సామాన్య కార్యకర్తగా ఉంటూ పార్టీ యొక్క ప్రతి కార్యక్రమములో పాల్గొంటూ ముందజంలో ఉన్నారు పార్టీ ఇచ్చిన ప్రతి ఒక్క కార్యక్రమంలో చురుకుగా తనదైన శైలిలో కార్యకర్తలను పోగుచేయడంలో శ్రీలత కి సాటి లేరు పార్టీ ఇచ్చిన
ఆదేశానుసారం ప్రతి ఒక్క కార్యక్రమములో పాల్గొంటూ తమకంటూ ఒక ప్రత్యేక స్థానంసంపాదించుకున్నారు నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజలందరికీ సుపరితురాలు అయ్యరూ,పోయిన ఎన్నికల్లో వార్డు నంబరు గా ఇండిపెండెట్ గా పోటీ చేసి అత్యధిక
మెజార్టీ తో గెలుపొందింది వార్డులో నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలుపరిష్కరించి అందరికీ ఇంటికి ఆడ బిడ్డ అయ్యారు,పోయిన ఎంపీటీసీ జెడ్పీటీసీ అభ్యర్ధులు గెలవడంలో కీలక పాత్ర పోషించారు వార్డులో అత్యధిక మెజారిటీ
పార్టీ అభివృద్ధికి కృషి చేసిన వారికి అవకాశం ఇవ్వాలి 20 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి సైనికుడిలా పనిచేశాను పార్టీ కోసం ఎన్నో ఆటుపోట్లు, అవమానాలు ఎదుర్కొన్నాం కష్టాలు పెట్టినా కండువా మార్చలేదు, పార్టీ జెండా వీడలేదు ఆర్ధికం కాదు అభివృద్ధియే ప్రధాన లక్ష్యం కాంగ్రెస్ సీనియర్ నేత మండల కిసాన్ సెల్ అధ్యక్షులు గ్యాదరి భాస్కర్
నేటిధాత్రి ఐనవోలు :-
Vaibhavalaxmi Shopping Mall
హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం కాంగ్రెస్ పార్టీ జడ్పిటిసి అభ్యర్థి ఎంపిక పారదర్శకంగా ఉంటుందని ఆ పార్టీ సీనియర్ నాయకులు కిసాన్ సెల్ మండల అధ్యక్షులు గ్యాదరి భాస్కర్ ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ కష్ట కాలంలో సైతం కండువా మార్చకుండా పార్టీ గెలుపు కోసమే నిరంతరం కృషి చేసిన నిస్వార్థపూరితమైన నేతలకు అవకాశం కల్పించాలని ఆయన అధిష్టానాన్ని కోరారు. 2001లో తాను కాంగ్రెస్ పార్టీలో చేరి గ్రామ కాంగ్రెస్ పార్టీలో మమేకమై పనిచేస్తూ, 2006లో ఉడత గూడెం గ్రామ వార్డు సభ్యునిగా ఏకగ్రీవంగా గెలవడం జరిగింది.
పార్టీ అధికారంలో లేకపోయినా మొక్కవోని దీక్షతో పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ కమిటీ సభ్యునిగా గ్రామానికి సేవలు అందించడం జరిగింది. 2014 సంవత్సరంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా గ్రామస్తులు అంత ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
2018లో రెండవసారి ఏకగ్రీవంగా గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా, కాంగ్రెస్ పార్టీ నాయకులు నేను చేసిన సేవను గుర్తించి ఎన్నుకోవడం జరిగిందన్నారు.2018లో జరిగిన స్థానిక సంస్థ ల ఎన్నికల్లో రామ్ నగర్ ఎంపిటిసి గా నామినేషన్ వేస్తే మండల కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు ఇతరులకు మద్దతుగా నిలబడి గెలిపించడం జరిగింది.
2020 సంవత్సరంలో అయినవోలు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వి.శ్రీనివాస్ నేను చేసిన సేవలను గుర్తించి కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడుగా నన్ను నియమించడం జరిగింది. అప్పటినుండి ఇప్పటివరకు రెండు పర్యాయాలుగా కిసాన్ సెల్ మండల అధ్యక్షులుగా ఇప్పటికీ కొనసాగుతూ తాజాగా తెలంగాణ ప్రభుత్వం స్థానిక రిజర్వేషన్లు కేటాయింపులో భాగంగా అయినవోలు జడ్పిటిసి స్థానం ఎస్సీ జనరల్ కు కేటాయించడం జరిగిందని ఎస్సీ రిజర్వేషన్ లో భాగంగా 25 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న ఎస్సీ కులస్తుడైన నాకు వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు కేఆర్ నాగరాజు జడ్పిటిసి గా అవకాశం కల్పించాలని కోరినట్లు భాస్కర్ తెలిపారు.
ఒకవేళ పార్టీ అవకాశం ఇస్తే అయినవోలు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుబంధ సంఘాల నాయకులు కర్షక కార్మిక చేతివృత్తిదారులు సబ్బండ వర్గాల ఆశీస్సులతో నన్ను జెడ్పిటిసిగా గెలిపించాల్సిందిగా భాస్కర్ కోరారు.
యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షునిగా పంచిక మహేష్ యాదవ్.
చిట్యాల, నేటిధాత్రి :
చిట్యాల మండలం కాల్వపల్లీ గ్రామానికి చెందిన పంచికా మహేష్ యాదవ్ నీ యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మేకల రాములు రాష్ట్ర అధ్యక్షులు కొక్కు దేవేందర్ యాదవ్ లు తెలిపారు, పంచిక మహేష్ యాదవ్ యాదవ జాతిని పటిష్టత కోసం నమ్మిన సిద్ధాంతం కోసం క్రమశిక్షణ గల యాదవ బిడ్డగా భూపాలపల్లి జిల్లా యాదవుల కోసం వారి సమస్యల కోసం ఎనలేని పోరాటాలు చేస్తారని యాదవుల కమ్యూనిటీ కోసం బలోపేతం చేస్తారని నమ్మకంతోని ఇవ్వడం జరిగింది పంచీక మహేష్ యాదవ్ నీ ఎన్నుకునట్లు తెలిపారు.
నూతనంగా ఎన్నకైన మహేష్ యాదవ్ మాట్లాడుతూ యాదవ జాతి కోసం సిద్దాంతము పునరంకితం అయి నితి నిజాయితీ క్రమశిక్షణ చిథశుద్దితో పని చేస్తానని యాదవుల సామాజిక వర్గం ఎదుర్కుంటున్న సమస్యలపై ఎనలేని పోరాటము చేస్తానని యాదవులను సంస్థాగతంగా పటిష్ఠ పరుస్తనను అదేవిధంగా నాకు సహకరించిన జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మేకల రాములన్నకు మరియు రాష్ట్ర అధ్యక్షులు దేవేంద్ర అన్నకు అలాగే రాష్ట్ర నాయకులు అందరికి ఇతర జిల్లా మండల నాయకులకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే జిల్లా జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి భూపాలపల్లి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా దొంగల రాజేందర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందిఅన్నారు,
మెట్ పల్లి ప్రెస్ క్లబ్ లో ఐజెయు జిల్లా కార్యవర్గ సభ్యులకు ఘన సన్మానం
మెట్ పల్లి అక్టోబర్ 4 నేటి ధాత్రి
మెట్ పల్లి ప్రెస్ క్లబ్ కు నూతనంగాఎన్నికైన ఉపాధ్యక్ష కార్యవర్గ సభ్యులకు సన్మానం మెట్ పల్లి గత రెండు నెలల క్రితం జగిత్యాల జిల్లకు ఐ జేయు ఎన్నికలు జరుగగా ఆ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డా జిల్లా కార్యవర్గ సభ్యులు షేక్ సాజిద్ పాషా, బాసెట్టి హరీష్ లను శనివారం రోజు మెట్ పల్లి ప్రెస్ క్లబ్ లో టీయూడబ్ల్యూజేఐజేయు అధ్యక్ష కార్యదర్శులు బూరం సంజీవ్, మమ్మద్ అజీమ్ ల ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ సభ్యులను ఘనంగా సన్మానించడం జరిగింది. వారితోపాటు మెట్ పల్లి ప్రెస్ క్లబ్ కు నూతనంగా ఎన్నికైన ఉపాధ్యక్షులు , మహమ్మద్ అఫ్రోజ్,కార్యవర్గ సభ్యులు బొల్లం రాజు, ఓంకారీ శ్రీనివాసులను కూడా సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఉపాధ్యక్షులు జంగం విజయ్, గౌరవ అధ్యక్షులు మాసుల ప్రవీణ్ , గౌరవ సలహాదారులు దాసం కిషన్,క్యాషియర్ మక్సూద్, జాయింట్ సెక్రెటరీ పుండ్ర శశికాంత్ రెడ్డి, పింజరి శివ,ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఎండి సమీయుద్దీన్, యస్ పి రమణ కార్యవర్గ సభ్యులు పోనగాని మహేందర్, కుర్ర రాజేందర్ ,యానం రాకేష్ ,రఫీ ఉల్లా, సోహెల్ , హైమద్, ముత్యాల రమేష్ ,విజయసాగర్, సభ్యులు ఆగ సురేష్,ఆదిల్ పాషా, ఏసమేని గణేష్, ఎండి అభిద్, రాజశేఖర్, అమ్ముల ప్రవీణ్, తేలు కంటే గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
స్థానిక ఎన్నికలె గ్రామాభివృద్ధికి ద్వేయంగా మారుతాయి
నేటి ధాత్రి కథలాపూర్
ఈ కాలంలో యువతరమే మార్పు తేవగల శక్తి. గ్రామ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించాల్సిన బాధ్యత ఇప్పుడు యువతపై ఉన్నది. స్థానిక ఎన్నికలే గ్రామాభివృద్ధికి ద్వేయంగా మారుతాయి.
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకుని గ్రామంలో అభివృద్ధి చేసే నాయకున్ని ఎన్నుకోవాలని కౌన్సిల్ ఫర్ సిటిజెన్ రైట్స్ (పౌర మరియు మానవ హక్కుల సంస్థ రాష్ట్ర కార్యదర్శి తాలూకా మల్లేష్ అన్నారు..
ఆయన మాట్లాడుతూ స్థానిక పాలనలో అభివృద్ధి లో ప్రజలు అసంతృప్తి చెందుతున్నారు నాయకులు ఒకసారి గెలిస్తే ప్రజల దగ్గరకు తిరిగి వెళ్ళరని ఆలోచన మారాలని ఆలోచన మారే విధంగా నూతనంగా ఎన్నుకోబడిన రాజకీయ నాయకుడు గ్రామ అభివృద్ధికి తోడ్పడి ఆ ఆలోచన రాకుండా చేయాలని అలాగే ఊరికి మార్పు కావాలంటే ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాలి. ఊరిలో మార్పు రావాలంటే మొదటగా మనం మారాలి గ్రామ సమస్యలపై అవగాహన ఉన్న వారిని, అలాగే విజన్, టెక్నాలజీ, వినియోగం ఇవన్నీ గ్రామ అభివృద్ధికి పనికొచ్చే అంశాలు నిజమైన సేవ భావనతో ముందుకు వచ్చినవారు గ్రామాన్ని సక్రమ దిశలో నడిపించగలరు గ్రామ సమస్యలు ఎత్తిచూపటమే కాదు వాటి పరిష్కారం చూపే దిశగా పనిచేయగల వ్యక్తిని ఎన్నుకోవాలి అలాగే ఓటర్లు కూడా డబ్బుకు మధ్యనికి లొంగకుండా కేవలం గ్రామ అభివృద్ధి మాత్రమే కోరుకోవాలని రాష్ట్ర కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ రాష్ట్ర కర్యదర్శి తాలూకా మల్లేష్ అన్నారు.
దశాబ్దాల పోరాటాలకు నిలువెత్తు నిదర్శనం కొండా లక్ష్మణ్ బాపూజీ
తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా నాయకులు మహేష్ వర్మ
మంచిర్యాల,నేటి ధాత్రి:
తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా బాపూజీ 110 వ జయంతి వేడుకలు శనివారం నిర్వహించారు.మంచిర్యాల జిల్లా కేంద్రంలోని తెలంగాణ రాజ్యాధికార పార్టీ మంచిర్యాల జిల్లా కార్యాలయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ 110వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.మహేష్ వర్మ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొని బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.అనంతరం టీఆర్పీ మంచిర్యాల జిల్లా నాయకులు మహేష్ వర్మ మాట్లాడుతూ.. తెలంగాణ మొదటి ఉద్యమకారుడు బాపూజీ అని అన్నారు. తెలంగాణ సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన మహనీయులని,బడుగు బలహీన వర్గాల చైతన్యానికి, వారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారని పేర్కొన్నారు. ఆయన చేసిన త్యాగాలు, సేవలను గుర్తు చేసారు. తెలంగాణ తొలి,మలి దశ ఉద్యమాల్లో కీలకంగా వ్యవహరించి తెలంగాణ జాతిపితగా కీర్తిని గడించారని అన్నారు.పదవులకన్నా ప్రాంతానికే మొదటి ప్రాధాన్యతను ఇచ్చి,తన పదవులను వదులుకుని ఉద్యమాన్ని ఉదృతం చేసి, ప్రజలను చైతన్యం చేసారని అన్నారు.వారి జయంతి సందర్భంగా మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ముద్దు బిడ్డ, తెలంగాణ జాతిపిత కొండా లక్ష్మణ్ బాపూజీ ని స్పూర్తిగా తీసుకుని రానున్న రోజుల్లో మన రాజ్యాధికారం సాధించుకునేందుకు అధికారం,ఆత్మగౌరవం,వాటా నినాదంతో తెలంగాణ రాజ్యాధికార పార్టీ పనిచేస్తుందని, దీనికి అన్ని వర్గాల ప్రజలు కలిసి రావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పాకాల దినకర్, దాస్యపు దీపక్,పడాల శివతేజ,కొత్తూరి సంతోష్, కుంట రాజేంద్రప్రసాద్, నామాల తిరుపతి,అకెనపల్లి మధు,పెట్టం రాజేష్,శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
మండలంలో ఘనంగా పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు * నివాళులర్పించిన బిజెపి జిల్లా కౌన్సిల్ నెంబర్
మహాదేవపూర్ సెప్టెంబర్ 25 (నేటి ధాత్రి)
మహాదేవపూర్ మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ అధ్యర్యంలో బీజేపీ జిల్లా కౌన్సిల్ నెంబర్ ఆకుల శ్రీధర్ అధ్యక్షతన గురువారం రోజున శ్రీ పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి సందర్బంగా బస్ స్టాండ్ ఆవరణలో వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులూ అర్పించారు. పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మాజీ అధ్యక్షులుగా, భారతీయ జనతా పార్టీ హైందవ రాష్ట్రo సిద్ధాంతకర్త అని, పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ 1916 సెప్టెంబర్ 25 న ఉత్తరప్రదేశ్ లోని మధుర దగ్గర ‘నగ్ల’ చంద్రబాన్ అనే గ్రామంలో జన్మించారని, మొదట కొద్దీ మంది స్వయం సేవకులలో ఒకరిగా చేరి ప్రాదేశీక సహా ప్రచారక్ స్థాయికి ఏదిగారని, భారతీయ జనతా పార్టీ హైందవ రాష్ట్రం సిద్ధాంతానికి పునాదిగా చెప్పబడే ఏకత్మాత మానవతా వాదం, శంకరాచార్య జీవిత చరిత్ర వంటి పుస్తకాలు రచించారాని, ఏకాత్మ మానవవాదం ప్రవచించి సమాజంలో అట్టడుగునా వున్నా వ్యక్తికి ప్రభుత్వ పథకాల్లో తొలి ప్రయోజనం చేకూరాలన్న అంత్యోదయ విధానాన్ని రూపొందించిన శ్రీ పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి సందర్బంగా ఆ మహనీయుడికి ఇవే మా ఘన నివాళులని వారు మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహాదేవపూర్ బీజేపీ మండల అధ్యక్షులు రాంశెట్టి మనోజ్, మండల ప్రధాన కార్యదర్శి బల్ల శ్రావణ్ కుమార్, బీజేపీ నాయకులు దాడిగేలా వెంకటేష్, శంకర్, శ్రవణ్, మహేష్, రాకేష్, హరీష్, పాల్గొన్నారు,
ఏ వై ఎస్ ఆధ్వర్యంలో ఇన్చార్జి ఎపిఎం కు ఘన సన్మానం.
చిట్యాల,నేటిధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో వెలుగు మహిళా సమైక్య ఏపిఎం ఇన్చార్జి గా గుర్రపు రాజేందర్ బాధ్యతలు చేపట్టినందున అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు జన్నే యుగేందర్ ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సన్మానించడం జరిగిందని తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి పుల్ల మల్లయ్య* అన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… రాజేందర్ వెలుగు మహిళ సమైక్య లో సీసీగా పనిచేస్తూ ఇన్చార్జి ఏపిఎం గా బాధ్యతలు చేపట్టడం ఆనందంగా ఉందని అంబేద్కర్ యువజన సంఘం తరపున రాజేందర్ కు శుభాకాంక్షలు తెలిపారు. విధి నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా సక్రమంగా నిర్వహించాలని అలాగే రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏ బి ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షులు గోల్కొండ సురేష్ అంబేద్కర్ యువజన సంఘం మండల ప్రచార కార్యదర్శి కట్కూరి రాజు పుల్యాల సురేష్ ధర్మ సమాజ్ పార్టీ జిల్లా కోశాధికారి శీలపాక నాగరాజు అంబేద్కర్ వాదులు పుల్ల ప్రభాకర్ జీడి సురేష్ భాస్కర్ మైదం మహేష్ గుర్రం తిరుపతి పాముకుంట్ల చందర్ తదితరులు పాల్గొన్నారు.
రామాయంపేట అభివృద్ధి పథంలో “జనహృదయనేత” సుప్రభాత్ రావు పాత్ర..
రామాయంపేట, సెప్టెంబర్16 నేటి ధాత్రి (మెదక్)
రామాయంపేట అభివృద్ధి, ప్రజా సంక్షేమం దిశగా గత పదేళ్లుగా నిరంతరం కృషి చేస్తున్న నాయకుడిగా టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాత్ రావు పేరు రామాయంపేట ప్రజల్లో విశేష గుర్తింపు పొందింది. రాజకీయాల్లో సాధారణంగా పదవులు, వర్గ పరమైన లాభాల కోసం కృషి చేసే నాయకులు ఉన్నారనే అభిప్రాయం ప్రజలలో బలపడుతున్న తరుణంలో, అన్ని వర్గాలను కలుపుకుంటూ ప్రజల కోసం అహర్నిశలు శ్రమించే నేతగా సుప్రభాత్ రావు ప్రత్యేక స్థానం సంపాదించారు.
Development
రామాయంపేటకు పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనుల మంజూరులో ఆయన పాత్ర ప్రధానమని స్థానికులు చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రామాయంపేట అభివృద్ధి కోసం ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ని ఒప్పించి కోట్ల రూపాయల నిధులు విడుదల కావడంలో ఆయన కృషి కీలకమైందని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆరోగ్యశ్రీ పథకంను రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా రామాయంపేటలో ప్రారంభించడంలో సుప్రభాత్ రావు పట్టుదల నిర్ణయాత్మకమైంది . అంతేకాకుండా రామాయంపేటలో రెవెన్యూ డివిజన్ స్థాపన కోసం ఆయన చేపట్టిన నిరాహార దీక్ష తర్వాతే టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటన చేయడం గమనార్హం. రామాయంపేట అభివృద్ధి దిశగా ఆయన సమన్వయంతోనే మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ప్రస్తుత ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు లు నిధుల మంజూరులో ముందడుగు వేసినట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా రోహిత్ రావు గెలుపులో సుప్రభాత్ రావు పోషించిన పాత్రను కాంగ్రెస్ వర్గాలు ప్రత్యేకంగా గుర్తిస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఆయన చేసిన శ్రమ ఆ విజయంలో కీలకమైందని చెబుతున్నారు.
Development
రాజకీయ ప్రయోజనాల కంటే ప్రజా ప్రయోజనాలను ముందు ఉంచే నాయకుడిగా, *“జనహృదయనేత”*గా సుప్రభాత్ రావు పేరు రామాయంపేట ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచింది. అభివృద్ధి మార్గంలో రామాయంపేటను తీసుకెళ్లడమే తన లక్ష్యమని ఆయన తరచూ చెప్పడం, ప్రజలు ఆయనను ఆశాకిరణంగా భావించడానికి ప్రధాన కారణమవుతోంది. అంతే కాకుండా రామాయంపేట పట్టణ ప్రజలు కలలో కూడా ఊహించని భారీ వరదలు వినాయక చవితి పండుగ రోజున అర్ధరాత్రి పట్టణాన్ని చుట్టుముడితే ప్రజలందరూ గాఢనిద్రలో ఉన్నప్పుడు అధికారులను అప్రమత్తం చేసి తనే స్వయంగా ముందుకు వచ్చి అధికారులకు ధైర్యాన్నిస్టు , ఎమ్మెల్యే కి, ఉన్నతాధికారులకు, ఎప్పటికి అప్పుడు సమాచారం అందిస్తూ ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా.300మంది గిరిజన డిగ్రీ కళాశాల పిల్లలను కాపాడటం పట్ల పట్టణ ప్రజలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
హైదరాబాద్ లో రాష్ట్ర “నారి శక్తి” సంస్థ లోగోని లాంచ్ చేసిన ఎం ఎల్ సి తీన్మార్ మల్లన్న
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ కి చెందిన “నారి శక్తి” సంస్థ ఫౌండర్ అండ్ చైర్మన్ జ్యోతి పండాల్ గారి ఆధ్వర్యంలో హైదరబాద్ లోని బిసి పొలిటికల్ జె.ఏ సి రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ శ్రీ తీన్మార్ మల్లన్న గారిచే రాష్ట్ర “నారి శక్తి” సంస్థ లోగో ను ఆవిష్కరించి తీన్మార్ మల్లన్న జ్యోతి పండాల్ ను సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడతూ మహిళలు సాధికారత సాధించినప్పుడే దేశం,రాష్ట్రం అభివృద్ది చెందుతుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ బిసి పొలిటికల్ జె.ఏ సి కోఆర్డినేషన్ కమిటి చైర్మన్ సుదగాని హరిశంకర్ గౌడ్, జె.ఏ సి నాయకులు కొనదొడ్డి నర్సింహ్మ (జహీరాబాద్ ఇంచార్జ్), తీన్మార్ మల్లన్న టీం శ్రీకాంత్, జగన్నాథ్, నాయకులు శ్రీ బయ్య వెంకటేశ్వర్లు యాదవ్ సింగారం రవీందర్ కొట్ల వాసుదేవ్ సుతారపు రంగన్న తదితరులు పాల్గొన్నారు
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.