సెయింట్ జోసెఫ్ హైస్కూల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు…

సెయింట్ జోసెఫ్ హైస్కూల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు

రామకృష్ణాపూర్,నేటిధాత్రి:

 

రామకృష్ణాపూర్ పట్టణంలోని సెయింట్ జోసెఫ్ హైస్కూల్లో శుక్రవారం ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులు, ఉపాధ్యాయినీయులు,రంగవల్లులు వేసి సంక్రాంతి పండుగ యొక్క విశిష్టతను చాటిచెప్పారు.
విద్యార్థులు సంప్రదాయ పండుగ వాతావరణాన్ని సృష్టించగా, పాఠశాల యాజమాన్యం సంక్రాంతి పండుగ ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన పెంపొందుతుందని విద్యార్థులకు ఉపాధ్యాయులు తెలిపారు.

మద్ది మేడారాన్ని సందర్శించిన కలెక్టర్ సత్య శారద.

మద్ది మేడారాన్ని సందర్శించిన కలెక్టర్ సత్య శారద.

#అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు సమన్వయంతో జాతరను దిగ్విజయం చేయాలి.

#ప్లాస్టిక్ రహిత జాతరగా మద్ది మేడారాన్ని నిలపాలి.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

ప్లాస్టిక్ రహితంగా మద్ది మేడారం జాతరను అధికారులు, ఆలయ కమిటీ సమన్వయంతో ముందుకు సాగి జాతరను దిగ్విజయం చేసే విధంగా కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు. బుధవారం మండలంలోని నాగరాజు పల్లి గ్రామ శివారులో ప్రతి రెండేళ్లకోసారి జరిగే సమ్మక్క సారలమ్మ జాతర ఆలయాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ మేరకు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అధికారుల సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ జాతర సమయంలో భక్తులకు తాగునీరు, రవాణా సౌకర్యం, వైద్యం అందుబాటులో ఉండే విధంగా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అన్ని శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు పోలీస్ బందోబస్తు నిర్వహిస్తూ భక్తులను అప్రమత్తంగా ఉండే విధంగా చూడాలని పోలీస్ శాఖకు ఆదేశించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ గాదె సుదర్శన్ జాతరలో మౌలిక వసతుల కోసం ప్రభుత్వం తరఫున మరిన్ని నిధులు ఇప్పిస్తే ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా జాతరను సజావుగా సాగే విధంగా ఆలయ కమిటీ కృషి చేస్తుందని కలెక్టర్కు విన్నవించగా స్పందించిన కలెక్టర్ సంబంధిత మంత్రిత్వ శాఖతో మాట్లాడి జాతరకు నిధులు మంజూరు చేసే విధంగా కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ ముప్పు కృష్ణ, ఎంపీడీవో శుభ నివాస్, నాగరాజు పల్లి సర్పంచ్ ఎరుకల లలిత, మామిండ్ల వీరేపల్లి సర్పంచ్ ఏడాకుల సరోజన, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి, పంచాయతీరాజ్ శాఖ , విద్యుత్ శాఖ అధికారులు, గ్రామ కార్యదర్శులు, పోలీస్ సిబ్బంది, ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

వనపర్తి లో ఘనంగా దత్త జయంతి ఉత్సవాలు..

వనపర్తి లో ఘనంగా దత్త జయంతి ఉత్సవాలు

వనపర్తి నేటిదాత్రి .

 

వనపర్తి జిల్లా కేంద్రంలో శ్రీ దత్త జయంతి సందర్భంగా ఆలయంలో హోమం అభిషేకాలు భక్తులచే ఘనంగా నిర్వహించామని ఆలయ పురోహితులు చల్ల వెంకటేశ్వర శర్మ సలహాదా పాండు శెట్టి ఒక ప్రకటనలో తెలిపారు . భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు అన్న ప్రసాదం స్వీకరించారని వారు పేర్కొన్నారు అన్నప్రసాదానికి ఆలయానికి సహకరించిన దాతలకు వారు ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు

కుంకుమేశ్వర ఆలయంలో ఘనంగా కార్తీక పౌర్ణమి….

కుంకుమేశ్వర ఆలయంలో ఘనంగా కార్తీక పౌర్ణమి

ఆలయంలో దీపకాంతులతో ప్రత్యేక పూజలు

పరకాల,నేటిధాత్రి

 

కార్తీకపౌర్ణమి సందర్బంగా బుధవారం రోజున పట్టణంలోని శ్రీ భవాని కుంకుమేశ్వర ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఎంతో ఘనంగా నిర్వహించబడ్డాయి.

ఆలయ ప్రాంగణం తెల్లవారుజాము నుంచే భక్తులతో కిక్కిరిసి పోయింది.భక్తులు పవిత్ర స్నానాలు చేసి శివారాధన, దీపారాధన,కార్తీక నోములు నిర్వహించారు.హిందూ సంప్రదాయంలో కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైనదిగా చెప్పుకుంటారు.ఈ రోజున శివుడికి భక్తులు ప్రత్యేక పూజలలతో ఆలయాలు దీపకాంతులతో వెలిగిపోతాయి,శివాలయాలు శివనామ స్మరణతో మారుమోగుతాయి.ప్రత్యేక పూజలు,అభిషేకాలు, అనంతరం దీప వత్తులతో దీపాలను వెలిగించడం వంటి వైదిక కార్యక్రమాలలో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేకంగా శివకేశవ పూజలను నిర్వహిస్తారు.కార్తీక పౌర్ణమి రోజు నదీ తీరాల్లో పవిత్ర స్నానం చేసిఉపవాసం ఆచరిస్తూ,దీపారాధన జరిపితే చాలు,శివుని కటాక్షం లభిస్తుందని భక్తులు నమ్ముతున్నారు.

ఘనంగా కౌండిన్య మహర్షి జయంతి జాతీయ వారోత్సవాలు…

ఘనంగా కౌండిన్య మహర్షి జయంతి జాతీయ వారోత్సవాలు

నర్సంపేట,నేటిధాత్రి:

 

కార్తీక పౌర్ణమి రోజున జన్మించిన గౌడ కులగోత్రం,గౌడవంశం మూల పురుషుడు కౌండిన్య మహర్షి జయంతి జాతీయ వారోత్సవాలను గౌడ కుల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గోపా వరంగల్ జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు రామగోని సుధాకర్ గౌడ్ నర్సంపేట పట్టణంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి యుగంలో ప్రకృతి వైపరీత్యాలు, భయంకరమైన వినాశకరమైన విపత్తులు వచ్చినప్పుడు మానవ వినాశనం, దైవ వినాశనం, వృక్ష వినాశనం నుంచి ప్రజల్ని కాపాడడం కోసం అవతరించిన పరమేశ్వర ప్రసాది కౌండిన్య మహాముని అని పేర్కొన్నారు. దైవ గౌడ జాతి ఆవిర్భావానికి మూలపురుషుడు గౌడ గోత్రదారి నేటికీ ఏకకుల గోత్రనామ దయంతో దేశవ్యాప్తంగా గౌడ జాతి పిలవబడుతుందని తెలిపారు.కార్తీకమాసంలో గౌడ కుల గోత్ర పూజ, గౌడ కులదైవాలను ప్రసన్నం చేసుకొని అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో సకల సంపదలతో దేశవ్యాప్తంగా వర్ధిల్లేల ఆశీర్వదించే పవిత్రదినం కార్తీక పౌర్ణమి రోజు అని తెలియజేశారు.అనంతరం శుభాకాంక్షలు తెలిపారు.

ఘనంగా నాగుల చవితి….

ఘనంగా నాగుల చవితి.

#ప్రత్యేక పూజలు నిర్వహించిన పురోహితుడు శ్రీనివాస్ శర్మ.

#భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించిన మహిళలు.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలోని అభయ నాగేంద్ర స్వామి ఆలయంలో పూజారి శ్రీనివాస్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ఆలయానికి చేరుకొని పుట్టలో పాలు పోసి నాగేంద్ర స్వామికి పూజలు గ్రామ ప్రజలతోపాటు మండలంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో విరజిల్లుతూ. ఇలాంటి దోషాలు లేకుండా కాపాడాలని పలువురు మహిళలు కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సీనియర్ నాయకుడు గందె శ్రీనివాస్ గుప్తా , కోటగిరి నారాయణ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

లైసెన్స్ లేకుండా టపాసులు విక్రయించవద్దు…

లైసెన్స్ లేకుండా టపాసులు విక్రయించవద్దు

భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే

భూపాలపల్లి నేటిధాత్రి

 

టపాసులు విక్రయించాలనుకునేవారు తెలంగాణ ఎక్స్ ప్లోజివ్స్ యాక్ట్ 1884, రూల్స్ 2008 ప్రకారం సరైన లైసెన్స్ పొందడం తప్పనిసరని, లైసెన్స్ లేకుండా విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖారే హెచ్చరించారు. దీపావళి పండుగ నేపథ్యంలో జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే శనివారం జిల్లా కేంద్రంలోని టపాసుల విక్రయదారుల షాపులను పర్యవేక్షించి ప్రజలకు, విక్రయదారులకు ముఖ్య సూచనలు చేశారు
సందర్భంగా వారు మాట్లాడుతూ టపాసుల షాపులు జనం రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలు, ట్రాఫిక్ బిజీ ఏరియా, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్‌ల పక్కలో, పెట్రోల్ బంకుల సమీపంలో ఏర్పాటుచేయకూడదన్నారు. సురక్షిత, అనుమతించబడిన ప్రాంతాల్లోనే షాపులు ఏర్పాటు చేయాలని సూచించారు. తహసిల్దార్, ఫైర్ సర్వీస్, పోలీస్ శాఖ సూచించిన ప్రదేశాల్లో మాత్రమే లైసెన్స్ ఉన్న వ్యాపారులు షాపులు నిర్వహించాలని ఎస్పీ పేర్కొన్నారు. భద్రతా ప్రమాణాలు పాటించకుండా టపాసులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.
పిల్లలు టపాసులు కాల్చేటప్పుడు పెద్దల పర్యవేక్షణ తప్పనిసరని, భద్రతా నియమాలు పాటించి, ఈ దీపావళిని ఆనందంగా, ప్రమాద రహితంగా జరుపుకుందామన్నారు. డీఎస్పీ సంపత్ రావు, సీఐ నరేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

ఘనంగా పల్లకి సేవ

ఘనంగా పల్లకి సేవ

జహీరాబాద్ నేటి ధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

సంగారెడ్డి: జహీరాబాద్ మండలం హోతికే గ్రామ శివారులోని భవానీ మాత, మహేశ్వరి మాత మందిరంలో పౌర్ణమి సందర్భంగా పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. ఉదయం పూజా కార్యక్రమాల తర్వాత నిర్వహించిన పల్లకి సేవలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో అధికారులు, ప్రముఖులు పాల్గొని దేవీ ఆశీస్సులు పొందారు.

ఆనందోత్సాహాలతో మధ్య కౌండిన్యుల అభిషేకాలు…

 

ఆనందోత్సాహాలతో మధ్య కౌండిన్యుల అభిషేకాలు

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట పట్టణంలో గల పట్టణ గౌడ సంఘం ఆధ్వర్యంలో కంఠమహేశ్వర స్వామి ఉత్సవాలు రెండో రోజు ఆనందోత్సవాల మధ్య నిర్వహించారు. కౌండిన్యుల గోత్రం కలిగిన ప్రతి ఒక్కరూ కంఠమహేశ్వర స్వామి ఆలయానికి డప్పుచప్పుల్ల మధ్య ఇంటింటి నుంచి తరలివచ్చారు. ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు.పాలు, పెరుగు, నెయ్యి, పసుపు, కుంకుమ ,జలాలతో అభిషేకాలు చేశారు. తమ కుటుంబాలను చల్లంగా చూడాలని ఆ దేవున్ని ప్రార్థించారు. అంతకు ముందు పట్టణంలోని పలు వీధులలో పూజారులచే పలు విన్యాసాలు నిర్వహించారు.కొత్త వస్త్రాలను ధరించిన గౌడులు పట్టణంలోని వారి ప్రతి ఇంటి నుంచి బిందెలతో జలాలు మంగళహారతులతో తరలివచ్చి పూజలను నిర్వహించారు.పట్టణంలోని గౌడ సంఘం అధ్యక్షుడు కోలా వెంకటేశ్వర్లు గౌడ్, కార్యదర్శి మద్దెల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ పూజ వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించారు.ఆలయ కమిటీ భక్తుల సౌకర్యం కోసం పలు ఏర్పాట్లను చేసింది.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కోల వెంకటేశ్వర్లు గౌడ్, ప్రధాన కార్యదర్శి మద్దెల శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షులు గాదగొని సాంబయ్య గౌడ్, ఆర్ధిక కార్యదర్శులు నాతి సధానందం గౌడ్, గిరగాని కిరణ్ గౌడ్, డైరెక్టర్స్ తాళ్ళ పెళ్లి శ్రీనివాస్ గౌడ్, మొగల గాని సురేష్ గౌడ్, వేముల కృష్ట గౌడ్, గిరగాని రమేష్ గౌడ్, నాగేళ్లి ప్రమోద్ గౌడ్, చుక్క రవి గౌడ్, బొట్టు పెద్దమనిషి కొయ్యడి కొమురయ్య గౌడ్, సారుకోల పెద్దమనిషి గిరగాని చంద్రమౌళి గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ నాగేల్లి వెంకటనారాయణ గౌడ్, మాజీ కౌన్సిలర్ వేముల సాంబయ్య గౌడ్, గౌడ వెల్పేర్ అధ్యక్షులు గండి లింగయ్య గౌడ్, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు సోల్తి సారయ్య గౌడ్ ,మాజీ అధ్యక్షులు ఐలు సమ్మయ్య గౌడ్, చుక్క కనుకయ్య గౌడ్, గిరగాని సాంబయ్య గౌడ్ గండి రాము గౌడ్, కక్కెర్ల అశోక్ గౌడ్, గంధం చంద్రమౌళి గౌడ్, తాళ్ళ పెళ్ళి చంద్రమౌళి గౌడ్, కొయ్యడి సంపత్ గౌడ్, రామగోని సుధాకర్ గౌడ్, ఊడుగుల శ్రీనివాస్ గౌడ్, పంజాల రాజు గౌడ్, గ్రంధాలయ సంస్థ మాజీ డైరెక్టర్ గంప రాజేశ్వర్ గౌడ్, పుల్లూరి స్వామి గౌడ్ వల్లాల శ్రీహరి గౌడ్, వీరయ్య గౌడ్, వేముల రవి గౌడ్, సీనియర్ రిపోర్టర్స్ కారుపోతుల విజయ్ కుమార్ గౌడ్,బుర్ర వేణు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ముగిసిన దేవీ శరన్నవరాత్రులు…

ముగిసిన దేవీ శరన్నవరాత్రులు

బాలానగర్ /నేటి ధాత్రి

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని చిన్నరేవల్లి గ్రామంలో దేవీ శరన్నవరాత్రుల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగగా..శనివారం ముగిశాయి. ఈ సందర్భంగా అమ్మవారి వస్త్రాలను, పూర్ణ కలశమును వేలంపాట నిర్వహించారు. పూర్ణ కలశాన్ని సింగిల్ విండో మాజీ చైర్మన్ బత్తుల వెంకటరామ గౌడ్ వేలంపాటలో పాల్గొని కలశాన్ని రూ.51 వేలకు దక్కించుకున్నారు. అమ్మవారిని ప్రతిమను నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు భారీగా పాల్గొన్నారు.

దసరా శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర నాయకులు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి…

దసరా శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర నాయకులు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ ప్రజలకు రాష్ట్ర నాయకులు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. దుర్గామాత అనుగ్రహం కోసం.. నవరాత్రుల్లో 9 రోజులపాటు భక్తిశ్రద్ధలతో దుర్గామాతను పూజించి, చెడుపై.. మంచి, దుష్ట శక్తులపై.. దైవ శక్తుల విజయానికి ప్రతీకగా జరుపుకునే పండుగే విజయదశమి అన్నారు. దసరా పండుగ ధనిక పేద తేడా లేకుండా ప్రతి ఒక్కరి మధ్య స్నేహభావాన్ని పెంపొందించి సమాజం ఐక్యమత్యంతో ఉండేలా చేస్తుందని పేర్కొన్నారు. జహీరాబాద్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ముఖ్యంగా విద్య వైద్యం ప్రతి ఒక్కరికి చేరాలని తలంపుతో ప్రజా ప్రభుత్వం పనిచేస్తూ విద్యా వైద్యానికి పెద్దపీట వేస్తుందని తెలిపారు. పేదింటి బిడ్డలకు అత్యుత్తమ విద్య అందించాలని తలంపుతో ప్రారంభించరు ఈ సందర్భంగా ఉదాహరించారు. జహీరాబాద్ నియోజకవర్గ ప్రజలంతా సుఖ సంతోషాలతో దసరా ఉత్సవాలను జరుపుకోవాలని, ఆ జగన్మాత ఆశీస్సులతో ప్రజలంతా సుఖ శాంతులతో, సిరి సంపదలతో తులతూగాలని ఆ కనకదుర్గమ్మ అమ్మవారి దీవెనలు, ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

వైభవంగా చండీయాగం…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-01T141753.181.wav?_=1

వైభవంగా చండీయాగం

రాయికల్ అక్టోబర్ 1: నేటి ధాత్రి:

రాయికల్ పట్టణంలోని శ్రీ దుర్గా సేవా సమితి ఆధ్వర్యంలో బుధవారం దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా నిర్వహించిన చండీయాగం భక్తుల్ని ఆకట్టుకుంది. ఉదయం నుండి ప్రారంభమైన యాగ కార్యక్రమాలు మధ్యాహ్నం వరకు భక్తిశ్రద్ధలతో కొనసాగాయి. వేదపండితుడి మంత్రోచ్చారణల నడుమ జరిగిన యాగంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
భక్తులందరికీ యాగ దర్శనం కనుల విందుగా నిలిచింది. సమితి సభ్యులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, భక్తులకు ప్రసాదాలను అందజేశారు.

దసరా శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర నాయకులు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-01T141238.110.wav?_=2

 

దసరా శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర నాయకులు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ ప్రజలకు రాష్ట్ర నాయకులు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. దుర్గామాత అనుగ్రహం కోసం.. నవరాత్రుల్లో 9 రోజులపాటు భక్తిశ్రద్ధలతో దుర్గామాతను పూజించి, చెడుపై.. మంచి, దుష్ట శక్తులపై.. దైవ శక్తుల విజయానికి ప్రతీకగా జరుపుకునే పండుగే విజయదశమి అన్నారు. దసరా పండుగ ధనిక పేద తేడా లేకుండా ప్రతి ఒక్కరి మధ్య స్నేహభావాన్ని పెంపొందించి సమాజం ఐక్యమత్యంతో ఉండేలా చేస్తుందని పేర్కొన్నారు. జహీరాబాద్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ముఖ్యంగా విద్య వైద్యం ప్రతి ఒక్కరికి చేరాలని తలంపుతో ప్రజా ప్రభుత్వం పనిచేస్తూ విద్యా వైద్యానికి పెద్దపీట వేస్తుందని తెలిపారు. పేదింటి బిడ్డలకు అత్యుత్తమ విద్య అందించాలని తలంపుతో ప్రారంభించరు ఈ సందర్భంగా ఉదాహరించారు. జహీరాబాద్ నియోజకవర్గ ప్రజలంతా సుఖ సంతోషాలతో దసరా ఉత్సవాలను జరుపుకోవాలని, ఆ జగన్మాత ఆశీస్సులతో ప్రజలంతా సుఖ శాంతులతో, సిరి సంపదలతో తులతూగాలని ఆ కనకదుర్గమ్మ అమ్మవారి దీవెనలు, ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

విజయదశమి అందరికి విజయాలు చేకూర్చాలి…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-01T135810.401.wav?_=3

 

 

విజయదశమి అందరికి విజయాలు చేకూర్చాలి

జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐపీఎస్

జిల్లా ప్రజలకు,పోలీస్ అధికారులకు,సిబ్బందికి విజయదశమి శుభాకాంక్షలు

జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయుధ,వాహన పూజలు

సిరిసిల్ల టౌన్ : ( నేటిధాత్రి )

సిరిసిల్ల జిల్లాలో ఈరోజు విజయదశమి పండుగ ప్రజలకు అన్ని రంగాలలో విజయం చేకూర్చాలని ఎస్పీ ఆకాంక్షించారు.ఈరోజు జిల్లా పోలీసు కార్యాలయంలోని ఆర్ముడు రిజర్వ్ విభాగంలో ఆయుధ పూజ, వాహన పూజ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్పీ దుర్గా దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.విజయదశమి పర్వదినోత్సవం అందరికి సుఖ సంతోషాలు కలిగించాలని ఆకాంక్షించారు. ఈసందర్భంగా జిల్లా ప్రజలకు మరియు పోలీస్ అధికారులకు సిబ్బందికి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈపూజా కార్యక్రమాలలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, ఆర్.ఐ లుమధుకర్, యాదగిరి, సి.ఐ లు కృష్ణ,నాగేశ్వరావు,మధుకర్, శ్రీనివాస్, ఆర్.ఎస్.ఐ లు, ఎస్.ఐ లు సిబ్బంది పాల్గొన్నారు.

ఝరాసంగం మండల ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపిన…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-01T133811.880.wav?_=4

 

ఝరాసంగం మండల ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపిన

◆:- మండల ఎంఐఎం పార్టీ అధ్యక్షులు షేక్ రబ్బాని

జహీరాబాద్ నేటి ధాత్రి:

ప్రజలందరిలోనూ దసరా సంతోషాన్ని నింపాలని ఝరాసంగం మండల ఎంఐఎం పార్టీ అధ్యక్షులు షేక్ రబ్బాని పేర్కొన్నారు. దసరా నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. చెడుపై మంచికి విజయానికి ప్రతీకగా చేసుకునే దసరా పండగలో అందరి జీవితాల్లోనూ కొత్త వెలుగు నింపాలని కోరారు. శాంతియుత, అభివృద్ధి కారక సమాజం కోసం అందరూ కృషి చేయాలని ఆయన కోరారు.చెడుపై మంచి, దుష్టశక్తులపై దైవశక్తి విజయానికి ప్రతీక దసరా అని, చెడు ఎంత దుర్మార్గమైనా, శక్తిమంతమైనా అంతిమ విజయం మంచినే వరిస్తుందని ఎంఐఎం పార్టీ మండల అధ్యక్షులు షేక్ రబ్బాని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు ఆయన దసరా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా సుఖశాంతులు, సిరి సంపదలతో తలతూగాలని ఆయన కోరారు.

ఆయుధ పూజ మంత్రం ఇదే…

ఆయుధ పూజ మంత్రం ఇదే!

జహీరాబాద్ నేటి ధాత్రి;

దసరా పండుగకు ముందు వచ్చే ఆయుధ పూజను ఈ ఏడాది అక్టోబర్ 1న నిర్వహించుకుంటున్నారు. నవరాత్రులలో మహర్నవమి రోజున జరిగే ఈ పూజకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. రైతులు, వాహనదారులు, టైలర్లు, కార్మికులు తమ పనిముట్లను, వాహనాలను దుర్గామాత ముందుంచి పూజిస్తారు. పురాణాల ప్రకారం, పాండవులు యుద్ధానికి ముందు తమ ఆయుధాలను జమ్మి చెట్టుపై భద్రపరిచి పూజించినట్లు తెలుస్తోంది. ఈ రోజున ‘ఓం దుం దుర్గాయైనమః’ అనే మంత్రాన్ని పఠించడం శుభప్రదమని నమ్మకం. కొన్ని ప్రాంతాల్లో అస్త్ర పూజ అని, కేరళలో పోటీలు, తమిళనాడులో సరస్వతీ దేవి పూజ (గోలు) చేస్తారు.

 ఇంద్రకీలాద్రిపై పదవ రోజుకు నవరాత్రి ఉత్సవాలు.. తరలివస్తున్న భక్తులు

 ఇంద్రకీలాద్రిపై పదవ రోజుకు నవరాత్రి ఉత్సవాలు.. తరలివస్తున్న భక్తులు

అమ్మను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు. దుర్గమ్మ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. జై దుర్గా జై జై దుర్గా అన్న నామస్మరణతో ఇంద్రకీలాద్రి మార్మోగుతోంది.

ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయంలో దసర శరన్నవరాత్రి ఉత్సవాలు(Kanaka Durga Navaratri) ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. నవరాత్రి మహోత్సవాలు నేటితో పదవ రోజుకు చేరుకున్నాయి. తొమ్మిది రోజుల పాటు వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ… పదవ రోజు శ్రీ మహిషాసుర మర్దిని దేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు. దుర్గమ్మ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. జై దుర్గా జై జై దుర్గా అన్న నామస్మరణతో ఇంద్రకీలాద్రి మార్మోగుతోంది.నవరాత్రి మహోత్సవాల్లో వివిధ రూపాల్లో ఉన్న అమ్మవారి దర్శనం కోసం భారీగా భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. ముఖ్యంగా అమ్మవారి జన్మనక్షత్రం మూలా నక్షత్రం రోజున ఇంద్రకీలాద్రి భక్తులతో కిలకిటలాడింది. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్లలో భక్తులకు మంచి నీరు, పండ్లను అందజేశారు. ప్రతీరోజు ఒక్కో అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుని భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.

శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అమ్మవారి సేవలో మాజీ కౌన్సిలర్ దంపతులు…

శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అమ్మవారి సేవలో మాజీ కౌన్సిలర్ దంపతులు
వనపర్తి నేటిదాత్రి .

వనపర్తి పట్టణంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయం లో అమ్మవారి అభిషేకం పూజలో 33 వ వార్డు మాజీ కౌన్సిలర్ తిరుమల్ అలేఖ్య దంపతులు అంగడి నరేందర్ కట్ట సుబ్బయ్య పాల్గొన్నారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ అయ్యలూరి రఘునాథం చార్యులు వారిచే అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించారు . అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామికి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని చైర్మన్ కోరారు

అమ్మవారి మండపం వద్ద..

అమ్మవారి మండపం వద్ద..
భరతనాట్యం , మ్యాజిక్ షో , నిత్య అన్నదాన కార్యక్రమం

నిజాంపేట: నేటి ధాత్రి

 

దేవి శరన్నవరాత్రులను పురస్కరించుకొని నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో కౌండిన్య యుత్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నాట్యమండలి చే దుర్గామాత మండపం వద్ద భరతనాట్యం కార్యక్రమం మరియు మ్యాజిక్ షో అలాగే నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ.. ప్రతి ఏటా భక్తిశ్రద్ధలతో అమ్మవారిని కొలుచుకోవడం జరుగుతుందన్నారు. నవరాత్రులు రోజుకు ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ఆధునిక కాలంలో సంస్కృతి సంప్రదాయాలు నేటి యువతకు తెలియజేయాలని ఉద్దేశంతో భరతనాట్యం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. అలాగే మూఢనమ్మకాలను నమ్మవద్దని మ్యాజిక్ షో నిర్వహించామని తెలిపారు. అలాగే నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించామని తెలిపారు ఈ కార్యక్రమంలో కౌండిన్య యూత్ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు

గొప్ప మనసు చాటుకున్న ఆటో డ్రైవర్…

గొప్ప మనసు చాటుకున్న ఆటో డ్రైవర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం: సంగారెడ్డి జిల్లా ఝరాసంగం
మండలానికి చెందిన ఆటో డ్రైవర్ రాజ్కుమార్ గొప్ప మనసు చాటుకున్నారు. ఆదివారం ఝరాసంగం గ్రామానికి చెందిన సంగమేశ్వర్ దసరా పండుగ సందర్భంగా సరుకులు కొనుగోలు చేయడానికి జహీరాబాద్కు వెళ్లారు. సరుకులు కొనుగోలు చేసి తిరుగు ప్రయాణంలో కొల్లూరు గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ రాజ్కుమార్ ఆటోలో ఇంటికి చేరుకున్నారు. ఇంటికి చేరుకున్న సంగమేశ్వర్ తన వద్ద ఉన్న సరుకులు చూసుకుంటే సుమారు రూ. 8 వేల రూపాయలు ఎక్కడో పోయాయని గుర్తించారు. ఇదే సమయంలో ఆటో డ్రైవర్ రాజ్కుమార్ సోమవారం ఉదయం తన ఆటోను పరిశీలిస్తే రూ.8 వేల రూపాయలు లభించాయి. వెంటనే ఆయన ఆ డబ్బును పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి అప్పగించారు. పోలీసులు ఆ డబ్బులు ఝరాసంగం గ్రామానికి చెందిన గుర్తించి, ఆయనకు తిరిగి అందజేశారు.
ఎస్సై క్రాంతి కుమార్, గ్రామస్తులు రాజ్కుమార్ ఘనంగా సన్మానించి అభినందించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version