ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు శరవేగంగా

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు శరవేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలంలో బుర్రకాయలగూడెంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రగతిని ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరం ప్రాథమిక సహకార సంఘం ఎరువుల దుకాణం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పశువుల ఆరోగ్య కేంద్రాలను, తహసీల్దార్ కార్యాలయంలో భూ భారతి దరఖాస్తులు, స్టోర్ రూము తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులతో ముకాముఖి మాట్లాడారు. నిర్మాణ పనులలో జాప్యం జరుగకుండా నాణ్యత పాటిస్తూ వేగంగా పనులు పూర్తి చేయాలని సూచించారు. లబ్ధిదారులకు నిర్మాణ పద్ధతులపై అవగాహన కల్పించి, అవసరమైన మౌలిక సదుపాయాలు సమకూర్చే దిశగా సంబంధిత శాఖలు చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రతి ఇంటి నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులు వీలైనంత తొందరగా గృహ ప్రవేశం చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అధికారులు, క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ చేస్తూ సత్వరం పనులు పూర్తి అయ్యేలా పని చేస్తేనే లక్ష్యాన్ని సాధించగలమన్నారు. గణపురం మండలంలో ఇందిరమ్మ ఇండ్ల ప్రగతిని గృహ నిర్మాణ శాఖ పిడిని అడిగి తెలుసుకున్నారు. ఇసుక ఎక్కడి నుండి తెస్తున్నారని అడిగి తెలుసుకుని ఇసుక ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కాల్వపల్లి నుండి ఇసుక తెస్తున్నట్లు పిడి తెలిపారు.
అనంతరం ప్రాథమిక పశు వైద్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. పశువుల చికిత్స కు వచ్చిన రైతులతో వైద్యసేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మందులు స్టాకు ఉంచాలని, పశువులు వ్యాధులకు గురికాకుండా టీకాలు వేయాలని సూచించారు. పశు సంపదను కాపాడుకోవాలని తెలిపారు. అవసరమైన మందుల కొరకు ప్రతిపాదనలు ఇవ్వాలని పశు సంవర్ధక శాఖ డిడిని సూచించారు. ఈ సందర్భంగా గొర్రెల వైద్య సేవలకు వచ్చిన రైతు జిల్లా కాలెక్టర్ కు గొర్రె పిల్లను బహుకరించారు వ్యాధులతో బాధ పడే ప్రజలు వైద్యుల సలహాలు, సూచనలతో మేరకు క్రమం తప్పక మందులు వాడాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
తెలిపారు.శుక్రవారం గణపురం ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్య సేవలకు వచ్చిన ప్రజలతో సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీ పేరేంటి అని గట్టయ్యను అడిగి తెలుసుకుని ఏమి సమస్య ఉంది, వైద్యులు మంచిగా చూశారా లేదా మందులు ఇచ్చారా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం లక్ష్మీ అనే మహిళతో మాట్లాడారు. ఈ సందర్భంగా లక్ష్మీ మాట్లాడుతూ తేలు కుట్టినందున వైద్య సేవలకు వచ్చానని తెలుపగా మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఆసుపత్రికి వచ్చే ప్రజలకు హెల్త్ ప్రొఫైల్ తయారు చేయాలని సూచించారు. ఓపి రిజిస్టర్, స్టోర్ రూము ను పరిశీలించారు. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని స్పష్టం చేశారు.
ప్రాథమిక సహకార సంఘం ఎరువుల విక్రయ కేంద్రాన్ని తనిఖీ చేసి ఎరువుల నిల్వలు పరిశీలించారు జిల్లాలో ఎరువుల కొరత లేదని, రైతులు అవసరం మేర తీసుకోవాలని సూచించారు. ధరల పట్టిక, స్టాకు రిజిస్టర్ పరిశీలించారు. ఈ రోజు ఇప్పటి వరకు ఎంత మంది రైతులు యూరియా తీసుకున్నారని వివరాలు అడుగగా 13 మంది రైతులకు 30 బస్తాలు యూరియా ఇచ్చామని తెలిపారు. ఎరువులు, విత్తన దుకాణాలను నిత్యం పర్యవేక్షణ చేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు.తహసీల్దార్ కార్యాలయంలో భూ భారతి దరఖాస్తులు, స్టోర్ రూములను పరిశీలించారు
ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు భూ భారతి దరఖాస్తులు. పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ ను ఆదేశించారు. నోటీసు లు జారీ, విచారణ ప్రక్రియ, దరఖాస్తులు తిరస్కరణ తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. తిరస్కరించిన దరఖాస్తు దారులకు కారణాలు తెలియచేయాలని తెలిపారు.తహసీల్దార్ కార్యాలయ సందర్శనలో కార్యాలయానికి వచ్చిన వయోవృద్ధునితో ఏ సమస్య కొరకు వచ్చారని అడిగి తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తహశీల్దార్ ను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, గృహ నిర్మాణ శాఖ పిడి లోకిలాల్, జిల్లా వ్యవసాయ అధికారి బాబూరావు, తహసీల్దార్ సత్యనారాయణ స్వామి, ఎంపిడిఓ ఎల్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్ పై అనవసర రాద్ధాంతం

ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్ పై అనవసర రాద్ధాంతం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు

భూపాలపల్లి నేటిధాత్రి

కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు అంబాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూరాకుల ఓదెలు లలిత అనే రైతుకు ఉండబడిన భూమిలో బర్ల షెడ్డు వేసుకోవడం జరిగింది రోడ్డుపై వేసిన బర్ల రేకుల షెడ్డును తొలగించాలని సీసీ రోడ్డు నిర్మాణం కోసం వారికి నోటీసులు ఇచ్చిన మున్సిపల్ అధికారులు కానీ నెల రోజులైనా స్పందించని రైతులు మునిసిపల్ అధికారులు బర్ల షెడ్డును కూల్చారు కానీ దానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జి ఎస్ ఆర్ కు ఎలాంటి సంబంధం లేదు. వారు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో తమకు ఉండబడిన బర్లను తోలి నిరసన వ్యక్త చేయడం ఏమైన చర్య ఈ కుట్ర వెనుక బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఉన్నాడని మాకు అనుమానం వ్యక్తం చేస్తున్నాం మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్ చేసే అభివృద్ధిని చూసి ఓర్వలేక ఎమ్మెల్యే పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఊరుకునే ప్రసక్తే లేదు మీరు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవడానికి ఇలాంటి పనులను ప్రోత్సహిస్తూ వెనక ఉండి నడిపిస్తున్నారు అని మాజీ ఎమ్మెల్యే గండ్రను విమర్శించారు ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బుర్ర కొమురయ్య అప్పం కిషన్ పిప్పాల రాజేందర్ దాట్ల శ్రీనివాస్ జంబోజు పద్మ ఉడుత మహేందర్ బౌత్ విజయ్ తోట రంజిత్ రేణుక తదితరులు పాల్గొన్నారు

ఢిల్లీకి తరలి వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ న్యాయవాదులు..

ఢిల్లీకి తరలి వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ న్యాయవాదులు:-

వరంగల్/హన్మకొండ, నేటిధాత్రి  (లీగల్):-

ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ లీగల్ సెల్ చైర్మన్ అభిషేక్ మను సింగ్వి ఆగస్టు 2 న రాజ్యాంగ  సవాళ్లపై జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సులో పాల్గొనేందుకు సీనియర్ న్యాయవాది వర్ధన్నపేట పిసిసి అధికార ప్రతినిధి టిపిసిసి రాష్ట్ర లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మని శేఖర్ రావు, రాష్ట్ర కన్వీనర్లు మూదాసిర్ అహ్మద్ ఖయ్యూం, పోషిని రవీందర్, కొక్కొండ రమేష్, వెంకటరమణ, మహమ్మద్ జావేద్, గడ్డం విష్ణువర్ధన్  గార్లు శుక్రవారం రోజు సాయంత్రం ఢిల్లీకి జిల్లా కోర్టు ఆవరణం నుండి బయలు దేరి వెళ్ళారు.

ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన

ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేసిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు.

చిట్యాల, నేటిధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండల కేంద్రంలోని గుంటూరు పల్లి లో మంగళవారం రోజున ఇందిరమ్మ ఇళ్లకు కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేసిన మండల పార్టీ అధ్యక్షుడు గూట్ల తిరుపతి, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదింటి కల నిజం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే భూపాలపల్లి నియోజకవర్గంలోని గ్రామాలను అభివృద్ధి చేసిన ఘనత ఎమ్మెల్యే సత్తన్నకు దక్కిందని అన్నారు, టిఆర్ఎస్ ప్రభుత్వం పేదోడి సొంతింటి కలలను తీర్చలేదని 10 సంవత్సరాల తర్వాత ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సందర్భంగా అన్నారు, అలాగే మాజీ ఎమ్మెల్యే కేటీఆర్ పర్యటనలో మాట్లాడుతూ కాలేశ్వరం లో మోటార్లు పెట్టడం లేదని నిరాహార దీక్ష చేస్తామనడం ఎందుకో చెప్పాలని దొరల ఫామ్ హౌస్ లోకి నీళ్లను పంపడం కోసమేనా అని అన్నారు, ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి కిష్టయ్య మండల ప్రధాన కార్యదర్శి గడ్డం కొమురయ్య మండల యూత్ అధ్యక్షుడు అల్లకొండ కుమార్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ముద్దన నాగరాజు కాంగ్రెస్ నాయకులు పాశం లక్ష్మీనారాయణ నర్రా శివరామకృష్ణ మునిమాకుల నాగేశ్వరరావు తిరుపతయ్య సాంబయ్య కాంగ్రెస్ పార్టీ యూత్ మండల్ నాయకులు రాజు తదితరులు పాల్గొన్నారు.

నూతన దంపతులనుఆశీర్వదించిన కాంగ్రెస్ పార్టీ..

నూతన దంపతులనుఆశీర్వదించిన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్.

చిట్యాల, నేటి ధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం గోపాలపురం గ్రామానికి చెందిన బొజ్జలక్ష్మీకాంతం శోభ గార్ల మరియు తిరుమలపురం గ్రామానికి చెందిన ఉప్పుల లక్ష్మీనారాయణ పద్మ దంపతుల ప్రథమ పుత్రిక దామిని,బొజ్జ అక్షయ్, గార్ల ఎంగేజ్మెంట్ ఫంక్షన్లో హాజరై ఆశీర్వదించిన మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మూల శంకర్ గౌడ్ దంపతులు. వారి వెంట వీరాచారి దంపతులు పాల్గొన్నారు.

మట్టిపాట పోస్టర్ ఆవిష్కరించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు.

మట్టిపాట పోస్టర్ ఆవిష్కరించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు.

చిట్యాల, నేటి ధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం లోని తిర్మలాపూర్ గ్రామానికి చెందిన వర్ధమాన గేయ దసరాకు నరేష్ రచించిన మట్టిపాట పోస్టర్ ను చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గూట్ల తిరుపతి ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గూట్ల తిరుపతి విచ్చేసి మాట్లాడుతూ అమ్మ తనం ఎంత విలువైనదొ మట్టి పరిమళం కూడా అంతే విలువైనదని చెప్పడం జరిగింది అదేవిధంగా అమ్మ నవమాసాలు కడుపులో మోస్తే మనిషిని జీవితాంతం కాపాడేది మట్టి తల్లి అని పేర్కొన్నారు నేటి సమాజంలో నేల తల్లికి లేని స్వార్థం మనుషులలో నేడు పేరిగిపోయిందని చుట్టూ ఉన్న సహజ వనరులను కాపాడుకోవాలని ప్రకృతి మన దైవమని పేర్కొన్నారు అదే విధంగా ఈ పాటను రచించిన దాసారపు నరేష్ ను పాట లో నటించిన జన్నే యుగేందర్, పాట పాడిన జూపాక శివను, సంగీతం కిట్టు కిస్ ను పాటలో పాల్గొన్న బృందాన్ని అభినందించారు
కార్యక్రమంలో దొడ్డి కిష్టయ్య, గడ్డం కొమురయ్య, పుల్ల మల్లయ్య, అల్లకొండ కుమార్, గుమ్మడి సత్యం, పుల్ల సతీష్, శనిగరపు మొగిలి కటుకూరి మొగిలి, గోల్కొండ సతీష్ తదితరులు పాల్గొన్నారు

కాంగ్రెస్ పార్టీపై నిందలేస్తే మాత్రం ఊరుకునేది లేదు

కాంగ్రెస్ పార్టీపై నిందలేస్తే మాత్రం ఊరుకునేది లేదు

మెట్ పల్లి జూలై 21 నేటి ధాత్రి

కాంగ్రెస్ పార్టీమల్లాపూర్ మండల అధ్యక్షులు కొమ్ముల చిన్నారెడ్డి
పాత దాంరాజ్ పల్లి గ్రామం లో మాట్లాడుతూ నిన్న మీరు చేసిన షుగర్ ఫ్యాక్టరీ కొరకై పాదయాత్ర చేసినందుకు ఒక రైతుగా నేను అభినందిస్తా కానీ కాంగ్రెస్ పార్టీపై నిందలేస్తే మాత్రం ఊరుకునేది లేదు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సరం లోపలనే ఒక వంద డెబ్బై కోట్లు (170) పాత బకాయిలు చెల్లించి మా చిత్తశుద్ధిని నిరూపించుకున్నాం మేము 2025 డిసెంబర్లో గా ఫ్యాక్టరీ పునరుద్ధరణ చేపడతామని చెప్పాము మీ అరవింద్ కి కూడా తెలుసు పాత బకాయిలు కట్టకుండా ఏ పరిశ్రమకు కూడా ఏ బ్యాంకు గ్యారంటీ ఇవ్వదు మీ అరవింద్ కూడా 2019లో పాదయాత్ర చేశారు అప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఆ ఐదు సంవత్సరాలలో నయా పైసా కూడా షుగర్ ఫ్యాక్టరీ పై ఖర్చు చేయలేదు పైగా ఫ్యాక్టరీ భూములు అమ్మాలని చూసింది అప్పుడు అడ్డుకున్నది మా కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాబట్టి అనవసరమైన విషయాలు మాట్లాడకుండా మీ అరవింద్ ని అడగండి మా సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు ఈ ఫ్యాక్టరీని ఎలా ప్రారంభించాలో ఎంతగా ఆలోచిస్తున్నారు మీ నాయకుడికి గుర్తు ఇంకొకసారి కాంగ్రెస్ పార్టీని నిందించకుండా మీకే గనుక చిత్తశుద్ధి ఉంటే షుగర్ ఫ్యాక్టరీ విషయమై మాతో కలిసి రావాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తు మీరు మా ప్రభుత్వం పైన వేస్తున్న నిరాధారమైన ఆరోపణలను నిందలను ఖండిస్తున్నాం
ఈ కార్యక్రమం లో రైతులు, నాయకులు మామిడాల శ్రీనివాస్, కొమ్ముల చిన్న చిన్నారెడ్డి,కలకోట శంకర్,కొత్తూరి చిన్న రాజారెడ్డి,పొలాస వివేక్ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా బిజెపిలో చేరికలు.

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా బిజెపిలో చేరికలు.

#రాబోయే స్థానిక ఎన్నికల్లో యువతకే పెద్దపీట.

#బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాపరెడ్డి.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతకే మొదటి ప్రాధాన్యత దక్కుతుందని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాపరెడ్డి అన్నారు సోమవారం మండలంలోని రంగాపురం గ్రామంలో మండల పార్టీ అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు ముల్క రాజేష్ తో పాటు 50 మంది కార్యకర్తలు పార్టీకి రాజీనామా చేసి రాణా ప్రతాపరెడ్డి సమక్షంలో బిజెపి పార్టీలో చేరగా వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం గ్రామ కూడలిలో జెండా ఆవిష్కరణ చేసి మాట్లాడుతూ. ఈరోజు పల్లెలు పచ్చదనంతో పరిశుభ్రంగా ఉండడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు ప్రతి పల్లెకు నేరుగా నిధులను విడుదల చేసి గ్రామాలు అభివృద్ధి చెందే విధంగా పథకాలను రూపొందించి గ్రామాలు దృశ్యశ్యామలంగా ఈరోజు ఇలా ఉన్నాయంటే దానికి కారణం మోడీ ప్రభుత్వం. ప్రతి పేదవాడికి సన్న బియ్యం, రైతులకు ప్రపంచంలోనే అతి తక్కువ ధరకు యూరియా బస్తాలు ఇవ్వడం జరుగుతుంది. రైతులకు పెట్టుబడి సహాయం, ప్రతి గ్రామాలలో స్మశాన వాటిక, డంపింగ్ యార్డులు, సిసి రోడ్లు, వీధిలైట్ల ఏర్పాటు, పి ఎం జి ఎస్ వై,, ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా తారు రోడ్ల నిర్మాణ అభివృద్ధి పనులను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ఇలాంటి మరెన్నో అభివృద్ధి పనులకు మోడీ ప్రభుత్వం నిధులను సమకూర్చుతున్నది. అలాగే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నర్సంపేట నియోజకవర్గం లో ఎక్కువ స్థానాల్లో యువకులకే అవకాశం కల్పించి ప్రజా ప్రతినిధులను చేయడమే భారతీయ జనతా పార్టీ లక్ష్యం అని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఓబీసీ మోర్చా అధికార ప్రతినిధి గడ్డం ఆంజనేయులు ,పార్లమెంట్ కో కన్వీనర్ కట్ల రాంచందర్ రెడ్డి ,జిల్లా కౌన్సిల్ మెంబర్ బొద్దిరెడ్డి ప్రతాప్ రెడ్డి ,సీనియర్ నాయకులు వల్లె పర్వతాలు ,మండల ముఖ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

మానవత్వం చాటుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకురాలు పుష్ప..

మానవత్వం చాటుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకురాలు పుష్ప

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-53.wav?_=1

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి అంబేద్కర్ కూడలిలో మలహల్ రావు మండల్ నాచారం గ్రామానికి చెందిన మేకల సారమ్మ వైఫ్ ఆఫ్ రమేష్ అంబేద్కర్ కూడలిలో నిండు గర్భిణీ రక్త స్రావంతో బాధపడుతున్న మహిళను ఆటోలో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లిన కాంగ్రెస్ పార్టీ నాయకురాలు పుష్ప వెంటనే వైద్య సిబ్బందిని కలిసి తక్షణమే డెలివరీ చేయించడం జరిగింది మహిళకు మగ శిశువు జన్మించాడు హక్కున చేర్చుకున్న ఎద్దు పుష్ప వారం రోజులు ఆసుపత్రికి వెళ్లి
జన్మనిచ్చిన తల్లి పుట్టిన బాలుడు మంచి చెడ్డలు చూసుకున్నారు. పుష్ప ను డెలివరీ అయిన మహిళా కుటుంబ సభ్యులు ఆసుపత్రి సిబ్బంది పలువురు అభినందించారు

దళిత బహుజన నాయకుల సస్పెన్షన్ సిగ్గుచేటు

దళిత బహుజన నాయకుల సస్పెన్షన్ సిగ్గుచేటు

తొర్రూరు డివిజన్ నేటి ధాత్రి

కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న దళిత బహుజన నాయకుల సస్పెన్షన్ సిగ్గుచేటని జాతీయ మాల మహానాడు డివిజన్ అధ్యక్షులు గోడిశాల నవీన్, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు మంద యాకమల్లు లు అన్నారు. గురువారం జాతీయ మాల మహానాడు జిల్లా యూత్ నాయకులు ఎనమాల రాకేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ
తొర్రూరు మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దళిత బహుజన బిడ్డలు మెరుగు మల్లేశం గౌడ్,చిట్టిమల్ల మహేష్,బాలు నాయక్ లను అనైతికంగా పార్టీ నుంచి బహిష్కరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు.
సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్ పార్టీలో ఉండి దళిత బహుజనల ఆశయాలు, అభివృద్ధి కోసం అహర్నిశలు చేస్తూ పార్టీలో వివిధ హోదాలలో గుర్తింపు తెచ్చుకొని పార్టీలో జరుగుతున్న విధానాలను ప్రశ్నించినందుకు నియోజకవర్గ ఇన్చార్జి ఝాన్సీ రెడ్డి ఒంటెద్దు పోకడలను సరిచేసుకోవాలని, సీనియర్ నాయకులను కలుపుకొని కష్టపడ్డ కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వాలని అడిగినందుకు సస్పెండ్ చేయడం వారి అగ్రవర్ణ నిరంకుశత్వానికి నిదర్శనమని అన్నారు.మహేష్ మాల మహానాడు జిల్లా అధ్యక్షుని హోదాలో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ నేతృత్వంలో జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలకు పనిచేస్తున్నాడని, వీళ్ళకంటే ఎక్కువగా మాట్లాడిన అగ్రవర్ణ నాయకులను సస్పెండ్ చేసి నిజాయితీని నిరూపించుకోవాలన్నారు.ఝాన్సీ రెడ్డి తక్షణమే సస్పెన్షన్ ఎత్తివేయాలని లేనిపక్షంలో మాల మహానాడు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో దళిత బహుజన బిడ్డల పక్షాన పోరాడుతామని అన్నారు.ఈ సమావేశంలో మాల మహానాడు మండల అధ్యక్షులు అనపర్తి నగేష్,నాయకులు ఎనమాల అంజయ్య, మగ్గిరి వెంకటేశ్వర్లు, కోడిరెక్కల దినేష్, గందారి యశ్వంత్, ధర్మారపు వెంకన్న, ప్రశాంత్,

కాంగ్రెస్ పార్టీ సమావేశంలో పాల్గొన్న దేశిని కోటి.

జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశంలో పాల్గొన్న దేశిని కోటి
(జమ్మికుంట: నేటిధాత్రి)
కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ హుజురాబాద్ నిజయోకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఉడతల ప్రణవ్ బాబు కు స్వాగతం పలుకుతూ శాలువాతో సత్కరించిన దేశిని కోటి. దొంత రమేష్. సుంకర రమేష్.జిల్లాల తిరుపతిరెడ్డి.సతీష్ రెడ్డి.మేకల తిరుపతిరెడ్డి. నల్ల కొండల రెడ్డి.శ్రీనివాస్.తదితరులు సత్కరించారు.
ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడుతూ రానున్న స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టింది ప్రజలు కాంగ్రెస్ పార్టీని విశ్వసిస్తున్నారు మీరందరూ ఐక్యతగా ఉండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థన గెలిపించాలని విభేదాలు లేకుండా పనిచేయాలని ఎంపీటీసీలను జడ్పిటిసి లను ఎంపీపీలుగా జిల్లా పరిషత్ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరడం జరిగింది

ఉనికి కోసమే పుట్ట మధు మంత్రిపై అర్ధరహిత.!

ఉనికి కోసమే పుట్ట మధు మంత్రిపై అర్ధరహిత ఆరోపణలు

చట్టం చేసిన పనిని మంత్రి శ్రీధర్ బాబుపై రుద్దడం సిగ్గుచేటు

మాజీ జడ్పీటీసీ చొప్పరి సధానందం

ముత్తారం :- నేటి ధాత్రి

ముత్తారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు,ముత్తారం మండలం మాజీ జెడ్పిటిసి చొప్పరి సదానందం మాట్లాడుతూ ఒక ప్రేమ జంట వ్యవహారానికి సంబంధించి పోలీసులు ఎంక్వయిరీ లో భాగంగా వెళ్లిన ఘటనలో బిఆర్ఎస్ నాయకులు పోలీసు ఉన్నతాధికారులతో దురుసుగా ప్రవర్తించి వాగ్వాదానికి దిగగా అట్టి వ్యక్తులను పోలీసు అధికారులు చట్టరీత్యా అరెస్టు చేయగా ఆ వ్యవహారాన్ని కూడా మంత్రి శ్రీధర్ బాబు,టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబుపై రుద్దడం సిగ్గుచేటని అన్నారు.బి ఆర్ ఎస్ అధికారంలో ఉన్న కాలంలో ఎందరో కాంగ్రెస్ కార్యకర్తలపై అక్కరకు రాని కేసులు పెట్టి హింసించిన చరిత్ర కమాన్పూర్ మాజీ జెడ్పిటిసి పుట్ట మధుకర్ ది ఎంతోమందిని క్రూరంగా హింసించి,భయభ్రాంతులకు గురిచేసి,సస్యశ్యామలంగా ఉన్న మంథని నియోజకవర్గంలో ఎన్నో హత్యలతో రక్తసిక్తం చేసిన నీ పాలనను మంథని ప్రజలు ఇంకా మరువలేదన్నారు.

 

నీ అనుచరుడు బిఆర్ఎస్ కార్యకర్త పోలీసులతో ప్రవర్తించిన వీడియోలు మంథని ప్రజలందరూ చూసి చీదర అయినా సిగ్గు లేకుండా కేవలం ఉనికి కోసమే మంత్రిపై,మంత్రి కుటుంబంపై అర్థరహిత ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు.ఒక్కసారి అవకాశం ఇచ్చినందుకే మంథని ప్రజలకు నీ మేక వన్నె పులి వ్యవహారాలు తెలిసి నిన్ను వద్దనుకొని అభివృద్ధి కాంక్షించి మళ్లీ దుద్దిళ్ల కుటుంబానికి పట్టం కట్టిన చరిత్ర మంథని ప్రజలని,మంథని నియోజక వర్గ అభివృద్ధి కొరకు అహర్నిశలు కృషి చేస్తున్న మంత్రి శ్రీధర్ బాబు,24 గంటల్లో ఏ సమయంలో ఏ ఆపద వచ్చిన వెంటనే స్పందించి పరిష్కారం చేసే టిపిసిసి ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శ్రీనుబాబు గురించి మంథని ప్రజలందరికీ తెలుసన్నారు.మరో మారు దుద్దిళ్ల కుటుంబం పై ప్రజల్లో ఉనికి కోసం అర్థరహిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని మా నాయకుడు నేర్పిన సంస్కారంతోనే మీలాగా అడ్డగోలుగా మేము మాట్లాడలేకపోతున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మద్దెల రాజయ్య,మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు వాజీద్ పాషా,కిసాన్ సెల్ మండల అధ్యక్షులు గాదం శ్రీనివాస్,ముత్తారం గ్రామ తాజా మాజీ సర్పంచ్ తూటి రజిత రఫీ,మండల కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు బక్కతట్ల వినీత్ తదితరులు పాల్గొన్నారు

బిసి రిజర్వేషన్ బిల్లు క్యాబినెట్ లో ఆమోదం

బిసి రిజర్వేషన్ బిల్లు క్యాబినెట్ లో ఆమోదం

వీణవంక, ( కరీంనగర్ జిల్లా) నేటి ధాత్రి :

 

వీణవంక మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎక్కటి రఘుపాల్ రెడ్డి, మాజీ అధ్యక్షులు ఎండీ సాహెబ్ హుస్సేన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, గురువారం రోజున జరిగిన తెలంగాణ క్యాబినెట్ సమావేశంలో బీసీ బిల్లులకు 42 %శాతం మద్దతుగా స్వగదీసినందున మండల కేంద్రంలో బాణాసంచా కాలుస్తూ మిఠాయిలు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు అనంతరం వారు మాట్లాడుతూ,దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని,ఎన్నికల ముందు ఏఐసీసీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ లకు 42% శాతం అమలు చేస్తుందని,బీసీ అభివృద్ధికి,వారి సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉందని అన్నారు. ఈ బిల్లుకు కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,మంత్రి వర్గానికి, ముఖ్యంగా బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్,శ్రీహరి,పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, నియోజకవర్గం ఇంచార్జ్ వోడితల ప్రణవ్ బాబుకు వీణవంక మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞతలు తెలిపారు.ఈ నిర్ణయాల్లో రాజకీయ,విద్య,ఉద్యోగాల్లో మంచి అవకాశాలు ఉంటాయని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కర్ర భగవాన్ రెడ్డి,గంగాడి రాజి రెడ్డి,గంగాడి తిరుపతి రెడ్డి, ధర్మకర్త జున్ను తుల మధుకర్, రెడ్డి చదువు జైపాల్ రెడ్డి, ఈదునూరి పైడి కుమార్, పంజాల సతీష్, బిక్షపతి ఒరేం శ్రీనివాస్,ముసిపట్ల శశిధర్ రెడ్డి, మోటం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ.

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

తంగళ్ళపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ గ్రామంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను కాంగ్రెస్ పార్టీ నాయకుడు గడ్డం నాయకులు నాయకురాల చేతుల మీదుగాపంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ. రాష్ట్రంలో ప్రజలు అభివృద్ధి చెంచుకోవాలని పరిస్థితుల్లో ఉన్న వారికి ముఖ్యమంత్రి సహాయనిధి వారికి ఎంతో ఉపయోగపడుతుందని అలాంటిది గ్రామంలో ప్రతి ఒక్కరికి ఆపద సమయంలో వైద్యం చేయించుకొని వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి పొందవచ్చు గాని ఈ సందర్భంగా తెలియజేశారు ఎందుకుగాను రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గడ్డం మధుకర్ మాట్లాడుతూ ఇందిరమ్మ కాలనీ గ్రామానికి చెందిన గజ్జల రవి 9500 ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు రావడానికి కృషి చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కి ప్రభుత్వ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ కి. సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి కి. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రవీణ్ కి ఇట్టి చెక్కులు రావడానికి కృషి చేసిన వీరందరికీ పేరుపేరునా లబ్ధిదారులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు .ఇట్టి కార్యక్రమంలో. కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంపెల్లి శ్యామ్. గోరింటాల రాజమల్లు. బొల్లి శంకర్. నూతి మార్కండేయ. గోరింటాల మాధవి. దీకొండ జ్యోతి. దూస లత. బేతి జయ. పార్టీ నాయకులు నాయకురాలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

నిరంతరం పేదల పక్షాన నిలబడే మహానేత

నిరంతరం పేదల పక్షాన నిలబడే మహానేత రేవూరి ప్రకాష్ రెడ్డి

కొయ్యడ శ్రీనివాస్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు

పరకాల నేటిధాత్రి
పట్టణ కేంద్రంలో ఇందిరమ్మ లబ్ధిదారులకు మొట్టమొదటి బిల్ రావడం జరిగిందని
ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పేదల పక్షాన నిలబడే మహానేత అని పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్ అన్నారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల పక్షాన ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిర మహిళలను నిరుపేదలకు చేరే విధంగా వారందరూ పూర్తిగా కట్టుకోవాలని ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష చేసుకుంటూ నిరంతరం లబ్ధిదారుల నిర్మాణంలో కార్యకర్తలను భాగస్వామ్యం చేసుకుంటూ ఇల్లు నిర్మించే విధంగా ఇలాంటి లోటుపాట్లు రాకుండా చర్యలు తీసుకుంటున్నారని అన్నారు.గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం కెసిఆర్ పాలనలో నిరుపేద ప్రజలను కులగొట్టుకోమని చెప్పి ఎడారిలో ఉంచి వాళ్లను రోడ్డున పాలు చేసిన కేసీఆర్ ప్రభుత్వం కానీ నాటి ఇందిరమైనులైన నేటి ఇందిరమ్మ ఇళ్లయిన అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అనేది పేదలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తోటే న్యాయం జరుగుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు.ఈ యొక్క ఇందిరమ్మ లబ్ధిదారులకు మొదటి బేస్మెంట్ బిల్లు 21,3,14 వార్డులలో బండారి లక్ష్మి,గడ్డం శైలజ,జోరు విజయలలిత,ఎండి అక్బరుద్దీన్,అలీ లకు మొదటి బిల్లు లక్ష రూపాయలు రావడం జరిగిందన్నారు.ఈరోజున వారంతా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని ఇది కేవలం పేదవాడి ఇంటి కల నెరవేర్చడం అది కాంగ్రెస్ పార్టీ తోటే సాధ్యం ఇది రేవూరి ప్రకాష్ రెడ్డి కృషి అని అన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు మున్సిపల్ మాజీ కోఆప్షన్ సభ్యులు ఎర్రబెల్లి భాస్కర్,బండి సదానందం గౌడ్,సుధమల్ల రమేష్,మొగిలి తదితరులు పాల్గొన్నారు.

డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి పుట్టినరోజు .

డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహణ

నేటి ధాత్రి చర్ల

చర్ల కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో పిసిసి జనరల్ సెక్రెటరీ నల్లపు దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భద్రాచలం డివిజన్ కాంగ్రెస్ నాయకులు చీమలమరి మురళి మాట్లాడుతూ
రైతు సంతోషంగా ఉంటే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన రైతు బిడ్డగా అన్నదాతల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి వారి అభివృద్ధి కోసం చివరి శ్వాస వరకు పనిచేసిన నాయకుడు దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ అని అన్నారు
సంక్షేమానికి బ్రాండ్
అభివృద్ధికి ట్రేడ్ మార్క్‌లా నిలిచి ప్ర‌జా సంక్షేమ‌మే ల‌క్ష్యంగా పాల‌న చేసిన నాయ‌కుడు దివంగ‌త మ‌హానేత డాక్ట‌ర్
వైయస్‌ఆర్‌ 76వ జయంతి సందర్భంగా ఘననివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో గుండేపూడి భాస్కరరావు ఆవుల పుల్లారావు నల్లపు శేషగిరి విజయ్ కుమార్ నాయుడు మేడబత్తిన వాసు సిరిపురపు శివ పూజారి రమణయ్య కారంపూడి సల్మాన్ చీమకుర్తి సాయిచరణ్ పొగాకు సత్తి బాబు మునిగల వెంకన్న మాణికరావు రాజన్న ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు మచ్చ రాజ కనితి శ్రీను మామిడి భాను తదితరులు పాల్గొన్నారు

అర్హత పద్మ దేవేందర్ రెడ్డి కి లేదు..

కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత పద్మ దేవేందర్ రెడ్డి కి లేదు..

ఎమ్మెల్యే పై అనవసర ఆరోపణలు చేయడం మంచిది కాదు..

సర్పంచులు అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడడం బిఆర్ఎస్ పాపం..

శిలాఫలకాలు వేయడమే తప్ప పనులు ప్రారంభించని బిఆర్ఎస్..

టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాత రావు..

రామాయంపేట జూలై 5 నేటి ధాత్రి (మెదక్)

మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావ్, కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల మాట్లాడి అర్హత బి.ఆర్.ఎస్ నాయకులతోపాటు మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి కి ఎంత మాత్రం లేదని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాత రావు అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతంలో ఎమ్మెల్యేగా ఉండి చేసిన అభివృద్ధి పనులు ఏమాత్రం లేకపోవడంతో పాటు తక్కువ సమయంలో అభివృద్ధి వేగవంతం చేస్తున్న ఎమ్మెల్యే రోహిత్ రావు పట్ల ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదు అన్నారు. బి ఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో శిలాఫలకాలు వేయడం కొబ్బరికాయలు కొట్టడమే తప్ప ఎక్కడ కూడా పనులు ప్రారంభించిన ఘటనలు లేవన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేవలం 16 నెలలు కాలం ఎమ్మెల్యే రోహిత్ రావు ప్రత్యేక చొరవతో వేగంగా నియోజకవర్గ అభివృద్ధి చెందుతుందన్నారు. ఇది జీర్ణించుకోలేక మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అనవసర ఆరోపణలు చేయడం జరుగుతుందన్నారు. నియోజకవర్గం లో 250 గ్రామపంచాయతీలు రెండు మున్సిపాలిటీలు దేవాలయాలకు నిధులు మంజూరు చేయించి అభివృద్ధి పనులను సైతం వారం రోజుల్లోకి ప్రారంభించిన ఘనత ఎమ్మెల్యే రోహిత్ రావుకు దక్కింది అన్నారు. పద్మ దేవేందర్ రెడ్డి రామాయంపేట రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుండి అభివృద్ధి కుంటూపడిందని కనీసం తన స్వగ్రామం కోనాపూర్ కూడా అభివృద్ధి నోచుకోని దుస్థితి దాపురించింది అన్నారు. రామయంపేట రెవిన్యూ డివిజన్ ప్రకటించి ఆర్డిఓ కార్యాలయం, సిబ్బంది నియమించకపోవడం కనీసం ఆర్డిఓ ఎవరు తెలియని పరిస్థితి అప్పటి బి ఆర్ ఎస్ చేసిన దౌర్భాగ్య పరిస్థితి అన్నారు. తూతు మంత్రంగా రెవిన్యూ డివిజన్ ప్రకటించి చేతులు దులుపుకోవడం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.

Congress party.

ఈ సమావేశంలో రమేష్ రెడ్డి, దేమే యాదగిరి చిలుక స్వామి, బైరం శంకర్ కంచర్లు పాల్గొన్నారు.

చలో హైదరాబాద్ కు తరలి వెళ్ళిన..

చలో హైదరాబాద్ కు
తరలి వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు

కొత్తగూడ, నేటిధాత్రి:

గ్రామ కమిటీ అధ్యక్షుల మరియు క్రియాశీల కార్యకర్తల సమ్మేళనానికి హైదరాబాద్ ఎల్బీ స్టేడియం కు విచ్చేసిన
ఏఐసీసీ అధ్యక్షుడు గౌరవ శ్రీ మల్లిఖార్జున ఖర్గే గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ…
ములుగు నియోజకవర్గ
మహబూబాబాద్ జిల్లా
కొత్తగూడ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ అనసూయ సీతక్క ఆదేశాల మేరకు నియోజకవర్గ ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ పటేల్ సూచనల మేరకు… కొత్తగూడ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వజ్జ సారయ్య నేతృత్వంలో ర్యాలీ నిర్వహించి జేజేలు పలుకుతూ… కార్యకర్తలను చలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియం కు తరలించారు
ఈ కార్యక్రమంలో
కొత్తగూడ మండల అన్ని గ్రామాల పార్టీ అధ్యక్షులు , మండల నాయకులు ముఖ్య కార్యకర్తలు సోషల్ మీడియా విభాగం యువజన నాయకులు తరలి వెళ్లారు.

కోరుట్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇంచార్జి జువ్వాడి..

మెట్ పల్లి జూలై 4 నేటి ధాత్రి
కోరుట్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇంచార్జి జువ్వాడి నర్సింగరావు పుట్టినరోజు సందర్బంగా జిల్లా గ్రంథాలయం డైరెక్టర్ నాగభూషణం హైదరాబాద్ లో వారి నివాసం లో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీ లోకి ఆహ్వానించిన జువ్వాడి నర్సింగరావు ఈ కార్యక్రమంలో
మల్లాపూర్ మాజీ జడ్పీటీసీ ఎల్లలజలపతి రెడ్డి రాష్ట్ర పద్మశాలి సంఘము ఉపాధ్యక్షులు కేసుల సురేందర్ కౌన్సిలర్లు మర్రి సహాదేవ్, పిప్పర రాజేష్ బీసీ సంక్షేమ శాఖ మెట్ పల్లి ఇంచార్జి తుమ్మనాపెళ్ళి రాజు లు తదితరులు పాల్గొన్నారు.

చలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియం కు .

చలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియం కు తరలి వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డా౹౹ఎ.చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ గ్రామ అధ్యక్షుల సమ్మేళన బహిరంగ సభకు బయలుదేరిన,జహీరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు మరియు నాయకులు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు హన్మంత్ రావ్ పటేల్ గారు,శ్రీనివాస్ రెడ్డి, రామలింగారెడ్డి,మాక్సూద్ అహ్మద్,పట్టణ అధ్యక్షులు కండేం.నర్సింలు గారు మరియు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, గ్రామ అధ్యక్షులు పాల్గొని సభకు బయలుదేరడం జరిగింది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version