తెలంగాణ రాష్ట్రం రోల్ మోడల్ గా అభివృద్ధి చేస్తాం…

తెలంగాణ రాష్ట్రం రోల్ మోడల్ గా అభివృద్ధి చేస్తాం

ఆత్మకూర్ పర్యటనలో సి ఎం
రేవంత్ రెడ్డి

వనపర్తి నేటిదాత్రి .

 

 

సోమవారం నాడు వనపర్తి జిల్లా ఆత్మకూరు పర్యటనలో ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి మున్సిపాలిటీ లోపలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు చేశారు. రూ.15 కోట్ల వ్యయంతో ఆత్మకూరు పట్టణ అభివృద్ధి పనులకు, రూ.15 కోట్ల అమరచింత అభివృద్ధి పనులకు శంఖుస్థాపన లు చేశారు. ఆత్మకూరు మున్సిపాలిటీలో రూ.22 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన 50 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటరు భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు ఆత్మకూరు మున్సిపాలిటీ పి. జె.పి క్యాంపు ఆవరణలో ఏర్పాటు చేసిన శిలాఫలకాల ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి కె. అరవింద్ ప్రసాద్ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డకి స్వాగతం పలికార రాష్ట్ర మంత్రులు జిల్లా ఇంచార్జి మంత్రి దామోదర రాజనర్సింహ, రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడలు మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి కోమటి రెడ్డి వెంకటరెడ్డి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి వనపర్తి జిల్లా ఎస్పీ డి. సునీత రెడ్డి ,ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ శశిధర్ అధికారులు పాల్గొన్నారు

దేశ సమగ్రత కోసం పాటుపడిన ఉక్కు మహిళ ఇందిరాగాంధీ….

దేశ సమగ్రత కోసం పాటుపడిన ఉక్కు మహిళ ఇందిరాగాంధీ.

కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మధు వంశికృష్ణ.

చిట్యాల, నేటిదాత్రి :

 

 

చిట్యాల మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.అనంతరం కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మధువంశీ కృష్ణ మాట్లాడుతూ పేదల అభ్యుదయం, దేశ సమగ్రత కోసం పాటుపడిన ఉక్కు మహిళ మాజీ ప్రధాని, భారతరత్న ఇందిరాగాంధీ అని అన్నారు. దేశసేవకై తన జీవితాన్నే అంకితం చేసిన ఉక్కు మహిళ దేశ ప్రథమ మహిళా ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరా గాంధీ అని అన్నారు… నిరుపేదల ముంగిటకు బ్యాంకు సేవలను తీసుకువచ్చేందుకు బ్యాంకులను జాతీయం చేశారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే ప్రతి కార్యక్రమానికి ఇందిరాగాంధీ పథకాలు ఆదర్శమన్నారు….
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు చిలుకల రాయకోమురు దొడ్డి కిష్టయ్య మండల ప్రధాన కార్యదర్శి గడ్డం కొమురయ్య మండల నాయకులు గుమ్మడి సత్యనారాయణ, అరెపెల్లి మల్లయ్య, అరెపల్లి నర్సింహారాములు, ఆకుల రవీందర్, శనిగరపు మొగిలి యూత్ నాయకులు అల్లం రాజు ఏకు కిషన్ తదితరులు పాల్గొన్నారు.

ఇందిరాగాంధీకి జహీరాబాద్ లో కాంగ్రెస్ ఘన నివాళి..

ఇందిరాగాంధీకి జహీరాబాద్ లో కాంగ్రెస్ ఘన నివాళి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఇందిరమ్మ లాంటి నాయకురాలు ఆమె ఇచ్చిన స్ఫూర్తి ఈ దేశ యువత ఆదర్శంగా తీసుకోవాలని జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. గురువారం మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కండెం నర్సింలు కలిసి ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు కండెం నర్సింలు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో అనేక సంస్కరణలు చేసి ప్రజాహిత నిర్ణయాలు తీసుకొని ఈ దేశ ప్రజలకు అమ్మగా ఇందిరా గాంధీ చిరస్మరణీయం అని పేర్కొన్నారు. నేటికి కూడా అన్ని ప్రభుత్వాలు ఇందిరమ్మ పాలన తేవాలని ఆదర్శంగా తీసుకుని చిరస్థాయిగా నిలిచారని అన్నారు.ఇట్టి కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు కండెం నర్సింలు మండల అధ్యక్షుడు నర్సింహ రెడ్డి నాయకులు ఖాజమియా కేబుల్ శేఖర్ సుజాత తదితరులు పాల్గొన్నారు,

ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే.

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-15T152213.716.wav?_=1

 

ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే.

చిట్యాల నేటి దాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం లోని ముచినిపర్తి గ్రామంలో ఇందిరమ్మ గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రేషన్ కార్డులు మంజూరు ఇందిరమ్మ ఇండ్లు సన్న బియ్యం రైతులకు రుణమాఫీ మహిళల ఖర్చుతో బస్సు ప్రయాణం లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదలకు అండగా నిలిచిందని అన్నారు, టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని అప్పులపాలుగా చేసి రైతులను ప్రజలను మోసం చేసిందన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వాధికారం లోకి వచ్చిన వెంటనే భూపాలపల్లి నియోజకవర్గంలో 3500 మంజూరు చేశామని ప్రస్తుతం గృహప్రవేశాలకు తయారవుతున్నాయని చిట్యాల మండలంలో 430 ఇండ్లు మంజూరు చేశామని, ఇప్పటికి 290 ఇండ్లు పూర్తికా వస్తున్నాయని మిగతా ఇండ్లను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు, కాంగ్రెస్ ప్రభుత్వంతో పేదవాడి ఇంటికల నిజమైందని అన్నారు, అనంతరం ఎమ్మెల్యే కోల కృష్ణవేణి దంపతుల నిర్మించుకున్న ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి లబ్ధిదారులతో కలిసి సహ బంతి భోజనం చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గూ ట్ల తిరుపతి, మాజీ జెడ్పిటిసి పులి తిరుపతిరెడ్డి, హౌసింగ్ పీడీ ఏఈ తాసిల్దార్ ఇమామ్ బాబా కాంగ్రెస్ మండల జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.

చిట్యాల నేటి ధాత్రి :

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని రైతు వేదికలొ గురువారం రోజున కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుట్ల తిరుపతి ఆధ్వర్యంలో చిట్యాల టేకుమట్ల మండలంలోని సిఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగాభూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొని లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పాల్గొనిపంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు మంత్రి సహాయ నిధి ఒక వరం లాంటిదని అన్నారు అలాగే పేద ప్రజలు ఎవరైనా ఎలాంటి పైరవీలకు తావు లేకుండ స్వచ్ఛందంగా అమలు చేస్తామన్నారు ఎవరికి ఏ ఆపద ఉన్న స్వచ్ఛందంగా వచ్చి చెప్పుకోవాలన్నారు, ఇది ప్రజా పాలన ప్రభుత్వమని కొనియాడారు, 18 గంటలు కష్టపడి పని చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఈ నియోజకవర్గ ప్రజల కోసమే అహర్నిశల కృషి చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి, మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి మాజీ జెడ్పిటిసి పులి తిరుపతిరెడ్డి,జిల్లా కాంగ్రెస్అధికార ప్రతినిధి దొడ్డికిష్టయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి మధువంశీకృష్ణ, టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ బుర లక్ష్మణ్ గౌడ్ , జిల్లా నాయకులు చిలుకల రాయకొమురు, వర్కింగ్ ప్రెసిడెంట్ మూలశంకర్ గౌడ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుల అల్లకొండ కుమార్ టేకుమట్ల చిట్యాల మండల కాంగ్రెస్ నాయకులు తదితరులు లబ్ధిదారులు పాల్గొన్నారు.

పేదల పాలిటి పెన్నిధి.. ముఖ్యమంత్రి సహాయ నిధి..

*పేదల పాలిటి పెన్నిధి.. ముఖ్యమంత్రి సహాయ నిధి..

*చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు..

*18 మంది బాధితులకు సి.యం.రిలీప్ ఫండ్ చెక్కులను అందించిన ఎంపీ దగ్గుమళ్ళ

చిత్తూరు(నేటిధాత్రి)నవంబర్

ముఖ్యమంత్రి సహాయ నిధి.. పేదల పాలిట పెన్నిధిగా నిలుస్తోందని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు తెలిపారు. ఆపదలో ఉన్న ఆప్తులకు ఈ విధంగా ఆపన్న హస్తాన్ని అందించడం ఆనందంగా ఉందన్నారు. పేదలకు చేయూతనివ్వడంలో కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని ఆయన తెలియజేశారుచిత్తూరులోని పార్లమెంటు కార్యాలయంలో గురువారం సుమారు18 మంది బాధితులకు 10,89,041 రూపాయల చెక్కులను విడి విడిగా అందించి, వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపారు చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిత్తూరు పార్లమెంటు పరిధిలో ఇప్పటికే ఎంతోమంది ఆప్తులకు, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా తోడ్పాటునందించడం జరిగిందన్నారుసీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు ఓ వరం లాంటిదని ఆయన పేర్కొన్నారు. తాజాగా సుమారు18 మంది బాధితులకు విడి విడిగా 10,89,041 రూపాయల చెక్కులను అందించి వారి కష్టసుఖాలలో పాలుపంచుకోవడం సంతృప్తినిచ్చిందన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదల పక్షపాతిగా పనిచేస్తూ
వారి హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బాటలో నడుస్తూ
తాను కూడా ప్రజాసేవే పరమావధిగా భావించి
తన కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో నిర్వర్తిస్తున్నట్లు చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాద్ రావు ఈ సందర్భంగా వివరించారు.
చెక్కులు అందుకున్న బాధితులు చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావుకు కృతజ్ఞతలు తెలియజేశారు

మండల బిజెపి ఆధ్వర్యంలో మోటర్ బోరు ప్రారంభం…

మండల బిజెపి ఆధ్వర్యంలో మోటర్ బోరు ప్రారంభం…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

తంగళ్ళపల్లి మండలం రామచంద్రపురం గ్రామంలో. గ్రామస్తులు ఇతర అవసరాల కోసం నీరు అవసరం ఉండడంతో గ్రామంలోని నీటికి ఇబ్బందులు. ఎదుర్కొనడంతో. గ్రామస్తులు ఆధ్వర్యంలో తంగళ్ళపల్లి మండల బిజెపి అధ్యక్షులు. వే న్నమనేని. శ్రీధర్ రావు ఆధ్వర్యంలో. నీటి అవసరాల గురించి. కరీంనగర్ ఎంపీ. కేంద్ర మంత్రి. బండి సంజయ్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లగా. తాను స్పందించి. ప్రజల కు. నీటి అవసరాన్ని గుర్తించి ఎంపీ. నిధుల నుండి బోరు. మోటారు మంజూరు చేయడం జరిగిందని. తద్వారా బోరు బండి పంపించడంతో. మండల బిజెపి అధ్యక్షులు వేన్నమనేని శ్రీధర్ రావు. బీజేవైఎం జిల్లా అధ్యక్షులు రాగుల రాజిరెడ్డి. కొబ్బరికాయ కొట్టి. బోరు పాయింట్ వేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. అడిగిన వెంటనే. ప్రజల అవసరాల నిమిత్తం బోరు మోటర్ మంజూరు చేయడంతో. కరీంనగర్ ఎంపీ. కేంద్ర మంత్రి బండి సంజయ్ కి ప్రజల అందరి తరపున. ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో. రాజన్న సిరిసిల్ల జిల్లా మీడియా కన్వీనర్ కాసుగంటి .రాజు. బీజేవైఎం. జిల్లా సెక్రెటరీ చిందం .నరేష్. తంగళ్ళపల్లి మండల జనరల్ సెక్రెటరీ రాజు. సందీప్ గ్రామ సీనియర్ నాయకులు ముత్యం మరియు గ్రామ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

కోహీర్ 19 లక్షలు కలెక్టర్ వ్యయంతో రోడ్డు మరమ్మతు పనులు ప్రారంభమవుతాయి.

కోహీర్ 19 లక్షలు కలెక్టర్ వ్యయంతో రోడ్డు మరమ్మతు పనులు ప్రారంభమవుతాయి.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లాలోని కోహీర్ మండల ప్రధాన రహదారి చాలా రోజులుగా శిథిలావస్థలో ఉంది మరియు చాలా మంది అధికారులు మరియు ప్రజా ప్రతినిధులకు ఫిర్యాదు చేసినప్పటికీ తాత్కాలిక ఉపశమనం తప్ప మరేమీ లభించలేదు. కాలక్రమేణా ఈ రహదారిపై పెరుగుతున్న ప్రమాదాలు మరియు సంఘటనలను చూసిన ఫిర్దోస్ సర్వర్ నాయకుడు మరియు సామాజిక కార్యకర్త మొహమ్మద్ ఫిర్దౌస్ జిల్లా కలెక్టర్ సంగారెడ్డి కలెక్టర్ పి. పర్వీనియా ప్రత్యేక ప్రాతినిధ్యం వహించి, జాతీయ రహదారి నుండి కోహీర్ కు వచ్చే రహదారి యొక్క శిథిలావస్థ మరియు రహదారిపై జరుగుతున్న అన్ని సమస్యలు మరియు ప్రమాదాల గురించి ఆయనకు తెలియజేశారు. ఈ సమస్యలను గమనించిన కలెక్టర్, జాతీయ రహదారి నుండి మనీయర్ పల్లి వరకు ఉన్న రహదారి మరమ్మతు కోసం తన మరియు కలెక్టర్ ప్రత్యేక నిధి నుండి రూ. 19 లక్షలు మరియు కోహీర్ నుండి నాగ్ రెడ్డి పల్లి వరకు ఉన్న రహదారి మరమ్మతు కోసం రూ.1.5 లక్షలు విడుదల చేశారు, తద్వారా రోడ్డుపై ప్రమాదాలను నివారించవచ్చు. ఈ పనిని చూసిన ప్రయాణీకులు జిల్లా కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయ ప్రతినిధులు ఓట్లు అడిగేందుకు ప్రజల ఇంటి వద్దకు వచ్చినట్లే, ప్రజలు వారిని ఎన్నుకున్నప్పుడు, ప్రజా ప్రతినిధులు ప్రజల సమస్యలను పరిగణనలోకి తీసుకుని వారి సమస్యలను పరిష్కరించాలని అన్నారు

పునరావాస కేంద్రంలో దుప్పట్లు పంపిణీ..

పునరావాస కేంద్రంలో దుప్పట్లు పంపిణీ..

మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ రేవతి, సింగాలగుంట వాసులు..

తిరుపతి,నేటిధాత్రి:

సింగా లగుంట 38 వా వార్డు నందు పునరావాస కేంద్రానికి వెళ్లి అక్కడ వాళ్లతో వసతుల గురించి చర్చించి వారికి బెస్షీట్లు మరియు బ్రెడ్లు ఏపీజీ&బిసి చైర్మన్, తిరుపతి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్, తిరుపతి మాజీ మ్మెల్యే మన్నూరు సుగుణమ్మ , 38వ వార్డు ముఖ్య నాయకురాలు సింగాలగుంట రేవతి పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలోసంతోష్ ,విశ్వనాధం , ఆముదాల తులసి మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

హఫీజ్ పీర్ షబ్బీర్ అహ్మద్ కుటుంబానికి తెలంగాణ ముఖ్యమంత్రి సంతాపం తెలిపారు..

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-29T131947.636.wav?_=2

 

హఫీజ్ పీర్ షబ్బీర్ అహ్మద్ కుటుంబానికి తెలంగాణ ముఖ్యమంత్రి సంతాపం తెలిపారు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రఖ్యాత మత పండితుడు మరియు జమియత్ ఉలేమా తెలంగాణ మరియు ఆంధ్ర అధ్యక్షుడు హాజీ హఫీజ్ పీర్ షబ్బీర్ అహ్మద్ (అల్లాహ్ ఆయనపై దయ చూపాలి) షాహీన్ నగర్‌లోని ఆయన నివాసానికి వెళ్లి తన తండ్రి మృతికి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా, హఫీజ్ పర్ ఖలీక్ అహ్మద్ సాబిర్ (జమియత్ ఉలేమా తెలంగాణ ప్రధాన కార్యదర్శి) ముఖ్యమంత్రిని హృదయపూర్వకంగా స్వాగతించారు మరియు ఆయన సానుభూతి మరియు సంతాపానికి ధన్యవాదాలు తెలిపారు. సంతాప సమావేశంలో, తెలంగాణ మరియు ఆంధ్రలోని వివిధ జిల్లాల అధ్యక్షులు మరియు జమియత్ యొక్క అనేక మంది అధికారులు కూడా పాల్గొన్నారు. జమియత్ ఉలేమా జిల్లా సంగారెడ్డి తరపున హజ్రత్ మౌలానా ముఫ్తీ అబ్దుల్ సబూర్ ఖాస్మి (జమియత్ ఉలేమా జిల్లా సంగారెడ్డి జనరల్ సెక్రటరీ) మరియు హఫీజ్ అక్బర్ సాహిబ్ (జమియత్ ఉలేమా జిల్లా సంగారెడ్డి ట్రెజరర్) కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా, రాష్ట్రంలోని రాజకీయ మరియు సామాజిక సమస్యలను కూడా బహిరంగంగా చర్చించారు మరియు పరస్పర సహకారం మరియు సమన్వయం ద్వారా ప్రజా సంక్షేమం మరియు స్థిరత్వం కోసం ఉమ్మడి ప్రయత్నాలపై ప్రాధాన్యత ఇవ్వబడింది. సమావేశం ఆహ్లాదకరమైన మరియు గౌరవప్రదమైన వాతావరణంలో జరిగింది, దీనిలో మరణించిన వ్యక్తి యొక్క మతపరమైన మరియు జాతీయ సేవలకు నివాళులు అర్పించారు మరియు అతని లక్ష్యాన్ని కొనసాగించాలనే దృఢ సంకల్పం కూడా వ్యక్తమైంది.

పేదల కలల్ని సాకారం చేసేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోంది….

పేదల కలల్ని సాకారం చేసేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోంది

#పేదల జీవితాల్లో వెలుగులు నింపేలా ఇంటి కలను సాకారం చేస్తాం.

#అర్హులైన ప్రతి పేదవారికి విడతల వారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తాం.

#వెంకటాపూర్ గ్రామములో ఇందిరమ్మ ఇళ్లు గృహ ప్రవేశానికి హాజరై ప్రారంభించిన ….

#రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క.

ములుగు జిల్లా, నేటిధాత్రి:

 

పేదల కలల్ని సాకారం చేసేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని
రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు.
గురువారం ములుగు జిల్లా వెంకటాపూర్ మండల కేంద్రంలోని బీసీ కాలనీ కి చెందిన ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు బయ్యా ప్రమీల ఇందిరమ్మ ఇల్లును రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి లతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల పథకం పేదల జీవనోపాధికి చిహ్నంగా నిలిచిందని మంత్రి సీతక్క అన్నారు.
పేదల బాగోగుల పట్ల శ్రద్ధచూపడం అందులో భాగమని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్లు అంటేనే ప్రజా ప్రభుత్వం గుర్తుకు వస్తోందని, పేద ప్రజల కలల ఇళ్ల రూపంలో ప్రతిబింబించడానికి ఈ పథకం దోహదపడిందని మంత్రి వివరించారు.
ప్రజా ప్రభుత్వమే నిజమైన రైతు–కూలీలకు అండగా నిలుస్తోందని అన్నారు. రైతును “రాజు”గా చూడాలనే సంకల్పంతోనే సన్నవరి వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తున్నామని తెలిపారు. తొమ్మిది నెలల వ్యవధిలోనే రూ.21 వేల కోట్లతో రెండు లక్షల లోపు ఉన్న రైతుల రుణమాఫీ చేయడం, రూ.22,500 కోట్లతో 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడం, మూడు విడతల్లో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇండ్లు కట్టించేందుకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. అలాగే, 7 లక్షల కొత్త రేషన్ కార్డులు జారీ చేయడం, 17 లక్షల పాత రేషన్ కార్డుల్లో కొత్త సభ్యుల పేర్లు నమోదు చేయడం వంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజా ప్రభుత్వమే విజయవంతంగా అమలు చేసిందని మంత్రి అన్నారు.
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం రెండూ జోడెద్దుల్లా సమపాళ్లలో ముందుకు వెళ్తున్నాయని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించి కేవలం కమిషన్‌ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టుపైనే దృష్టి పెట్టిందని తీవ్రస్థాయిలో విమర్శించారు. పేదల గౌరవప్రదమైన జీవనానికి ప్రతీకగా నిలిచే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని పూర్తిగా విస్మరించారని ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

జహీరాబాద్ లో యాచకుల ప్రత్యేక సర్వే…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-16T121305.938.wav?_=3

 

జహీరాబాద్ లో యాచకుల ప్రత్యేక సర్వే

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ పట్టణంలో యాచకుల కోసం మెప్మా ఆధ్వర్యంలో బుధవారం ప్రత్యేక సర్వే కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సర్వే ద్వారా పట్టణంలో యాచకులు ఎక్కడెక్కడ ఉన్నారో పూర్తి వివరాలను మెప్మా సిబ్బంది సేకరించారు. ఈ సర్వే కార్యక్రమం మరో మూడు రోజులపాటు కొనసాగుతుందని మెప్మా పట్టణ ప్రాజెక్టు అధికారి బసంత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం యాచకుల పునరావాసం మరియు సంక్షేమానికి దోహదపడుతుందని భావిస్తున్నారు.

మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే నాగరాజు, జిల్లా యూత్ అధ్యక్షుడు దిలీప్ రాజ్ గారు…

మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే నాగరాజు, జిల్లా యూత్ అధ్యక్షుడు దిలీప్ రాజ్ గారు…
పర్వతగిరి (నేటిధాత్రి)

https://youtu.be/noKiE2XIQfg?si=L7oOaMMyR-BikAwq

 

వరంగల్ జిల్లా పర్వతగిరి మండల పరిధిలోని అన్నారం గ్రామానికి చెందిన పర్వతగిరి మండల యూత్ అధ్యక్షుడు గొడుగు వినయ్ గారి నానమ్మ గొడుగు లచ్చమ్మ నిన్న అనారోగ్యంతో మరణించగా నేడు వారి నివాసానికి వెళ్లి భౌతిక దేహానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన గౌరవ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు మరియు వరంగల్ అర్బన్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కేఆర్ దిలీప్ రాజ్
అనంతరం కల్లెడ గ్రామానికి చెందిన మద్దెల శ్రీనివాస్, బాల్లె వెంకటయ్య ఇటివల అనారోగ్యంతో మరణించగా నేడు వారి నివాసాలకు చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.అదే విధంగా నిన్న కల్లెడ గ్రామంలో కురిసిన అకాల వర్షంతో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో వర్షపు నీరు రోడ్డుపైకి చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు సంబంధిత అధికారులతో మాట్లాడి గ్రామంలో శాశ్వత డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే స్పష్టంగా తెలిపారు కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

శ్రీరామసాగర్ రెండోదశ ప్రాజెక్టుకు బి.ఎన్ పేరు పెట్టాలి…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-13T145124.240.wav?_=4

 

శ్రీరామసాగర్ రెండోదశ ప్రాజెక్టుకు బి.ఎన్ పేరు పెట్టాలి

ఎం సిపిఐ (యు) పార్టీ నేతల డిమాండ్

నర్సంపేట,నేటిధాత్రి:

 

శ్రీరామ్ సాగర్ రెండవ దశ ప్రాజెక్టుకు నల్లగొండ జిల్లా మాజీ ఎంపీ , తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి పేరు నామకరణం చేయాలని ఎంసిపిఐ (యు) రాష్ట్ర కమిటీ సభ్యురాలు వంగల రాగ సుధా,డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి డిమాండ్ చేశారు.ఈ క్రమంలో నర్సంపేట ఆర్డిఓ ద్వారా ముఖ్యమంత్రికి మెమోరాండం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిఎన్ రెడ్డి తన జీవితమంతా ప్రజల కోసమే త్యాగం చేశారని నాలుగున్నర లక్షల ఎకరాలకు నీరు అందించే ఈ ప్రాజెక్టు సాధన కోసం అలుపెరుగని పోరాటాలు నిర్వహించారని పేర్కొన్నారు.అలాంటి వారి త్యాగాన్ని గుర్తించకుండా ఆ ప్రాజెక్టుకు కాంగ్రెస్ నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి పేరు పెడతామని ముఖ్యమంత్రి ప్రకటించటం సరికాదన్నారు. పీడిత ప్రజల అభ్యున్నతి కోసం త్యాగంచేసిన బిఎన్ పేరు నామకరణం చేసి భవిష్యత్ తరాలకు ఆదర్శంగా ఉండేలా , ముఖ్యమంత్రి పునః పరిశీలన చేసి సరైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.లేనియెడల ప్రజలను సమీకరించి ఉద్యమాలకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టౌన్ నాయకులు భైరబోయిన నర్సయ్య,గనిపాక బిందు,కళ్లెపెల్లి రాకేష్ పాల్గొన్నారు.

పదేండ్లు పరిపాలించి రాష్ట్రాన్ని అప్పులో ముంచింది మీ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కాదా…

పదేండ్లు పరిపాలించి రాష్ట్రాన్ని అప్పులో ముంచింది మీ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కాదా…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రవీణ్ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో. పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పది సంవత్సరాలు ప్రజలను దోచుకున్నోళ్ళు దోకా. కార్డు రిలీజ్ చేయడం విడ్డూరంగా ఉందని. సిరిసిల్ల వేదికగా చేసుకొని తెలంగాణ వ్యాప్తంగా అవినీతికి ఆద్యం పోసింది కేటీఆర్ కాదా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజాపాలన సాగిస్తుంటే కళ్ళు మండుతున్నాయి . గత మీ పాలన లో.చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి అసత్య ఆరోపణలు చేస్తున్నారని రానున్న స్థానిక ఎన్నికలకు ప్రజల్లోకి వెళ్తే ప్రజలు చి కొడుతారని.తప్పుడు ప్రచారానికి తెర లేపుతున్నారని. గత పది సంవత్సరాలు. అమలుకునోచుకోని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసింది మీరు కాదా. ప్రజలను అరిగోశపెట్టి ఇబ్బందులకు గురిచేసింది మీరు కాదా. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తుంటే గులాబీ నేతల కళ్ళు మండుతున్నాయని హామీ ఇచ్చిన ప్రకారం ఆరోగ్యారంటీలలో నాలుగు హామీలను అమలు చేసిన o. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా సంక్షేమం ఆపడం లేదు అని. సిరిసిల్ల వేములవాడ గులాబీ నాయకులు ఇంత దోపిడీ చేసింది ఏం చేసింది అందరికీ తెలుసు అని బీసీ రిజర్వేషన్ పై చిత్తశుద్ధితో పనిచేస్తుంటే బి ఆర్ఎస్ నేతల . కండ్లు మండుతున్నాయని మీ ప్రభుత్వ హయాంలో మీరు బీసీలకు ఏం చేశారో చెప్పాలి. ఫామ్ హౌస్ లో.పడుకోవడానికి తప్ప పరిపాలన చేతగాని మీరా మమ్మల్ని విమర్శించేది గుట్టలకు గుట్టలకు రైతుబంధు ఇచ్చి ప్రజాధనం కోట్లు కొల్లగొట్టారని మూడు వేల కోట్ల విలువైన ఇసుకను సిరిసిల్ల నుండి తరలించి మీ నాయకులు కోట్లు
సంపాదించిన మీరు ధోక కార్డు రిలీజ్ చేయడం సిగ్గుచేటని కార్డు పట్టుకొని రండి చర్చకు సిద్ధం కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపు దిశగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని. ప్రతి గ్రామంలో బిఆర్ఎస్ లీడర్ల అవినీతి కార్డులు రిలీజ్ చేసి ఎన్నికలకు పోదామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇట్టి కార్యక్రమంలో మండల జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

మేము ప్రజలకు బాకీ ఉన్నమాట వాస్తవమే..

మేము ప్రజలకు బాకీ ఉన్నమాట వాస్తవమే..

#మమ్మల్ని గెలిపించి,అభివృద్ధిలో భాగస్వామ్యం చేసిన ప్రజలకు ఎప్పడు రుణపడి ఉంటాం..

#మిగులు రాష్ట్రాన్ని అప్పులు పాలు చెందింది మీరే కదా..

#మీ రాజకీయ లబ్ధికోసం ప్రజలను ఎన్నికల ముందు తప్పుదోవ పట్టిస్తున్నారు…

#బి ఆర్ ఎస్ కా డోఖా కార్డ్ విడుదల చేసిన డీసీసీ అధ్యక్షులు,ఎమ్మెల్యేలు,ఎంపీ

హన్మకొండ, నేటిధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

పదేళ్ల పరిపాలనలో మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పులు చేసి ఆర్ధిక భారాన్ని మోపిన బి ఆర్ ఎస్ నేతలు బాకీ కార్డ్ పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి మండిపడ్డారు.సోమవారం రోజున హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వరంగల్ పార్లమెంట్ సభ్యులు శ్రీమతి కడియం కావ్య,వర్ధన్నపేట శాసన సభ్యులు శ్రీ కే ఆర్ నాగరాజు,వరంగల్ జిల్లా అధ్యక్షులు శ్రీమతి కడియం కావ్య తో కలిసి పాల్గొన్నారు.

పదేళ్ల గత బి అర్ ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన హామీలను విస్మరించిన హామీలపై బిఆర్ఎస్ కా డోఖా కార్డ్ పేరుతో కార్డులను విడుదల చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఈ కార్డులను ప్రజల్లోకి తీసుకెళ్లలను పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ ప్రజలిచ్చిన అధికారాన్ని పూర్తిగా స్వప్రయోజనాలకు వాడుకున్నారని,రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా ప్రజలను నట్టేట ముంచారని మండిపడ్డారు.ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా,సంక్షేమ పథకాల అమలులో నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. ప్రజలు మర్చిపోలేదు దశాబ్దం పాటు అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి, ఏవీ పూర్తి చేయకుండా మధ్యలో వదిలేసింది.

కాంగ్రెస్ మాట మీద నమ్మకం ఉన్న పార్టీ మేము ఇచ్చిన హామీలను దశల వారీగా, ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తున్నాం.
బిఆర్‌ఎస్ పార్టీకి ఇప్పుడు ఉన్న ఏకైక పని తప్పులను కప్పిపుచ్చుకోవడం, ప్రజల దృష్టి మళ్లించడం మాత్రమే.
బిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతి పేద కుటుంబానికి డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు ఇస్తామని పెద్దగా ప్రచారం చేసింది.
వేలాది కుటుంబాలు నేడు షీట్ ఇళ్ళ్లో, అద్దె ఇళ్ళ్లో ఉంటున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్‌లో ఉన్న ఇళ్లను పూర్తి చేయడానికి ఫండ్‌లు విడుదల చేసింది.
టీఆర్‌ఎస్ “రైతు బంధు, రైతు బీమా” అని గొప్పగా చెప్పుకున్నా, వాస్తవానికి రైతులకు రుణాలు మాఫీ కాలేదు.
పంట కొనుగోలు కేంద్రాల్లో బిల్లులు నెలల తరబడి పెండింగ్‌లో ఉంచారు.

ఎరువుల కొరత, విత్తనాల కొరత రైతు దైనందిన కష్టాలు బిఆర్‌ఎస్ పాలనలో పెరిగాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మొదటి బడ్జెట్‌లోనే రైతులకు పంటల బీమా పునరుద్ధరణ, సమయానుసారం ఎరువుల సరఫరా చర్యలు తీసుకుంది.

మార్కెట్‌లో కనీస మద్దతు ధర (ఎమ్మెస్పి) హామీగా ఇచ్చి అమలు చేయడం మొదలుపెట్టింది.
టీఆర్‌ఎస్ 2018లో ఇచ్చిన హామీ: “ప్రతి నిరుద్యోగ యువకుడికి ₹3,016 భృతి.”
పదేళ్లపాటు అధికారంలో ఉన్నా, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.
పరీక్షల వాయిదాలు, పేపర్ లీక్‌లు, అవినీతి యువత భవిష్యత్తుతో చెలగాటమాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రిక్రూట్‌మెంట్ ప్రక్రియలను వేగవంతం చేసింది.
టీఆర్‌ఎస్ పాలనలో పాఠశాలలు మూతపడ్డాయి, హాస్టళ్లు మూసివేశారు.
విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు కోట్లలో పెండింగ్‌లో ఉన్నాయి.
డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలు కొత్తగా ఎక్కడా ప్రారంభం కాలేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా రంగానికి మళ్లీ జీవం పోస్తోంది.
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు క్లియర్ చేయడం మొదలుపెట్టింది.
ప్రభుత్వ కళాశాలలకు ఫ్యాకల్టీ నియామకాలు జరుగుతున్నాయి.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం వరంగల్‌కు స్మార్ట్ సిటీ హామీ ఇచ్చినా, దాని అమలు వద్ద ఆగిపోయింది.
మీరు చేస్తున్న బాకీ ప్రచారంలో మేము ప్రజలకు బాకీ ఉన్నమాట నిజమే అని ఓటు వేసి గెలిపించిన ప్రజలకు బాకీ ఉండటంలో తప్పు లేదని దుయ్యబట్టారు.
రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బి ఆర్ ఎస్ బాగోతాలను ప్రజలకు చేరువ అయ్యేలా “బిఆర్ఎస్ కా దోఖా “ను ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రావు,పీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాస్ రావు,మున్సిపల్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు,కార్పొరేటర్లు జక్కుల రవీందర్ యాదవ్,విజయశ్రీ జిల్లా కిసాన్ సెల్ చైర్మన్ వెంకట్ రెడ్డి,మహిళా అధ్యక్షురాలు బంక సరళ మరియు ప్రజా ప్రతినిధులు,బ్లాక్ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఎం బలపరిచిన వ్యక్తులను గెలిపించండి…

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఎం బలపరిచిన వ్యక్తులను గెలిపించండి

సి.పి.ఎం జిల్లా కార్యదర్శి ముశం రమేష్

సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)

 

 

ఈరోజు అమృత్లాల్ శుక్ల కార్మిక భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి
ముశం రమేష్ మాట్లాడుతూ..రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఎం పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో జడ్పిటిసి ఎంపిటిసి సర్పంచ్ కానాలకు వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో పోటీ చేయనున్నది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిపిఎం కార్మిక కర్షక బడుగు బలహీన వర్గాల పక్షాన నిలబడి అనేక పోరాటాలు నిర్వహిస్తూ వస్తున్నది
కాంగ్రెస్ బిజెపి టిఆర్ఎస్ పార్టీలు తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాలు మాత్రమే పనిచేస్తున్నాయి తప్ప ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ఏ ఒక్క పార్టీ కూడా నిజాయితీగా ప్రజల కొరకు పనిచేసిన దాకాలు లేవు ఎన్నికల సందర్భంగా అనేక హామీలు ఇచ్చి ఎన్నికల అయిన తర్వాత హామీలను అమలు చేయకుండా తుంగలో తొక్కేయడం పెట్టుబడిదారి పార్టీలకు ఆనవాయితీగా మారింది చట్టసభల్లో కమ్యూనిస్టు పార్టీల ప్రాతినిధ్యం తగ్గిపోవడంతో విచ్చలవిడిగా అవినీతి రాజ్యమేలుతున్న పేదల సమస్యలు పరిష్కారం కావడం లేదు రాజన్న సిరిసిల్ల జిల్లాలో భూ అక్రమాలు ఇసుక మాఫియా. ప్రకృతి సంపద దోచుకోవడం. రోజురోజుకు పెరిగిపోతాయి ప్రశ్నించే గొంతుక లేకపోవడం వలన అవినీతి రాజ్యమేలుతుంది ప్రజల సమస్యలు పక్కన పోతున్నాయి.నీతికి నిజాయితీకి క్రమశిక్షణకు మారుపేరైనటువంటి సిపిఎం పార్టీ అభ్యర్థులను ప్రజా సమస్యల పరిష్కారం కొరకురాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజానీకానికి సిపిఎం జిల్లా కమిటీ విజ్ఞప్తి చేస్తుంది.ఈ సమావేశంలో సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యులు ఎగమంటి ఎల్లారెడ్డి. కోడం రమణ సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సూరం పద్మ,శ్రీరాముల రమేష్,
చంద్ర సిపిఎం నాయకులు,సందు పట్ల పోచమ్మల్లు, గడ్డం రాజశేఖర్,తదితరులు పాల్గొన్నారు.

స్వచ్ఛతాహి సేవ కార్యక్రమం…

స్వచ్ఛతాహి సేవ కార్యక్రమం

భూపాలపల్లి నేటిధాత్రి

పైలెట్ కాలనీ లో గల సింగరేణి కమ్యూనిటి హాల్ లో
స్వచ్ఛతాహి సేవ కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ఏరియా సివిల్( ఏజిన‌ఎం ) రవికూమర్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వయంగా కమ్యూనిటి హాల్ ముందు వైపు, వెనుక వైపు ఉన్న పిచ్చి మొక్కలను చెత,చెదారాలను, అధికారులు సివిల్ సిబ్బంది తో కలిసి శుభ్రం చేశారు.
ఈ సందర్భంగా ఏజిన‌ఎం మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి, ప్రతి పౌరుడిలో స్వచ్ఛ భారత్ ఆలోచన పదిలంగా ఉండాలని ఆయన కోరారు. పరిశుభ్రత ఒక్క వ్యక్తిగత పరిశుభ్రతకే పరిమితం కాకుండా, సమాజ సంక్షేమానికి మూలస్తంభంగా నిలుస్తుందన్నారు . సింగరేణి సంస్థలో పని చేస్తున్న ప్రతి ఉద్యోగి వారి పని ప్రదేశాలలో, నివాస ప్రాంతాలలో శుభ్రత పాటిస్తూ మిగతా సమాజానికి ఆదర్శంగా నిలవాలన్నారు. స్వచ్ఛతా నినాదాన్ని ప్రతిసారీ మన జీవితాల్లో భాగం చేసుకోవాలని కోరారు. అందరి కృషితోనే పరిశుభ్రత సాధ్యమౌతుంది” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏరియా సర్వే అధికారి శైలేంద్ర కుమార్, ఎన్విరాన్మెంట్ అధికారి పోశమల్లు, సివిల్ (ఎస్. ఇ) బాలరాజు, అశోక్ రెడ్డి,ఇతర అధికారులు,ఉద్యోగులు ,సివిల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

దసరా శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర నాయకులు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-01T141238.110.wav?_=5

 

దసరా శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర నాయకులు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ ప్రజలకు రాష్ట్ర నాయకులు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. దుర్గామాత అనుగ్రహం కోసం.. నవరాత్రుల్లో 9 రోజులపాటు భక్తిశ్రద్ధలతో దుర్గామాతను పూజించి, చెడుపై.. మంచి, దుష్ట శక్తులపై.. దైవ శక్తుల విజయానికి ప్రతీకగా జరుపుకునే పండుగే విజయదశమి అన్నారు. దసరా పండుగ ధనిక పేద తేడా లేకుండా ప్రతి ఒక్కరి మధ్య స్నేహభావాన్ని పెంపొందించి సమాజం ఐక్యమత్యంతో ఉండేలా చేస్తుందని పేర్కొన్నారు. జహీరాబాద్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ముఖ్యంగా విద్య వైద్యం ప్రతి ఒక్కరికి చేరాలని తలంపుతో ప్రజా ప్రభుత్వం పనిచేస్తూ విద్యా వైద్యానికి పెద్దపీట వేస్తుందని తెలిపారు. పేదింటి బిడ్డలకు అత్యుత్తమ విద్య అందించాలని తలంపుతో ప్రారంభించరు ఈ సందర్భంగా ఉదాహరించారు. జహీరాబాద్ నియోజకవర్గ ప్రజలంతా సుఖ సంతోషాలతో దసరా ఉత్సవాలను జరుపుకోవాలని, ఆ జగన్మాత ఆశీస్సులతో ప్రజలంతా సుఖ శాంతులతో, సిరి సంపదలతో తులతూగాలని ఆ కనకదుర్గమ్మ అమ్మవారి దీవెనలు, ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

“ప్రజలకు హామీలు నెరవేర్చని కాంగ్రెస్‌పై బీజేపీ నేత విమర్శ”…

ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం
ప్రధానమంత్రి మోడీ గారిని మరియు భారతీయ జనతా పార్టీ నీ విమర్శించే హక్కు కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదు
భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి
వర్ధన్నపేట( నేటిధాత్రి):

భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యం లోని కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ అభివృద్ధి పేద ప్రజల అభివృద్ధి తోనే సాధ్యమవుతుందని ఆలోచించి ప్రజలకు భారమైన జీఎస్టీ పన్నును నాలుగు స్లాబులుగా ఉన్నదాన్ని తగ్గి రెండు స్లాబుల కిందికి తీసుకువచ్చి నిత్యవసర వస్తువుల ధరలు తగ్గుముఖం పట్టే విధంగా ఆటోమొబైల్ పరిశ్రమలు ఫార్మా కంపెనీల లాభాలను తగ్గించి జిఎస్టిని తగ్గించడం ద్వారా పేదలకు న్యాయం జరుగుతుందని ఆలోచించి జిఎస్టి తగ్గిస్తే దానిని కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శించడం చాలా హాస్యస్పదంగా ఉందని భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి అన్నారు. లేనిపోని మాటలు చెప్పి దొంగ హామీలు ఇచ్చి ఇచ్చిన హామీలను ఇప్పటివరకు నెరవేర్చలేక జనాల్లోకి పోయే ముఖం లేక కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రధానమంత్రి గారిని విమర్శించడం తగదని ఇప్పటికైనా ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా పనిచేయాలని కాంగ్రెస్ నాయకులకు హితవు పలికారు. మహిళలకు ప్రతి నెల 2500 ఇస్తామన్న హామీ ఇప్పటివరకు దరిదాపుల్లో కనపడడం లేదని గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకు ఇస్తామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు హామీని నెరవేర్చిన దిశగా వెళ్లలేదని ఆసరా పింఛన్లు డబల్ చేసి ఇస్తామని మోసం చేసి ఓట్లు ఎంచుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కళ్ళు మూసుకుపోయాయా అని ప్రశ్నించారు. వికలాంగులకు 6000 రూపాయలు పెన్షన్లు ఇస్తామని చెప్పి మోసం చేసిన కాంగ్రెస్ మళ్ళీ మాయమాటలు చెబుతూ ప్రజల్ని మోసం చేయాలని చూస్తుందని ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్తారని అప్పుడు వాళ్ళ పార్టీకి మరియు నాయకులకు కళ్ళు తెరుచుకుంటాయని అప్పటివరకు భ్రమలో కొనసాగాలని మహేందర్ రెడ్డి అన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version