మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలో నారాయణపేట, మహబూబ్ నగర్ సంయుక్తంగా విస్తృతంగా వాహనాలను తనిఖీ చేపట్టారు. అనుమతి పత్రాలు లేని వాహనాలకు భారీ జరిమానా విధించారు. గురువారం ఉదయం కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు దహనం ఘటన చోటు చేసుకోవడంతో అధికారులు వాహనాల తనిఖీ నిర్వహించారు. అధిక లోడుతో వెళ్తున్న వాహనాదారులను అధికారులు హెచ్చరించారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించాలన్నారు.
ఐసిటిసి ద్వారా వైద్య శిబిరం ఏర్పాటు చేసి, గ్రామ స్తులకు ఉచితంగా వైద్య పరీక్షలు, రక్త నమూనాలు సేకరించి హెచ్ ఐవి ఎయిడ్స్, టిబి, సిఫిలిస్, హెచ్ బీ ఎస్ పై అవగాహన కల్పించారు. డాక్టర్ మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులపట్ట వివక్ష చూపవద్దని, వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష చూపవద్దని, వ్యాధిగ్ర స్తులకు అందించే చికిత్స గురించి తెలియజేశారు. హెచ్ఐవి వస్తే ఏఆర్ టి ద్వారా మందులు వాడి నిజజీవితాన్ని గడపవచ్చు. ప్రతి గర్భవతి దగ్గర ఉన్న ఐసీటీసీ సెంటర్ కు వెళ్లి హెచ్ఐవి పరీక్ష చేయించు కోవాలి.ఈ కార్యక్రమంలో డాక్టర్ అభినందన్ రెడ్డి, ఏఎన్ ఎం సునీత, కుమార స్వామి, సిఎల్ డబ్ల్యూ స్వప్న, వీరన్న, మైలారం వైద్య సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు
జహీరాబాద్ నియోజకవర్గ కోహిర్ మండల దిగ్వాల్ గ్రామంలో బీహార్లోని మహా బోధి బుద్ధగయ విముక్తి కోసం విశ్వవ్యాప్త ఆందోళన చేపట్టినట్టు ప్రముఖ బౌద్ధ భిక్షువు వినయ్ ఆచార్య తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం దిగ్వాల్లో అంబేడ్కర్ విగ్రహం వద్ద మాట్లాడుతూ, ఫిబ్రవరి 12, 2026న న్యూఢిల్లీలో నిర్వహించనున్న అంతర్జాతీయ మహా సభకు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని అంబేడ్కర్ వాదులను కోరారు. ఈ కార్యక్రమంలో తలారి అశోక్, జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వం పత్తి రైతుల కోసం ప్రారంభించిన కపాస్ కిసాన్ యాప్ వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు. యాప్ ను పత్తి రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉత్పత్తులను కనీస మద్దతు ధర (ఎంఎస్పి)కు సులభంగా,మధ్యవర్తుల ప్రమేయం లేకుండా అమ్ముకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.గురువారం వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలోని దేశాయిపల్లె, ముద్దునూరు,బంధంపెల్లి,గ్రామాల పత్తి రైతులకు మండల వ్యవసాయ శాఖ అధికారి మాధవి అధ్యక్షతన కిసాన్ యాప్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రైతులకు స్లాట్ బుకింగ్, పేమెంట్ ట్రాకింగ్, ఆధార్ , భూమి రికార్డుల ద్వారా సులభంగా నమోదు చేసుకోవడం వంటి సదుపాయాలున్నాయని అన్నారు.
ఆధార్ నంబర్తో స్వీయ-నమోదుతో పాటుమార్కెట్లో రద్దీని తగ్గించడానికి క్యూలను నివారించడానికి స్లాట్ బుక్ చేసుకోవచ్చని అన్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా అమ్మకాలు జరుపుకోవడంతో పాటు పేమెంట్ ట్రాకింగ్ వంటి సదుపాయాల ద్వారా లావాదేవీలలో పారదర్శకతను అందిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు.ముందుగా ప్లేస్టోర్ నుంచి కపాస్ కిసాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని యాప్లో ఆధార్, భూమి రికార్డులు (పట్టాదారు పాస్బుక్), పంట రకం, విస్తీర్ణం, ఇతర అవసరమైన వివరాలను నమోదు చేయాలన్నారు.పత్తి అమ్మాలనుకుంటున్న మార్కెట్ను ఎంచుకుని స్లాట్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు.నాణ్యమైన పత్తి కి మంచి మద్దతు ధర రూ.8110 వస్తుందని తెలియజేశారు.పత్తి ఏరడానికి కాటన్ బ్యాగ్స్, పాత చీరలు వాడాలని, ప్లాస్టిక్ సంచులు వాడరాదని సూచించారు.
ఈ సందర్భంగా అంగన్వాడీ సెంటర్స్, మరియు ప్రైమరీ స్కూల్ లను కలెక్టర్ తనిఖీ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, నర్సంపేట ఏడిఏ దామోదర్ రెడ్డి, ఏఈఓలు హనుమంతు,విజయ్, రాజేశ్ ఆయా గ్రామాల పత్తి రైతులు పాల్గొన్నారు.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం ఝఖరాంగం మండల కేంద్రంలో ఎంవీడీవో కార్యాలయం లో ఎంపీడీవో సుజాత మరియు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రమ్య ఆధ్వర్యంలో అత్యవసర పరిస్థితులలో ఎవరైనా కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు సిపిఆర్ చేసి వ్యక్తిని ప్రాణాపాయం నుండి ఏ విధంగా తప్పించవచ్చో అవగాహన కల్పించారు. ట్రైనర్స్ ఎం ఎల్ హెచ్ పి మురళీకృష్ణ, హెచ్ ఈ ఓ గోవర్ధన్, సిహెచ్ సుధాకర్, ఈ కార్యక్రమంలో ఆశ కార్యకర్తలు అంగన్వాడి టీచర్స్ గ్రామపంచాయతీ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యం అమ్మి మద్దతు ధర పొందాలి
ప్రతిపక్షాల మాటలు నమ్మి రైతులు ఆందోళనకు గురి కావద్దు-ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
గంగాధర, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలం హిమ్మత్ నగర్, గట్టుభూత్కుర్, చిన్న అచంపల్లి, పెద్ద అచంపల్లి, గర్షకుర్తి, తాడిజెర్రి, రంగారావుపల్లి, ఉప్పరమల్యాల, కురిక్యాల, మల్లాపూర్, వెంకంపల్లి, మధురానగర్ గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతుల ధాన్యం అమ్మి మద్దతు ధర పొందాలని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సూచించారు. మండలంలోని వివిధ గ్రామాల్లో వ్యవసాయ సహకార సంఘం, ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈసందర్భంగా చొప్పదండి ఎమ్మెల్యే సత్యం మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యం గింజ వరకు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చే రైతులు ఇబ్బంది పడకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కేంద్రాల వద్ద తాగునీరు, విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయాలని, రైతుల కోసం నీడ ఏర్పాటు చేయాలని సూచించారు. కేంద్రాలకు రైతుల వివరాలను నమోదు చేసుకొని, తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని వెంట వెంటనే మిల్లులకు తరలించాలని సూచించారు. ప్రతిపక్షాల మాటలు నమ్మి రైతులు ఆందోళనకు గురి కావద్దని, సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని భరోసా కల్పించారు. ఈకార్యక్రమంలో సింగల్ విండో చైర్మన్ వెలిచాల తీర్మల్ రావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తోట కరుణాకర్, తహశీల్దార్ అంబటి రజిత, ఎంపిడిఓ రామ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పురుమల్ల మనోహర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దుబ్బాసి బుచ్చయ్య, రామిడి రాజిరెడ్డి, సాగి అజయ్ రావు, బుర్గు గంగన్న, రాజగోపాల్ రెడ్డి, రోమాల రమేష్, పడితపల్లి కిషన్, చక్రపాణి, శ్రీనివాస్, లక్ష్మణ్, హన్మంత రెడ్డి, మహేష్, ఆనంద్, కరుణాకర్, తదితరులు పాల్గొన్నారు.
గణపురం మండల కేంద్రంలో ధర్మసమాజ్ పార్టీ బీసీ ఎస్సీ ఎస్టీ జాక్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశంలో ధర్మసమాజ్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కండె రవి మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో 24 న ఇందిరా పార్క్ దగ్గర హైదరాబాదులో జరగబోయే మహా ధర్నాకు సారాధ్యం వహిస్తున్న ఉమ్మడి ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఈశ్వరయ్య, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవిలు, బీసీ ఎస్సీ ఎస్టీ రైట్స్ అండ్ రాజ్యాధికార సాధన జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ విశారదన్ మహరాజ్ నేతృత్వంలో చేయబోయే మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని పిలుపునివ్వడం జరిగింది. దేశ జనాభాలో 133 కులాలు 60 శాతం ఉన్న బీసీలు కేవలం 29 శాతం రిజర్వేషన్ ని మాత్రమే అనుభవిస్తున్నారు తద్వారా వీరు ఆర్థికంగా, రాజకీయంగా, విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాలలో అగ్రకుల పార్టీల చేతిలో 70 సంవత్సరాలు దగా పడ్డది చాలు వీరికి న్యాయబద్ధంగా రావాల్సిన 42% రిజర్వేషన్ ని రాజ్యాంగబద్ధంగా 9వ షెడ్యూల్లో చేర్చితేనే బీసీలకు సంపూర్ణ విముక్తి జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఘనపూర్ మండల కేంద్రంలోని బీసీలు, బహుజన సంఘాల వారందరూ మహాధర్నా కార్యక్రమానికి తరలిరావాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మైనార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సైదులు పాష, అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు శనిగరపు రాజేందర్, రజక సంఘం నాయకులు వడ్డేపల్లి శ్రీనివాస్, కోగిల జితేందర్, కుర్రి స్వామినాథన్, ఇంజపల్లి విక్రమ్, ఎస్.కె ఇమామ్, ఇంజపెల్లి రవి పాల్గొన్నారు..
పిల్లలను కిడ్నాప్ చేశామంటూ పోలీసుల పేరుతో వచ్చే ఫోన్ కాల్స్తో జాగ్రత్త:
◆:- ఎస్ఐ రాజేందర్ రెడ్డి
జహీరాబాద్ నేటి ధాత్రి;
మీ పిల్లల పేర్లు చెప్పి, వారు ఏడుస్తున్న శబ్ధాన్ని మీకు వినిపించే అవకాశం ఉందన్న మానసిక ఆందోళనకు గురై భయపడవద్దని అత్యాశ, భయం..ఈ రెండే సైబర్ మారుతున్నాయని వ్యాఖ్య మీ పిల్లలను కిడ్నాప్ చేశామంటూ పోలీసుల పేరుతో వచ్చే నకిలీ ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని జహీరాబాద్ నియోజకవర్గ మొగుడంపల్లి మండల చారక్ పల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ రాజేందర్ రెడ్డి సూచించారు.మీ పిల్లల పేర్లను చెప్పి, వారు ఏడుస్తున్న శబ్దాన్ని మీకు వినిపిస్తే మానసికంగా ఆందోళనకు గురై భయపడవద్దని విజ్ఞప్తి చేశారు. అత్యాశ, భయం.. ఈ రెండే సైబర్ నేరగాళ్లకు వరంగా మారుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ నేరాలకు అడ్డుకట్ట వేయాలంటే అవగాహనతో కూడిన అప్రమత్తత అవసరమని ఆయన అన్నారు. మీ పిల్లలు, బంధువుల వ్యక్తిగత విషయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సామాజిక మాధ్యమాల్లో పంచుకోవద్దని సూచించారు. బెదిరింపు కాల్స్ వస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ రాజేందర్ రెడ్డి సూచన చేశారు. ఈ మేరకు హెల్ప్ లైన్ నెంబరు పంచుకున్నారు. హెల్ప్ లైన్ నెంబర్ 1930కు కాల్ చేయలిa
దీపావళి సందర్భంగా స్పెషల్ ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు, గిఫ్ట్ లింకులు అంటూ సోషల్ మీడియా, మెసేజ్లు, ఈమెయిల్లు, వెబ్సైట్ల ద్వారా ప్రజలను మోసం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని. సైబర్ నేరగాళ్లు నకిలీ వెబ్సైట్లు సృష్టించి, బ్యాంక్ వివరాలు, ఓటిపి లు, యూపీఐ పిన్లు తీసుకొని ఖాతాల్లోని డబ్బులను దోచుకుంటున్నారని అన్నారు.
హెచ్చరిక: అక్టోబర్ 1 నుండి ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 390 మంది మోసపోయి రూ. 8.5 లక్షల వరకు నష్టం కలిగిందని తెలిపారు.
సైబర్ మోసగాళ్ల విధానం:
నకిలీ షాపింగ్ వెబ్సైట్లు, సోషల్ మీడియా ప్రకటనల ద్వారా ప్రజలను ఆకర్షించడం.
వాట్సాప్, ఎస్ ఎం ఎస్, టెలిగ్రామ్ ద్వారా ఫిషింగ్ లింకులు పంపడం.
యాప్ డౌన్లోడ్ చేయమని చెప్పి బ్యాంక్ వివరాలు సేకరించడం.
గూగుల్లో నకిలీ కస్టమర్ కేర్ నంబర్లు చూపించడం జరుగుతుందని గుర్తు చేశారు.
జిల్లా ప్రజలకు సూచనలు:
ధృవీకరించిన వెబ్సైట్లు మరియు అధికారిక యాప్స్ ద్వారానే కొనుగోలు చేసుకోవాలని సూచించారు.
టెలిగ్రామ్ లేదా ఇతర లింక్ల ద్వారా ఏపీకె ఫైల్స్ డౌన్లోడ్ చేయ వద్దని తెలిపారు.
ఎవరికీ బ్యాంక్ వివరాలు, ఓటిపి లు యూపీఐ పిన్లు పంచుకోవద్దని తెలిపారు.
ముందుగానే చెల్లింపులు చేయకుండా, “ క్యాష్ ఆన్ డెలివరీ” సదుపాయాన్ని వినియోగించుకోవాలని తెలిపారు..
ఎలాంటి మోసాలు జరిగిన వెంటనే 1930 నంబరుకు కాల్ చేయండి లేదా వెబ్సైట్లో ఫిర్యాదు చేయండని సూచించారు. మోసపోకుండా జాగ్రత్త అవగాహనే రక్షణ.”
గుంపల్లి మునీశ్వర్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు
పరకాల నేటిధాత్రి
పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ రైతు భవన్ లో ఏఐటీయూసీ హమాలి యూనియన్ అవగాహన సదస్సు కార్మిక యూనియన్ అధ్యక్షులు లంకదాసర అశోక్ అధ్యక్షతనలో ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా గుంపల్లి మునీశ్వర్ కార్మిక రాష్ట్ర అధ్యక్షులు హాజరయ్యారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మన కార్మికుల పరిస్థితి మరింత అద్వానంగా ఉన్నదని ఏఐటియుసి పోరాటాలతో 50 కిలోల బస్తాలు వచ్చాయని హమాలి కార్మికులు తమ రక్తాన్ని చెమటగా మార్చి కష్టించి పనిచేస్తున్న ప్రభుత్వం నుండి తగిన ఆదరణ లేకపోవడం దారుణమని అన్నారు.బరువులు మోసేటప్పుడు లారీల నుండి దించేటప్పుడు ఎత్తేటప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయని కాళ్లు చేతులు విరిగిన ప్రాణాలు పోయినా ప్రభుత్వం ఆదుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ముఠా జట్టు హమాలీల సంక్షేమ బోర్డును పునర్దించాలని మన మార్కెట్లో దడ్వాయిలు,కాంట్రవెస్తూ అటు రైతులకు హమాలి కార్మికులకు చేదోడు వాదోడుగా
ఉంటున్నారు.మార్కెట్లో ప్రధానంగా మార్కెట్ యార్డ్ లో పనిచేసే వారందరూ రెక్కలు ముక్కలు చేసుకొని డొక్కలు ఎండి చాలీచాలని ఆదాయంతో బతుకుతున్నారని అన్నారు. మార్కెట్లో పనిచేసే హమాలీ దడువాయి,గంపకూలి కార్మికులకు పని భద్రత కల్పించాలని,రైతు ప్రజా కార్మిక వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేసి నాలుగు కార్మికులకు ప్రమాద బీమా నష్టపరిహారం మూడు లక్షల నుండి 10 లక్షలకు పెంచాలని మార్కెట్లో పనిచేస్తున్న వారందరికీ లైసెన్స్ గుర్తింపు కార్డులు ఇవ్వాలని మరియు కార్మికులందరికీ 3000 యూనిఫామ్ ను ప్రతి సంవత్సరం ఇవ్వాలని,మార్కెట్ యార్డ్ కార్మికుల లైసెన్స్ రెన్యువల్ చేసి 58 నుంచి 60 సంవత్సరాలకు ఇన్సూరెన్స్ వర్తించేలా చర్యలు తీసుకోవాలన్నారు.మార్కెట్ యార్డుల పాలకవర్గంలో కార్మికుల నుంచి ఇద్దరికీ డైరెక్ట్ గా అవకాశం కల్పించాలని యార్డులో క్యాంటీన్ మంచినీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ యొక్క సమావేశంలో ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి జక్కు రాజ్ గౌడ్,ఏ ఐ టి యు సి హనుమకొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లంక దాసరి అశోక్,కార్మిక నాయకులు కోడే పాక ఐలయ్య,కోకిల శంకర్, కోట యాదగిరి,రేణిగుంట రాజయ్య,బొట్ల భద్రయ్య,మోరే రవి,ధార్వా యూనియన్ అధ్యక్షులు ప్రభాకర్,గంపకూలి లచ్చమ్మ తదితర కార్మికులు నాయకులు పాల్గొన్నారు.
చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ఆవరణంలో పత్తి సాగు చేసిన రైతులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా విక్రయాలు చేసేలా ప్రభుత్వ చర్యలు తీసుకుంటుందని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గుమ్మడి శ్రీదేవి శుక్రవారం స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఆవరణలో పత్తి విక్రయాలపై సూచనలతో కూడిన వాలు పోస్టర్లను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పత్తి రైతులు ముందస్తు కపాస్ కిసాన్ స్లాట్ బుకింగ్ చేసుకొని సమీపంలో మిల్లుల వద్ద విక్రయించుకోవాలని పంట నమోదు తో పాటు బ్యాంకుకు తమ ఆధార్ కార్డును లింకు చేసుకోవాలని సూచించారు దళారులకు పత్తి అమ్మి రైతులు మోసపోవద్దని ఆమె తెలిపినారు, ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ కార్యదర్శి షరీఫ్ సూపర్వైజర్ రాజేందర్ రైతు సోదరులు మరియు మార్కెట్ కమిటీ సిబ్బంది పడిదెల దేవేందర్ అల్లం సమ్మయ్య పాల్గొన్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆదర్శ పాఠశాల కళాశాలలో సిపిఆర్ పై అవగాహన వారోత్సవాల సందర్భంగా జీవీకే ఈఎంఆర్ఐ 108 అంబులెన్స్ సిబ్బంది చిట్యాల వారి ఆధ్వర్యంలో శుక్రవారం సిపిఆర్ పై అవగాహన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 108 అంబులెన్స్ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ నగేష్ కుమార్ స్వయంగా సిపిఆర్ చేసి విద్యార్థులకు చూపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సిపిఆర్ కార్డియో ఫల్మనరీ రీసెస్సిటేషన్ తో ప్రాణాలు కాపాడొచ్చు అన్నారు. సిపిఆర్ అనేది ఒక అత్యవసర ప్రాణ రక్షణ పద్ధతి అని ఎవరికైనా శ్వాస తీసుకోవడం గుండె కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు మెదడు ఇతర ముఖ్య అవయవాలకు రక్తాన్ని ఆక్సిజన్ ను సరఫరా చేయడానికి ఇది సహాయపడుతుందని తెలిపారు. సిపిఆర్ లో ప్రధానంగా చాతిని గట్టిగా వేగంగా నొక్కడం గుండెపోటు వచ్చిన వ్యక్తికి తక్షణమే అందించవలసిన అత్యవసర చికిత్స అని తెలిపారు. అకస్మాత్తుగా కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు సిపిఆర్ చేసి ప్రమాదం నుంచి కాపాడవచ్చు అన్నారు. కార్డియాక్ అరెస్ట్ అయితే 108 అంబులెన్స్ కు సమాచారం ఇస్తూనే వాహనం వచ్చేవరకు సిపిఆర్ చేస్తే ప్రాణాలు దక్కుతాయి అని తెలిపారు. అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తికి సిపిఆర్ చేసే విధానం పై విద్యార్థులకు నగేష్ కుమార్ అవగాహన కల్పించారు. సిపిఆర్ పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ సందర్భంగా 108 టెక్నీషియన్ నగేష్ కుమారును పైలెట్ రాజు ను స్కూల్ యాజమాన్యం అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ పాఠశాల కళాశాల ప్రిన్సిపాల్ మేకల రమేష్ ఉపాధ్యాయులు రాకేష్ 108 పైలెట్ రాజు తదితరులు పాల్గొన్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆదర్శ పాఠశాల కళాశాలలో సిపిఆర్ పై అవగాహన వారోత్సవాల సందర్భంగా జీవీకే ఈఎంఆర్ఐ 108 అంబులెన్స్ సిబ్బంది చిట్యాల వారి ఆధ్వర్యంలో శుక్రవారం సిపిఆర్ పై అవగాహన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 108 అంబులెన్స్ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ నగేష్ కుమార్ స్వయంగా సిపిఆర్ చేసి విద్యార్థులకు చూపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సిపిఆర్ కార్డియో ఫల్మనరీ రీసెస్సిటేషన్ తో ప్రాణాలు కాపాడొచ్చు అన్నారు. సిపిఆర్ అనేది ఒక అత్యవసర ప్రాణ రక్షణ పద్ధతి అని ఎవరికైనా శ్వాస తీసుకోవడం గుండె కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు మెదడు ఇతర ముఖ్య అవయవాలకు రక్తాన్ని ఆక్సిజన్ ను సరఫరా చేయడానికి ఇది సహాయపడుతుందని తెలిపారు. సిపిఆర్ లో ప్రధానంగా చాతిని గట్టిగా వేగంగా నొక్కడం గుండెపోటు వచ్చిన వ్యక్తికి తక్షణమే అందించవలసిన అత్యవసర చికిత్స అని తెలిపారు. అకస్మాత్తుగా కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు సిపిఆర్ చేసి ప్రమాదం నుంచి కాపాడవచ్చు అన్నారు. కార్డియాక్ అరెస్ట్ అయితే 108 అంబులెన్స్ కు సమాచారం ఇస్తూనే వాహనం వచ్చేవరకు సిపిఆర్ చేస్తే ప్రాణాలు దక్కుతాయి అని తెలిపారు. అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తికి సిపిఆర్ చేసే విధానం పై విద్యార్థులకు నగేష్ కుమార్ అవగాహన కల్పించారు. సిపిఆర్ పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ సందర్భంగా 108 టెక్నీషియన్ నగేష్ కుమారును పైలెట్ రాజు ను స్కూల్ యాజమాన్యం అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ పాఠశాల కళాశాల ప్రిన్సిపాల్ మేకల రమేష్ ఉపాధ్యాయులు రాకేష్ 108 పైలెట్ రాజు తదితరులు పాల్గొన్నారు.
వ్యాధి నివారణ కార్యక్రమములో పాల్గొన్న అడిషనల్ కలెక్టర్
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండల కంబాలపల్లి లో పశువుల గాలి కుంటూ వ్యాధి నివారణ కార్యక్రమములో పాల్గొన్న ఝరాసంగం మండల పెద్దలు, నాయకులు ఇట్టి కార్యక్రమనికి సంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ ముఖ్య అతిధి గా హాజరయ్యరు.ఇట్టి కార్యక్రమములో ఝరాసంగం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హనుమంతరావు పాటిల్, ఆలయ చైర్మన్ శేఖర్ పాటిల్,సీనియర్ నాయకులు సంగ్రామ్ పాటిల్, మారుతీరావు పాటిల్, వేణుగోపాల్ రెడ్డి,కొల్లూరు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డప్పూరు సంగమేష్, వనంపల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నవీన్ పాటిల్, యూత్ కాంగ్రెస్ ఝరాసంగం మండల ప్రధాన కార్యదర్శి చింతలగట్టు శివరాజ్, వినయ్ చిన్న,పాండు ముధిరాజ్,తెలంగాణ వాణి రిపోర్టర్ నాగన్న,బ్యాంక్ మిత్ర సంజీవ్,పశువులు వైద్యులు జెడి , మరియు మండల సిబ్బంది,డాక్టర్ జాన్ శ్రీకాంత్,మరియు గ్రామప్రజలు రైతులు పాలుగొన్నారు.
జగిత్యాల ఇందిరా భవన్ లో మాజీ మంత్రివర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి సోమవారం విలేకరుల సమావేశం
రాయికల్, అక్టోబర్ 13, నేటి ధాత్రి:
అధిక లాభాపేక్షతో పెట్టుబడులు పెట్టి అమాయక ప్రజలు మోసపోతున్నారు.
ఫేక్ యాప్ ల ద్వారా అధిక లాభాపేక్షను ఎర చూపి, గ్రామీణ ప్రజలతో పాటు వివిధ హోదాల్లో ఉన్నవారు సైతం మెట్ ఫండ్, యు బిట్ లలో చైన్ విధానంలో పెట్టుబడులు పెట్టి మోసపోతున్నారు.
పెట్టుబడి దారులకు విదేశీ టూర్లు, లక్సరీ వసతుల పేరిట అమాయక ప్రజలు ఆకర్షితులు అవుతున్నారు.
గతంలో ఫైనాన్స్ కంపెనీలు రెగ్యులేటరీ లేదు..ప్రస్తుతం క్రిప్టో కరెన్సీ పేరిట నకిలీ యాప్లు, వెబ్సైట్లు విస్తరించాయి.
ఆర్ బి ఐ అనుమతులు లేకుండా చేపట్టే ఏ ఆర్థిక కార్యక్రమాలు అయినా చట్ట విరుద్ధమే.
కేవలం జగిత్యాల జిల్లా లోనే సుమారు 1000 కోట్లు మోసపోయినట్లు లెక్కలు చెబుతున్నాయి.
పెట్టుబడులు పెట్టిన వారికి ఏవిధమైన రశీదులు లేకుండానే పెట్టుబడులు పెడుతున్నారు.
క్షణాల వ్యవధిలో యాప్ లు తొలగిస్తూ ఆధారాలు లేకుండా చేస్తున్నారు.
జగిత్యాల పోలీసు యంత్రాంగం కేసులు నమోదు చేయడం అభినందించదగ్గ విషయం.
నకిలీ యాప్ లలో పెట్టుబడులు పెట్టీ మోసపోయిన వారు పోలీసుల దృష్టికి వచ్చేది ఒక్క శాతం కూడా లేదు.. ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదు..
రాష్ట్ర ప్రభుత్వం గంజాయి, జూదం అరికట్టేందుకు చర్యలు చేపడుతోంది.
చట్ట పరమైన చర్యలు తీసుకోవడం తో పాటు, రికవరీ అవుతుందో లేదో అని భయపడి కేసు పెట్టేందుకు ముందుకు రావడం లేదు.
నకిలీ యాప్ లలో అమాయక ప్రజలను పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించిన వారి ఆస్తులు జప్తు చేయాలి.
పోలీసులు కేసులు నమోదు చేయడంతోపాటు రికవరీ చేస్తామనే విశ్వాసం బాధితుల్లో కల్పిస్తేనే ఫిర్యాదు చేసేందుకు ముందుకు వస్తారు.
రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు తగ్గిపోయి, ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది.
ఆర్ బి ఐ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఆర్థిక కార్యకలాపాలు దేశ ఆర్థిక వ్యవస్థ పై ప్రభావం చూపుతుంది.
దేశ రక్షణ తో పాటు ఆర్థిక వ్యవస్థ రక్షణ కూడా ప్రధానం.
రాష్ట్ర పరిధిలో ఏ మేరకు నిలుపుదల చేస్తాం.. అని పరిశీలించి ఆర్థిక మోసాలు అరికట్టేలా చర్యలు చేపట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
కేంద్ర హోమ్ శాఖ, ఆర్థిక శాఖ సైతం నకిలీ యాప్ లు, వెబ్సైట్ లలో పెట్టుబడులను అరికట్టేలా చొరవ తీసుకోవాలి..
నకిలీ యాప్ లలో పెట్టుబడులు పెట్టీ మోసపోవడం జగిత్యాల జిల్లాకే పరిమితం కాలేదు. బాధితులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు.
పోలీసులు ప్రత్యేక చొరవ తీసుకొని, ఆర్థిక నేరాలు చేసిన వారి ఆస్తులు జప్తు చేయాలి.
పోలీసులు సుమోటోగా విచారణ చేపట్టాలి..
రాష్ట్ర స్థాయిలో పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి, ఆర్థిక నేరాల వ్యవహారాలను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి కి విజ్ఞప్తి చేస్తున్న..
శాయంపేట మండల కేంద్రంలో గల గ్రామపంచాయతీ ఆవర ణంలో ఐదుసంవత్సరాల లోపు చిన్నారు లందరికీ తప్పకుండా పోలియో చుక్కలు వేయించుకోవాలని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు భూపాలపల్లి నియోజక వర్గం గ్రామపంచాయతీ కార్యాల యంలో నిర్వహించిన పోలి యో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అనంతరం చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేస్తూ, చిన్నారుల ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం ప్రతి తల్లిదం డ్రులు తమ పిల్లలకు రెండు పోలియో చుక్కలు వేయాలని పిలుపు నిచ్చారు ఎమ్మెల్యే మాట్లాడుతూ పోలియో రహిత సమాజం నిర్మాణం మన అందరి బాధ్యత
ఈ మహత్తర లక్ష్యం సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి ఈ కార్యక్రమంలో వైద్య అధికారులు, ఆశా కార్యకర్తలు,స్థానిక ప్రజలు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం:-
వరంగల్, నేటిధాత్రి, (లీగల్):-
శుక్రవారం నాడు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం (వరల్డ్ మెంటల్ హెల్త్ డే) ను పురస్కరించుకొని, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, వరంగల్ కార్యదర్శి యం.సాయి కుమార్ అధ్యక్షతన “మిషనరీస్ ఆఫ్ ఛారిటి”, కాశిబుగ్గ, వరంగల్ లోని మేథో దివ్యాంగులైన చిన్నారులకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ మరియు వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బి.నిర్మలా గీతాంబ హాజరై, మాట్లాడుతూ “మానసిక దివ్యాంగులను చేరదీసి, వారిని ఏ విషయంలోనూ తక్కువ చేసి చూడొద్దన్నారు.
దివ్యాంగులకు సేవ చేస్తున్న సిబ్బందిని అభినందించారు. న్యాయ సేవలు, సహకారం కోసం న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలన్నారు. భవిష్యత్తులో వీరికి కావలసిన అన్ని రకాల వైద్య సేవలకు మమ్మల్ని సంప్రదించవచ్చునని అన్నారు. ఈ సందర్భంగా మేథో దివ్యాంగులకు పండ్లు, స్వీట్లను అందించి, వారితో కలిసి కాసేపు సరదాగా గడిపారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.సాయికుమార్, డిప్యూటి లీగల్ ఏయిడ్ కౌన్సిల్ శ్రీనివాసరావు, ఇంతెజార్గంజ్ సబ్ ఇన్స్పెక్టర్లు టీ.తేజ, ఎన్.వెంకటేశ్వర్లు డా.క్యూరీ, డా.అనూహ్య, సిస్టర్ సవీన మరియా, సిస్టర్ అంజలిక మరియా తదితరులు పాల్గొన్నారు.
స్థానిక సంస్థలలో బీసీలకు కల్పించే 42 శాతం రిజర్వేషన్ల ప్రయత్నాలను అడ్డుకోవద్దని కాకతీయ యూనివర్సిటీ బీసీ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ గడ్డం కృష్ణయ్య విజ్ఞప్తి చేసినారు.యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో జీవో నెంబర్ 9 పై తెలంగాణ హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో ప్రధాన కార్యదర్శి డాక్టర్ శ్రీలత ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ కృష్ణయ్య మాట్లాడుతూ స్థానిక సంస్థలలో బీసీల రిజర్వేషన్లను అడ్డుకోటానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి రిజర్వేషన్లను సాధించటానికి బీసీలు కూడా ఆ అడ్డుకునే ప్రయత్నాలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. 2013 లో, 2019లో, 2025 లో కూడా ఒకే వర్గానికి చెందిన వారు చట్టాలలో ఉన్న లోపాలను అడ్డం పెట్టుకుని బీసీ రిజర్వేషన్లను అడ్డుకునే ప్రయత్నం చేస్తూ బీసీలకు అన్యాయం చేస్తున్నారని అభిప్రాయపడినారు. వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ తండు నాగయ్య మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధనకి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకి కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించి రిజర్వేషన్ల సాధనకు సహాయ పడాలని విజ్ఞప్తి చేసినారు.ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎర్ర బొజ్జు రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ల సాధనకి బిల్లు పెట్టినా సవరణ బిల్లు పెట్టినా జీవో జారీచేసినా రిజర్వేషన్లు సాధించలేకపోయింది కాబట్టి ప్రభుత్వం పార్లమెంటరీ ప్రక్రియ ద్వారా రిజర్వేషన్లు సాధించే ప్రయత్నాలు చేయాలని అభిప్రాయపడినారు.ఉపాధ్యక్షులు డాక్టర్ బ్రహ్మయ్య మాట్లాడుతూ రిజర్వేషన్ల సాధనకి కాకతీయ యూనివర్సిటీ బీసీ టీచర్స్ పక్షాన భవిష్యత్తులో అనేక కార్యక్రమాలు చేపడతామని తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో బిసి టీచర్స్ అసోసియేషన్ కి చెందిన డాక్టర్ తిరునహరి శేషు, డాక్టర్ సుధీర్, డాక్టర్ వీరస్వామి డాక్టర్ సతీష్ డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ చింతం ప్రవీణ్, డాక్టర్ రాజు, డాక్టర్ కళ్యాణి, డాక్టర్ సునీత, డాక్టర్ విజయకుమార్, డాక్టర్ సునీత ,డాక్టర్ జోత్స్న, డాక్టర్ శ్రీధర్, డాక్టర్ గిరి, డాక్టర్ కిరణ్, డాక్టర్ కవిత, డాక్టర్ రాజేంద్రప్రసాద్, డాక్టర్ కుమార్ ,డాక్టర్ రమేష్, డాక్టర్ సదానందం, డాక్టర్ జె పి, డాక్టర్ నరేష్ తదితరులు పాల్గొన్నారు.
కేసముద్రం మండలంలోని అంగన్వాడి కల్వల క్లస్టర్ లోని పిక్లా తండా శివారు బోడగుట్ట తండా అంగన్వాడి సెంటర్లో గురువారం పోషణ మాసోత్సవం కార్యక్రమం నిర్వహించారు ఇందులో పోషకాలను అందించే 20 రకాల పిండి వంటలు, కొత్త రకమైన వంటకాలు, అలంకరణ బాగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా అంగన్వాడి సూపర్వైజర్ ఎస్ ప్రేమ జ్యోతి మాట్లాడుతూ… చిన్నపిల్లలకు ఎలాంటి జంక్ ఫుడ్ ఇవ్వవద్దని, నూనె పదార్థాలు, చక్కెర, చిప్స్ వంటి వాటికి దూరంగా ఉంచాలన్నారు. గర్భిణీ స్త్రీలు ప్రతినెల పరీక్ష చేయించుకుని తగిన పోషకాహారం తీసుకోవాలన్నారు. గర్భిణిగా ఉన్నప్పుడు మంచి ఆహారం తీసుకుంటే ఆరోగ్యవంతమైన బేబీ జన్మిస్తుందని చెప్పారు. పిల్లల పెరుగుదల విషయంలో ఎప్పటికప్పుడు పోషకాహారం అందిస్తూ ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలన్నారు. ఈ సందర్భంగా వివిధ రకాల ఆహార పదార్థాలను చిరుధాన్యాలతో తయారుచేసి పిల్లలకు అందించారు. హాజరైన వారందరితో పోషకాహారం పై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం గనె యాదగిరి, కార్యదర్శి ఇ.నివాస్ రెడ్డి, టీచర్ గానె పావన, క్లస్టర్ లోని అంగన్వాడి టీచర్లు జీ. నీల, టి. వాణి, ఈ. జ్యోతి, బి. సునీత, బి. స్వప్న, జి. పద్మ, ఆశ వర్కర్లు ఎం. నాగలక్ష్మి, ఎస్. ఉపేంద్ర, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, గ్రామస్తులు, పిల్లలు పాల్గొన్నారు.
ఫిలాటెలి డే సందర్భంగా తపాలా కార్యాలయం సందర్శించిన షైన్ స్కూల్ విద్యార్థులు
నేటిధాత్రి, వరంగల్:
Vaibhavalaxmi Shopping Mall
ఫిలాటెలి డే సందర్భంగా హనుమకొండ రాంనగర్లోని షైన్ ఉన్నత పాఠశాల ఎలైట్ క్యాంపస్ విద్యార్థులు స్థానిక తపాలా కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు పోస్టల్ స్టాంపులను తిలకించి, తపాలా కార్యాలయంలో అందిస్తున్న సేవల గురించి అవగాహన పొందారు. ఈ కార్యక్రమాన్ని ఏఎస్పీ మూల రమాదేవి, పోస్ట్ మాస్టర్ పవన్ కుమార్, పోస్టల్ సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించారు. షైన్ విద్యాసంస్థల చైర్మన్ మూగల కుమార్ యాదవ్, డైరెక్టర్లు కవిత, రమ, ప్రిన్సిపల్ ప్రగతి రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు నవదీప్ తదితరులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.