పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన ధరలు…

పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన ధరలు

 

గత కొన్నిరోజుల నుంచి పెరుగుతూ పోయిన బంగారం ధరలు శుక్రవారం కాస్త తగ్గి పసిడి ప్రియులకు కొంత ఊరటనిచ్చాయి. కానీ, ఈ రోజు బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.

ముంబై, జనవరి 17: పేద, మధ్య తరగతి వారికి బంగారం అందని ద్రాక్షలాగా మారిపోయింది. రోజు రోజుకు బంగారం ధరలు పెరుగుతూ పోతున్నాయి. మధ్యలో కొంత తగ్గినా ఆ వెంటనే ఊహించని విధంగా పెరుగుతున్నాయి. గత కొన్నిరోజుల నుంచి పెరుగుతూ పోయిన బంగారం ధరలు శుక్రవారం తగ్గాయి. పసిడి ప్రియులకు కొంత ఊరటనిచ్చాయి. నిన్న స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,43,400 దగ్గర ట్రేడ్ అయింది. కానీ, ఈ రోజు బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.

పుత్తడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు….

పుత్తడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు

 

తాజాగా మరోసారి బంగారం, వెండి ధరలు మరోసారి పెరిగాయి. శుక్రవారం ఒక్క రోజులోనే తులం బంగారం రూ.3,770 పెరిగింది.అంతర్జాతీయంగా కీలక పరిణామాలు, దీపావళి పండుగ దృష్ట్యా దేశంలో బంగారం ధరలు ఆకాశాన్నంటున్నాయి. తాజాగా మరోసారి బంగారం, వెండి ధరలు పెరిగాయి. శుక్రవారం ఒక్క రోజులోనే తులం బంగారం రూ.3,770 పెరిగింది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,35,180 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,690గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1,85,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు అమలులో ఉంటాయి.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version