ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదల,క్రమశిక్షణ ఉన్న యువతను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ,కర్మాగార,గనులు & భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద అన్నారు.బుధవారం జిల్లాలోని మందమర్రి మండల కేంద్రంలోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో టామ్ కామ్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్,సింగరేణి సంస్థ మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ రాధాకృష్ణ,జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి రవికృష్ణ, తహసీల్దార్ సతీష్ కుమార్,టామ్ కామ్ సంస్థ మేనేజర్ అనిల్ కుమార్లతో కలిసి మంత్రి హాజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సరైన విద్యా అర్హతలు,నైపుణ్యాలు కలిగిన వారికి విదేశాల్లో మంచి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు.ముఖ్యంగా జర్మనీ, జపాన్,ఇజ్రాయిల్తో పాటు గ్రీస్,యూరప్ దేశాల్లో నైపుణ్యంతో కూడిన ఉద్యోగులకు డిమాండ్ అధికంగా ఉందన్నారు.ఆయా దేశాల అవసరాలకు అనుగుణంగా భాషా శిక్షణ అందించి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో టామ్ కామ్ సంస్థ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు.అర్హత,అనుభవం కలిగిన వారికి వారానికి 35 గంటల పని మాత్రమే ఉండటంతో పాటు నెలకు దాదాపు రూ.2 లక్షల వరకు వేతనం లభించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.యువతకు ఉపాధి కల్పించేందుకు మందమర్రిలో శిక్షణ కేంద్రం ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు.జూన్ 10 నుంచి ఉదయం,సాయంత్రం నాలుగు గంటల చొప్పున శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు.నర్సింగ్,ప్లంబింగ్, ఎలక్ట్రీషియన్ తదితర రంగాల్లో నైపుణ్యంతో కూడిన అభ్యర్థులకు విదేశాల్లో విస్తృత అవకాశాలు ఉన్నాయని మంత్రి వివరించారు.నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన కోసం ప్రభుత్వం టామ్ కామ్ సంస్థకు రూ.90 కోట్లు మంజూరు చేసిందన్నారు.యువత క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగాలని, విదేశీ భాషలను నేర్చుకుని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.తాము కష్టపడి సంపాదిస్తే కుటుంబాన్ని గౌరవంగా పోషించుకోవచ్చని,సమాజంలో మరింత మందికి ఆదర్శంగా నిలవచ్చని అన్నారు.
మందమర్రి లో శిక్షణ శిబిరం ఏర్పాటు – కలెక్టర్ కుమార్ దీపక్
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ విదేశీ ఉద్యోగాల్లో భద్రత,సాంఘిక రక్షణ,కార్మిక చట్టాల పరిరక్షణ ఉండటంతో ఉద్యోగులకు మంచి భవిష్యత్ లభిస్తుందని చెప్పారు.స్థానిక యువతకు శిక్షణ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మందమర్రి లోనే కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.అర్హత,ఆసక్తి ఉన్న నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, నిరుద్యోగ యువతీ యువకులు పాల్గొన్నారు.
తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామి ని దర్శించుకున్న శంకర్ గౌడ్ వనపర్తి నేటీదాత్రి .
సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామి ని దర్శనం చేసుకున్నామని చెప్పారు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కవులు కళాకారులు సాహిత్యవేతల కు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలన్నారు.సమాజములోని ప్రజలను జాగృతి పరిసి మంచి సమాజం రూపుదిద్దికోవడాని రచనలు , పాటలు ఉండేట్లు కవుల రచనలు, గాయకుల పాటలు ఉండాని అన్నారు.
రైతు సంక్షేమంలో భాగంగా కొనుగోలు కేంద్రాల ద్వారా వరిధాన్యం నుగోలు
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల,నేటి ధాత్రి:
రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా నిబంధనల ప్రకారం రైతుల వద్ద నుండి వరి ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.బుధవారం జిల్లాలోని జైపూర్ మండలం టేకుమట్ల, ఇందారం,షెట్ పల్లి,నర్సింగాపూర్ గ్రామాలలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర చెల్లించి రైతుల వద్ద నుండి వరి ధాన్యం కొనుగోలు చేస్తుందని తెలిపారు.అకాల వర్షాల నేపథ్యంలో తడిసిన ధాన్యాన్ని త్వరగా ఆరబెట్టి రైస్ మిల్లులకు తరలించాలని,రైతులు ధాన్యాన్ని నిబంధనల ప్రకారం కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని,రైతుల సౌకర్యార్థం కొనుగోలు కేంద్రాలలో త్రాగునీరు,నీడ సౌకర్యాలు కల్పించడంతో పాటు తూకం యంత్రాలు,ప్యాడి క్లీనర్లు ఇతర సదుపాయాలు కల్పించాలని తెలిపారు.రైతు వివరాలను సిస్టం లో నమోదు చేసి ఆధార్ కార్డు ద్వారా వారి గుర్తింపును దృవీకరించాలని,రైతు భూమి విస్తీర్ణం,పండించిన ధాన్యం వివరాలను సరి చూడాలని, ధాన్యం నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉండే విధంగా పరిశీలించాలని తెలిపారు.కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి రైతుల బ్యాంకు ఖాతాలలో నగదు జమ చేయడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లాలో అర్హులైన లబ్ధిదారులకు రెండు పడక గదుల ఇండ్లు అందించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు.
మంగళవారం బెల్లంపల్లి మండల కేంద్రంలో నిర్మించిన రెండు పడక గదుల ఇండ్లను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నిరుపేదలకు సొంత గూడు కల్పించాలనే లక్ష్యంతో చేపట్టిన 2BHK పథకంలో అర్హులైన వారికే ఇండ్లు కేటాయించేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన, సబ్ కలెక్టర్ మనోజ్తో కలిసి రికార్డులు మరియు దరఖాస్తుల ప్రక్రియను పరిశీలించారు. భూభారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సమస్యల దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
నిరుద్యోగ యువత తాను ఎంచుకున్న రంగంలో ఏకాగ్రతతో నైపుణ్యత సాధించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.శుక్రవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో సంక్షేమ వారంలో భాగంగా షెడ్యూల్డ్ కులములు, షెడ్యూల్డ్ తెగలు,వెనుకబడిన తరగతులు,మైనారిటీ యువతకు ఏర్పాటుచేసిన నైపుణ్యాభివృద్ధి, కెరీర్పై అవగాహన సదస్సుకు జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య,షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి అధికారి చాతరాజుల దుర్గాప్రసాద్, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి నీరటి రాజేశ్వరి,లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ తిరుపతి,ఎ టి సి ప్రిన్సిపాళ్లతో కలిసి హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నిరుద్యోగ యువత తాము ఎంచుకున్న రంగాలలో ఏకాగ్రతతో నైపుణ్యత సాధించి జీవితంలో స్థిరపడాలని తెలిపారు.వృత్తి విద్య కోర్టులలో ఆధునిక సాంకేతికతను అడ్వాన్సుడ్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా ప్రభుత్వం అందిస్తుందని, ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.తాము ఎంచుకున్న కోర్సులను ఏకాగ్రతతో నేర్చుకోవాలని,తరగతులకు తప్పనిసరిగా హాజరుకావాలని తెలిపారు. ప్రైవేట్ సంస్థలలో ఉద్యోగరంగంలో రాణించాలంటే నైపుణ్యత తప్పనిసరి అని,మనం నేర్చుకునే ప్రతి అంశం మనం చేస్తున్న పనిలో ఉపయోగపడుతుందని తెలిపారు.ఎంచుకున్న సబ్జెక్టులో పూర్తి అవగాహన ఉండాలని తెలిపారు.జర్మన్ దేశంలో ఎలక్ట్రీషియన్,డ్రైవర్,నర్సింగ్ రంగాలకు అవసరం ఉందని ఉందని,నైపుణ్యత గల వారిని ఎంపిక చేసి జర్మన్ భాషను నేర్పించి ఉపాధి కల్పించడం జరుగుతుందని తెలిపారు.విదేశాలలో వస్తున్న అవకాశాలకు నైపుణ్యత, అనుభవం తప్పనిసరిగా ఉండాలని,కోర్సు అనంతరం అప్రెంటిస్ షిప్ ద్వారా మరింత నైపుణ్యత నేర్చుకోవాలని తెలిపారు.నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు జాబ్ మేళాలు నిర్వహించి అవకాశం ఉన్న చోట ఉద్యోగం కల్పించడం జరుగుతుందని,యువత తాము ఎంచుకున్న కోర్సును ఏకాగ్రతతో నేర్చుకుని,నైపుణ్యత సాధించినట్లయితే మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా ఆటో & ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ నూతన కమిటీ ఎన్నిక
మంచిర్యాల,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆటో అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ( హెచ్ ఎం ఎస్ ) ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి జిల్లా ప్రధాన కార్యదర్శి తాటిపర్తి సాయి కృష్ణారెడ్డి అధ్యక్షత వహించారు. రియాజ్ అహ్మద్ సూచనల మేరకు జిల్లాలో ట్రేడ్ యూనియన్ను బలోపేతం చేసే దిశగా సమావేశం నిర్వహించగా, యూనియన్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నుకున్న నాయకులు: నరెడ్ల శ్రీనివాస్ జిల్లా అధ్యక్షులు, తగరం శ్రీనివాస్ జిల్లా జనరల్ సెక్రటరీ, ఎండి షఫీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, దుడ రాజన్న జిల్లా ఉపాధ్యక్షులు, ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం కొనసాగిస్తామని, యూనియన్ను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో ఆలస్యం జరుగుతోందని విమర్శిస్తూ,వెంటనే ఆ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.అలాగే ఆటో కార్మికులంతా ఐక్యంగా ఉండి హెచ్ఎంఎస్ సభ నాయకత్వంలో తమ సమస్యల పరిష్కారం కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ ఆటో యూనియన్ నాయకులు బూడిది రమేష్, రాజరెడ్డి,రమేష్,మహేష్,తాజ్ బాబా,అజీముద్దీన్,పల్లపు శ్రీనివాస్,అలీ,సురేష్,క్రాంతి కుమార్,సంపత్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు
మంచిర్యాల,నేటి ధాత్రి:
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి మంగళవారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సహప్రాంత ప్రచారక్ ప్రభు కుమార్ పాల్గొని, డా. బి.ఆర్. అంబేద్కర్ చూపిన మార్గంలో అందరూ నడవాలని సూచించారు.రాజ్యాంగాన్ని పరిరక్షిస్తూ,అందులో భాగమైన పౌరులుగా మనం పాటించవలసిన కర్తవ్యాలను తప్పనిసరిగా అనుసరించాలని ఆయన తెలిపారు.దేశాన్ని ఒక నాగరిక సమాజంగా రూపుదిద్దడంలో ప్రతి పౌరుడు ముందుండాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవాహ కృష్ణ భాస్కర్, సహకార్యవాహ శ్రీనివాస్,జిల్లా ప్రచారక్ నాగరాజు,రామకృష్ణ, రాజేశ్వర్ ఇతర సంఘ సభ్యులు పాల్గొన్నారు.
కుల మతాలను రెచ్చగొట్టే బిజెపి పార్టీకి తెలంగాణలో అవకాశం లేదు…
# టీపిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్
ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం….
# ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు.
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలి…
# కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి
పార్టీ కోసం కష్టపడ్డ వారికి సరైన గుర్తింపు రావడం లేదు
# మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు…
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
మంచిర్యాల జిల్లా స్థాయి కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశం క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఎంఎన్ఆర్ గార్డెన్ లో ఏర్పాటు చేశారు. సభ అధ్యక్షులుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వోడ్నాల శ్రీనివాస్ వ్యవహరించారు. సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథులుగా టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావద్, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, ఎమ్మెల్సీ దండే విటల్, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ లు హాజరయ్యారు. టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మంచిర్యాల జిల్లాలో ఇటీవల నూతనంగా నియమితులైన మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్ రెడ్డి తో పాటు నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన సభ్యులకు మంత్రులు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు. బిఆర్ఎస్ నిర్బంధ పాలనలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడ్డారని, అక్రమ కేసులు సైతం అనుభవించారని అన్నారు.
కార్యకర్తల వల్లే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, దేశంలో కాంగ్రెస్ పార్టీకి గొప్ప చరిత్ర ఉందని తెలిపారు. 65 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో, టిడిపి పాలనలో చేయలేని అప్పులు గత బిఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏండ్లలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని ఆరోపించారు. కెసిఆర్ హయాంలో 8 లక్షల కోట్ల అప్పులు దాటాయని అప్పులకు వడ్డీలు కడుతూనే సంక్షేమ పథకాలు అందిస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో బియ్యం అక్రమ స్మగ్లింగ్ జరిగిందని బిఆర్ఎస్ నాయకులు వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారని దుయ్యబట్టారు. శ్రీరామచంద్రుడు బిజెపి పార్టీ జాగీరుల ప్రచారం చేసుకుంటున్నారని,మతాల పేరిట రాజకీయాలు చేస్తున్నారని ,రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేశారని ఆరోపించారు. పేద ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో పేద ప్రజలకు సన్నబియ్యం అందిస్తుందని అన్నారు. బిజెపి పార్టీ దేశవ్యాప్తంగా సన్నబియ్యం ఎందుకు పంపిణీ చేయడం లేదో తెలపాలని అన్నారు. రాష్ట్రాన్ని దోచుకున్న సొత్తులో కెసిఆర్ కుటుంబంలో తగాదాలు జరుగుతున్నాయని అన్నారు. కుల మతాలను రెచ్చగొట్టే బిజెపి పార్టీకి తెలంగాణలో అవకాశమే లేదని తేల్చి చెప్పారు.తెలంగాణ రాష్ట్రాన్ని ఇప్పుడిప్పుడే గాడిలో పెడుతున్నామని, సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలతో విదేశీ పెట్టుబడులు వస్తున్నాయని అన్నారు.
*ఆర్థిక ఇబ్బందులు ఎదురైన సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం…
ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు…
తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా సరే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 గ్యారంటీల పథకాలను అమలు చేస్తున్నామని ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన అప్పులకు వడ్డీలు కడుతున్నామని అన్నారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కుటుంబం త్యాగాల కుటుంబమని, కాంగ్రెస్ పార్టీ కోసం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణాలు సైతం అర్పించారని గుర్తు చేశారు. ప్రధానమంత్రి పదవి అవకాశం వచ్చినా సరే సోనియా గాంధీ చేపట్టలేదని అన్నారు. పార్టీలో కష్టపడ్డ వారికి పదవులు వస్తాయని, పార్టీ గుర్తింపు ఇస్తుందని తెలిపారు.
*కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలి….
కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి.
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. పార్టీలో సీనియార్టీ ప్రాతిపదికన పదవులు ఇస్తున్నామని, కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసే వ్యక్తులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అన్ని పార్టీల్లో గ్రూప్ రాజకీయాలు ఉంటాయని అవి అన్ని పక్కన పెట్టి పార్టీ కోసం పని చేయాలని తెలిపారు. బిఆర్ఎస్ పార్టీ 10 ఏండ్లు చేసిన అరాచకాలను కాంగ్రెస్ పార్టీ ఎత్తి చూపిందని, కాంగ్రెస్ పార్టీ పై ,ప్రభుత్వం పై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ప్రతి ఒక్కరు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. గత బిఆర్ఎస్ పరిపాలనలో తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని, కాలేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ పథకాల్లో భారీ అవినీతి జరిగిందని, వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి అప్పుల రాష్ట్రంగా మిగిల్చారని మండిపడ్డారు.
*పార్టీ కోసం పనిచేసిన వారికి సరైన గుర్తింపు రావడం లేదు..
మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు…
కొత్తగా వచ్చిన వారు వేదికల మీద కూర్చుంటే కాంగ్రెస్ బతకదని గుర్తించుకోవాలని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలంటే పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తను గుర్తించాలని, కొత్తగా చేరిన వారిని ముందు వరసలో నిలబెట్టి కరుడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్తలను అవమానించొద్దని అన్నారు. అధికారం ఉందని వచ్చిన వారు అధికార మార్పిడి జరిగితే ఎవరూ ఉండరని, ఎన్ని కష్టాలు ఎదురైనా కాంగ్రెస్ లో పనిచేసిన కార్యకర్తలను గుర్తించి సముచిత స్థానం కల్పించి, గౌరవించాలని ఆయన కోరారు.కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు పనిచేశామని, గత ప్రభుత్వ హయాంలో అనేక ఇబ్బందులు పడ్డామని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో పార్టీ కోసం కష్టపడ్డ వారికే అవకాశం ఇస్తేనే మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని, ఇది గుర్తించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
రామగుండం పోలీస్ కమీషనర్ ఆదేశాల మేరకు రోడ్డు భద్రతపై డ్రైవర్లకు అరైవ్ అలైవ్ అవగాహన కార్యక్రమం చెన్నూరు సిఐ బన్సిలాల్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని మంచిర్యాల డీసీపీ భాస్కర్,జైపూర్ ఏసీపీ వెంకటేశ్వరులు సందర్శించి డ్రైవర్లను ఉద్దేశించి మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలను నివారించడంలో స్పష్టమైన చూపు అత్యంత ముఖ్యమని,ప్రతి డ్రైవర్ సమయానుకూలంగా కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.అదేవిదంగా ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటించవలసిన నిబంధనలను వారికి వివరించారు.ఈ శిబిరంలో సుమారు 150 మంది ఆటో,టాక్సీ డ్రైవర్లు పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్నారు.వీరిలో 24 మందికి ఉచితంగా కళ్లద్దాలు అందించగా,5 మందిని కంటి శస్త్రచికిత్స కోసం ఎంపిక చేసి పంపించారు.
గాంధీ చౌక్లో “చలి వేంద్రం” ప్రారంభం
వేసవిలో ప్రజలకు చల్లని తాగునీటి సదుపాయం.గాంధీ చౌక్ వద్ద డీసీపీ భాస్కర్,ఏసీపీ వెంకటేశ్వరులు సమక్షంలో చెన్నూర్ పట్టణ పోలీసులు చలి వేంద్రం ను ప్రారంభించారు.వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని చుట్టు ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ప్రజలు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని అధికారులు కోరారు.ఈ కార్యక్రమంలో చెన్నూర్ పట్టణ ఎస్సై లు శ్యాంపటేల్, సుబ్బారావు,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
మహిళా శక్తి భవన్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల,నేటి ధాత్రి:
జిల్లా కేంద్రంలోని పాత మంచిర్యాల ప్రాంతంలో కొనసాగుతున్న మహిళా శక్తి భవన్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.బుధవారం మహిళా శక్తి భవన్ నిర్మాణ పనులను ఆకస్మికంగా సందర్శించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహిళల సంక్షేమం, ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు.ఇందులో భాగంగా జిల్లాలోని మహిళా సమాఖ్యల కొరకు చేపట్టిన ఇందిరా మహిళా శక్తి భవన్ నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో జాతీయ రహదారుల విస్తరణలో భాగంగా చేపట్టిన భూసేకరణకు సంబంధించి దరఖాస్తుల పరిష్కారం పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని రాజస్వ మండల అధికారి కార్యాలయాన్ని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్ రావు తో కలిసి సందర్శించి దరఖాస్తుల పరిష్కారం వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అభివృద్ధిలో భాగంగా భారత జాతీయ రహదారుల సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలో చేపట్టిన 63, 163జి రహదారుల ఏర్పాటులో భాగంగా జిల్లాలోని ప్రాంతాలకు సంబంధించిన దరఖాస్తుల పరిష్కార చర్యలను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
లోక్ అదాలత్ ద్వారా సామరస్యంతో సమస్యలు ముగించుకోవాలని మార్చి 28న శనివారం నిర్వహించబడనున్న జాతీయ మెగా లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పిలుపునిచ్చారు.ఆయన మాట్లాడుతూ లోక్ అదాలత్ ద్వారా వివాదాలు శాంతియుతంగా,రాజీ మార్గంలో పరిష్కారమవుతాయని తెలిపారు.రాజీకి అనువైన క్రిమినల్ కంపౌండబుల్ కేసులు,సివిల్ తగాదా కేసులు,ఆస్తి విభజన, కుటుంబపరమైన,వైవాహిక కేసులు,బ్యాంకు బకాయిల వసూలు,విద్యుత్ చౌర్యం,చెక్ బౌన్స్ వంటి కేసుల్లో ఇరువర్గాలు లోక్ అదాలత్ ద్వారా చర్చించుకుని రాజీకి రావాలని అన్నారు.
రాజీయే రాజమార్గం
చిన్న చిన్న తగాదాల కారణంగా కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయం,డబ్బు వృథా చేసుకోవద్దని తెలిపారు.జుడీషియల్ శాఖ అందించిన ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఇరుపక్షాలు శాంతియుత పరిష్కారం పొందాలని సూచించారు.పెద్దపల్లి, మంచిర్యాల జోన్లలోని అన్ని పోలీస్ అధికారులు,కోర్టు విధులు నిర్వహించే కానిస్టేబుళ్లు,పోలీస్ సిబ్బందికి సరైన మార్గదర్శకాలు ఇచ్చి,రాజీ పడదగిన కేసులను గుర్తించాలని అన్నారు.ఇరువర్గాల వారిని పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించి రాజీ సాధించే ప్రయత్నాలు చేయాలని కమిషనర్ సూచించారు.తమ కేసుల్లో రాజీ కావాలని కోరుకునే వ్యక్తులు సంబంధిత పోలీస్ అధికారులను సంప్రదించాలని ఆయన కోరారు.లోక్ అదాలత్ ద్వారా వివాదాలు త్వరితగతిన పరిష్కారమై బాధితులకు సత్వర న్యాయం లభిస్తుందని పేర్కొన్నారు.
లోక్ అదాలత్ గురించి ప్రజలకు సూచనలు:
ఇరుపక్షాల సమ్మతితో మాత్రమే రాజీ సాధ్యం.లోక్ అదాలత్లో జరిగిన రాజీ చట్టపరంగా తుది తీర్పుగా పరిగణించబడుతుంది.ప్రతి కేసులో న్యాయమూర్తులు, న్యాయవాదులు,సామాజిక కార్యకర్తల సమన్వయంతో పరిష్కారం జరుగుతుంది.ప్రజలు, పోలీసులు,న్యాయస్థానాలు కలిసికట్టుగా పనిచేస్తే చిన్న వివాదాలు కూడా పెద్ద సమస్యలుగా మారకుండా ముందే పరిష్కరించుకోవచ్చని సీపీ అంబర్ కిషోర్ ఝా అన్నారు.
ప్రభుత్వ పాఠశాలలు,సంక్షేమ వసతి గృహాలలో విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.సోమవారం మంచిర్యాల పట్టణంలోని రాజీవ్ నగర్ ప్రాంతంలో గల ఆదర్శ పాఠశాలలు సందర్శించి విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు,అందిస్తున్న మధ్యాహ్న భోజనం ఆహారం నాణ్యత,తరగతి గదులు, పరిసరాలను పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధనతో పాటు మధ్యాహ్న భోజనంలో మెనూ ప్రకారం సకాలంలో పౌష్టిక ఆహారాన్ని అందించాలని, విద్యార్థుల ఆరోగ్య పట్ల శ్రద్ధ వహించాలని తెలిపారు.బాలికల వసతి గృహంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.అనంతరం హాజీపూర్ మండలం గుడిపేట లోని చందనాపూర్ లో గల పట్టణ ఆవాస పాఠశాలను సందర్శించి పాఠశాలలో చేపట్టిన అదనపు గదులు,ఇతర అభివృద్ధి పనులను పరిశీలించి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.వంటశాలను సందర్శించి విద్యార్థుల ఆహారం తయారీలో తాజా కూరగాయలు, నాణ్యమైన నిత్యవసర సరుకులను వినియోగించాలని, ఆహారం తయారీ సమయంలో సిబ్బంది శుభ్రత నిబంధనలు పాటించాలని తెలిపారు.ప్రభుత్వం విద్యారంగా అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తుందని,ఈ నేపథ్యంలో విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల మార్టిన్ గ్రామర్ హై స్కూల్ విద్యార్థుల ప్రతిభ
యువ విజేతలకు సత్కారం
మంచిర్యాల,నేటి ధాత్రి:
సూచిరిండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సర్ సి.వి.రామన్ యంగ్ జీనియస్ అవార్డ్స్ హైదరాబాద్ లక్డీకాపూర్ లోని రవీంద్రభారతిలో మంగళవారం ఏర్పాటు చేశారు.సి.వి.రామన్ యంగ్ జీనియస్ అవార్డులు ఒలంపియాడ్ టాపర్ల విశేషమైన విజయాలను సాధించిన విద్యార్థులకు 20, గోల్డ్,40 స్టేట్,400 డిస్ట్రిక్ట్,20 గురుబ్రహ్మ&చిత్రాలయ యువ విజేతలకు సత్కారం చేశారు.ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథిగా గంట శ్రీనివాసరావు ఎమ్మెల్యే ఆంధ్ర ప్రదేశ్,అధ్యక్షులు చింతమనేని ప్రభాకర్ ఎమ్మెల్యే ఆంధ్ర ప్రదేశ్,ప్రత్యేక అతిధి సినిమా భారతీయ నటుడు శ్రీకాంత్, భారతీయ నటుడు శివాజీ రాజా,లయన్ డాక్టర్ వై.కిరణ్, చైర్మన్-సూచిరిండియా గ్రూప్ కాన్సుల్ జనరల్ -బల్గేరియా రిపబ్లిక్ టి.జి & ఏ.పి , సైకాలజిస్ట్, పాల్గొన్నారు.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల విద్యార్థులు 1లక్షకు పైగా విద్యార్థిని,విద్యార్థులకు ఏర్పాటు చేసిన టాలెంట్ టెస్టులలో మంచిర్యాల నస్పూర్ మండలంలోని మార్టిన్ గ్రామర్ హై స్కూల్ విద్యార్థులు 8 మంది పోటీలో పాల్గొనగా 5వ తరగతి చదువుతున్న విద్యార్థి బైరం కాంక్షిత మొదటి స్థానంలో గెలిచారని మిగతా విద్యార్థులు వివిధ స్థానంలో గెలిచారని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సబిహ సుల్తానా తెలిపారు.ఈ సందర్భంగా సర్ సి.వి రామన్ యంగ్ జీనియస్ అవార్డులు సాధించిన విద్యార్థులను పాఠశాల యజమాన్యం అభినందించి భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.అలాగే అన్ని రంగాలలో విద్యార్థులు పాల్గొని మంచి ప్రతిభ కనబరిచి విజేతలుగా గెలుపొంది తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తేవాలని కోరారు.
విద్యార్థులను వార్షిక పరీక్షలకు ప్రోత్సహించేలా ప్రత్యేక ప్రేరణ- అవగాహన తరగతులు
జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి.చంద్రయ్య
మంచిర్యాల,నేటి ధాత్రి:
10వ తరగతి చదువుతున్న విద్యార్థులను వార్షిక పరీక్షలకు ప్రోత్సహించేలా ప్రత్యేక ప్రేరణ అవగాహన తరగతులు నిర్వహించడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి.చంద్రయ్య అన్నారు.మంగళవారం జిల్లా కేంద్రంలోని వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక తరగతులకు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి భాగ్యవతి,జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు చాతరాజుల దుర్గాప్రసాద్, జిల్లా విద్యాధికారి ఎస్.యాదయ్య,జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి నీరటి రాజేశ్వరి,ఎ. టి. డి. ఓ. సురేష్, టి.ఎన్.జి.ఓ.స్ ప్రతినిధి గడియారం శ్రీహరి,మానసిక వైద్య నిపుణులు సునీల్ లతో కలిసి హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 10వ తరగతి చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు ప్రత్యేక ప్రేరణ-అవగాహన తరగతులను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.ప్రతి విద్యార్గి ఉన్నత లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని,ఇష్టంతో చదివి, పట్టుదలతో సాధించి ఉన్నత స్థానాలలో నిలవాలని, తల్లిదండ్రులకు,జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు.ప్రేరణ-అవగాహన తరగతులను సద్వినియోగం చేసుకోవాలని,విషయ నిపుణులైన ఉపాధ్యాయులు ఇచ్చే మెలకువలను పాటించి, అన్ని సబ్జెక్టులలో 100 శాతం మార్కులు సాధించాలని, వార్షిక ఫలితాలలో 100 శాతం ఉత్తీర్ణతతో మంచిర్యాల జిల్లాను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలపాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో వసతి గృహ సంక్షేమాధికారి ధర్మానంద్ గౌడ్,ఉపాధ్యాయులు,వసతి గృహ సంక్షేమ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రభుత్వం చేపట్టిన అమ్మకు అక్షరమాల కార్యక్రమం ద్వారా వయోజన విద్య అభివృద్ధికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్ అన్నారు.జిల్లాలోని హాజీపూర్ మండలం రాపల్లి గ్రామంలో జిల్లా వయోజన విద్యాధికారి పురుషోత్తం నాయక్,జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి గణపతి,లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ తిరుపతి,గ్రామపంచాయతీ సర్పంచ్ మిట్టపల్లి రామ్ రెడ్డి లతో కలిసి ఉల్లాస్ అక్షరాస్యత కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి మాట్లాడుతూ అక్షరాలు దిద్ది చదువు నేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదని, 15 నుండి 60 సంవత్సరాల లోపు వారందరూ చదువుకోవాలని,అప్పుడే సమాజంలో గౌరవ స్థానం లభిస్తుందని అన్నారు.ఉల్లాస్ అక్షరాస్యత కేంద్రాలకు నిరక్షరాస్యులు ప్రతి ఒక్కరు రావడమే కాకుండా చదువు నేర్చుకుని 100 రోజుల్లో అక్షరాస్యులుగా తయారు కావాలని,అక్షర వికాసం పుస్తకంలోని 16 చాప్టర్ లను 100 రోజులలో పూర్తి చేయాలని తెలిపారు.వయోజన విద్య నేర్చుకుంటున్న మహిళా సంఘ సభ్యులు అక్షరాస్యతతో కీలక జీవన నైపుణ్యాలు నేర్చుకోవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు జిల్లా అధికార యంత్రాంగం కృషి చేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో అక్షర కేంద్రం వాలంటీర్లు శిరీష,దాసరి శ్యామల,జె డి ఎం.రామచందర్,ఎ పి ఎం వెంకటేష్,సి సి లు మోహన్, కృపవర్ణ,రాజమణి,వి ఓ ఎ లు,సంఘ సభ్యులు పాల్గొన్నారు.
నామినేషన్ల స్వీకరణలో గడువు సమయాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి
జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల,నేటి ధాత్రి:
మున్సిపల్ ఎన్నికలలో భాగంగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియలో సమయపాలన కచ్చితంగా పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు.శుక్రవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జి.అన్వేష్,కలెక్టరేట్ పరిపాలన అధికారి పిన్న రాజేశ్వర్ లతో కలిసి సందర్శించి నామినేషన్ల ప్రక్రియ తీరును పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ మాట్లాడుతూ నామినేషన్ల ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని,నామినేషన్ల స్వీకరణలో సమయపాలన ఖచ్చితంగా పాటించాలని, సాయంత్రం 5 గంటలకు గేటు మూసివేయాలని,గేటు లోపల ఉన్నవారికి టోకెన్లు అందజేసి వరుస క్రమంలో నామినేషన్లు స్వీకరించాలని,రిటర్నింగ్ అధికారులు నామినేషన్ల స్వీకరణలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.నామినేషన్ల స్వీకరణ కొరకు టేబుళ్లు ఏర్పాటు చేయడం జరిగిందని,నామినేషన్ దరఖాస్తులు నింపడం,జతపరచవలసిన పత్రాలు,ఇతర వివరాల కొరకు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.నామినేషన్ దరఖాస్తులు పూర్తి చేసిన అభ్యర్థులు హెల్ప్ డెస్క్ వద్ద పరిశీలించుకుని సరైన నామినేషన్లు దాఖలు చేయాలని తెలిపారు.31వ తేదీన నామినేషన్లు పరిశీలించి అర్హత గల అభ్యర్థుల జాబితా ప్రకటన,ఫిబ్రవరి 1వ తేదీన నామినేషన్లపై అభ్యంతరాలు,ఫిర్యాదుల స్వీకరణ,2వ తేదీన అభ్యంతరాలు,ఫిర్యాదుల పరిష్కారం,3వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ అనంతరం పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితా ప్రకటన జరుగుతుందని తెలిపారు.ఫిబ్రవరి 11వ తేదీన పోలింగ్,12వ తేదీన రీపోలింగ్ (ఏమైనా ఉన్నట్లయితే), 13వ ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టి గెలుపొందిన అభ్యర్థుల ప్రకటన జరుగుతుందని తెలిపారు.మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో కంట్రోల్ రూమ్ నం.08736-250501 ఏర్పాటు చేయడం జరిగిందని,ఎన్నికల సంబంధించిన సమాచారం,ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన పై ఫిర్యాదుల కొరకు సంప్రదించవచ్చని తెలిపారు.జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
2వ సాధారణ మున్సిపల్ ఎన్నికలలో భాగంగా జిల్లాలో ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.శుక్రవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో ఎన్నికల సందర్భంగా జరుగుతున్న పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియను పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి,జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించేందుకు పోలింగ్ సిబ్బంది రాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేయడం జరిగిందని తెలిపారు.మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లలో ఏర్పాటు చేసిన 265 పోలింగ్ కేంద్రాలకు గాను 265 మంది పి.ఓ. లతో పాటు 20 శాతం అదనంతో 53 మంది రిజర్వ్ పి. ఓ.లు,265 మంది ఎ.పి.ఓ.లతో పాటు 20 శాతం అదనంతో 53 మంది ఎ.పి.ఓ.లు,795 మంది ఓ.పి.ఓ. లతో పాటు 20 శాతం అదనంతో 159 మంది ఓ.పి.ఓ.లను రాండమైజేషన్ జరిగిందని తెలిపారు.బెల్లంపల్లి మున్సిపల్ పరిధిలోని 34 వార్డులలో ఏర్పాటు చేసిన 68 పోలింగ్ కేంద్రాలకు గాను 68 మంది పి.ఓ. లతో పాటు 20 శాతం అదనంతో 14 మంది రిజర్వ్ పి. ఓ.లు,68 మంది ఎ.పి.ఓ.లతో పాటు 20 శాతం అదనంతో 14 మంది ఎ.పి.ఓ.లు,204 మంది ఓ.పి.ఓ. లతో పాటు 20 శాతం అదనంతో 41 మంది ఓ.పి.ఓ.లను రాండమైజేషన్ జరిగిందని తెలిపారు.చెన్నూర్ మున్సిపల్ పరిధిలోని 18 వార్డులలో ఏర్పాటు చేసిన 36 పోలింగ్ కేంద్రాలకు గాను 36 మంది పి.ఓ. లతో పాటు 20 శాతం అదనంతో 7 మంది రిజర్వ్ పి. ఓ.లు,36 మంది ఎ.పి.ఓ.లతో పాటు 20 శాతం అదనంతో 7 మంది ఎ.పి.ఓ.లు,108 మంది ఓ.పి.ఓ. లతో పాటు 20 శాతం అదనంతో 22 మంది ఓ.పి.ఓ.లను రాండమైజేషన్ జరిగిందని తెలిపారు.క్యాతనపల్లి మున్సిపల్ పరిధిలోని 22 వార్డులలో ఏర్పాటు చేసిన 45 పోలింగ్ కేంద్రాలకు గాను 45 మంది పి.ఓ. లతో పాటు 20 శాతం అదనంతో 9 మంది రిజర్వ్ పి. ఓ.లు,45 మంది ఎ.పి.ఓ.లతో పాటు 20 శాతం అదనంతో 9 మంది ఎ.పి.ఓ.లు,135 మంది ఓ.పి.ఓ. లతో పాటు 20 శాతం అదనంతో 27 మంది ఓ.పి.ఓ.లను రాండమైజేషన్ జరిగిందని తెలిపారు.లక్షెట్టిపేట మున్సిపల్ పరిధిలోని 15 వార్డులలో ఏర్పాటు చేసిన 15 పోలింగ్ కేంద్రాలకు గాను 30 మంది పి.ఓ. లతో పాటు 20 శాతం అదనంతో 6 మంది రిజర్వ్ పి. ఓ.లు,30 మంది ఎ.పి.ఓ.లతో పాటు 20 శాతం అదనంతో 6 మంది ఎ.పి.ఓ.లు,90 మంది ఓ.పి.ఓ. లతో పాటు 20 శాతం అదనంతో 18 మంది ఓ.పి.ఓ.లను రాండమైజేషన్ జరిగిందని తెలిపారు.సిబ్బంది తమకు కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు.అధికారులకు అవసరమైన శిక్షణ అందించడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలన అధికారి పిన్న రాజేశ్వర్,ఎన్నికల విభాగం అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ సర్వే అకాడమీ నుండి శిక్షణ పొందిన పాత లైసెన్స్ సర్వేయర్స్ జిల్లా అధికారి వి.శ్రీనివాస్ కి మంగళవారం వినతిపత్రం అందజేశారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి అమలులో భాగంగా లైసెన్స్ సర్వేయర్స్ సేవలు వినియోగించుకోవడం కోసం సిద్దమైన విషయం వీధితమే. ఈ విషయంలో భాగంగా స్పెల్ -1 శిక్షణ పొందిన లైసెన్స్ సర్వేయర్స్ తో పాటు కొద్దిమంది పాత లైసెన్స్ సర్వేయర్స్ కి మండలాలు కేటాయించడం జరిగింది.ఇంకా చాలా మందికి లైసెన్స్ ఉండి ప్రయివేట్ గా సర్వే పనులు నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తున్నామని,మా అందరికి కూడా మండల్ అలాట్మెంట్ చేయాలనీ కోరగా వారు సానుకూలంగా స్పందిస్తూ తదుపరి లిస్ట్ లో తప్పకుండా అవకాశం కలిపిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సీనియర్ లైసెన్స్ సర్వేయర్స్ సదయ్య,సుధాకర్,మల్లేష్,లక్ష్మణ్,మేరాజ్,మురళి తదితరులు పాల్గొన్నారు.
స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని మంచిర్యాల పట్టణం కాలేజ్ రోడ్ లోని స్వామి వివేకానంద విగ్రహానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి,బీజేపీ నాయకులు,కార్యకర్తలు పూలమాలలు వేసి సోమవారం ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా రఘునాథ్ వెరబెల్లి మాట్లాడుతూ,స్వామి వివేకానంద జీవిత చరిత్రను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.ప్రతి ఒక్కరూ వివేకానంద ఆశయాలు, ఆలోచనలను తెలుసుకొని ఆయన అడుగుజాడల్లో నడవాలని సూచించారు.ప్రపంచ దేశాలన్నీ తిరిగి భారతదేశ గొప్ప చరిత్రను గుర్తించేలా చేసిన మహానుభావుడు స్వామి వివేకానందని తెలిపారు.యువత దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆయన ఆశయాలకు అనుగుణంగా పని చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో అమిరిశెట్టి రాజ్ కుమార్,బియ్యాల సతీష్ రావు,ఆకుల అశోక్ వర్ధన్,తుల ఆంజనేయులు,అవిడపు రాజబాబు, బుద్దారపు రాజమౌళి,బింగి సత్యనారాయణ,మెరెడికొండ శ్రీనివాస్,వెలుముల దుర్గా ప్రసాద్,కాశెట్టి నాగేశ్వర్ రావు,బూర్ల చిరంజీవి,బోయిని దేవేందర్,అరె సతీష్,మణికంఠ తదితరులు పాల్గొన్నారు
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.