ఆర్థిక సహాయం అందించిన కాంగ్రెస్ నాయకురాలు…

ఆర్థిక సహాయం అందించిన కాంగ్రెస్ నాయకురాలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ లోని మహిళా కాంగ్రెస్ కార్యాలయంలో నిరుపేద అమ్మాయి వివాహానికి ఆర్థిక సహాయం చేసి ధాతృత్వం చాటుకున్న జహీరాబాద్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా మాట్లాడుతూ,మహిళలను సాధికారపరచడం మా ప్రాధాన్యత, వివాహ ఖర్చుల భారాన్ని తగ్గించడం మరియు అమ్మాయిల సంక్షేమాన్ని ప్రోత్సహించడం ఈ ఆర్థిక సహాయం లక్ష్యం అని కుటుంబీకులు యువతి తల్లి నూర్జహాన్ బేగం, సోదరుడు మరియు గ్రామస్థులకు అందచేయడం జరిగింది.

కాంగ్రెస్ నూతన కమిటీ నియామకం…

కాంగ్రెస్ నూతన కమిటీ నియామకం

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి 5 :

 

 

 

మున్సిపల్ ఎన్నికలు లక్ష్యంగా ప్రతీ కార్యకర్త పనిచేయాల్సిన అవసరం ఉందని మేడ్చల్ జిల్లా డిసిసి అధ్యక్షులు – మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీ తోటకూర వజ్రేష్ యాదవ్ అన్నారు. మూడుచింతల పల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయి కమిటీని సోమవారం ప్రకటించారు. కమిటీ మండల అధ్యక్షుడిగా దోసకాయల వెంకటేశం, ఉపాధ్యక్షులుగా పుర్రెలి నరసారెడ్డి, గుర్రం బసవ రెడ్డి, నర్సింగ్ రావు గౌడ్, మర్యాల వీరేశం గుప్తా, తడిసిన వీరారెడ్డి, మహమ్మద్ జాఫర్ ప్రధాన కార్యదర్శిగా, వంగ భూపాల్ రెడ్డి, బండి జగన్నాథం, కమ్మరి బాలకృష్ణ, కామెడీ శశిధర్ రెడ్డి, కార్యదర్శులుగా సుంకు బుచ్చిరెడ్డి, కాషామైన ప్రవీణ్ కుమార్, కీసరి నర్సింహులు, తునికి వెంకటేష్ , ముద్రం పాపిరెడ్డి, స్పోర్ట్స్ పర్సన్ గా రవీందర్, ట్రెజరర్ గా బుద్ధి సదానందం, కిసాన్ సెల్ ప్రెసిడెంట్ గా వంగ దామోదర్ రెడ్డి, సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా జయల పాండు బీసీ సెల్ అధ్యక్షులుగా
గుండపల్లి శ్రీకాంత్ గౌడ్, ఎస్సీ సెల్ అధ్యక్షులుగా దాసరి నాగేశ్వర్, ఎస్టీ సెల్ అధ్యక్షులుగా కేతావత్ శ్రీకాంత్ నాయక్, మైనారిటీ సెల్ అధ్యక్షులుగా మహమ్మద్ యూషఫ్, సేవా దళ్ అధ్యక్షులుగా భానుచందర్ రెడ్డి లను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ ఏఎంసీ చైర్మన్ బొమ్మలపల్లి నరసింహులు, మాజీ వైస్ ఎంపీపీ మంద శ్రీనివాస్ రెడ్డి, వేణుగోపాలరావు, కొల్తూరు గ్రామ శాఖ అధ్యక్షులు నరసింహ, గోవర్ధన్ రెడ్డి, తిరుపతి రెడ్డి, పట్టా బాల నరసింహ, కరుణాకర్, దుర్గం ప్రవీణ్ యాదవ్, గురువయ్య, నల్ల శిల్పా యాదగిరి, వంగ వెంకటరమణారెడ్డి, తూము వేణుగోపాల్, సురేష్, మధుసూదన్ రెడ్డి, జగన్ గూడ రవీందర్, జలీల్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

మృతుల కుటుంబాలను పరామర్శించిన విష్ణు రెడ్డి..

మృతుల కుటుంబాలను పరామర్శించిన విష్ణు రెడ్డి..

#తదుపరి కాజీపేటలో సీసీ కెమెరాల ప్రారంభం..

హన్మకొండ, నేటిధాత్రి:

 

వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి ఆదేశాల మేరకు యువజన నాయకులు విష్ణు రెడ్డి ఆదివారం రోజున 47వ, 62వ డివిజన్‌లలో వివిధ కారణాలతో మృతి చెందిన దబ్బేట ఐలేష్,గద్దల కోర్నెల్,దాట్ల బాబు,బంగారి రవి కుమార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయా కుటుంబ సభ్యులను ఓదార్చి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. పార్టీ ఎప్పుడూ కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
అంతకు ముందు కాజీపేట పెద్దమ్మతల్లి హిల్స్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన నిఘా నేత్రాలు (సీసీ కెమెరాలు)ను ఎసిపి ప్రశాంత్ రెడ్డి, సిఐ సుధాకర్ రెడ్డి తో కలిసి విష్ణు రెడ్డి ప్రారంభించారు. ప్రజల భద్రతకు సీసీ కెమెరాలు కీలకంగా ఉపయోగపడతాయని ఈ సందర్భంగా తెలిపారు.
ఈ కార్యక్రమాల్లో సంబంధిత డివిజన్‌ల ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ప్రభుత్వ అనుమతులు లేకుండానే రెడ్ మిక్స్ ప్లాంట్ నిర్వహణ….

ప్రభుత్వ అనుమతులు లేకుండానే రెడ్ మిక్స్ ప్లాంట్ నిర్వహణ.

#విచారణకే పరిమితమైన మైనింగ్ అధికారుల పనితీరు.

#కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ యాదవ్.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

మండల కేంద్రంలో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండానే రెడ్ మిక్స్ ప్లాంట్ నిర్వహణ గత 4 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారని కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ ఆరోపించారు. ఈ మేరకు శనివారం స్థానిక గ్రామపంచాయతీ కార్యదర్శి ధర్మేందర్ కు వినతి పత్రం అందించి తక్షణమే సిమెంట్ క్రషర్ ను తొలగించి విద్యార్థుల, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఉన్న కొంతమంది రాజకీయ నాయకులు వారి స్వలాభాల కోసం గ్రామపంచాయతీ నుండి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే సంబంధిత అధికారుల ను భయభ్రాంతులకు గురిచేసి క్రషర్ నిర్వహణ చేశారని. అలాగే ప్లాంట్ కు ఇరువైపులా ఉన్న కస్తూరిబా పాఠశాల విద్యార్థులకు, రామాలయం కు వచ్చే భక్తులకు క్రషర్ ద్వారా వచ్చే దుమ్ము ధూళితో ఇబ్బందులు పడుతున్నారని అనేకసార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా సంబంధిత అధికారులు విచారణ చేపట్టి చేతులు దులుపుకున్నారు తప్ప క్రషర్ ను తొలగించి సమస్యను పరిష్కరించడంలో అధికారులు విఫలమయ్యారని ఆయన ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా రెడ్ మిక్స్ ప్లాంట్ యజమానులపై చర్యలు తీసుకొని ప్లాంటును తొలగించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కోలా లింగయ్య, బిక్షపతి, కిషోర్, రాజు తదితరులు పాల్గొన్నారు.

నడికూడ మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడిగా పెద్ద బోయిన రవీందర్ యాదవ్…

నడికూడ మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడిగా పెద్ద బోయిన రవీందర్ యాదవ్

 

నడికూడ,నేటిధాత్రి:

 

 

పరకాల శాసన సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు నడికూడ మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు నడికూడలో నడికూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బుర్ర దేవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో నార్లాపూర్ గ్రామ సర్పంచ్ పెద్ద బోయిన రవీందర్ యాదవ్ ను నడికూడ మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఫోరం ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణాపురం సర్పంచ్ పెండ్లి లక్ష్మి, కార్యదర్శిగా కంఠాత్మకూర్ సర్పంచ్ కొంగంటి తిరుపతి, ఉపాధ్యక్షుడిగా రాయపర్తి సర్పంచ్ రాజా జగత్ ప్రకాష్, కోశాధికారి గా ధర్మారం సర్పంచ్ భాషిక ఎల్లస్వామి లను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.ఈ కార్యక్రమంలో నడికూడ మండలంలోని సర్పంచులు కుడ్ల మలహల్ రావు,చర్లపల్లి గ్రామ సర్పంచ్ బండి రేణుక,చౌటుపర్తి గ్రామ సర్పంచ్ ఓదెల రూప,ధర్మారం గ్రామ సర్పంచ్ బాషిక ఎల్లస్వామి,కౌకొండ గ్రామ సర్పంచ్ ఓదెల శ్రీలత, ముస్త్సాల పెల్లి గ్రామ సర్పంచ్ మేకమల్ల వెంకటేష్, నర్సక్కపల్లి గ్రామ సర్పంచ్ కోడెపాక ముత్యాలు,పులిగిల్ల గ్రామ సర్పంచ్ ఇనుగాల పద్మ,సర్వాపూర్ గ్రామ సర్పంచ్ భోగి శ్రీలత,వరికోల్ గ్రామ సర్పంచ్ దొగ్గెల కుమారస్వామి,కంఠాత్మకూర్ గ్రామ సర్పంచ్ కొంగంటి తిరుపతి,రాయపర్తి గ్రామ సర్పంచ్ రాజా జగత్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే నడికూడ మండల యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అప్పం కుమార్ స్వామితో పాటు వివిధ గ్రామాల,మండల స్థాయి నాయకులు హాజరయ్యారు.
నూతనంగా ఎన్నికైన సర్పంచ్ లను అభినందిస్తూ,మండల అభివృద్ధికి సమిష్టిగా పనిచేయాలని సమావేశంలో నిర్ణయించారు.

ఘనంగా జరుపుకున్న డిసిసి ఉపాధ్యక్షులు జన్మదిన వేడుకలు..

ఘనంగా జరుపుకున్న డిసిసి ఉపాధ్యక్షులు జన్మదిన వేడుకలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

డిసిసి ఉపాధ్యక్షులు & సోదరుడు మహమ్మద్ ముల్తానీ జన్మదిన వేడుకలు ఆయన అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాచనూర్ గ్రామ స్థానిక వద్ద స్టేజీ ఏర్పాటు చేసి బాణాసంచా కాల్చి, బారి గజ మాలను మహమ్మద్ ముల్తానీకు అలంకరించి, ఆయనతో కేక్ కట్ చేయించి, శాలువా పూలమాలలతో సన్మానించి వేడుకలు ఘనంగా నిర్వహించారపటేల ఈ కార్యక్రమంలో పిసిసి సెక్రటరీ మహేందర్ పటేల్, అశ్విన్ పటేల్, మొహమ్మద్ ఖదీర్, షేక్ ఖాయుమ్,
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టి ఆర్గనేజింగ్ సెక్రటరీగా ముద్దం రాఘవ రెడ్డి నియామకం…

 

https://netidhatri.com/wp-content/uploads/2026/01/download-2026-01-03T112255.577.wav?_=1

 

కాంగ్రెస్ పార్టి ఆర్గనేజింగ్ సెక్రటరీగా ముద్దం రాఘవ రెడ్డి నియామకం

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి 

 

అలియాబాద్ మున్సిపాల్ కాంగ్రెస్ పార్టి ఆర్గనేజింగ్ సెక్రటరీగా ముద్దం రాఘవ రెడ్డి నియామకం అయ్యారు. ఈ మేరకు పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు తునికి రమేష్ శుక్రవారం నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎలక్షన్ లను దృష్టిలో పెట్టుకొని పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ప్రధాన కార్యదర్శి కంఠం కృష్ణ రెడ్డి, మాజీ సర్పంచ్ ఏళ్ల మల్లేష్, ఉపాధ్యక్షులు ముద్దం సుధాకర్ రెడ్డి, భూమి రెడ్డి నవీన్ రెడ్డి, సినియర్ నాయకులు అబ్బగౌని భాస్కర్ గౌడ్, మణికొండ నవీన్, వారాల మహిపాల్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, నాటకారి బాబు, లింగోళ్ల శ్రీకాంత్ గౌడ్, పిట్ల నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

నేతలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు..

నేతలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి 2 :

 

నూతన సంవత్సరం రాష్ట్ర ప్రజలకు శాంతి, అభివృద్ధి, సంక్షేమం తీసుకురావాలని, సేవలు మరింత ఫలప్రదంగా కొనసాగాలని ఆకాంక్షింస్తూ మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రెష్ యాదవ్, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుదీర్ రెడ్డిని అలియాబాద్ మున్సిపాల్ కాంగ్రెస్ పార్టి అద్యక్షులు తుంకి రమేష్ కమిటీ సభ్యులతో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి డైరెక్టర్ తుంకి భిక్షపతి, మాజీ సర్పంచ్ ఏళ్ల మల్లేష్, మాజీ ఎంపీటీసీ సరసం అశోక్ రెడ్డి, మున్సిపల్ ప్రధాన కార్యదర్శి కంఠం కృష్ణ రెడ్డి, ఉపాధ్యక్షులు భూమి రెడ్డి నవీన్ రెడ్డి, చట్లపల్లి నర్సింగ రావు, అబ్బగౌని భాస్కర్ గౌడ్, ముద్దం రాఘవ రెడ్డి, మణికొండ నవీన్, వారాల మహిపాల్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, నాటకారి బాబు, వల్లపు మహేష్, లింగోళ్ల శ్రీకాంత్ గౌడ్, పిట్ల నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

పార్టీని మరింత బలోపేతం చేయాలి…

పార్టీని మరింత బలోపేతం చేయాలి
* డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్
* కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు–కార్యకర్తల విస్తృత సమావేశం

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి

 

కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త ఐక్యంగా పనిచేయాలని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ అన్నారు. మూడు చింతలపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దోసకాయల వెంకటేష్ ఆధ్వర్యంలో ముఖ్య నాయకులు–కార్యకర్తల విస్తృత సమావేశం బుధవారం నారాయణపూర్ గ్రామంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన వజ్రేష్ యాదవ్ గారు హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ రాబోయే మున్సిపాలిటీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి ఎంతో కీలకమని పేర్కొన్నారు. మూడు చింతలపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త ఐక్యంగా పనిచేయాలని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. గల్లీ స్థాయి నుంచి మున్సిపాలిటీ స్థాయి వరకు పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత కార్యకర్తలదేనని అన్నారు. పార్టీ కోసం అంకితభావంతో కష్టపడే ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని, వారి సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గం ఏ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు జిడిపల్లి వేణుగోపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు గోన మహేందర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి, బండి జగన్నాథం, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

అనాధ బాలికలకు అండగా ఉంటకోరుట్లనియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ జువ్వాడి నరసింగ రావు..

అనాధ బాలికలకు అండగా ఉంటకోరుట్లనియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ జువ్వాడి నరసింగ రావు
మల్లాపూర్ ,నేటి దాత్రి

 

మల్లాపూర్ మండలంలోని రేగుంట గ్రామంలో తల్లి తండ్రులను కోల్పోయి అనాధలుగా మిగిలిన ఇద్దరు ఆడపిల్లలకు కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ జువ్వాడి నరసింగ రావు ఆదేశాల మేరకు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం రోజున ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులు అందజేశారు జువ్వడి నరసింగరావు ఫోన్ ద్వారమాట్లాడి అనాధలైన ఆ ఇద్దరు ఆడపిల్లలకు ధైర్యం చెప్పారు వారికి అండగా ఉంటామని వారు చదువుకోడానికి సహకరిస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ మాజీ ప్రధాన కార్యదర్శి రాజోజి సదానంద చారి స్థానిక కాంగ్రెస్ నాయకులు ఏనుగు రాజారెడ్డి పొన్నం భూమానందం మిట్టపల్లి రాజేశ్వర్ రెడ్డి మిట్టపల్లి నడిపి రాజారెడ్డి నేరెళ్ల రాజారెడ్డి నిమ్మల రాజేశం ఇనుగుర్తి వినోద్ మురళి సంతోష్ గుండో జి జనార్ధన్ ఎడమల నర్సారెడ్డి ఏనుగు రాజు బద్దం చిన్న రాజారెడ్డి ఎండి అకుర్ ఎలేటి రాజారెడ్డి బద్దం పెద్ద రాజారెడ్డి ముల్క గంగారం తదితరులు పాల్గొన్నారు

తుంకుంట సర్కిల్ ను శామీర్ పేట్ గా మార్చడం సరికాదు : తుంకుంట అఖిలపక్ష్యం..

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-27T125949.446.wav?_=2

 

తుంకుంట సర్కిల్ ను శామీర్ పేట్ గా మార్చడం సరికాదు : తుంకుంట అఖిలపక్ష్యం
* కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు వజ్రష్ యాదవ్ కు వినతి

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి 27 :

 

తుంకుంట సర్కిల్ ను శామీర్ పేట్ గా మార్చడం సరికాదని తుంకుంట అఖిలపక్ష నేతలు అన్నారు. ఈ మేరకు మేడ్చల్ – మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ ను శనివారం కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తుంకుంట మున్సిపాలిటీ జిహెచ్ఎంసి లో విలీనం తర్వాత తూముకుంట పేరును శామీర్ పేటగా మార్చడం సరైన విషయం కాదన్నారు. తూముకుంటను షామీర్పేటగా మార్చడం కంటే తూముకుంట- శామీర్ పేట్ సర్కిల్ గా పేరు మార్చిన సరిపోతుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, జిహెచ్ఎంసి అధికారులు 300 డివిజన్ కు తూముకుంట- శామీర్ పేట్ గా పేరును పెట్టాలన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంతో పాటు ఉత్తర తెలంగాణ కు గేటివేగా తుంకుంట ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలకనుగునంగా తూంకుంట ప్రజల ఆత్మగౌరవం కాపాడేవిదంగా తుంకుంట డివిజన్ గా కొనసాగించాలని కోరారు.

సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత..

సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి 27 :

 

ముఖ్యమంత్రి సహాయనిధి పేదల పాలిట వరమని దానిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ అలియాబాద్ మున్సిపల్ అధ్యక్షుడు తునికి రమేష్, ప్రధాన కార్యదర్శి కంటం కృష్ణారెడ్డి అన్నారు. అలియాబాద్ మున్సిపల్ పరిధిలోని అలియాబాద్ కు చెందిన వైల ఎల్లయ్య వైద్య పరీక్షలకు ఆర్థిక సహాయం కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ.30.000 చెక్కును శనివారం అందజేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక గొప్ప వరంగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో అలియాబాద్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టి నాయకులు నాటకారి బాబు, లబ్ధిదారుడు ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ నాయకులు

పంచాయతీ ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ నాయకులు

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-26T125108.610.wav?_=3

 

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

పంచాయతీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఝరాసంగంలోని ఎనిమిదో వార్డులో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు హన్మంత్ రావు పాటిల్ ఆధ్వర్యంలో బోరు బావిని తవ్వించడం జరిగింది. త్రాగునీటి సమస్య పరిష్కరించేందుకు కాలనీలో అందరి సహకారంతో బోరు ఏర్పాటు చేయడం జరిగింది. గురువారం కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు చేసి పనులు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు మల్లికార్జున్ పాటిల్, చంద్రప్ప, పెంటయ్య, సంగమేశ్వర్, ఆనందం, రాజ్ కుమార్, నాగప్ప, తుకారం, ఇస్మాయిల్, మహమ్మద్ ఫక్రుద్దీన్, అనిల్ కుమార్, సాయిలు, నర్సింలు, లక్ష్మయ్య, సంగన్న, ఫక్రుద్దీన్, కృష్ణ, దత్తు, నరేష్, తదితరులు పాల్గొన్నారు.

కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ..

కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

కార్యక్రమానికి విచ్చేయుచున్న
భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భూపాలపల్లి వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ రేపాక రాజేందర్ నేటి ధాత్రి తో మాట్లాడుతూ మండల గ్రామపంచాయతీ పరిధిలో కళ్యాణ లక్ష్మి లబ్ధిదారు ఉదయం 8 గంటలకు వచ్చి వారి వారి కల్యాణ లక్ష్మి చెక్కులను తీసుకోగలరని ,కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు అన్ని గ్రామాల గ్రామ కమిటీ అధ్యక్షులు, మహిళ నాయకులు యువజన కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా
కోరారు
స్థలం : * గణపురం గ్రామపంచాయతీ కార్యాలయం *

“కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా”…

“కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా”

ఖైరతాబాద్ కాంగ్రెస్ పార్టీ అబ్జర్వర్ గా రెండవసారి ఎస్. వినోద్ కుమార్ నియామకం.

మహబూబ్ నగర్/నేటి ధాత్రి

 

 

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం కు చెందిన కాంగ్రెస్ పార్టీ టి.పిసిసి ప్రధాన కార్యదర్శి ఎస్. వినోద్ కుమార్ ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ అబ్జర్వర్ గా రెండవసారి బుధవారం నియామకమయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎక్కువ అనుభవం ఉన్న వ్యక్తిగా చాలా సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్తూ ఓ నిజమైన నాయకుడిగా ఆయన ఎన్నో పదవులు పొందినారు .ఖైరతాబాద్ నుంచి మరోసారి కాంగ్రెస్ పార్టీ తరఫున అబ్జర్వ్ గా ఆయనను నియమించడం జరిగింది.ఈ మేరకు టి.పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంకితభావంతో పని చేసినందుకు తనకు కాంగ్రెస్ పార్టీ రెండవసారి ఖైరతాబాద్ అబ్జర్వర్ గా నియమించినందుకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. కాంగ్రెస్ పార్టీ నిరుపేదల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు. పేదల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం అన్నారు.

ఎమ్మెల్యేను కలిసిన పంచాయతీ పాలకవర్గ సభ్యులు…

ఎమ్మెల్యేను కలిసిన పంచాయతీ పాలకవర్గ సభ్యులు

 

నడికూడ,నేటిధాత్రి:

 

మండలంలోని కంఠాత్మకూర్ గ్రామంలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నూతనంగా సర్పంచ్ గా ఎన్నికైన గ్రామ సర్పంచ్ కొంగంటి తిరుపతి, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ని కలిసి పుష్పగుచ్చం అందించి కృతజ్ఞతలు తెలిపారు.
నూతనంగా ఎన్నికైనా గ్రామ సర్పంచ్,ఉపసర్పంచ్,వార్డు సభ్యులకు ఎమ్మెల్యే ఆశీస్సులు అందించి అభినందనలు తెలిపారు. గ్రామపంచాయతీ పాలకవర్గం కలిసికట్టుగా ఉండి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించిచారు. ఎమ్మెల్యేను కలిసినవారిలో సర్పంచ్‌ కొంగంటి తిరుపతి,ఉపసర్పంచ్‌ కంఠాత్మకూర్ కుమారస్వామి, వార్డుసభ్యులు బుస్సా భాగ్య,గూడూరు నాగరాజు,తడుక రగుపతి,బాయి సంధ్య,కుమ్మరి మౌనిక,బుస్స తిరుపతి,ఆకుల వనిత,ఎడ్ల కిరణ్,గూడూరు జాన్సీ రాణి.
ఈ కార్యక్రమం లో నడికూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్ర దేవేందర్ గౌడ్,మండల సమన్వయ కమిటీ సభ్యులు పాడి ప్రతాప్ రెడ్డి,గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భైరపాక భద్రయ్య, ఉపాధ్యక్షులు పరమండ్ల మహేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం మహేందర్, కార్యదర్శి బొమ్మకంటి విజేందర్, గూడూరు మధుకర్,బాయి సుమన్,సీనియర్ నాయకులు కంఠాత్మకూర్ కొమురయ్య, కొత్తూరు రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

బేతేస్తా బాప్టిస్ట్ చర్చిలో ఐక్య క్రిస్మస్ వేడుకలు…

బేతేస్తా బాప్టిస్ట్ చర్చిలో ఐక్య క్రిస్మస్ వేడుకలు

హన్మకొండ, నేటిధాత్రి:

 

హనుమకొండ 53వ డివిజన్ లష్కర్ సింగారంలోని బేతేస్తా బాప్టిస్ట్ చర్చిలో ఐక్య క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అల్లుడు, కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు విష్ణు రెడ్డి హాజరయ్యారు.
క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని స్థానిక నేత మట్టెడ అనిల్ ఏర్పాటు చేసిన దుస్తువులను పాస్టర్ కుటుంబ సభ్యులకు విష్ణు రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రేమ, ఐక్యత, సేవ భావనలే క్రిస్మస్ సందేశమని అన్నారు.
ఈ కార్యక్రమంలో చర్చి పెద్దలు, పాస్టర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం…

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ సేవాదళ్ జిల్లా ప్రధాన కార్యదర్శి అoకారం మహేష్ మరియు నాయకుల ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా అంకారపూమహేష్ మాట్లాడుతూ. తంగళ్ళపల్లి మండల కేంద్రంలో బహిరంగ చర్చకు రావాలని నిన్న జరిగిన సంఘటనలో మాజీ సర్పంచ్ రవి మాపై లేనిపోని అబద్దాలతో ఆరోపణ చేసి చర్చకు రావాలని చెప్పడం సిగ్గుచేటని తెలియజేస్తూ గతంలో నీవు సర్పంచ్ గా చేసిన సందర్భంలో మండలంలో ఏర్పాటుచేసిన వైకుంఠధామము కావచ్చు లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ కి నీవు ఆరు లక్ష రూపాయలు చందా రాస్తే మీ శిలాఫలకం ఎలా తొలగించారని.అలాగే నీవు చేసిన .ప్రభుత్వకాంట్రాక్టు వ్యవస్థలో.నీవుఏమీ. ఆశించకుండానే .నీవు పనులు చేసావా. నాకు సంబంధించినఆస్తులు అమ్ముకొని గ్రామ అభివృద్ధికి పెట్టినానుఅనిచెప్పినావు. నీవు అమ్ముకున్న ఆస్తులు ఎలా సంపాదించుకున్నావు మీ తాత ముత్తాతలు మీ అమ్మ నాన్నలు ఏమైనా సంపాదించి పెట్టారా నీవు సర్పంచి పదవి కాలంలో అధికారంలో ఉండి అధికార దుర్వినియోగం చేసావా. తంగళ్ళపల్లి గ్రామ ప్రజలందరికీ తెలియాల్సి ఉందని మీరు గ్రామంలో బహిరంగ చర్చకు సిద్ధమా ఎప్పుడు ఏ టైం అయినా మేము రావడానికి సిద్ధంగా ఉన్నామని.గ్రామంలో అంబబాయి.ఉత్సవాల్లో డబ్బులు వసూలు చేసి వాడుకున్నాముమాపై లేనిపోని ఆరోపణలు చేసినావు.వాటిని నిరూపించగలవా.ఎంత ఖర్చవుతుందోనీకు తెలుసా నీ ఇంటి ముందే ఉంటే ఎప్పుడైనా రూపాయి ఖర్చు చేశావా గణపతి నవరాత్రి ఉత్సవాల్లో గణపతి చందాలు తీసుకొని.వాడుకున్నావని అంటున్నావు గణపతి విగ్రహాలు కొనిచ్చిన చరిత్ర మాది అని. కరోనా సమయంలో మానత్వంతో చేసిన సేవలు నిజం కాదా మేము సేవ చేస్తే నీవు విమర్శలు చేసిన నిజం కాదా.గ్రామంలో వార్డ్ మెంబర్ గా పాలకవర్గంలోపనిచేసిన అనుభవం మా కుటుంబానికి ఉందని అలాగే ఊరి అభివృద్ధికి ఏమి చేశారని మీరు అనడం మీ విజ్ఞతకే వదిలేస్తున్నామని వేసవికాలంలోనీటి ఎద్దడి దృష్ట ఇందిరానగర్ కాలనీవాసులు సర్పంచ్ హోదాలో ఉన్న మిమ్మల్ని అడిగితే నాకు మీరు ఓట్లు వేయలేదు అని మహిళలను.కించపరిచింది మీరు.కాదాగతంలో రామాలయంలో విగ్రహాలను రామడుగు నుంచి తీసుకువచ్చి రామాలయానికి ఇచ్చింది నిజం కాదా విగ్రహాలు తీసుకువచ్చి గుడిలో నెలకొల్పిన కుటుంబం మాది అని అలాగే. తంగళ్ళపల్లి మార్కండేయ.టెంపుల్ కి ఏమి ఇచ్చారని మీరు అంటూ ఉంటే గతంలో మా కుటుంబం నుంచే మార్కండేయ గుడికి సంబంధించిన గేట్లను మా తల్లిదండ్రులు తాత లు.చేయించడం జరిగిందని. కొన్ని రోజుల క్రితం మొదటిసారిగా బహిరంగ చర్చకు రావాలని పిలవడం జరిగిందని దానికి మీరు రాకపోగా క్రితం జరిగిన సర్పంచి ఎన్నికల్లో ఓడిపోవడంతో ప్రస్టేషన్కు గురై మాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నావని. నీవు ఇంకా ఎదగాలని వెటకారంగా మాట్లాడుతున్నావు అని. మమ్మల్ని కించపరిచే విధంగా భాషమాట్లాడుతున్నామని. రాజకీయంలో మా ఎదుగుదలను చూడలేక మాపై లేనిపోని ఆరోపణలు.అబద్ధాలు .ప్రచారం చేస్తున్నామని నువ్వు ఎదిగింది గోరంత మేము.ఎదిగేది కొండంత ఉందని. మేము గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు నకుఅధిష్టానంమా.పార్టీ నాయకులఆదేశాను ప్రకారం పనిచేశామే తప్ప ఎవరిపై అబద్ధాలు ప్రచారం అబాండాలువేసేపని చేయలేదని నీవు రావణాసురుడి అటువంటి.వానివని పీడ వదిలించిప్రజల నిన్ను తిరస్కరించారని ఇక తంగళ్ళపల్లి గ్రామంలో లక్ష్మి రాజ్యమే ప్రజలు తీర్పు ఇచ్చారని.ప్రజలు ఇచ్చిన తీర్పు శిరీషవహిస్తామని. గతంలో నువ్వు చేసిన గ్రామపంచాయతీ భవన నిర్మాణం ఏ విధంగా నిర్మించావో.ప్రజలందరికీ తెలుసునని కనీసం వృద్ధులు వెళ్లలేని పరిస్థితిలో పైన నిర్మించావని నీవు చేసిన గతంలో ప్రభుత్వపరంగా ప్రతి పనిపైదానిపైమా దగ్గర ఆధారాల తో సహా ఉన్నాయని. రాజకీయంగా ఎవరైనా పైకి ఎదగడానికి తోడ్పాటును అందించాలి తప్ప అబద్ధాలతో ప్రచారం చేస్తూ ఎదుటి వాళ్లపై విమర్శలు నిందలు వేయరాదని. నీవు నిర్మించిన గ్రామపంచాయతీనిభవనాన్ని ప్రారంభించడానికి మా నాయకుల చుట్టుతిరిగినావు అందరికీ తెలుసునని దానిపై నీకు నోటీసులు ఏం జరిగిందో తంగళ్ళపల్లి గ్రామ ప్రజలందరికీ తెలుసునని. ఇక ముందైనా జాగ్రత్తగా వివరించాలని మీరు అవినీతి పనులు చేస్తూ ఉంటే గ్రామంలో ప్రజలు ఊరుకునే ప్రసక్తే లేదని నీవు ఒక మాట చెప్పినావుఅభివృద్ధిలో పాలుపంచుకుంటాననిదానికి ఎవరుఅడ్డురారని. ఇక ముందైనా ఆరోపణలు చేయడం మానుకోవాలని లేనియెడల ప్రభుత్వం నాయకులు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏమి జరుగుతుందో గ్రహిస్తున్నారని తంగళ్ళపల్లి గ్రామంలో జరుగుతున్న ప్రతి సంఘటనపై గ్రామ ప్రజలు గాని నాయకులు గాని ప్రజాప్రతినిధులు గాని అందరూ గ్రహిస్తున్నారని నీ చుట్టూ ఉండే నాయకులే నీవారుసరైన సమయంలో సరియైన గుణపాఠం చెబుతారని ప్రజాక్షేత్రంలో అందరూ ఒకటేనని గ్రహించాలని గ్రామంలో అందరం కలిసి అభివృద్ధిలో ముందుండి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇకపై ఆరోపణ చేయడం మానుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి పాత్రికేయుల సమావేశంలో. నియోజకవర్గ కాంగ్రెస్.పార్టీ ఇన్చార్జి యూత్ నాయకులు చుక్క శేఖర్. ఎగుర్లప్రశాంత్. అభి. సాయి కృష్ణ. పయ్యావుల శ్రీనివాస్. అభినయ్. మనీ. స్వామి. కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎంపీపీ సోయం కృష్ణ వేణి…

కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎంపీపీ సోయం కృష్ణ వేణి
సిపిఎం సీనియర్ నాయకులు రాంపండు

నేటిదాత్రి చర్ల

 

చర్ల మండలంలోని సీనియర్ రాజకీయ నాయకురాలు మాజీ ఎంపీపీ సోయం కృష్ణవేణి సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు రాంపండు శుక్రవారం అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు మంత్రి పొంగులేటి ఆసిస్సులతో భద్రాచలం ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని నమ్మి చేరుతున్నట్లు తెలిపారు 5 ఏళ్లపాటు ఎంపీపీగా పనిచేసి ప్రజా అభివృద్ధే ధ్యేయంగా నడుచుకున్న మాజీ ఎంపీపీ సోయం కృష్ణ వేణికి పరిసర గ్రామాలతో పాటు మండల కేంద్రంలోని ప్రజల మన్ననలు పొందినారు
సీపిఎంలో సుదీర్ఘ కాలంగా పనిచేసిన రాంపండు అటవీ గ్రామాలయినా కుర్నపల్లి ఎర్రబోరు బోధనేల్లి సత్యనారాయణపురం అర్ కొత్తగూడెం కలివేరు అభివృద్ధిలో కీలకంగా వ్యవరించారు ప్రజలు సైతం నేటికీ రాంపండు వెంటే ఉంటూ తమ సమస్యలను పరిష్కరించే నాయకుడి వెంట నడుస్తున్నారు ఈ ఇద్దరి రాకతో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుంది వీరితో పాటు చర్ల మాజీ వార్డు మెంబర్ కూర సుజాత కూడా జాయిన్ అయ్యారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సినీయర్ నాయకులు చీమలమర్రి మురళి పోలిన లంక రాజు పోట్రూ బ్రేమ్మానంద రెడ్డి ముమ్మినేని అరవింద్ మద్దరాజు నరసింహారాజు పాల్గొన్నారు

విజయఢంకా మోగించిన నూతన సర్పంచ్ లు.

విజయఢంకా మోగించిన నూతన సర్పంచ్ లు

నడికూడ,నేటిధాత్రి:

మండలంలో నూతనంగా గెలపొందిన సర్పంచులు కౌకొండ గ్రామా సర్పంచ్ గా ఓదెల శ్రీలత భాస్కర్ బిఆర్ఎస్,సర్వపూర్ గ్రామ సర్పంచ్ గా భోగి శ్రీలత కాంగ్రెస్,ధర్మారం గ్రామ సర్పంచ్ గా భాషిక ఎల్లస్వామి కాంగ్రెస్, రామకృష్ణాపూర్ గ్రామ సర్పంచ్ గా పెండ్లి లక్ష్మీరాజు కాంగ్రెస్,నడికూడ గ్రామ సర్పంచ్ గా కుడ్ల మలహల్ రావు కాంగ్రెస్,రాయపర్తి గ్రామ సర్పంచ్ గా రాజ జగత్ ప్రకాష్ కాంగ్రెస్,నర్సక్కపల్లి గ్రామ సర్పంచ్ గా కోడెపాక ముత్యాలు బిఆర్ఎస్, చర్లపల్లి గ్రామ సర్పంచ్ గా బండి రేణుక శంకర్, బిఆర్ఎస్,ముస్త్యాలపల్లి గ్రామ సర్పంచ్ గా మేకమల్ల వెంకటేష్ ఇండిపెండెంట్, చౌటుపర్తి గ్రామ సర్పంచ్ గా ఓదెల రూప సమ్మయ్య కాంగ్రెస్,పులిగిల్ల గ్రామ సర్పంచ్ ఇనుగాల పద్మ ఐలోని బిఆర్ఎస్,వరికోల్ సర్పంచ్ దొగ్గేల కుమారస్వామి బిఆర్ఎస్, నార్లాపూర్ గ్రామ సర్పంచ్ పెద్దబోయిన రవీందర్ యాదవ్ కాంగ్రెస్, కంఠాత్మకూర్ సర్పంచ్ కొంగంటి తిరుపతి కాంగ్రెస్, గెలుపొందారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version