మద్యం టెండర్లలో గౌడులకు 25% వాటా కావాలి..

మద్యంటెండర్లో గౌడులకు 25 శాతం వాటా ఇవ్వాలి

మోకుదెబ్బ రమేష్ గౌడ్ డిమాండ్..

నర్సంపేట,నేటిధాత్రి:

కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం మద్యం టెండర్లలో గౌడ కులస్తులకు 25 శాతం వాటా ఇవ్వాలని గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ డిమాండ్ చేశారు.పట్టణంలో బుదవారం మోకుదెబ్బ జిల్లా కమిటీ సమావేశం జరిగింది.ఈ సందర్బంగా రమేష్ గౌడ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం గౌడ కులస్తులకు మద్యం దుఖాణాలలో 15 శాతం మాత్రమే కెటాయించడం జరిగిందన్నారు. కామారెడ్డిలో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మేనిపెస్టోలో గౌడ కులస్తులకు మద్యం దుఃఖణాల కేటాయింపులో 25 శాతం ఇస్తామని వాగ్దానం చేసిందన్నారు.
కామారెడ్డి డిక్లరేషన్ లో గౌడ్స్ కు ఇచ్చిన హామీని ప్రకారంగా 25 శాతం వాటా డిక్లరేషన్ విస్మరించడం సరికాదన్నారు.మధ్యం టెండర్లలో 3 లక్షలు కాకుండా 2 లక్షలకు కుదించాలని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లు ఆమోదించాలని రమేష్ గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. రెండేళ్లుగా తాటిచెట్ల పైనుంచి పడి చనిపోయిన, గాయపడిన 7 వందల మంది గీత కార్మికులకు పెండింగ్ లో 7 కోట్ల రూపాయల ఎక్స్ గ్రేషియా వెంటనే చెల్లించాలని తెలిపారు. జనగామ జిల్లా కు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెట్టాలని, 50 యేండ్లు నిండిన ప్రతి గీత కార్మికుడికి ఫెక్షన్ మంజూరు చేయాలని రమేష్ గౌడ్ డిమాండ్ చేశారు.

మోకుదెబ్బ జిల్లా ప్రచార కార్యదర్శి గా శ్యామ్ సుందర్ గౌడ్

దుగ్గొండి మండలం లక్ష్మిపురం గ్రామానికి చెందిన బొమ్మగాని శ్యామ్ సుందర్ గౌడ్ ను మోకుదెబ్బ హన్మకొండ జిల్లా ప్రచార కార్యదర్శిగా నియమించినట్లు మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ తెలిపారు. గత రెండేళ్లుగా శ్యామ్ కుమార్ గౌడ్ గౌడ కులస్తులకు చేస్తున్న సేవలను గుర్తించి ఈ పదవిలో నియమించినట్లు రమేష్ గౌడ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో మోకుదెబ్బ రాష్ట్ర కార్యదర్శి మద్దెల సాంబయ్య గౌడ్, హన్మకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్షులు తోటకూరి రాందాస్ గౌడ్, గోపగాని వెంకట్ గౌడ్, జిల్లా సలహాదారులు రామగోని సుధాకర్ గౌడ్,జిల్లా కార్యదర్శి బోడిగే మల్లేశంగౌడ్,మేరుగు మల్లేశంగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

రైతులకు తక్షణమే యూరియా అందించాలి: బీఆర్ఎస్ ధర్నా..

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-03T131112.007.wav?_=1

రైతులకు యూరియా తక్షణమే అందించాలి

బిఆర్ఎస్ పార్టీ ఆధ్వ ర్యంలో ధర్నా, రాస్తారోకో

శాయంపేట నేటి ధాత్రి:

శాయంపేట మండలంలోని మాందారిపేటకూడలి వద్ద బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే శాసనసభ్యులుగండ్ర వెంకట రమణారెడ్డి నాయ కత్వంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇది కెసిఆర్ పైన చేస్తున్న కుట్ర మాత్రమే కాదు కాలేశ్వరాన్ని ఎండబెట్టే ప్రయ త్నంలో భాగంగానే ఇది జరుగు తున్నది.సిబిఐకి కాలే శ్వరం అప్పజెప్పడం అంటే పూర్తిగా ప్రాజెక్టును మూసేయడమే.

BRS Holds Protest

నిన్నటిదాకా సిబిఐ పైన వ్యతి రేకంగా మాట్లాడిన రేవం త్ రెడ్డి ఒక్కరోజులోనే మాట ఎందుకు మార్చాడు.తె లంగా ణా ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజె క్టును సీబీఐ కి అప్పజెప్పడం వెంటనే ఉపసంహరించుకోవా లి. లేదంటే మున్ముందు ధర్నా కార్యక్రమాలు ఇంకా ఉదృతం చేస్తామని, బెదిరింపులు కేసు లు మా పార్టీకి కొత్త కాదని అన్నారు.ఒక వైపు రైతులు పంటలకు యూరియా లేక అల్లాడిపోతుంటే వారి గురించి పట్టించుకునే వారే కరువ య్యారని అన్నారు. రోడ్డుపై బఠాయించి ధర్నాచేసి నిరసన తెలిపారు ఎరువుల కొరతకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం మే కారణం అంటూ నినాదాలు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వంవచ్చి న తర్వాత రైతులు ఆరిగోస పడుతు న్నారన్నారు సకాలం లో రైతు బంధు అందక ఎరు వులు లేక అష్ట కష్టాలు పడు తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అబద్దాల మాటలు తప్పుడు ప్రచారాలు చేస్తూ పబ్బం గడుపుతున్నా రని మండి పడ్డారు రైతులకు యూరియా కష్టాలు తీర్చాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్ర మంలో మండల కేంద్రంలోని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు అధిక మొత్తంలో పాల్గొన్నారు.

BRS Holds Protest

అల్లాడుతున్న అన్నదా తలు గంటల తరబడి నిరీక్షణ

వేసినపంట అదను దాటి పోవడంతో యూరియా రైతులు అల్లాడిపోతున్న పనులన్నీ మానుకొని ఎరువుల దుకాణం వద్ద పడికా పులు కాస్తున్నాం అన్నదాతలు ఎరువుల కేంద్రం వద్ద క్యూ కట్టారు యూరియా బస్తాలు తక్కువ రావడంతో ఉన్నవారికి ఒక్కొక్కడిగా ఇవ్వడం జరుగుతుంది. మండల కేంద్రంలో పంపిణీ చేస్తున్న యూరియా బస్తాలను రైతులను అడిగి తెలుసుకు న్నారు. మండల వ్యవసాయ అధికారికి రైతుల గురించి చెప్పడం జరిగింది. ప్రతి రైతుకు సంపూర్ణంగా అందే టట్లు చూడాలని మాట్లాడడం జరిగింది.రైతులకు అండగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుం దని మాజీ ఎమ్మెల్యే అన్నారు

ప్రాంతీయ పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి.

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-03T123441.263.wav?_=2

ప్రాంతీయ పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి :

◆:- యువనేత మొహమ్మద్ ముర్తజా

జహీరాబాద్ నేటి ధాత్రి:

జాతీయ పార్టీలు అయిన కాంగ్రెస్, బీజేపీ కలిసి మన ప్రాంతీయ పార్టీ తెలంగాణ రాష్ట్రము సాధించిన బిఆర్ఎస్ పార్టీ ని లేకుండా చేయాలని చేస్తున్న కుట్రలు సాగవు కెసిఆర్ కాళేశ్వరం నిర్మించి అపర భగీరతుడు అయ్యారు. కాంగ్రెస్, బీజేపీ నాటకాలు గట్టిగ ఎండగట్టాడు మరియు వీళ్ళ ఆటలు సాగాలేవు అందుకని కక్ష సాధింపు చర్యలకు కాంగ్రెస్ బీజేపీ లు కలసి కవిత ని కేసులు పేరుతో బెదిరించి పావుగా చేసి ఆడిస్తున్న నాటకం.
ఒక రకంగా చెప్పాలంటే ప్రాంతీయ పార్టీ లేకుండా చేసే కుట్ర ఇది.జాతీయ పార్టీ రాష్ట్రము లో అధికారం లో ఉంటే రాష్ట్రాన్ని వాళ్ళ చెప్పు చేతల్లో, ఢిల్లీ కి గులాం గిరి చేయిస్తారు, స్వతంత్ర నిర్ణయం తీసుకొనే అధికారం వీళ్లకు ఉండదు.
జాతీయ పార్టీల కన్నా, రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు, అవసరాలు, ప్రాధాన్యతలు ప్రాంతీయ పార్టీ బిఆర్ఎస్ కె బాగా తెలుసు. రాష్ట్రానికి ప్రత్యేకమైన ప్రాజెక్టులు, పథకాలు, నిధుల కోసం కేంద్రం దగ్గర బలంగా డిమాండ్ చేయగలదు.
స్థానిక సంస్కృతి, భాష, ఆర్థిక వ్యవస్థ, రైతాంగం, పరిశ్రమలు వంటి అంశాల్లో ప్రాంతీయ పార్టీలు ఎక్కువ దృష్టి ప్రాధాన్యత ఇస్తుంది.ప్రజల్లారా జాగ్రత్త బిఆర్ఎస్ పార్టీ మన ప్రాంతీయ పార్టీ, అందరు కలసి కట్టుగా మన ప్రాంతీయ పార్టీ అయిన బిఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేయాల్సిన సమయం ఇది, లేదంటే శాశ్వతంగా ఢిల్లీ గులాముల చేతిలో రాష్టం బందిగా ఉంటుంది.

కొల్లూరులో బాల గణేష్ నిమజ్జనం…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-03T121958.700-1.wav?_=3

కొల్లూరులో బాల గణేష్ నిమజ్జనం

జహీరాబాద్ నేటి ధాత్రి:

హనుమాన్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు సి హెచ్ సంగమేష్ సాయిగౌడ్ కాశీ రామ్ లక్ష్మణ్ డి శేఖర్ పాండు హరి శ్రీనివాస్ పాటిల్ మల్లేష్ విష్ణువర్ధన్ రెడ్డి శ్రీశైలం మరియు యుత్ సభ్యులు కొల్లూరు అధ్వర్యం లో ఏర్పటు చేసిన గణేష్ నిమజ్జనం కార్యక్రమంలో పాలుగొన్న గ్రామ పెద్దలు నాయకులు.ఇట్టి కార్యక్రమములో కొల్లూరు మాజీ ఎంపీటీసీ సీ హెచ్ రాజ్ కుమార్ కొల్లూరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డప్పూరు సంగమేష్,మాజీ వార్డు సభ్యులు వై నగేష్ ఎం విష్ణు యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఝరాసంగం చింతలగట్టు శివరాజ్, సంగారెడ్డి నర్సింహారెడ్డి,దేవేందర్ దారా గోరఖ్ కాశీనాథ్ ఉమాకాంత్ సి ప్రకాష్ మరియు గ్రామ ప్రజలు పాల్గోని బాల గణేశునికి పూజలు చేసి నిమజ్జనం కార్యక్రమన్ని విజయవంతంగా పూర్తి చేసారు.

ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కాంగ్రెస్ పార్టీ బలం….

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-03T121001.744-1.wav?_=4

ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కాంగ్రెస్ పార్టీ బలం

◆:- యువ నాయకులు మహ్మద్ హఫీస్

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండల చిల్లెపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు మహ్మద్ హఫీస్ మాట్లాడుతూ
అధికారంలోకి వచ్చిన 18 నెలలోనే ఐదు గ్యారంటీలను అమలు చేసి ప్రజల మన్న లను పొందింది అన్నారు. రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఉందన్నారు. గతంలో పది సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ మోసపూరిత హామీలతో, పథకాలతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందన్నారు. అందుకే ప్రజలు బీఆర్ఎస్ పార్టీని అసెంబ్లీ ఎన్నికల్లో బొంద పెట్టారన్నారు. జరగబోయే ఎంపిటిసి జడ్పిటిసి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిలను అత్యధిక మెజార్టీతో గెలిపించి,రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాల్సిన అవసరం ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు ఉందన్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలోని పంచాయతీలు, వార్డులలోని ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియపరుస్తూ ఓట్లను అడిగి ఎంపీటీసీ జెడ్పిటిసిలను అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై బిఆర్ఎస్ పార్టీ ధర్నా, రస్తారోకో..

బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో

జహీరాబాద్ నేటి ధాత్రి:

బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మానిక్ రావు నాయకత్వంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలకు నిరసనగా ఈరోజు జహీరాబాద్ పట్టణంలోని బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ధర్నా మరియు రస్తా రోకో కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
ఇది కెసిఆర్ పైన చేస్తున్న కుట్ర మాత్రమే కాదు తెలంగాణ నదీ జలాలను పక్క రాష్ట్రాలకు తరలించి,కాలేశ్వరాన్ని ఎండబెట్టే ప్రయత్నంలో భాగంగానే ఇది జరుగుతున్నది.
సిబిఐకి కాలేశ్వరం అప్పజెప్పడం అంటే పూర్తిగా ప్రాజెక్టును మూసేయడమే.నిన్నటిదాకా సిబిఐ పైన వ్యతిరేకంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఒక్కరోజులోనే మాట ఎందుకు మార్చాడు.తెలంగాణా ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును సీబీఐ కి అప్పజెప్పడం వెంటనే ఉపసంహరించుకోవాలి.లేదంటేమున్ముందు ధర్నా కార్యక్రమాలు ఇంకా ఉదృతం చేస్తామని.బెదిరింపులు కేసులు మా పార్టీకి కొత్త కాదని అన్నారు.ఒక వైపు రైతులు పంటలకు యూరియా లేక అల్లాడిపోతుంటే వారి గురించి పట్టించుకునే వారే కరువయ్యారని అన్నారు.ఈ కార్యక్రమంలో జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి , కోహీర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు , న్యాల్కల్ మండల పార్టీ అధ్యక్షులు రవీందర్, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్, మాజి పట్టణ అధ్యక్షులు మొహియుద్దీన్ ,మాజి ఎంపీపీ బొగ్గుల సంగమేశ్వర్,మాజి కేతకీ సంగమేశ్వర ఆలయ చైర్మన్ నరసింహ గౌడ్ , వివిధ గ్రామాల తాజా మాజి సర్పంచ్ లు ఎంపీటీసీ వార్డ్ సభ్యులు ముఖ్య నాయకులు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

కాంగ్రెస్‌లో ఉంటే.. కిరాయి ఇంట్లో ఉన్న ఫీలింగ్ ఉంది..

కాంగ్రెస్‌లో ఉంటే.. కిరాయి ఇంట్లో ఉన్న ఫీలింగ్ ఉంది..

ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులో భాగంగా పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌ నోటీసులు జారీ చేశారు. ఫిరాయింపుల కేసు విచారణకు సంబంధించి నిర్దేశిత సమయాన్ని ఆ నోటీసుల్లో పేర్కొనలేదని సమాచారం.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు రోజుకో మలుపు తీసుకుంటుంది. అయితే సుప్రీంకోర్టు తీర్పును గౌరవించి బీఆర్‌ఎస్‌ ఫిర్యాదులపై విచారణ చేపట్టిన స్పీకర్‌ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి మారిన పదిమంది ఎమ్మెల్యేకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నోటీసులపై తాజాగా.. మరోసారి గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి స్పందించారు. స్పీకర్ నోటీసులకు తాను రిప్లై ఇచ్చినట్లు తెలిపారు. తాను ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని.. అదే విషయాన్ని స్పీకర్‌కు ఇచ్చిన రిప్లైలో చెప్పానని స్పష్టం చేశారు. అప్పుడున్న పరిస్థితుల్లో తాను పార్టీ మారానని చెప్పుకొచ్చారు. అధికార పార్టీలో ఉంటే నియోజకవర్గ పనులు జరుగుతాయని కాంగ్రెస్‌లో చేరినట్లు చెప్పారు. కానీ పార్టీ మారి తప్పు చేశానని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో.. ఉంటే కిరాయి ఇంట్లో ఉన్నా అనే ఫీలింగ్ ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తాను బీఆర్ఎస్‌లోనే ఉన్నానని, హరీష్ రావు తనతో రెగ్యులర్‌గా టచ్‌లో ఉన్నట్లు ఆయన వివరించారు.

ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులో భాగంగా పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌ నోటీసులు జారీ చేశారు. ఫిరాయింపుల కేసు విచారణకు సంబంధించి నిర్దేశిత సమయాన్ని ఆ నోటీసుల్లో పేర్కొనలేదని సమాచారం. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు నిర్దేశించిన గడువు లోపల పది మంది ఎమ్మెల్యేలపై విచారణ పూర్తి చేసి స్పీకర్‌ నిర్ణయం ప్రకటిస్తారా..? లేక పెండింగ్‌లో పెడతారా..? అన్నది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు, ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు ఎమ్మెల్యేలు తాము బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతున్నామంటూ పలు సందర్భాల్లో ప్రకటించారు. శాసనసభ రికార్డుల్లోనూ పది మంది ఎమ్మెల్యేలూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలుగానే ఉన్నారు. సుప్రీంకోర్టు గడువు ముగిసేలోపు స్పీకర్‌ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.

ఆపదలో భరోసా సీఎంఆర్ఎఫ్…

ఆపదలో భరోసా సీఎంఆర్ఎఫ్

గంగాధర నేటిధాత్రి :

 

అనారోగ్యంతో బాధపడుతూ, ప్రమాదంలో గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పేద, మధ్యతరగతి ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి పథకం భరోసా కల్పిస్తోందని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పురుమల్ల మనోహర్ అన్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి క్రింద రూ. 22,56,500/- విలువైన ఆర్థిక సహాయం మంజూరు అయింది. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆదేశాల మేరకు శనివారం గంగాధర మండలం మధురానగర్ లోని ఎమ్మెల్యే ప్రజా కార్యాలయంలో లబ్ధిదారులకు సిఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. ఆపదలో తమను ఆదుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇందుకు సహకరించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గంగాధర మార్కెట్ కమిటీ వైఎస్ చైర్మన్ తోట కరుణాకర్, బుర్గు గంగన్న,సాగి అజయ్ రావు,సత్తు కనుకయ్య, దోర్నాల శ్రీనివాస్ రెడ్డి,రెండ్ల రాజిరెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు గరికంటి కరుణాకర్,ముచ్చ శంకరయ్య,దొమ కొండ మహేష్, మల్లయ్య, శంకర్,మ్యాక వినోద్,ఎమిరెడ్డి నాగేంద్రర్ , శ్రీనివాస్, మంత్రి మహేందర్, పవుల్, నారాయణ ,తదితరులు పాల్గొన్నారు.

ఆశాస్త్రీయంగా వార్డుల విభజన..

ఆశాస్త్రీయంగా వార్డుల విభజన
అధికార పార్టీకి లాభం చేకూర్చే విధంగా అధికారుల పనితీరు
భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి
వర్ధన్నపేట (నేటిధాత్రి):

 

 

వర్దన్నపేట స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ గెలుపు కోసం వార్డుల విభజన ఆశాస్త్రీయంగా చేపట్టి అధికారుల మీద ఒత్తిడి తెచ్చి అడ్డదారిన గెలవాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తుందని భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి ఆరోపించారు. గత ఆరు నెలలుగా ఓటర్ లిస్ట్ సవరణ పేరుతో ఎన్నోసార్లు అధికారులు మీటింగులు పెట్టి సవరణలు చేస్తున్నామని చెప్పి అటువంటి ఏమి చేపట్టకుండా మళ్లీ పార్లమెంటు ఎలక్షన్లో ఉన్న అటువంటి ఓటర్ లిస్టు ఆధారంగా వార్డుల విభజన చేయడం విడ్డూరంగా ఉంది అని అన్నారు.

 

గత రెండు సంవత్సరాల క్రితం చనిపోయిన వారిని సైతం ఓటర్ లిస్ట్ లో నుంచి తొలగించకుండా మరియు ఒకే వ్యక్తికి ఒకే వార్డులో రెండు ఓట్లు ఉన్నా కూడా వాటిని కూడా సవరణలు చేయకుండా లిస్టులు విడుదల చేయడం అధికారుల పనితీరుకు అద్దం పడుతుందని మహేందర్ రెడ్డి విమర్శించారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని తప్పులను సరిదిద్దుకొని వార్డులను శాస్త్రీయ పద్ధతిలో విభజన చేయాలని మహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి జడ సతీష్. మడత రాజేష్. గోరు కంటి అనిల్ పాల్గొన్నారు.

ప్రజా ప్రభుత్వంలో.. రైతుల కడగండ్లు..

ప్రజా ప్రభుత్వంలో.. రైతుల కడగండ్లు

రైతు శ్రేయస్సును మరిచిన.. కాంగ్రెస్ ప్రభుత్వం

బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను రాజును చేసింది.

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను గాలికొదిలేసింది.

రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి వాల్యా నాయక్.

బాలానగర్ /నేటి ధాత్రి

బాలానగర్ మండల కేంద్రంలో మంగళవారం రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి వాల్యా నాయక్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క రైతుకు ఇబ్బందులు కలగలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతును రాజును చేసిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ముందుచూపు లేకపోవడంతో రైతులు యూరియా లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులను గాలికి వదిలేసారన్నారు. సకాలంలో ప్రభుత్వం స్పందించి త్వరితగతిన రైతులకు యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. యూరియా సరఫరాలో ఆలస్యం జరిగితే రైతులు ఆర్థికంగా నష్టపోతారన్నారు. ఇందిరమ్మ రాజ్యం వస్తే ప్రజలందరికీ మేలు చేసే విధంగా ప్రజా ప్రభుత్వం ఉంటుందని ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరడం లేదన్నారు. ఆరు గ్యారెంటీ ల పథకాలు అమలు కావడం లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రూ.లక్ష కోట్ల అవినీతి అవస్తమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి.. మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలన్నారు. వచ్చే మూడేళ్ల తర్వాత బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటు వేసి ఇప్పుడు బాధపడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ రావు, మాజీ ఎంపీపీ కమల, లక్ష్మయ్య, గోపి నాయక్, లక్ష్మణ్ నాయక్, తిరుపతి నాయక్ తదితరులు పాల్గొన్నారు.

డైవర్షన్‌ పాలిటిక్స్‌లో డేరింగ్‌ కింగ్‌

-డైమనిక్‌ పాలిటిక్స్‌లో ఆరి తేరిన లీడర్‌!

-ఒక్కసారి కమిటైతే తన మాట తానే వినడు.

-రేవంత్‌ వేసిన స్కెచ్‌కు ఎదురుండదు.

-ఎవ్వరి సలహాలు తీసుకోడు.

-తన ఆలోచనలకు అనుగుణంగా మాత్రమే ముందుకు వెళ్తారు.

-తన నిర్ణయాలు వెంట నడిచే వారిని వదులుకోడు.

-ఒక్కసారి నమ్మితే జీవితాంతం వదిలిపెట్టడు.

-రాజకీయాలలో నీతికి చోటు వెతకడం సాధ్యం కాదని తెలుసు.

-అధికారం కోసం రాజకీయాలలో సందర్భోచిత అడుగులు నేర్చుకున్నాడు.

-ఓటమి నేర్పిన పాఠాలనుంచి వెంటనే బైట పడగలిగే శక్తి వున్న నాయకుడు.

-రెండేళ్ళుగా ప్రతిపక్షాలకు ఊపిరి సలపకుండా చేస్తున్నాడు.

-తనను తిట్టిన బిఆర్‌ఎస్‌ను ఓడిరచి గెలిగిన ధీరుడు.

-ఎదురయ్యే సమస్యలను క్షణాలలో మరిపించగలడు.

-రెండేళ్ళలలో జరిగిన పొరపాట్లను కూడా జనం మర్చిపోయేలా చేయగలడు.

-తన మాటలను మాత్రం ఎప్పుడూ లైమ్‌ లైట్‌లో వుంచగలడు.

-మీడియా అటెన్షనంతా తనపైనే ఫోకస్‌ చేసుకోగలడు.

-ఒక్క మాటతో సమస్యలన్నీ పక్కదారి పట్టించగలడు.

-రాజకీయ వ్యతిరేకుల చేత కూడా దటీజ్‌ రేవంత్‌ అనిపించుకోగలడు.

-రాజకీయాలెప్పుడూ సక్సెస్‌ చుట్టే తిరుగుతాయి.

-ఈ విషయం రేవంత్‌ కు తెలిసినంతగా మరే నాయకుడికి తెలియదు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

డైవర్ట్‌ అనే మాట లేకుండా దేశంలో రాజకీయాలు సాగడం లేదంటే అతిశయోక్తి కాదు. ఆ పార్టీ, ఈ పార్టీ అని తేడా లేదు అన్ని పార్టీలు అదే అనుసరిస్తున్నాయి. ఆ దారిలోనే నడుస్తున్నాయి. అలాంటి డైవర్షన్‌ పాలిటిక్స్‌ను ఎవరు సమర్థవంతంగా పోషిస్తే రాజకీయాలలో వాళ్లే కింగ్‌లౌతున్నారు. అలాంటి నాయకులే దేశమంతటా సాగుతున్నారు. డైవర్షన్‌ రాజకీయాలే ప్రపంచమంతా సాగుతున్నాయనేది కూడా ముమ్మాటికీ నిజం. అలాంటి రాజకీయాలను నమ్ముకుంటే తప్ప రాణించలేమని నాయకులు తెలుసుకోవాల్సిన పరిస్థితులు ఎదురౌతున్నాయి. రాజకీయం కూడా ఒక లక్ష్యం చేసుకొని నాయకుడవ్వాలి. రాజకీయాలలో డైవర్షన్లు, డైమెన్షన్లు సహజం. అవి లేకుండా రాజకీయాలు సాధ్యమయ్యే రోజులు కావు. నైతికత అనే పదానికి కాలం చెల్లిన రోజులు. ముళ్లును ముళ్లుతోనే తీయాలి. బలమైన రాజకీయ శక్తులను ఎదిరించి నిలబడలాంటే లాజిక్‌ల కన్నా మ్యాజిక్‌లే ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి. నమ్మకాల విన్యాసాలే రాజ్యమేలుతాయి. జనం ఎప్పుడూ ఏదో ఒకటి కొత్త దనం కోరుకుంటారు. ఆ కొత్తను సరికొత్తగా చూపించే నాయకుడు విజేత అవుతాడు. ఇప్పుడున్న పరిస్థితులలో మడికట్టుకునే రాజకీయాలు సాధ్యం కాదు. భీమ్మించుకొని కూర్చుంటే అసలే సాధ్యం కాదు. ఎత్తుకు పైఎత్తులలో అవతలి వారిని చిత్తు చేయాలంటే టక్కుటమార గజకర్ణ గోకర్ణ విద్యలు ప్రదర్శించాల్సిందే..గత పాలకుల కన్నా భిన్నంగా పాలిస్తానని నాలుగు మాటలు చెబితే ప్రజలు ఆహ్వానించే రోజులు ఎప్పుడో పోయాయి. అలా చెప్పిన వారిని కూడా ప్రజలు ఆదరించిన సందర్భాలు కూడా లేవు. జనం కోరుకునే వాటినైనా నాయకులు కళ్ల ముందు వుంచుతామనే మాటలు చెప్పి ఒప్పించాలి. లేకుంటే నాయకుడి ఆలోచనల్లోకైనా జనాన్ని రప్పించి గోల్‌ కొట్టాలి. ఒక్కసారి వెనుకబడితే ముందుకొచ్చే రోజులు కావు. ఎదురొచ్చిన వారి నుంచి తప్పుకుంటూ కాకుండా, వారిని తప్పిస్తూ ముందుకు వెళ్తేనే సక్సెస్‌ అవుతున్న రోజులు. ఈ ఎత్తులు, వ్యూహాలు ఆది నుంచి అనుసరిస్తూ, ఆచరిస్తూ ముందుకెళ్లి సక్సెస్‌ అయిన ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి. ఆయన అవకాశాలు ఎదురు రాలేదు. అవకాశాలను తన వైపు తిప్పుకొని గెలుస్తూ వచ్చాడు. నిజం చెప్పినా సరే తనదైన శైలిలో చెప్పి గెలిచాడు. అబద్దాలు చెప్పినా సరే జనం అవే వాస్తవమని నమ్మేలా చేశాడు. డైరెక్ట్‌గా డైవర్షన్‌ పాలిటిక్స్‌లో కింగ్‌ అయ్యారు. రాజకీయాలలో ఎలా గెలిచారన్నది ఎప్పుడూ పాయింట్‌ కాదు. గెలిచారా లేదా? అన్నదే కీ పాయింట్‌. అందుకే సిఎం. రేవంత్‌ రెడ్డి సక్సెస్‌కు కేరాఫ్‌గా నిలిచారు. అవతలి వారిని ప్రతిసారి ఊహించని దెబ్బ కొట్టడంలో ఆరి తేరిన నాయకుడనిపించుకున్నారు. ప్రతి సందర్భంలోనూ అసమ్మతి నుంచి సమ్మతి పొందిన నాయకుడై వెలుగొందుతున్నారు. బరి గీసి నిలబడి, ఎదురించి నిలబడి విజయాన్ని దాసోహం చేసుకుంటున్నారు. దటీజ్‌ రేవంత్‌ రెడ్డి అని ప్రత్యర్థుల చేత కూడా అనిపించుకుంటున్నారు. రాజకీయాలలో రకరకాల భిన్నాభిప్రాయాలు వుండొచ్చు. అభిప్రాయ బేధాలు పొడసూపొచ్చు. కానీ కాదనుకున్న వారి చేత కొనియాడబడే స్థాయికి చేరుకోవడం అనేది సామాన్యమైన విషయం కాదు. అది అందరికీ సాధ్యం అసలే కాదు. అందుకు అకుంఠిత దీక్ష అవసరం. కష్టాలు, నష్టాలు తరుముతున్నా నిలబడే ధైర్యం కావాలి. అన్నిటికన్నా గుండె నిబ్బరంగా వుండాలి. కష్టాలను చిరు నవ్వు తో స్వాగతించే మనస్తత్వం అలవడాలి. గెలుపే లక్ష్యం తప్ప మిగతావన్నీ చాలా చిన్న సమస్యలుగానే చూడాలి. లక్ష్యం పెద్దదైనప్పుడు ఎదురయ్యే సమస్యలు గడ్డిపరకలుగా మార్చుకోవాలి. ఒక్కసారి కమిటైతే తన మాట తానే వినను అనే రాజకీయాలు చేయడంలో సిఎం. రేవంత్‌ రెడ్డి దిట్ట. మనకంటూ కొన్ని పక్కా వ్యూహాలు సొంతగా వుండాలి. వాటికి తోడు ఇతర నాయకుల సలహాలు, సూచనలు తీసుకోవాలి. మొత్తం ఇతరుల మీద ఆధారపడితే మొదటికే మోసం రావొచ్చు. ఈ విషయం స్పష్టంగా తెలిసిన నాయకుడు రేవంత్‌ రెడ్డి. అందుకే రేవంత్‌ వేసిన స్కెచ్‌కు ఎదురుండదు. ప్రతిపక్షంలో వున్నప్పుడు అటు కేసిఆర్‌ ను పదే పదే రెచ్చగొట్టి, మీడియా అటెన్షన్‌ అంతా తనవైపు తిప్పుకునే వారు. పిసిసి అధ్యక్షుడుగా వున్న సమయంలో ఒక్కరోజు కూడా రాజకీయాలకు దూరంగా వున్నది లేదు. కేసిఆర్‌ను ప్రశాంతంగా నిద్రపోనిచ్చింది లేదు. మల్లన్న సాగర్‌ బాదితుల పక్షాన పోరాటం చేసినా, బాసర విద్యార్థుల పక్షాన నిలిచే రాజకీయం చేసినా ప్రజలను తనవైపు తిప్పుకున్నాడు. తన ఆలోచనలకు అనుగుణంగా మాత్రమే ముందుకు వెళ్తారు. తన నిర్ణయాలతో వెంట నడిచే వారిని వదులుకోడు. ఒక్కసారి నమ్మితే జీవితాంతం వదిలిపెట్టడు. ఇంతటి మంచి తనం రేవంత్‌ రెడ్డి సొంతం. అందుకే పార్టీలకు అతీతంగా రేవంత్‌ రెడ్డి ని ఇష్టపడతారు. పార్టీలు వేరైనా, సిద్ధాంతాలు వేరైనా వ్యక్తుల మధ్య వుండే స్నేహపూర్వక సంబంధాలు వేరు. ఇప్పుడున్న రోజులలో రాజకీయాలలో నీతికి చోటు వెతకడం సాధ్యం కాదని రేవంత్‌కు స్పష్టంగా తెలుసు. అందుకే అధికారం కోసం రాజకీయాలలో సందర్భోచిత అడుగులు నేర్చుకున్నాడు. ఎలాంటి గాడ్‌ ఫాదర్‌ లేకుండా రాజకీయాలలో ఉన్నత శిఖరాలకు చేరుకోవడం రేవంత్‌ లా అందరికీ సాధ్యం కాదు. ఓటమి నేర్పిన పాఠాలనుంచి వెంటనే బైట పడగలిగే శక్తి వున్న నాయకుడగా తనను తాను నిరూపించుకున్నాడు. నేటి తరం నాయకులకు, యువతకు ఆదర్శంగా నిలిచారు. అంతే కాదు రెండేళ్ళుగా ప్రతిపక్షాలకు ఊపిరి సలపకుండా చేస్తున్నాడు. కేసిఆర్‌ లాంటి నాయకుడు కూడా ఒక మాట అనడానికి ముందూ వెనుక ఆలోచిస్తున్నాడు. గతంలో కేసిఆర్‌ ఉద్యమ కాలంలో ఎంతటి వారినైనా సరే చీల్చి చెండాడే వారు. కానీ ఇప్పుడు రేవంత్‌ రెడ్డి ముందు మాట్లాడాలంటే ఒక రకంగా జంకుతున్నాడు. ఎందుకంటే తనను తిట్టిన బిఆర్‌ఎస్‌ను ఓడిరచి గెలిగిన ధీరుడు రేవంత్‌ రెడ్డి. తన పాలనలో ఈ రెండు సంవత్సరాల కాలంలో ఎదురైన అనేక సమస్యలను క్షణాలలో మరిపించగలిగేలా ఎత్తులు వేస్తూ వస్తున్నాడు. రెండేళ్ళలలో జరిగిన కొన్ని పొరపాట్లను కూడా జనం మర్చిపోయేలా చేయగలడు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజులకు సుంకిశాల రిటైనింగ్‌ వాల్‌ కూలిపోయింది. దానిని వివాదం చేయాలని బిఆర్‌ఎస్‌ ఎంత చూసినా ఆ పార్టీకి సాధ్యం కాలేదు. బిఆర్‌ఎస్‌ ఎంత మొత్తుకున్నా ప్రజలు వినిపించుకోలేదు. ఎందుకంటే కాళేశ్వరం కూలిన దాని ముందు సుంకిశాల ఎంత చిన్నది అని ఎదురుదాడి కాంగ్రెస్‌ పార్టీ, రేవంత్‌ రెడ్డి మొదలుపెట్టారు. దానిని పూర్తి చేసే బాధ్యత కాంట్రాక్టర్‌ దంటూ బిఆర్‌ఎస్‌ ను దబాయించారు. ఆఖరుకు ఆ పాపం కూడా బిఆర్‌ఎస్‌ ఖాతాలో వేసి ఎదురుదాడి చేశారు. మళ్ళీ ఇప్పటి వరకు బిఆర్‌ఎస్‌ సుంకిశాల మీద మాట్లాడిరది లేదు. అలా రాజకీయంగా ప్రత్యర్థులను ఇరికించడం రేవంత్‌ రెడ్డి వెన్నతో పెట్టిన విద్య అని చెప్పకతప్పదు. ఆ మధ్య ఎస్‌ఎల్బీసి టన్నెల్‌ వ్యవహారం ఎటు పోయిందో కూడా తెలియనంతగా రాజకీయాలను తన వైపు తిప్పుకోగల సమర్థవంతమైన నాయకుడు రేవంత్‌ రెడ్డి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు కాకపోవడానికి కూడా కేసిఆరే కారణమని ప్రజలను నమ్మించిన నాయకుడు రేవంత్‌ రెడ్డి. కేవలం కేసిఆర్‌ చేసిన అప్పుల మూలంగా నెల నెల మిత్తీలకే 6 వేల కోట్లు చెల్లిస్తున్నానని చెప్పి, ప్రజలను నమ్మించి పార్లమెంటు ఎన్నికలలో బిఆర్‌ఎస్‌ కు ఒక్క సీటు కూడా రాకుండా రాజకీయం చేసిన నాయకుడు రేవంత్‌ రెడ్డి. రాజకీయంగా తన మాటలను మాత్రం ఎప్పుడూ లైమ్‌ లైట్‌లో వుంచగలడు. మీడియా అటెన్షనంతా తనపైనే ఫోకస్‌ చేసుకోవడంలో రేవంత్‌ రెడ్డి దిట్ట. ఒక్క మాటతో సమస్యలన్నీ పక్కదారి పట్టించగలడు. రాజకీయాలెప్పుడూ సక్సెస్‌ చుట్టే తిరుగుతాయి. ఈ విషయం రేవంత్‌ కు తెలిసినంతగా మరే నాయకుడికి తెలియదు.

కాంగ్రెస్ వైఫల్యాలపై, రైతుల పక్షాన బీజేపీ వినతి.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-25T164829.319.wav?_=5

 

కాంగ్రెస్ వైఫల్యాలపై, రైతుల పక్షాన బీజేపీ వినతి.

కల్వకుర్తి/ నేటి ధాత్రి :

కల్వకుర్తిమండలంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు మట్ట నరేష్ గౌడ్ఆధ్వర్యంలో మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ కి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మొగిలి దుర్గాప్రసాద్ బిజెపి సీనియర్ నాయకులు బండెల రామచంద్రారెడ్డిహాజరై వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను పూర్తిగా విస్మరించిందని తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో యూరియా, ఇతర రసాయన ఎరువుల కొరత రైతులను తీవ్రమైన ఇబ్బందుల్లోకి నెట్టేసిందని తెలిపారు.రైతులకు ఎరువులు సమయానికి అందకపోవడం వల్ల పంట నష్టాలు తప్పవు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పష్టమైన వ్యూహంతో ముందుకువచ్చి, ఎరువుల సరఫరా నిరవధికంగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి మండల రెవెన్యూ అధికారి గారికి ఈ విషయాన్ని తెలియజేసాం. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఉన్నతాధికారులకు నివేదించాలని కోరాం,” అని బీజేపీ నేతలు స్పష్టం చేశారు.అలాగే, గతంలో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని, ప్రజలను మోసం చేయడం మానుకోవాలని హెచ్చరించారు. బీజేపీ రైతుల పక్షాన నిలబడి, వారి సమస్యల పరిష్కారానికి అన్ని విధాలుగా పోరాడుతుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు బిజెపి సీనియర్ నాయకులు కృష్ణగౌడ్ జిల్లా ఉపధ్యక్షుడు బొడ నరసిహ్మ పట్టణ అధ్యక్షులు బబిదేవ్ జిల్లా కాన్సిల్ సభ్యులు కిష్టారెడ్డి మాజీ మండల అధ్యక్షుడు సురేందర్ గౌడ్ గారు, మైనార్టీ మోర్చా రాష్ట్ర నాయకులు రహ్మతులా, pacs వైస్ చైర్మన్ శ్యాంసుందర్, గoగధర్,మండల ప్రధాన కార్యదర్శులు బచలకుర శ్రీశైలం,శ్రీను,ముదిరాజ్ నప శివ, ఉపాదేక్షులు బాలకృష్ణ, రాజశేఖర్, పానుగంటిశివ,మంద రజురెడ్డి, లిoగారెడ్డి,నాగరాజు,సురేష్ గౌడ్, వెంకటేష్, వినయ్ రెడ్డి, అంజనేయులు,అయోధ్య, తదితరులు పాల్గొన్నారు.

అక్రమ అరెస్టులతో ప్రతిపక్షాల గొంతులను నొక్కలేరు.

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-25T161118.191-1.wav?_=6

అక్రమ అరెస్టులతో ప్రతిపక్షాల గొంతులను నొక్కలేరు
బిజెపి నాయకులు
వర్ధన్నపేట (నేటిధాత్రి):

 

వర్ధన్నపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జనహిత పాదయాత్ర అడ్డుకుంటారనే వంకతో భారతీయ జనతా పార్టీ వర్ధన్నపేట నాయకులను అరెస్టు చేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్లో ఉంచుకోవడం చాలా విడ్డూరంగా ఉందని భారతీయ జనతా పార్టీ నాయకులు ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ నాయకులు కుందూరు మహేందర్ రెడ్డి. జడ సతీష్. కొండేటి సత్యం మాట్లాడుతూ అరెస్టులతో ప్రతిపక్షాల గొంతులను నొక్క లేరని ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలపై అబద్ధపు హామీలపై ప్రతిపక్ష పార్టీగా మా పోరాటం కొనసాగుతుందని భారతీయ జనతా పార్టీ నాయకులు అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా యాత్రలు చేపట్టడం వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదని వారు చేసేది జనహిత యాత్ర కాదని జనద్రోహయాత్రాన్ని ఆరోపించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా పనిచేయాలని మహిళలకు 2500 రూపాయలు మరియు కళ్యాణ లక్ష్మి పథకం కింద తులం బంగారం ఆసరా పెన్షన్ల పెంపుదల. గ్యాస్ సబ్సిడీలు అందే విధంగా వారి హామీలు నెరవేర్చే విధంగా ఆలోచించి పని చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి హితవు పలికారు. బిజెపి నాయకులతోపాటు విద్యార్థి పరిషత్ నాయకులను అరెస్ట్ చేయడం చాలా బాధాకరమని అన్నారు.

నమ్మిండ్ల శ్రీను అన్నకు జన్మదిన శుభాకాంక్షలు..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-72-3.wav?_=7

TPCC ఉపాధ్యక్షుడు నమ్మిండ్ల శ్రీను అన్నకు జన్మదిన శుభాకాంక్షలు
*బర్ల సహాదేవ్ అడ్వకేట్
వర్దన్నపేట నియోజకవర్గ అధికార ప్రతినిధి

వర్దన్నపేట (నేటిధాత్రి):

యువతకు మార్గదర్శి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అన్న అని అంటే కష్ట కాలంలో నేనున్నా అని భరోసా ఇచ్చే నాయకుడు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు నమ్మిండ్ల శ్రీను అన్న గారు జన్మదిన శుభాకాంక్షలు
ప్రజలతో కలసి మమేకమై ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతూ, ఎప్పుడూ అందరికి అందుబాటులో ఉంటూ, నిజాయితీతో కూడిన రాజకీయాలకు ప్రతీకగా నిలుస్తూ, సామాజిక న్యాయానికి అండగా నిలుస్తూ ప్రజా హృదయాలలో స్థానం సంపాదించుకున్నారు.
నమ్మిండ్ల శ్రీను అన్న గారు కేవలం ఒక నాయకుడు మాత్రమే కాకుండా ప్రజల ఆపదలో అండగా నిలిచే సహృదయుడు, యువతకు మార్గదర్శి. ఆయన సేవా తపన, దూరదృష్టి, కష్టసుఖాలలో అందరితో కలసి నిలబడే ధైర్యసాహసాలు ఈనాటి రాజకీయాల్లో అరుదైన లక్షణాలు.
ఆయన పాదయాత్రలు, ప్రజల సమస్యలపై పోరాటం, బడుగు బలహీన వర్గాల కోసం చేసే కృషి ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం. ఆయనలాంటి నాయకుడు మన వర్ధన్నపేట నియోజకవర్గానికి దక్కడం గర్వకారణం.ఈ సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయురారోగ్యాలతో ప్రజా సేవలో ఎల్లప్పుడూ ముందుండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను

కొత్త రేషన్ కార్డులను పంపిణీ..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-23T135201.153.wav?_=8

 

కొత్త రేషన్ కార్డులను పంపిణీ

నర్సంపేట,నేటిధాత్రి:

 

రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన కొత్త రేషన్ కార్డులను నర్సంపేట పట్టణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రవికుమార్ లబ్దిదారులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చొరవతో నర్సంపేట పట్టణానికి చెందిన 23, 24, వార్డుల్లో నూతనంగా మంజూరైన నూతన రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో 23వ వార్డు అధ్యక్షులు పెద్దపల్లి శ్రీనివాస్, 24వ వార్డు కోల చరణ్ రాజ్ గౌడ్, నర్సంపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపెల్లి సందీప్, వార్డు ఆఫీసర్లు మౌనిక, తరుణ్, మాజీ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నాగేల్లి సారంగం గౌడ్, వార్డు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు జానకమ్మ, సరోజన, మోహన్, బైరగోని రవి, మొగిలిచర్ల రాజు, తదితరులు పాల్గొన్నారు

బిఆర్ఎస్ లో చేరిన మాజీ సర్పంచ్…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-23T104227.530.wav?_=9

 

బిఆర్ఎస్ లో చేరిన మాజీ సర్పంచ్

పరకాల నేటిధాత్రి

 

 

మండలంలోని మల్లక్కపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు,మాజీ సర్పంచ్ బయ్య రాజేందర్ శనివారం రోజున కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తూ పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ లో చేరారు.ఈ సందర్బంగా రాజేందర్ కు మాజీ ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు,మాజీ వైస్ ఎంపీపి చింతిరెడ్డి మధుసూదన్ రెడ్డి,మండల పార్టీ నాయకులు,యూత్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

బాoసేప్ 12వ మహాసభలను విజయవంతం చేయండి

బాoసేప్ 12వ మహాసభలను విజయవంతం చేయండి

నిజాంపేట్, నేటి ధాత్రి

 

మెదక్ జిల్లా నిజాంపేట్ మండల కేంద్రంలో బాంసేఫ్ ప్రచారకులు, బాంసేఫ్ 12వ రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్స్ కరపత్రాల ఆవిష్కరణ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బాంసేఫ్ అధ్యక్షులు నరేందర్ ఆధ్వర్యంలో కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులాదారిక జనగణన చేస్తామని ప్రకటించిన కులాదారిక జన గణన చేపట్టకపోవడం ద్వారా ఓబిసి ఎస్సి, ఎస్టీ కులాల ప్రజలను మోసం చేస్తున్నాయని వారు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆయన అన్నారు. ఈవీఎంల విషయంలో మౌనాన్ని పాటించడం ద్వారా అవకతవకలు పాల్పడడం బిజెపి కాంగ్రెస్ పార్టీలు ఒకదానిని ఒకటి సహకరించుకుంటున్నాయని ఆయన ఎద్దేవ చేశారు. తాము పుట్టిన సమాజ అభివృద్ధి కొరకు తమ బానిసత్వాన్ని వదిలించుకోవడం తమ ధనాన్ని తమ అజ్ఞానాన్ని తమ సమయాన్ని వెచ్చించిన వారు ధన్యులు అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డిడిఎఫ్ మెదక్ జిల్లా అధ్యక్షులు దుబాసి సంజీవ్, టి ఎమ్మార్పీఎస్ మెదక్ జిల్లా అధ్యక్షులు గరుగుల శ్రీనివాస్,
అంబేడ్కర్ సంఘం అధ్యక్షులు కొత్తల గంగారం,
భారతీయ యువ మోర్చా కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఇల్లిందల ప్రభాకర్,
భారత ముక్తి మోర్చా కామారెడ్డి జిల్లా అధ్యక్షులు గడ్డం రవి,నర్సింలు నిజాంపేట్ మండల డిబిఎఫ్ ఉపాధ్యక్షులు బ్యాగరి రాజు,వడ్డెర సంఘం మైశయ్య,మల్లయ్య,మైనార్టీ నాయకులు సమీర్, సలీం, హైమద్ తదితరులు పాల్గొన్నారు.

నారాయణపూర్ పై రవిశంకర్ ను కాంగ్రెస్ ధ్వజమెత్తింది..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-54-3.wav?_=10

నారాయణపూర్ పై మాట్లాడే అర్హత మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ కు లేదు

ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఉండి నారాయణపూర్ నిర్వాసితుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిన ఘనుడు రవిశంకర్

ఐదేళ్లు నారాయణపూర్ ప్రజలకు ముఖం చూపించకుండా తప్పించుకు తిరిగిన చరిత్ర నీది కాదా?

రైతు సమస్యలు, ప్రజా సంక్షేమంపై పూర్తి అవగాహన ఉన్న గొప్ప నాయకుడు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తి కోసం రూ. 43 కోట్లు మంజూరు చేయించిన ఘనత చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ది

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పురుమల్ల మనోహర్

గంగాధర మండలం మధురానగర్ ప్రజా కార్యాలయంలో విలేకరుల సమావేశం

గంగాధర నేటిధాత్రి :

గంగాధర మండలం నారాయణపూర్ రిజర్వాయర్ గురించి మాట్లాడే అర్హత మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్కు లేదు. ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఉండి నారాయణపూర్ నిర్వాసితుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిన ఘనుడు రవిశంకర్, నారాయణపూర్ నిర్వాసితుల సమస్యలను పట్టించుకోకుండా ఐదేళ్లు మొఖం చాటేసిన ఘన చరిత్ర ఆయనది. సాగునీరు అందించి పంటలు ఎండిపోకుండా కాపాడాలని కోరితే, రాళ్ల వర్షం పడి పంట నష్టపోయాం అనుకోవాలని రైతులకు నిర్లక్ష్యమైన సమాధానమిచ్చిందెవరో రైతులు మరచిపోరన్న సంగతి గుర్తుంచుకోవాలి. ఏనాడైనా సకాలంలో నారాయణపూర్ రిజర్వాయర్ కు నీటిని విడుదల చేయించిన చరిత్ర నీకుందా, పంటలు సాగు చేయడానికి ముందే నారాయణపూర్ రిజర్వాయర్ కు సాగునీటిని విడుదల చేయించి రైతులపై తమకున్న చిత్తశుద్ధిని చాటుకున్నారు మా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. పదేళ్లపాటు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ నారాయణపూర్ నిర్వాసితులకు న్యాయం చేయలేక పోయింది. అబద్ధపు హామీలు పబ్బం గడుపుకోవడం తప్ప చేసింది ఏమీ లేదు. నారాయణపూర్ నిర్వాసితులకు ఒక్క రూపాయి పరిహారమైన ఇప్పించావా, పుట్టిన ఊరు అని చెప్పుకునే నువ్వు నారాయణపూర్ గ్రామానికి ఏం చేశావు, మధురానగర్ చౌరస్తాలో చర్చకు సిద్ధమా. చొప్పదండి ఎమ్మెల్యేగా గెలిచిన ఏడాది కాలంలోనే నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తి, పరిహారం కోసం రూ.43 కోట్లు మంజూరు చేయించిన గొప్ప నాయకుడు మా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. రైతు సమస్యలపై, సంక్షేమంపై అవగాహనతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పనిచేస్తున్నారు. ఫోటోల కోసం ఫోజులు ఇస్తూ, వాటిని పేపర్లో చూసుకుంటూ మురిసిపోవడం తప్ప మాజీ ఎమ్మెల్యే రవిశంకర్కు ఏమి చేతకాదు అని నిరూపితం కావడంతోనే, చొప్పదండి నియోజకవర్గం ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు. ఇప్పటికైనా అబద్ధపు ప్రచారం మానుకోవాలని లేదంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సింగిల్ విండో వైస్ చైర్మన్ వేముల భాస్కర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దుబ్బసి బుచ్చన్న,జాగిరపు శ్రీనివాస్ రెడ్డి,బూర్గు గంగన్న, దోర్నాల శ్రీనివాస్ రెడ్డి,రోమాల రమేష్, సాగి అజయ్ రావు,వేముల అంజి,మంత్రి మహేందర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

పేదలకు లబ్ధి చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం…

పేదలకు లబ్ధి చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

తొర్రూరు డివిజన్ నేటి ధాత్రి

 

ప్రతి పేదలకు అన్ని విధాలుగా లబ్ధి చేయడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్ అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న కొత్త రేషన్ కార్డులను బుధవారం పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఝాన్సీ రాజేందర్ రెడ్డిల ఆదేశాల మేరకు తొర్రూరు పట్టణంలోని రేషన్ షాప్ లో నూతన లబ్ధిదారులకు కార్డులను అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం పేదల కష్టాలను అర్థం చేసుకొని ఆహార భద్రతతో పాటు రేషన్ కార్డులను అందించిందన్నారు. పల్లె ప్రజలకు అండగా నిలిచే విధంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెదగాని సోమయ్య,చాపల బాపురెడ్డి,గంజి విజయపాల్ రెడ్డి,గుండాల నర్సయ్య,జలకం శ్రీనివాస్, వెంకటాచారి,తాళ్లపల్లి బిక్షం గౌడ్, సొంటి రెడ్డి భాస్కర్ రెడ్డి, నడిగడ్డ శ్రీనివాస్,కల్లూరి కుషాల్, రాజేష్ యాదవ్, జింజిరాల మనోహర్,ముద్దసాని సురేష్, వెలుగు మహేశ్వరి, పంజా కల్పన, జలీల్,గూడేల్లి రామచంద్రయ్య, జలగం వెంకన్న,మహేష్ యాదవ్, యశోద,దేవేందర్, రేషన్ షాప్ డీలర్లు సోమిరెడ్డి, సోమయ్య, శ్రీనివాస్, వార్డు ఆఫీసర్లు మురళి, అజయ్, నరేష్, సురేష్, బ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

తొర్రూరులో పరామర్శ కార్యక్రమం…

అధైర్య పడొద్దు అండగా ఉంటాం

తొర్రూరు పట్టణంలో శ్రద్ధాంజలి, పరామర్శ కార్యక్రమాలు నిర్వహించిన టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి ఝాన్సి రాజేందర్ రెడ్డి గారు.

తొర్రూరు డివిజన్ నేటి ధాత్రి

తొర్రూరు పట్టణంలోని 16వ వార్డుకు చెందిన గుర్రాల మధుకర్ రెడ్డి కుమారుడు సాయి నవనీత్ రెడ్డి ఇటీవల మృతిచెందగా, ఈరోజు వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

తదనంతరం, పట్టణంలోని 2వ వార్డులో సీతమ్మగారు ఇటీవల మృతిచెందిన నేపథ్యంలో, వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఝాన్సి రాజేందర్ రెడ్డి గారు, వారికి తక్షణ ఆర్థిక సహాయం అందజేశారు.

Condolence Meet in Torrur

ఈ కార్యక్రమాల్లో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సోమరాజ శేఖర్, సీనియర్ నాయకులు పెద్దగాని సోమన్న, తునం శ్రావణ్, బసనా బోయిన రాజేష్ యాదవ్, చెవిటి సుధాకర్, అలాగే పట్టణ, మండల కాంగ్రెస్ నాయకులు, యువజన నాయకులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version