షేఖపూర్ దర్గాలో సర్కార్ గంధం సమర్పణ, భక్తుల కోలాహలం…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-09T115705.923.wav?_=1

 

షేఖపూర్ దర్గాలో సర్కార్ గంధం సమర్పణ, భక్తుల కోలాహలం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ మండలం శేఖపూర్ గ్రామంలోని షేక్ షాబుద్దీన్ దర్గా వద్ద సోమవారం రాత్రి సర్కార్ గంధం సమర్పించారు. పోలీస్ పటేల్ వారి ఇంటి నుండి డప్పు చప్పులతో ఒంటపై గంధాన్ని దర్గాలో సమర్పించారు. మంగళవారం వరకు ఖవ్వాలి పోటీలు జరుగుతాయని గ్రామస్తులు తెలిపారు.

 

 

 

ఈ జాతరకు కర్ణాటక, మహారాష్ట్ర, హైదరాబాద్ నుంచి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని దర్గాను చందర్ పూలమాలలు సమర్పించి వచ్చిన భక్తులు మొక్కులు చెలించుకొని ఫేతెహ మిఠాయి సమర్పించి జహీరాబాద్ నియోజకవర్గ ప్రజలందరు సుఖసంతోషాలతో ఉండాలని ప్రర్తించారు,

గణప సముద్రం లో గణేశుల నిమజ్జనం…

గణప సముద్రం లో గణేశుల నిమజ్జనం

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండల కేంద్రంలో నవరాత్రులు పూజలు అందుకున్న గణేశులను నిమజ్జనం ఏర్పాట్లును పర్యావేక్షించిన తాసిల్దార్ మధురకవి సత్యనారాయణ స్వామి, ఎంపీడీవో ఎల్ భాస్కర్, ఎస్సై రేఖ అశోక్ ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో గణపసముద్రం వద్ద ఫ్లోట్ ఏర్పాట్లు సముద్రం సరసు వద్ద గణపతుల నిమజ్జనోత్సవానికి ఇరిగేషన్ శాఖ భూపాలపల్లి ఈ ఈ

 

 

 

బసవ ప్రసాద్ గౌడ్ గణపురం ఎస్ ఐ రేఖ అశోక్ రూ 35 వేళ్ళతో వెదురు బొంగులు ఇనుప డ్రమ్ములతో మొదటిసారి ఏర్పాటుతో విగ్రహాలను తీసుకెళ్లడంకి క్రేన్ సహాయంతో ఫ్లోట్ పైకి విగ్రహాలను ఎక్కించి లోతట్టు ప్రాంతానికి తీసుకువెళ్లి నిమజ్జనం చేశారు.ఏ బి డి ఈ ఈ వరుణ్ ఏఈ శ్రీనివాస్ వీరి సహాయంతో ప్రత్యేకంగా నిమజ్జనోత్సవానికి శాశ్వత విద్యుత్ స్తంభాలను ఏర్పాట్లు అధికారులు ట్రాన్స్కో కో ఎస్ సి మల్పూర్ నాయక్ డి ఈ పాపిరెడ్డి గణపురం ట్రాన్ కో ఏ ఈ వెంకటరమణ మూడు రోజులపాటు విద్యుత్తు శాఖ సిబ్బంది తో ఎనిమిది విద్యుత్తు స్తంభాలను నూతనంగా ట్రాన్స్ఫారం ఏర్పాట్లు చేశారు.

అక్కన్నపేటలో అంగరంగ వైభవంగా గణేష్ నిమజ్జనం..

అక్కన్నపేటలో అంగరంగ వైభవంగా గణేష్ నిమజ్జనం..

రామయంపేట సెప్టెంబర్ 6 నేటి ధాత్రి (మెదక్)

 

 

రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామంలో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జన మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. శుక్ర వారం సాయంత్రం గ్రామమంతా ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.
నిమజ్జన శోభాయాత్రలో గ్రామస్తులు, ముఖ్యంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలు సంప్రదాయ వేషధారణలో కోలాటాలతో నృత్యాలు చేస్తూ వినాయకుడిని గంగమ్మ ఒడికి తీసుకెళ్లడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిన్నారులు, యువకులు కూడా డప్పు వాయిద్యాలు, నృత్యాలతో ఊరంతా ఉత్సవ శోభను పెంచారు.
ఫ్రెండ్స్ యూత్ సభ్యులు నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులు జైజై గణేశ్, గణపతి బప్పా మోరియా అంటూ నినాదాలు చేస్తూ ఊరంతా సందడి చేశారు.

గంగమ్మ ఒడిలోకి గణ నాథులు

గంగమ్మ ఒడిలోకి గణ నాథులు

శాయంపేట నేటిధాత్రి:

 

 

శాయంపేట మండల వ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగాయి తొమ్మిది రోజులపాటు పూజలు అందుకున్న విఘ్నేశ్వరుడు గంగమ్మ చెంతకు చేరుకున్నాడు. వినాయక విగ్రహాల నిమజ్జన శోభాయాత్ర శుక్రవారం మహిళలు యువతీ యువకులు భజనలు కోలాహాటాలతో బ్యాండ్ డీజే పాటలతో సాగింది చిన్న పెద్ద అంతా కలిసి శోభాయతులు ఉత్సాహంగా పాల్గొని ఆడి పాడారు చివరి రోజు కావడంతో గణనాధునికి వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి గణేష్ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్లి చెరువులో నిమజ్జనం చేశారు.ఈ క్రమంలో మండలం లోని పలు గ్రామాల్లో చెరువు లు కుంటలు ప్రాజెక్టుల వద్ద గణేష్ నిమజ్జనాలు కోలాహా లంగా సాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో మండపాల యువతీ యువకులు ప్రజలు అధిక మొత్తంలో పాల్గొన్నారు

కన్నుల పండువ గా అంజనీ పుత్ర గణ నాథుని నవరాత్రుల వేడుకలు….

కన్నుల పండువ గా అంజనీ పుత్ర గణ నాథుని నవరాత్రుల వేడుకలు….

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

వినాయక చవితి వేడుకల సందర్భంగా జిల్లా ఆధ్యాత్మిక కేంద్రం గా, శాంతి యుతంగా నిమజ్జన వేడుకలు నిర్వహించుకోవాలని మంచిర్యాల డీసీపీ భాస్కర్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రం లోని వంద ఫీట్ల రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని వినాకయ కుని మండపం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం డీసీపీ నీ అంజనీ పుత్ర ఎస్టేట్స్ చైర్మెన్ గుర్రాల శ్రీధర్, ఎండీ పిల్లి రవి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా ఆధ్యాత్మిక కేంద్రం గా విలసిల్లి శాంతి, ఐక్యత తో పండుగ లో నిర్వహించుకోవాలన్నారు. తెలంగాణ పండుగలు మన సంస్కృతికి అద్దం పడతాయని వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదన్నారు. భిన్నత్వంలో ఏకత్వం గా ప్రతి పండుగ ను వేడుక గా నిర్వహించుకుని మధుర జ్ఞాపకాలుగా మలచుకోవాలన్నారు. అనంతరం అంజనీ పుత్ర సంస్థ చైర్మెన్ గుర్రాల శ్రీధర్, మేనేజింగ్ డైరెక్టర్ పిల్లి రవి మాట్లాడుతూ వంద ఫీట్ల రోడ్డు వద్ద వినాయకుని ఏర్పాటు చేసిన నాటి నుంచి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందని, వారి సహకారం, ఆశీర్వాద బలం తో సేవాకార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషిస్తు వినూత్న కార్యక్రమాలు చేపడుతూ విజయవంతంగా దూసుకు వెళ్తున్నామన్నారు. అనంతరం ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులను శాలువాతో సత్కరించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లు సూరినేని కిషన్, కాసర్ల సదానందం, డైరెక్టర్ లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

“గణపతి లడ్డు వేలంలో జట్టగొండ మారుతి విజయం..

గణనాథుని లడ్డు వేలం పాటలో 16 వేల పలికిన మాజీ సర్పంచ్ జట్టగొండ మారుతి

జహీరాబాద్ నేటి ధాత్రి:

న్యాల్కల్ మండల మల్గి గ్రాములోని హనుమాన్ మందిరంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో గణనాథుని లడ్డు వేలం పాటలో మొదటి లడ్డును 16 వేలకు మాజీ సర్పంచ్ జట్టగొండ మారుతి కురుమ దక్కించుకోవడం జరిగింది గ్రామంలో పలు చోట్ల వెలిసిన గణనాథులు పూజల అనంతరం నిమజ్జనానికి తరలాయి. చెరువులో నిమజ్జనం చేశారు పూజల అనంతరం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి గణనాథులు నిమజ్జనం చేశారు,

“గణపతి లడ్డు వేలంలో జట్టగొండ మారుతి విజయం…

గణనాథుని లడ్డు వేలం పాటలో 16 వేల పలికిన మాజీ సర్పంచ్ జట్టగొండ మారుతి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

న్యాల్కల్ మండల మల్గి గ్రాములోని హనుమాన్ మందిరంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో గణనాథుని లడ్డు వేలం పాటలో మొదటి లడ్డును 16 వేలకు మాజీ సర్పంచ్ జట్టగొండ మారుతి కురుమ దక్కించుకోవడం జరిగింది గ్రామంలో పలు చోట్ల వెలిసిన గణనాథులు పూజల అనంతరం నిమజ్జనానికి తరలాయి. చెరువులో నిమజ్జనం చేశారు పూజల అనంతరం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి గణనాథులు నిమజ్జనం చేశారు,

మమతా నగర్ గణనాధుని సన్నిధిలో మహా అన్నదాన కార్యక్రమం…

మమతా నగర్ గణనాధుని సన్నిధిలో మహా అన్నదాన కార్యక్రమం

పరకాల నేటిధాత్రి

 

 

పట్టణంలోని పదో వార్డు మమత నగర్ కాలనీ వాసుల ఆధ్వర్యంలో గణేష్ విగ్రహ దాత తాళ్లపల్లి వెంకటేశ్వర్లు కవిత ల సహకారంతో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడుతున్న నేపథ్యంలో మమతా నగర్ కాలనీవాసులు ముప్పిడి రంజిత్ మమత,దార్న రవీందర్ సత్యవతిలచే స్వామివారి సన్నిధానంలో మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కాలనీవాసులు భక్తులు గణేష్ మహారాజ్ కి జై అంటూ స్వామివారిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాల నిర్వాహణ అనంతరం స్వామివారి మహా అన్నప్రసాద వితరణను స్వీకరించి స్వామి వారి కృపకు ప్రాప్తులైనట్లు మహా అన్నప్రసాద వితరణ దాతలు ముప్పిడి రంజిత్ దార్న రవీందర్తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలకు పరకాల పట్టణంలోనే మమతా నగర్ గణనాథుడు పెట్టింది పేరుగా నవరాత్రి తొమ్మిది రోజులు మమతా నగర్ కాలనీ వాసులంతా ఒక పండగ వాతావరణంను ఏర్పాటు చేసుకుంటూ గణపతి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని,ఈ నేపథ్యంలో శనివారం రోజున నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమంకు విచ్చేసి కార్యక్రమమును విజయవంతం చేసిన కాలనీవాసులకు భక్తులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

వినాయక ఉత్సవ కమిటీ సభ్యులకు పోలీసువారి ఆంక్షలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-28T132148.392.wav?_=2

 

వినాయక ఉత్సవ కమిటీ సభ్యులకు పోలీసువారి ఆంక్షలు

మందమర్రి నేటి ధాత్రి

 

వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా, సురక్షితంగా జరుపుకోవాలని మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి ప్రజలకు సూచించారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, డిఐజి (ఐపీఎస్), మంచిర్యాల డిసిపి ఏ భాస్కర్ ఐపీఎస్, బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ ల ఆదేశాల మేరకు మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ) శశిధర్ రెడ్డి గణేష్ మండప నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలు పండుగను ఆనందంగా జరుపుకునే క్రమంలో భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.గణేష్ మండపాల ఏర్పాట్లు గురించి పోలీస్ వారికి సమాచారం అందించాలని, విగ్రహం సైజు, బరువు, ఉత్సవాల తేదీలు, నిమజ్జనం వివరాలు, కమిటీ సభ్యుల సమాచారాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుని, అనుభవజ్ఞులైన వారి ద్వారా మాత్రమే విద్యుత్ కనెక్షన్లు ఏర్పాటు చేయించుకోవాలి. గ్రామ పంచాయతీ లేదా మున్సిపాలిటీ, విద్యుత్ శాఖల నుండి అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి. వివాదాస్పద స్థలాల్లో మండపాలు ఏర్పాటు చేయకూడదు.

 

 

జాగ్రత్తలు పాటించాలి
మండపాల వద్ద అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా నిర్వాహకులు పూర్తి బాధ్యత వహించాలి. రాత్రిపూట కనీసం ఇద్దరు కమిటీ సభ్యులు కాపలాగా ఉండి, చిన్న పిల్లలు, వృద్ధులను మండపాల వద్ద పడుకోనివ్వరాదు. మండపంలో మండే స్వభావం ఉన్న పదార్థాలు లేదా పటాకులు ఉంచకూడదు. అగ్నిప్రమాదాలు జరిగితే వాటిని అదుపు చేయడానికి ఇసుక, నీటిని సిద్ధంగా ఉంచుకోవాలి.
ఉదయం 8 నుండి రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్లు వినియోగించాలి. ఇతర మతాలు, కులాలను కించపరిచే పాటలు లేదా అసభ్యకరమైన పాటలు పెట్టరాదు. గణేష్ మండపం వద్ద లేదా ఊరేగింపులో డీజేలను వాడటం పూర్తిగా నిషేధం. ఊరేగింపు సమయంలో ముస్లిం ప్రార్థనల వేళ మసీదుల వద్ద మైకులు ఆపి, ప్రశాంతంగా వెళ్ళాలి. మండపాలు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించకుండా ఏర్పాటు చేయాలి.
నిమజ్జనం మరియు పర్యావరణ పరిరక్షణ
నిమజ్జనం రోజున పోలీసులు సూచించిన మార్గాల్లో మాత్రమే ఊరేగింపు నిర్వహించాలి. ఊరేగింపు నిర్ణీత సమయంలోగా పూర్తయ్యేలా చూసుకోవాలి. ఊరేగింపు సమయంలో వాలంటీర్లను నియమించుకుని, కమిటీ సభ్యులు విగ్రహంతో పాటు ఉండాలి. మద్యం తాగి నిమజ్జనంలో పాల్గొనరాదు. సమావేశం సందర్భంగా పర్యావరణాన్ని కాపాడేందుకు మట్టి గణపతులను పూజించాలని సీఐ శశిధర్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో మట్టి గణపతులను నిర్వాహకులకు పంపిణీ చేశారు. ఈ సమావేశంలో ఎస్ఐ రాజశేఖర్, ఎలక్ట్రిసిటీ ఏఈ, గణేష్ మండపాల నిర్వాహకులు, హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

గణపతి నవరాత్రుల ఉత్సవ కమిటీ అధ్యక్షునిగా క్యాతరాజు రమేష్…

గణపతి నవరాత్రుల ఉత్సవ కమిటీ అధ్యక్షునిగా క్యాతరాజు రమేష్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

 

మండల కేంద్రంలో శుక్రవారం రోజున శ్రీ సాంబమూర్తి సామూహిక దేవాలయంలో ఈనెల 27న గణపతి నవరాత్రి ఉత్సవములను నిర్వహించేందుకు నిర్వాహక కమిటీని ఎన్నుకోవడం జరిగింది. శ్రీ సాంబమూర్తి దేవాలయ ప్రధాన అర్చకులు భైరవభట్ల వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో. గ్రామస్తుల సమక్షంలో గణపతి నవరాత్రుల ఉత్సవ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉత్సవ కమిటీ అధ్యక్షనిగా క్యాతరాజు రమేష్, ఎన్నికయ్యారు. అధ్యక్షులు క్యాతరాజు రమేష్ మాట్లాడుతూ. గణపతి నవరాత్రి ఉత్సవాలను గ్రామస్తుల సహకారంతో భక్తి శ్రద్ధలతో ఉత్సవాలను తొమ్మిది రోజులపాటు నిర్వహించేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తానని అందుకు కమిటీ సభ్యులతో పాటు గ్రామస్తుల సహకారంతో గణపతి నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని క్యాతరాజు రమేష్ అన్నారు. ఉపాధ్యక్షులుగాదేవునూరి కుమార్, ప్రధాన కార్యదర్శిగా ఎల్దండి ప్రకాష్, కోశాధికారిగా బత్తిని రాజు, సహాయ కార్యదర్శిగాఎర్రబాటి మహేందర్, అన్నారపు కుమార్, కార్యవర్గ సభ్యులుగా వీణవంక నవీన్,క్యాతారాజు రజనీకాంత్, సూర్నేని మణికర్, గుడిమల్ల రమేష్, తంగళ్ళపల్లి వీరబ్రహ్మం, వీణవంక ప్రసాద్, కటుకూరి శ్రీధర్, దేవునూరి అశోక్, చాట్ల రాజు, పుట్ట అజయ్, హరీష్ లను గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నికైనారు.

గణేష్ మండపాల పర్మిషన్ కోసం ఇలా అప్లై చేసుకోండి

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-69.wav?_=3

గణేష్ మండపాల పర్మిషన్ కోసం ఇలా అప్లై చేసుకోండి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

గణేష్ నవరాత్రులకు మండపాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని పోలీసులు సూచించారు https://policeportal.tspolice .gov.in/index.htmలో పర్మిషన్ కోసం అప్లై చేసుకోవాలి. “విద్యుత్ కనెక్షన్ కోసం డిడి కట్టాలి. సొంతంగా విద్యుత్ కనెక్షన్ ఇవ్వొద్దు. నిపుణులతో మాత్రమే పనిచేయించండి. గాలి,వానను తట్టుకునేలా మండపాలు ఏర్పాటు చేసుకోవాలి. పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేసుకోండి” అని పోలీసులు తెలిపారు.

అన్నయ్య నువ్వే నాకు శ్రీరామ రక్షా

 

అన్నయ్య నువ్వే నాకు శ్రీరామ రక్షా

 

పరకాల నేటిధాత్రి
సోదర సోదరీమణుల ప్రేమను ప్రతిరూపంగా జరుపుకునే అపురూపమైన వేడుక రాఖీ.ఈ సందర్భంగా పరకాల పట్టణ మరియు మండల ప్రజలు తమ తోబుట్టువులకు పవిత్రమైన పండుగ ప్రతి కష్టంలో సోదరులు తోడుంటారనే విశ్వాసానికి గుర్తు రాఖీ అని చెప్పవచ్చును పండుగ శ్రావణ మాసంలో జరుపుకుంటారు.పట్టణంలోని ఓ కాలనిలోని మామిడి అనన్య శ్రీ అనే చిన్నారి తన అన్న ఉద్భవ్ కుమార్ కు రాఖీ కట్టి తన ప్రేమను చాటుకుంది.సోదర, సోదరీమణుల మధ్య అనుబంధాన్ని ఈ పండుగ గుర్తు చేస్తుంది.సోదరి తన సోదరుడికి రాఖీ కట్టి జీవితంలో ఉన్నత స్థానాలను చేరుకోవాలని ఎల్లవేళలా అండగా,రక్షణగా ఉండాలని,అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల నడుమ అనురాగ బంధానికి ప్రతీకగా నిలిచే పండుగ రాఖీ పౌర్ణమిగా చెప్పవచ్చు.

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక…. రక్షాబంధన్..!

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-8-2.wav?_=4

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక…. రక్షాబంధన్..!

చిట్యాల, నేటి ధాత్రి:

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో శనివారం రోజున అన్న చెల్లెల అనుబంధానికి ప్రతిక అయిన రక్షాబంధన్ వేడుకలు ప్రతి ఇంటిలో ఆనందంతో ఉత్సాహంతో జరుపుకున్నారు అలాగే అన్నా చెల్లెళ్ల ఆత్మీయ అనుబంధానికి ప్రతీక రాఖీ పర్వదినం. సోదరుడికి కట్టే రాఖీలు సోదరీమణులకు రక్షణ కవచంగా నిలుస్తాయని విశ్వాసం. మండల వ్యాప్తంగా ఆడపడుచులు శనివారం రోజున రాఖీ పర్వదినాన్ని సుఖ సంతోషాలతో హాయిగా ఉండాలని జరుపుకుంటున్నారు, రాఖీ పర్వదినాన్ని రాఖీ పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి, రోజే రాఖీ పౌర్ణమి జరుపుకోవాలని వేద పండితులు, చెబుతుంటారు. అర్చకుల పంచాంగం ప్రకారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాఖీ పండుగను జరుపుకోవాలని ఆ సమయంలో సోదరీమణులు తమ సోదరులకు రాఖీలు కట్టవచ్చని వేద పండితులు తెలిపారు. సోదరుడికి రక్షాబంధన్ కట్టిన తర్వాత హారతి ఇచ్చి దీవిస్తారు, హిందువులు జరుపుకునే పండుగల్లో రాఖీ ఒకటి. ఈ పండుగ సోదర సోదరీమణులకు మధ్య ప్రేమగా గుర్తుగా పేరుగాంచింది, రాఖీ కట్టిన తర్వాత తన సోదరికి సోదరుడు తన జీవితాంతం అండగా ఉంటానని అలాగే సోదరీమణులు తన సోదరుడి మణికట్టుపై రాఖీ కట్టి స్వీటు తినిపించి హారతిస్తారు. తనకు రాఖీ కట్టిన సోదరికి ఏదైనా చిరుకానుక గా బహుమతి ఇచ్చి జీవితాంతం కాపాడుతానని హామీ ఇచ్చినట్లుగా భావిస్తారు, ఈ రాఖీ పండుగ వేడుకలు మండలంలోని ఆడపడుచులు ప్రభుత్వ కార్యాలయాలలో మరియు పార్టీ కార్యాలయాల్లో ఘనంగా జరుపుకున్నారు.

శ్రావణ మాస ఆధ్యాత్మికోత్సవం…

జహీరాబాద్: శ్రావణ మాస ఆధ్యాత్మికోత్సవం

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-02T132554.640.wav?_=5

జహీరాబాద్ నేటి ధాత్రి:

శ్రావణ మాసం పురస్కరించుకొని జహీరాబాద్ అనుభవ మండపంలో రెకులగీ మల్లేశం ఆధ్వర్యంలో విశేష పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు. వారిని మహీంద్రా & మహీంద్రా సంస్థ నుండి పదవీ విరమణ పొందిన ఆగూర్ కృష్ణ మోహన్ కి లింగాయత్ సమాజం – రంజోలు తరఫున సన్మానం నిర్వహించారు. అదేవిధంగా ఆదివారం వీరన్న పాటిల్ పూజ నిర్వహించనున్నారని భక్తులందరు శ్రద్ధాభక్తులతో పాల్గొని ఆధ్యాత్మిక ఫలితం పొందాలని నిర్వాహకులు ఆహ్వానిస్తున్నారు.

అంగరంగ వైభవంగా శ్రావణమాసం ఉత్సవం

అంగరంగ వైభవంగా శ్రావణమాసం ఉత్సవం

రామాలయం అభివృద్ధికి నగదు అందజేత

శ్రావణ మాస ఉత్సవం లో ప్రత్యేక పూజలు

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ పట్టాభి సీతా రామచంద్రస్వామి ఆలయంలో శ్రావణమాస ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఆలయ అర్చకులు ముసునూరి నరేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు అదేవిధంగా గణపురం మండల కేంద్రానికి చెందిన సిరంగి ధనుజ పటేల్ వెంకటేశ్వర పటేల్ దంపతులు శుక్రవారం శ్రీ పట్టాభి సీతారామచంద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అదేవిధంగా పూజ అనంతరం ఆలయ అభివృద్ధిలో పాల్గొంటానని చెప్పి అభివృద్ధి కొరకు
10. 116 రూపాయలను ఆలయ అధ్యక్షుడు తాళ్లపల్లి గోవర్ధన గౌడ్ కి అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు బండారు శంకర్ మూలా శ్రీనివాస్ గౌడ్ బటిక స్వామి మాదాసు అర్జున్ బూర రాజగోపాల్ దైవాల భద్రయ్య మాదాసు మొగిలి ఉయ్యాల బిక్షపతి పాండవుల భద్రయ్య తదితర భక్తులు పాల్గొన్నారు

శాయంపేటలో పండుగలా కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు..

శాయంపేటలో పండుగలా కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు

శాయంపేట నేటిధాత్రి;

శాయంపేట మండలకేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి వర్యులు కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుక లను అత్యంత వైభవంగా జరుపుకున్నారు.బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంగుల మనోహర్ రెడ్డి మరియు మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి ఆధ్వ ర్యంలో కూడలి వద్ద కేక్ కట్ చేసి, పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేటీఆర్ ఆయురారోగ్యాలతో ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ, తెలంగాణ ప్రజలకు ఎంతో సేవ చేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ వంగాలనారాయణ రెడ్డి, మండల యూత్ అధ్యక్షు లు మారేపల్లి మోహన్, సీని యర్ నాయకులు లక్ష్మారెడ్డి, పిఎసిఎస్ వైస్ చైర్మన్ దూదిపాల తిరుపతిరెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ మారపల్లి నందం, ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షులు మేకల శ్రీని వాస్, గ్రామ శాఖ అధ్యక్షులు గాదె రాజేందర్, మేకల వెంకటే శ్వర్లు,సవాసి రమేష్, లక్ష్మణ్, గంట శ్యాంసుందర్ రెడ్డి, మండ ల కోఆప్షన్ సభ్యులుమొహిబు ద్దిన్, మాజీ సర్పంచులు వలప దాస్ చంద్రమౌళి,పోతురమణా రెడ్డి, చింతనిప్పుల భద్రయ్య, గడిపే విజయ్, ధైనంపల్లిసుమ న్, కొమ్ముల శివ, చెన్నబోయిన అజయ్, విద్యాసాగర్, నర్ర రాజు, అట్ల తిరుపతి, రంగు మహేందర్, కుసుమ రమేష్ , కోల మచ్చయ్య, రాజ మహ మ్మద్, సదాశివరెడ్డి, ఆదిరెడ్డి, నారాయణరెడ్డి, ప్రభాకర్, వైద్యుల సాంబరెడ్డి, మస్కి సుమన్ ,నాగరాజు , రేణిగుంట్ల సంతోష్ , ఎండి పాష, వినయ్, శ్రీను, సునీల్, శివ,మండల సోషల్ మీడియా కన్వీనర్ దాసి శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

బాలాజీ ఇంటిగ్రేటెడ్,అక్షర ద స్కూల్ లో.!

బాలాజీ ఇంటిగ్రేటెడ్,అక్షర ద స్కూల్ లో ఘనంగా బోనాల పండగ.

నర్సంపేట,నేటిధాత్రి:

బాలాజీ విద్యాసంస్థల్లో విద్యాసంస్థల్లో ఒక్కటైన బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్ మరియు అక్షర స్కూల్ లో శనివారం బోనాల పండుగ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు.
ఈ సందర్భంగా బాలాజీ విద్యాసంస్థల అధినేత డాక్టర్ ఏ. రాజేంద్రప్రసాద్ రెడ్డి, ట్రెజరర్ వనజ,ఎంఈఓ సారయ్య పాల్గొని బోనాల జాతర పండగ యొక్క ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు.ఆషాడ మాసంలో తెలంగాణలో బోనాల జాతరలో ప్రజలు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి జరుపుకోవడం జరుగుతుంది అన్నారు. విద్యార్థులు బోనాలు ఇంటి వద్ద తయారు చేసుకుని వచ్చారు. మరికొందరు పోతురాజుల వేషధారణలో ఆకట్టుకున్నారు.ఈ కార్యక్రమంలో
బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్ ప్రిన్సిపల్ జ్యోతి గౌడ్,అక్షర స్కూల్ ప్రిన్సిపల్ భవాని,బాలాజీ మహిళా డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ రామ్ రాజ్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు,తల్లిదండ్రులు పాల్గొన్నారు.

బాలాజీ టెక్నో స్కూల్లో తెలంగాణ బోనాల సంబరాలు..

నర్సంపేట మండలంలోని లక్నేపల్లి లో గల బాలాజీ టెక్నో స్కూల్లో తెలంగాణ బోనాలు సంబరాలు ఘనంగా జరుపుకున్నారు.భారతీయ సంస్కృతి, వారసత్వాన్ని ప్రతిబింబించేలా విద్యార్థిని ,విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి మహంకాళి ,పోతరాజు వేషధారణలతో వచ్చి అందరినీ ఆకట్టుకునేలా బోనం ఎత్తుకొని ప్రదర్శనలు చేశారు.ఈ కార్యక్రమానికి బాలాజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఏ. రాజేంద్ర ప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆషాడ మాసంలో జరుపుకునే అతిపెద్ద హిందూ పండుగ. హైదరాబాద్ నగరంలో 1813 సంవత్సరంలో ప్లేగు వ్యాధి బారి నుండి బయటపడేందుకు ఉజ్జయినిలోని మహంకాళి అమ్మవారికి ప్రార్థనలు చేశారు. వ్యాధి వ్యాప్తి చెందకుండా నిలిచిపోవడంతో భక్తులు అమ్మవారికి బోనం సమర్పించారు.బోనం అంటే భోజనం అని అర్థం.ఇది మాతృదేవికి నైవేద్యం. ఇంట్లోమహిళలు పాలు, బెల్లం కలిపి మట్టి కుండలో గానీ ఇత్తడి పాత్రలో గాని భోజనం వండుతారు.వీటిని వేప ఆకులతో,పసుపుతో అలంకరిస్తారు అట్టి బోనాన్ని నెత్తిపై ఎత్తుకొని పోతరాజు విన్యాసాలతో వెళ్లి అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారని ఈ సందర్భంగా వివరించారు.స్కూల్ ప్రిన్సిపల్ పి.రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ మహిళలు సాంప్రదాయ చీరలో ఆభరణాలు ఇతర ఉపకరణాలు ధరించి అమ్మవారికి బోనంతో పాటు చీర ,గాజులు సమర్పిస్తారని,మాతృదేవతను ఎల్లమ్మ, పోచమ్మ, డెక్కలమ్మ, మారేమ్మ, పోలేరమ్మ, అంకాలమ్మ, నూకలమ్మ, పెడమ్మ వివిధ రూపాలలో అమ్మవారిని పూజిస్తారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

బాలాజీ ఇంటిగ్రేటెడ్ అక్షరలో ఘనంగా వన మహోత్సవ కార్యక్రమం.

బాలాజీ ఇంటిగ్రేటెడ్ అక్షరలో ఘనంగా వన మహోత్సవ కార్యక్రమం

నర్సంపేట,నేటిధాత్రి:

బాలాజీ విద్యాసంస్థల్లో ఒక్కటైన అక్షర ద స్కూల్, బిట్స్ స్కూల్లో మంగళవారం వన మహోత్సవ కార్యక్రమం పురస్కరించుకొని మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు.

Dr. A. Rajendra Prasad Reddy, Head of Balaji Educational.

బాలాజీ విద్యాసంస్థల అధినేత డాక్టర్ ఏ. రాజేంద్ర ప్రసాద్ రెడ్డి, ట్రెజరర్ డాక్టర్ వనజ పాల్గొని వన మహోత్సవం సందర్భంగా విద్యార్థులు గ్రీన్ కలర్ దుస్తులు ధరించి ఇంటి వద్ద నుండి తీసుకొచ్చిన మొక్కలను పాఠశాల ఆవరణలో పిల్లలతో మొక్కలు నాటించారు.ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు మొక్కలు ఎంతో దోహదపడతాయని ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని తెలిపారు.అనంతరం వన మహోత్సవం పై డ్రాయింగ్ కాంపిటీషన్ నిర్వహించారు. ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల సెక్రటరీ డాక్టర్ రాజేశ్వర్ రెడ్డి,బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్ ప్రిన్సిపల్ జ్యోతి,అక్షర స్కూల్ ప్రిన్సిపల్ జి. భవాని,ఉపాధ్యాయ బృందం,విద్యార్థులు పాల్గొన్నారు.

మొహరం పండుగలో పాల్గొన్న జహీరాబాద్ ఎమ్మెల్యే.

 

మొహరం పండుగలో పాల్గొన్న జహీరాబాద్ ఎమ్మెల్యే

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండలం బొప్పనపల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు గ్రామస్థుల ఆహ్వానం మెరకు మత సామరస్యాలకు అతీతంగా జరిగిన మొహ‌రం ఉత్సవాల్లో జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు పాల్గొని దర్గాకు పూలమాలలు చాదర్ సమర్పించి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మాజీ ఎంపీపీ సంగమేశ్వర్, మాజీ కేతాకీ సంగమేశ్వర ఆలయ చైర్మన్ నర్సింహా గౌడ్, పట్టణ అధ్యక్షులు ఏజాస్ బాబా,మాజీ సర్పంచ్ లు శ్రీనివాస్ రెడ్డి , సంగారెడ్డి, నాయకులు వెంకట్ రెడ్డి,సంతు పటేల్,నాగేందర్ పటేల్,విజయ్ పటేల్, సోహైల్,ఉల్లాస్,బొప్పానపల్లి సీఎహేచ్ నాగన్న, కి. శశివర్ధన్ రెడ్డి,సయ్యద్,గఫార్,నర్సింలు,లేయాకత్, విష్ణువర్ధన్ రెడ్డి,జి సిద్ధప్ప,దిగంబర రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి,రవి,సుకుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఆషాడమాసంలో గోరింటాకు పండగ

ఆషాడమాసంలో గోరింటాకు పండగ

గోరింటాకు పండగను జరుపుకుంటున్న మహిళలు

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలో
శ్రీ పట్టాభి సీతా రామచంద్రస్వామి ఆలయంలో మంగళవారం ఆషాడ శుక్ల త్రయోదశి. సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించటం జరిగింది ఈ సందర్భంగా మహిళలందరూ ఆషాడ మాసంలో గోరింటాకును పెట్టుకోవడం ఒక సాంప్రదాయంగా భావించి మహిళలు అందరూ కలిసి రామాలయం ఆవరణంలో గోరింటాకు పండగను జరుపుకున్నారు.
గోరింటాకు ఆషాడ మాసంలోనే ఎందుకు పెట్టుకోవాలి

 

 

పూర్వము పార్వతీదేవి ఒకరోజు చేతులకి గోరింటాకు పెట్టుకుంటుండగా గోరింటాకు చెట్టు పార్వతి దేవిని ఈ విధముగా కోరింది ప్రజలందరూ గోరింటాకు చెట్టును గుర్తించాలి అని కోరింది అందుకు పార్వతీదేవి ఆషాడమాసంలో గోరింటాకు పెట్టుకోవటం వల్ల మహిళలకు సౌభాగ్యాన్ని ఆరోగ్యాన్ని సౌందర్యాన్ని పొందవచ్చు అని పార్వతి దేవి చెప్పింది.
అందువల్ల మహిళల ందరూ ఆషాడ మాసంలో గోరింటాకు పండగను ఒక సాంప్రదాయంగా భావించి జరుపుకుంటారు
మహిళలు మాట్లాడుతూ. గోరింటాకు పండగను ప్రతి సంవత్సరం రామాలయంలో వైభవంగా జరుపుకుంటాము.
గోరింటాకు పెట్టుకోవడం వల్ల గోరింటాకులో ఉన్నటువంటి ఔషధ గుణాలు శరీరానికి చలవ చేస్తాయి ఒత్తిడిని తగ్గిస్తుంది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది అదేవిధంగా గోరింటాకు పెట్టుకోవడం వల్ల స్త్రీలు సౌభాగ్యంగా భావిస్తారు వివాహమైన స్త్రీలకు వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది అని భావిస్తాము అందుకొరకు ప్రతి ఆషాడ మాసంలో గోరింటాకు పండగను ఎంతో సాంప్రదాయంగా జరుపుకుంటాము.
ప్రతి ఆషాడ మాసంలో మహిళలు గోరింటా కు పండగను జరుపుకోవాలని కోరుకుంటున్నాము.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version