మొసలితో మజాక్ చేయడమంటే ఇదే.. ఈ అంకుల్ నిర్వాకం చూస్తే అవాక్కవుతారు..

మొసలితో మజాక్ చేయడమంటే ఇదే.. ఈ అంకుల్ నిర్వాకం చూస్తే అవాక్కవుతారు..

 

రోడ్డు పక్కన గడ్డిలో ఓ పెద్ద మొసలి పడుకుని ఉంది. అయితే అది చనిపోయిందా.. లేక మొసలి బొమ్మనా అనేది స్పష్టంగా తెలియలేదు. మొసలి మాత్రం చలనం లేకుండా పడి ఉంది. ఇంతలో..

ఎక్కడ ఏ చిన్న విచిత్ర, వింత, వినోద సంఘటన జరిగినా.. వీడియో రూపంలో ఇట్టే నెట్టింట్లోకి వచ్చి చేరుతోంది. వాటిలో కొన్ని వీడియోలు చూస్తే అందరికీ ఆశ్చర్యం కలుగుతుంటుంది. మరికొన్ని వీడియోలు అందరినీ షాక్‌కు గురి చేస్తుంటాయి. తాజాగా, ఇలాంటి షాకిచ్చే వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి మొసలిపై కూర్చొన్న వీడియో చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. చావుకు షార్ట్ కట్ చూసుకుంటున్నాడేమో.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఎక్కడ జరిగిందో ఏమో తెలీదు గానీ.. సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రోడ్డు పక్కన గడ్డిలో ఓ పెద్ద మొసలి పడుకుని ఉంది. అయితే అది చనిపోయిందా.. లేక మొసలి బొమ్మనా అనేది స్పష్టంగా తెలియలేదు. మొసలి మాత్రం చలనం లేకుండా పడి ఉంది. ఇంతలో ఓ వ్యక్తి అక్కడికి వచ్చాడు. ఏమాత్రం భయం లేకుండా మొసలిపై కూర్చుని కాసేపు గెంతులేశాడు.

మొసలి కడుపుపై చేతులతో కొడుతూ చాలా సేపే దానిపై (man sitting on crocodile) కూర్చొనే ఉన్నాడు. తర్వాత మొసలిపై పడుకుని ఫొటోకు ఫోజులు ఇచ్చాడు. ఇలా చాలా సేపటి తర్వాత.. దానిపై నుంచి పైకి లేచి తాపీగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే అతను అంత చేస్తున్నా కూడా మొసలి కదలకపోవడంతో అంతా అది చనిపోయిందని భావిస్తున్నారు. లేదా మొసలి లాంటి బొమ్మ అయి ఉండొచ్చని అనుకుంటున్నారు.

ఏది ఏమైనా ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘బహుశా దాని ఓనర్ అయి ఉంటాడు..అందుకే ఆ మొసలి ఏమీ చేయలేదు’.. అంటూ కొందరు, ‘ఇలాంటి పనులు చేయడం ప్రమాదకరం’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1400కి పైగా లైక్‌లు, 1.19 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ వర్సెస్ సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్‌..

ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ వర్సెస్ సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్‌

ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ, సస్పెన్షన్‌లో ఐపీఎస్ ఆఫీసర్ సునీల్ కుమార్‌ల మధ్య సోషల్ మీడియా వేదికగా వార్ జరుగుతోంది. ఇద్దరూ సవాళ్లు, ప్రతి సవాళ్లతో తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

అమరావతి, మార్చి 01: ఆంధ్రప్రదేశ్ ఉప సభాపతి రఘురామకృష్ణరాజు, సస్పెన్షన్‌లో ఉన్న ఐపీఎస్‌ అధికారి పీవీ.సునీల్‌ కుమార్‌ల మధ్య సోషల్ మీడియా వేదికగా వేడి రాజుకుంది. సామాజిక, ప్రసార మాధ్యమాల వేదికగా ఒకరిపై మరొకరు వ్యంగ్యాస్త్రాలు సంధించుకుంటున్నారు. ఎమ్మెల్యేల క్రీడాపోటీల్లో క్రికెట్ ఆడుతున్న క్రమంలో ఇటీవల రఘురామ కిందపడి గాయపడ్డారు. ఆయన చేతికి మణికట్టుకు గాయవ్వగా.. చేతికి కట్టుతోనే అసెంబ్లీకి హాజరయ్యారు. రఘురామ గాయంపై సస్పెన్షన్‌లో ఉన్న ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు. ‘రఘురామ.. కస్టోడియల్‌ టార్చర్‌ కథ అబద్ధం. ఆటలో పడిపోతేనే రెండు ఎముకలు విరిగాయి. అలాంటిది నిజంగా కొట్టి ఉంటే.. ఎన్ని ఎముకలు విరిగేవి అధ్యక్షా?’ అని వ్యంగ్యంగా పోస్ట్ చేశారు.
దీనికి డిప్యూటీ స్పీకర్ రఘురామ దీటుగా బదులిచ్చారు. ‘సర్వీస్‌ కాల సస్పెన్షన్‌లో ఉన్న సునీల్‌ కుమార్‌ అనుమతిస్తే నాకు కేవలం అరగంట చాలు.. కస్టడీలో నన్ను హింసించినట్టుగా.. కాళ్లు కట్టేసి పాదాలపై కర్ర, రబ్బర్ బెల్ట్‌తో రక్తపు చారల మచ్చలు పడేలా కొట్టగలను. సునీల్‌ కుమార్‌ వచ్చి కొట్టించుకుని, నిరూపించుకుంటాను అంటే బహిరంగంగానే ఈ కార్యక్రమం పెట్టేందుకు సిద్ధం’ అని రఘురామ సవాల్‌ విసిరారు.

న్యాయ వ్యవస్థపై తనకు పూర్తిగా నమ్మకముందని ఈ సందర్భంగా రఘురామ అన్నారు. ‘న్యాయ వ్యవస్థపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. నాపై కస్టోడియల్‌ హింసకు పాల్పడిన సునీల్‌ కుమార్‌ అరెస్ట్‌ తథ్యం’ అని ఆయన హెచ్చరించారు.

ఈ కోతి ముందు స్పైడర్ మ్యాన్‌ కూడా దిగదుడుపే.. ఏం చేసిందో మీరే చూడండి..

ఈ కోతి ముందు స్పైడర్ మ్యాన్‌ కూడా దిగదుడుపే.. ఏం చేసిందో మీరే చూడండి..

 

ఒక కోతి చేసిన సాహస విన్యాసానికి సంబంధించిన పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ కోతి చాలా ఎత్తుగా ఉన్న గోడ వద్దకు వచ్చింది. సాధారణంగా ఆ గోడను ఎక్కడం అసాధ్యం. అయితే..

కోతి చేష్టలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలా సార్లు ఆ పనులు చిరాకు పుట్టించినా.. అప్పుడప్పుడూ అందరినీ ఆలోచింపజేస్తాయి. కొన్నిసార్లు ఆ కోతి చేష్టలు అందరికీ కనువిప్పు కూడా కలిగిస్తుంటాయి. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ కోతి గోడ ఎక్కేందుకు చేసిన స్టంట్స్ చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ఈ కోతి స్పైడర్ మ్యాన్‌ను మించిపోయిందిగా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..
ఒక కోతి చేసిన సాహస విన్యాసానికి సంబంధించిన పాత వీడియో (Viral Video) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ కోతి చాలా ఎత్తుగా ఉన్న గోడ వద్దకు వచ్చింది. సాధారణంగా ఆ గోడను ఎక్కడం అసాధ్యం. అయితే ఎలాగైనా ఆ గోడను ఎక్కేయాలని కోతి ఫిక్స్ అయింది. మొదటగా బలంగా ఓ జంప్ చేసింది. అయితే తీరా నాలుగు, ఐదు అడుగుల ఎత్తు మేర ఎగిరి కిందపడుతుంది. ఆ తర్వాత ఇంకాస్త వెనక్కు వెళ్లి.. మళ్లీ ఒక్క జంప్ చేసి గోడ మధ్యలో ఉన్న రంధ్రంలో చేయి పెట్టి వేలాడుతుంది.

ఆ తర్వాత కొంచెం కొంచెం పక్కకు జరుగుతూ వచ్చి.. చివరగా అనుకున్నట్లుగానే ఆ గోడను పూర్తిగా పైకి ఎక్కేసింది. ఇలా కోతి అనుకున్న విధంగా అంత పెద్ద గోడను (monkey climbed up the high wall) సైతం ఎంతో అవలీలగా ఎక్కేసిందన్నమాట. ఆ తర్వాత దానికి అది చాలా సింపుల్ అయిపోయింది. స్పైడర్ మ్యాన్ తరహాలో మళ్లీ పైనుంచి కిందకు దూకి, మళ్లీ పైకి ఎక్కడం ఇలా స్టంట్స్ చేస్తూనే ఉందన్నమాట. చూసేందుకు ఇది సింపుల్‌గా అనిపిస్తున్నా కూడా.. చాలా మందికి ఇది ఇన్‌స్పైర్ కలిగించేలా ఉంది.

టీ20 డబ్ల్యూసీ: పాకిస్థాన్ ఓపెనర్ విధ్వంసం.. కోహ్లీ వరల్డ్ రికార్ట్ బ్రేక్..

టీ20 డబ్ల్యూసీ: పాకిస్థాన్ ఓపెనర్ విధ్వంసం.. కోహ్లీ వరల్డ్ రికార్ట్ బ్రేక్

టీ20 ప్రపంచ‌క‌ప్‌ 2026లో పాకిస్థాన్ యువ ఓపెన‌ర్ సాహిబ్జాదా ఫర్హాన్ త‌న సూప‌ర్ ఫామ్‌ను కొన‌సాగించాడు. నిన్న శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ బాది.. పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.

స్పోర్ట్స్ డెస్క్: టీ20 ప్రపంచ కప్( T20 World Cup 2026) టోర్నీ నుంచి పాకిస్థాన్ నిష్క్రమించిన సంగతి తెలిసిందే. నిన్న(శనివారం) శ్రీలంక జట్టుపై విజయం సాధించినప్పటికీ నెట్ రన్‌రేట్ తక్కువగా ఉండటంతో సెమీస్ కు చేరలేకపోయింది. ఇంతటి నిరాశలో పాకిస్థాన్ జట్టుకు ఊరటనిచ్చే అంశం ఒకటి ఉంది. ఆ జట్టు యువ ఓపెన‌ర్ సాహిబ్జాదా ఫర్హాన్ త‌న సూప‌ర్ ఫామ్‌ను కొన‌సాగించాడు. ప‌ల్లెకెలె వేదిక‌గా శ్రీలంక‌తో జ‌రిగిన కీల‌క మ్యాచ్‌లో ఫర్హాన్ అద్భుత‌మైన సెంచ‌రీతో చెల‌రేగాడు. ఇన్నింగ్స్ తొలి ఓవ‌ర్ నుంచే ప్రత్యర్థి బౌల‌ర్లను ఊచకోత కోశాడు.
గ్రూప్-2లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఫర్హాన్ 60 బంతుల్లో 100 పరుగులు చేశాడు. ఇందులో 9 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. ఈ అద్భుత ఇన్నింగ్స్‌తో ఫర్హాన్ ప‌లు రికార్డుల‌ను త‌న పేరిట లిఖించుకున్నాడు. అలానే క్రికెట్ దిగ్గజ ప్లేయర్ విరాట్ కోహ్లీ పేరిట ఉన్న ఓ రికార్డును కూడా ఫర్హాన్ బ్రేక్ చేశాడు. టీ20 ప్రపంచ కప్ ఒక‌ ఎడిష‌న్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఫ‌ర్హాన్ చరిత్ర సృష్టించాడు. ఇప్పటివ‌ర‌కు ఈ రికార్డు కోహ్లీ పేరిట ఉండేది. టీ20 ప్రపంచకప్‌ 2014లో విరాట్ 319 పరుగులు చేశాడు. 2026 ఎడిషన్‌లో ఫర్హాన్ 383 ప‌రుగులు చేసి.. కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డును ఫర్హాన్ బద్దలు కొట్టాడు. అలానే టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ ఒక‌ ఎడిష‌న్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన ఆట‌గాడిగా వెస్టిండీస్ ప్లేయర్ షిమ్రోన్ హెట్‌మయెర్(17)ను ఫ‌ర్హాన్(18) అధిగ‌మించాడు. అలానే పొట్టి ప్రపంచకప్ చరిత్రలో ఒకే ఎడిషన్‌లో రెండు సెంచరీలు బాదిన తొలి బ్యాటర్‌గా ఫర్హాన్ అరుదైన ఘనత సాధించాడు. అదేవిధంగా టీ20 ప్రపంచ‌క‌ప్‌లో రెండు సెంచ‌రీలు చేసిన ఆటగాడిగా క్రిస్ గేల్ సరసన ఫర్హాన్ చేరాడు.

బంగారం ధరలకు రెక్కలు.. రూ.1.73 లక్షలు దాటిన పది గ్రాముల పసిడి..

బంగారం ధరలకు రెక్కలు.. రూ.1.73 లక్షలు దాటిన పది గ్రాముల పసిడి..

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల ప్రభావంతో బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. శనివారం నుంచి భారీ పెరుగుదలను నమోదు చేస్తున్నాయి. యుద్ధం కారణంగా పది గ్రాముల బంగారం ధర మళ్లీ రూ.2 లక్షలు దాటే అవకాశముందని అంచనాలు వెలువడుతున్నాయి.

 

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల ప్రభావంతో బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. శనివారం నుంచి భారీ పెరుగుదలను నమోదు చేస్తున్నాయి. యుద్ధం కారణంగా పది గ్రాముల బంగారం ధర మళ్లీ రూ.2 లక్షలు దాటే అవకాశముందని అంచనాలు వెలువడుతున్నాయి. రానున్న కొద్ది రోజుల్లో బంగారం ధర రూ.2 లక్షలకు, వెండి ధర రూ.4 లక్షలకు చేరుకుంటాయని నిపుణులు భావిస్తున్నారు (Gold prices).
ఈ రోజు (మార్చి 1న) ఉదయం 11:30 గంటల సమయంలో హైదారాబాద్ బులియన్ మార్కె‌ట్‌లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,73,080కు చేరుకుంది. నిన్నటి ధరతో పోల్చుకుంటే రూ.4,300కు పైగా పెరిగింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,58,650 దగ్గర ఉంది (live gold rates). నిన్నటి ధరతో పోల్చుకుంటే రూ.4000 పెరిగింది.

ఇక, దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.1,73,230కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.1,58,800కి చేరుకుంది. మరోవైపు వెండి ధర మళ్లీ మూడు లక్షల రూపాయల మార్క్‌ను దాటేసింది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.3.25 లక్షలుగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.2.95 లక్షలుగా ఉంది.

శంషాబాద్ ఎయిర్ పోర్టులో పలు విమానాల రద్దు.. గల్ఫ్ ప్రయాణికుల అవస్థలు..

శంషాబాద్ ఎయిర్ పోర్టులో పలు విమానాల రద్దు.. గల్ఫ్ ప్రయాణికుల అవస్థలు

 

ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ విమానయాన రంగంపై తీవ్ర ప్రభావం పడింది. ముఖ్యంగా హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సిన విమాన సర్వీసులు భారీగా రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

 ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల కారణంగా విమానయాన సంస్థలు తమ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా విమాన మార్గాలను మార్చడం లేదా రద్దు చేస్తున్నాయి. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ (Shamshabad Airport) నుంచి ప్రధానంగా గల్ఫ్, అరబ్ దేశాలకు వెళ్లే సర్వీసులపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. శంషాబాద్ నుంచి వివిధ దేశాలకు వెళ్లాల్సిన 23 విమాన సర్వీసులు రద్దయ్యాయి. అదేవిధంగా వివిధ దేశాల నుంచి హైదరాబాద్‌కు రావాల్సిన 21 విమాన సర్వీసులు కూడా నిలిచిపోయాయి. దుబాయ్, దోహా (ఖతార్), కువైట్, దమ్మమ్, సౌదీ అరేబియా, షార్జా, అబుదాబి, జెడ్డా, మస్కట్ దేశాలకు వెళ్లాల్సిన 23 విమాన సర్వీసులు రద్దయ్యాయి.

ప్రయాణికుల ఆందోళన..

ముందస్తు సమాచారం లేకుండా విమానాలు రద్దు కావడంతో ఎయిర్ పోర్టులో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇతర దేశాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు తమ కనెక్టింగ్ ఫ్లైట్స్ మిస్ అవుతున్నామని ఆందోళన చెందుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రయాణికులు ఎయిర్ పోర్టులోనే పడిగాపులు కాస్తున్నారు. కొన్ని సంస్థలు టికెట్ రీఫండ్ లేదా ప్రత్యామ్నాయ తేదీలను కేటాయిస్తున్నప్పటికీ, యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో సర్వీసులు ఎప్పుడు పునరుద్ధరిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది.

యుద్ధం కారణంగా విమాన మార్గాల్లో మార్పులు

ఇరాన్, ఇజ్రాయెల్ వైమానిక క్షేత్రాలను మూసివేయడం లేదా ప్రమాదకరంగా ప్రకటించడం వల్ల విమానాలు సుదీర్ఘ మార్గాల్లో ప్రయాణించాల్సి వస్తోంది. దీనివల్ల విమాన ప్రయాణ కాలం 2 నుంచి 3 గంటలు పెరుగుతోంది. సుదీర్ఘ మార్గాల వల్ల ఇంధన ఖర్చు పెరిగి, విమాన టికెట్ల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతానికి ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. గల్ఫ్ దేశాలకు ప్రయాణించాలనుకునే వారు తమ విమాన సంస్థల నుంచి అధికారిక సమాచారం అందిన తర్వాతే ఎయిర్ పోర్టుకు బయలుదేరడం శ్రేయస్కరమని పలువురు చెబుతున్నారు.

ఖమేనీ మృతికి ప్రతీకారం తీర్చుకుంటాం.. అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్ హెచ్చరిక..

ఖమేనీ మృతికి ప్రతీకారం తీర్చుకుంటాం.. అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్ హెచ్చరిక..

 

సుప్రీం లీడర్ అయుతొ

ల్లా అలీ ఖమేనీ మృతికి కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. ఖమేనీ మృతిని ఇరాన్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది.

సుప్రీం లీడర్ అయుతొల్లా అలీ ఖమేనీ మృతికి కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. ఖమేనీ మృతిని ఇరాన్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. దాడులకు పాల్పడిన వారిపై కచ్చితంగా బదులు తీర్చుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు ఇరాన్ క్యాబినెట్ ఓ ప్రకటన విడుదల చేసింది (Iran retaliation warning).

సంఘమిత్ర హైస్కూల్‌లో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు

సంఘమిత్ర హైస్కూల్‌లో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు

 వరంగల్, నేటిధాత్రి:

National Science Day celebrations at Sanghamitra HighSchool

వరంగల్ జిల్లా దేశాయ్‌పేట్ రోడ్డులోని సంఘమిత్ర హైస్కూల్‌లో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించినట్లు పాఠశాల కరస్పాండెంట్ ఎం. వెంకటేశ్వర్ రెడ్డి, ప్రిన్సిపాల్ డి. మహేందర్ తెలిపారు.ఈ సందర్భంగా నోబెల్ బహుమతి గ్రహీత, భౌతిక శాస్త్రవేత్త సి వి రామన్ చిత్రపటానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కరస్పాండెంట్ మాట్లాడుతూ, 1928 ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్ ద్వారా కాంతి పరిక్షేపణ సిద్ధాంతాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప శాస్త్రవేత్త సి.వి. రామన్ అని పేర్కొన్నారు. భౌతిక శాస్త్రంలో చేసిన విశిష్ట సేవలకు గాను ఆయన 1930లో నోబెల్ బహుమతిని అందుకున్నారని తెలిపారు.దేశంలో సైంటిఫిక్ టెంపర్, పరిశోధన, ఆవిష్కరణలకు ప్రోత్సాహం కల్పించేందుకు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని వివరించారు.ప్రిన్సిపాల్ మహేందర్ మాట్లాడుతూ, సైన్స్‌కు జీవితాంతం అంకితమైన మహనీయుడు సి.వి. రామన్ ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు శాస్త్ర విజ్ఞానంపై ఆసక్తి పెంపొందించుకోవాలని, వినూత్న ఆలోచనలతో కొత్త ఆవిష్కరణలు చేయాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా విద్యార్థులు తయారు చేసిన సైన్స్ ప్రాజెక్టులు, నమూనాలను ప్రదర్శించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రోత్సహించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

 

 

సమూల మార్పులతో తెలంగాణలో నూతన విద్యావిధానం

· నివేదిక సమర్పించిన ఏకసభ్య కమిటీ

· అబ్జెక్టివ్ పద్ధతినుంచి, సమగ్ర అభ్యసనం దిశగా మార్పు

· కోచింగ్ సెంటర్లకు కష్టాలు తప్పవు

· ప్రైవేటు స్కూళ్ల విచ్చలవిడి ఫీజులపై నియంత్రణ

· కార్పొరేట్ స్థాయిలో తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు

· ఈఏపీసీఈటీ ప్రవేశపరీక్ష రద్దు

· 12వ తరగతి (ఇంటర్మీడియట్) మార్కుల ఆధారంగా సీట్లు

· టీచర్లకు ఆటోమేటిక్ ప్రమోషన్లకు స్వస్తి

· పనితీరు ఆధారంగా ప్రమోషన్లు

· ప్రాథమిక స్థాయి నుంచే కత్రిమమేధకు ప్రాధాన్యం

· నర్సరీ నుంచి పీజీ వరకు ఇంగ్లీష్ మీడియం

· 1వ క్లాస్ నుంచి త్రిభాషా సూత్రం అమలు

హైదరాబాద్, నేటిధాత్రి: 

కొత్త విద్యావిధానంపై అధ్యయనం చేసేందుకు నియమించిన ఏకసభ్య కమిటీ తన నివేదికను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సమర్పించడం తాజా పరిణామం. పదవీ విరమణ చేసిన ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి ఈ కమిటీకి నేతత్వం వహించారు. “ఎడ్యుకేషన్ పాలసీ ఆఫ్ తెలంగాణ`2026: విజన్ ఫర్ ఇన్‌క్లూజివ్ ఎక్స్‌లెన్స” పేరుతో ఈ నివేదికను తయారుచేసారు. ప్రస్తుతంఅమల్లో వున్న విద్యావిధానంలో సమూల మార్పులను కమిటీ సిఫారసు చేసింది. ముఖ్యంగా వి ద్యార్థి కేంద్రంగా ఈ విద్యావిధానం వుండటం కీలకం. 

ఈ కమిటీ చేసిన సిఫారసులు ఈవిధంగా వున్నాయి.

· ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీల ఉమ్మడి ప్రవేశపరీక్ష (ఈఏపీసీఈటీ)ని రద్దు చేయాలి. 12వ తరగతి లేదా ఇంటర్మీడియట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగానే ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించాలి. 

· నర్సరీ నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు ఇంగ్లీషు మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలి. ఇదే సమయంలో 1వ తరగతినుంచి త్రిభాషా సూత్రాన్ని అమలు చేయాలి.

· ఇప్పటివరకు అమల్లో వున్న ఉపాధ్యాయులకు ఆటోమేటిక్ ప్రమోషన్ విధానానికి స్వస్తి పలకాలి. టీచర్ పనితీరు ప్రమాణంగా మాత్రమే ఇక ముందు ప్రమోషన్లు కల్పించాలి.

· ప్రస్తుతం రాష్ట్రంలోని రెండువేల పాఠశాలలను తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌గా మార్చాలి. అంతేకాదు నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే క్యాంపస్‌లో నిర్వహించాలి.

· ఎస్.ఎస్.సి.(10వ తరగతి), ఇంటర్మీడియట్ (12వ తరగతి) బోర్డులను విలీనం చేసి, బోర్డు పరీక్షలను కేవలం 12వ తరగతి స్టాండర్డ్‌లోనే నిర్వహించాలి.

· 2026-27 విద్యాసంవత్సరం నుంచి విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్‌లో పాలు (విజయ డైరీ) త ప్పనిసరిగా ఇవ్వాలి.

· ప్రాథమిక విద్య స్థాయినుంచే కత్రిమమేధ (ఏఐ) పాఠ్య ప్రణాళికలో చేర్చాలి.

· ఈ ఏఐ పాఠ్య ప్రణాళికకు అనుగుణంగా టీచర్లు, అధ్యాపకులకు స్వల్పకాలిక ఏఐ ట్రైనింగ్‌ను నిర్వహించాలి. అంటే ఇప్పటికి కాలం చెల్లిన టెక్నికల్ ప్రోగ్రామ్‌ల స్థానంలో ఏఐ ఆధారిత కోర్సులకు ఈ ట్రైనింగ్‌ల్లో ప్రాధాన్యతనివ్వాలి.

· ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్‌లో ఈ విధానం విజయవంతమైన నేపథ్యంలో, మిగిలిన 100 నియోజకవర్గాల్లో ఈ స్కూళ్లను పైలెట్ ప్రాతిపదికన ప్రారంభించాలని కమిటీ సిఫా రసు చేసింది. 

· ప్రతి స్కూల్‌ను 4-5 ఎకరాý విస్తీర్ణంలో ఏర్పాటు చేయాలి. ఒక్కొక్క తరగతి గదిని 30 మంది విద్యార్థుల సామర్థ్యంతో నిర్మించాలి. 

· తరగతి గదులు డిజిటల్ అభ్యసనానికి అనువుగా ఇం{రాక్టివ్ ఫ్లాట్ ప్యానళ్లు (ఐఎఫ్‌పీ లు), డ్యూయల్ డెస్క్‌లు, గ్రీన్ బోర్డులు ఏర్పాటు చేయాలి.

· పూర్తి స్థాయి పరికరాలతో సైన్స్ ల్యాబ్‌లు, కంప్యూటర్ ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలి. వీటితో పాటు ఆధునిక ఫర్నీచర్‌తో లైబ్రరీలను ఏర్పాటు చేయాలి.

· విద్యార్థులకు పాఠశాలకు వచ్చి వెళ్లేందుకు వీలుగా ప్రత్యేకంగా స్కూల్ బస్సు సదుపా యం కల్పించాలి. 

· అగ్రశ్రేణి కార్పొరేట్ విద్యాసంస్థల మాదిరిగానే క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలి.

· సోలార్ ప్యానళ్లు, ఎలఈడీ లైటింగ్, ప్రకతి వ్యవసాయం కోసం న్యూట్రిషన్ గార్డెన్‌లు ఏర్పాటు చేయాలి. 

· పాలిటెక్నిక్ కళాశాలలు, అడ్వాన్స్‌డ్ టెక్నికల్ సెంటర్లలో కూడా ఏఐ విద్యను తక్షణం ప్రవేశపెట్టాలి. 

· యూనివర్సిటీల్లో సెల్ఫ్ ఫైనాన్సింగ్ సిస్టమ్‌ను రద్దు చేసి, ఆయా కోర్సును రెగ్యులర్ చే యాలి.

· యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్‌ను పునర్‌వ్యవస్థీకరించి, వైస్`ఛాన్స్‌లర్ నియామకా ల్లో పారదర్శకంగా పనిచేసే సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేయాలి.

· ప్రైవేటు పాఠశాలల్లో ఫీజు నియంత్రణ, ఫీజు నిర్మాణ ప్రక్రియ ఏవిధంగా వుండాలనేది నిర్ణయించేందుకు రిటైర్డ్ జడ్జి లేదా ప్రధాన కార్యదర్శి నేత త్వంలో ఒక రాష్ట్రస్థాయి కమిటీని ఏర్పాటుచేయాలి.

కమిటీ నివేదికలో పేర్కొన్న సిఫారసుల ప్రకారం తొలిదశ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటుకు అవసరమైన ఆర్థిక దన్నుతో పాటు కొత్త సంస్కరణలను అమల్లోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు ముందుకు వేస్తున్నది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో 100 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను (టీపీఎస్) 2026`27 విద్యాసంవత్సరం నుంచి ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవం త్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్‌కు ఆవల ప్రతి నియోజకవర్గంలో ఒక టీపీఎస్ స్కూల్‌ను ప్రభుత్వం నిర్మిస్తుంది. ఇందులో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే క్యూర్ (కాంప్రహెన్సివ్ అర్బన్ రీవైటలైజేషన్Ê ఎడ్యుకేషన్) కింద ప్రణాళికలు తయారుచేసిన 12 సమీకత పాఠశాలల్లో, అవసరమైన మౌలిక సదుపాయాలను ఏడాదిలోగా పూర్తిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ పాఠశాలల నిర్మాణం ప్రస్తుతం కొండర్గ్, ఆరుట్ల, కల్వకుర్తి, u£ట్టుగూడ, మిర్యాలగూడల్లో కొనసాగుతోంది. 

తెలంగాణ బడ్జెట్ 2026-27లో విద్యకు అత్యంత ప్రాధాన్యతనివ్వనున్నారు. మొత్తం బడ్జెట్ రూ.3.2 నుంచి 3.25లక్షలకోట్లుగా వుండే అవకాశముంది. ఇందులో విద్యకు అగ్రతాంబూలం ఇ వ్వడానికే ప్రభుత్వం కతనిశ్చయంతోవుంది. 2025‘26 బడ్జెట్‌లో ప్రభుత్వం విద్యకు రూ.23,108కోట్లు కేటాయించింది. ఇది అంతకుముందు ఏడాది కంటే 13.5% ఎక్కువ. టీపీఎస్‌ల కోసం ఈ ఏడాది ప్రభుత్వం బడ్జెట్‌లో విద్యకు మరింత ఎక్కువ పెట్టుబడులు పెట్టక తప్పదు. గతంలో రాష్ట్రంలోని 58 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌కు ప్రభుత్వం రూ.11,600కోట్లు కేటాయించింది. ఈ మొత్తంతో వీటిల్లో టీపీఎస్‌లకు నిర్దేశించిన మౌలిక స దుపాయాలే కల్పిస్తారు. ఇక రాష్ట్రంలోని 65 ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్స్ (ఏటీసీ)లుగా అభివద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.2324.2 కోట్లు కాగా టాటా టెక్నాలజీస్‌తో పాటు ఇందులో ప్రభుత్వం, రూ.308కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఇక బ్రేక్‌ఫాస్ట్ లో విజయపాలు ఇవ్వాలని నిర్ణయించడం వల్ల, డైట్ చార్జ్‌లకు 40% వరకు ప్రభుత్వం పెంచ నుంది.  

ఈఏపీసెట్‌ను రద్దు చేయడం ద్వారా ప్రభుత్వం విద్యార్థులను విపరీత మానసిక ఒత్తిడినుంచి విముక్తి చేయనున్నది. ముఖ్యంగా ప్రైవేటు కోచింగ్ సెంటర్లు, కోచింగ్ ఈపీసెట్ పెరుతో పెద్ద మొత్తంలో ఫీజులు వసూలు చేస్తుండటంతో విద్యార్థులపై ఆర్థిక భారం విపరీతంగా పడుతోంది. క మిటీ సిఫారసు మేరకు 12వ తరగతి మార్కుల ఆధారంగా సీట్ల కేటాయింపు జరగడంవల్ల వి ద్యార్థులకు మానసిక ఒత్తిడినుంచి, వారి తల్లిదండ్రులకు ఫీజుల భారం నుంచి విముక్తి కలుగ నుంది. ప్రస్తుతం ప్రభుత్వం అమల్లోకి తెస్తున్న విద్యావిధానం ద్వారా, విద్యార్థులు తిరిగి తరగతి గదుల్లో సమగ్ర పాఠ్యాంశాల అభ్యసన ప్రక్రియకు మళ్లుతారు. అంటే ఇప్పుడు కేవలం ఆబ్జెక్టివ్ ప్రశ్నల ఆధారిత పరీక్షా విధానం ఆధారంగా జరిగే అభ్యసకు స్వస్తి పలుÅ£నున్నారు. ఇక నర్సరీ నుంచి పీజీ వరకు ఇంగ్లీషు మాధ్యమంలో చదవడం వల్ల గ్రామీణ ప్రాంతాలు ముఖ్యంగా వెనుకబడిన వర్గాలవారు ఆంగ్లభాష రాకపోవడమన్న ఇబ్బందినుంచి బయటపడతారు. ఫలితంగా ఉ ద్యోగాల్లో గట్టి పోటీ ఇవ్వడమే కాకుండా, అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలను తేలిగ్గా నేర్చుకోగ లుగుతారు. ఇక ప్రాథమిక స్థాయినుంచే ఏఐ పాఠ్యప్రణాళికను అమలుచేయడంవల్ల, గ్లోబల్ డిజిటల్ ఎకానమీ, 2047 నాటికి 3 ట్రిలియన్ల ఎకానమీ సాధనకు అనువైన నైపుణ్యాలను విద్యార్థులు అలవరచుకోగలుగుతారు. తెలంగాణ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ అథారిటీ (టీఈఎసఏ), ప్రైవే టు స్కూళ్లలో ఫీజుల నియంత్రణపై ప్రధానంగా దష్టి కేంద్రీకరిస్తుంది. ముఖ్యంగా విద్య వాణిజ్యీకరణను నిరోధించడమే కాకుండా, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో సమాన విద్యాప్రమాణాలు కొ నసాగేలా చూస్తుంది. 

అయితే ఈ కొత్త విద్యావిధానంపై విమర్శలు కూడా లేకపోలేదు. మరింత సమర్థవంతమైన టీచర్ ట్రైనింగ్ లేకుండా ఇంగ్లీషు మీడియం విద్య ఎంతవరకు విజయవంతమవుతుందనేది కొందరు వ్యక్తం చేస్తున్న అనుమానం. ప్రస్తుతం పాఠశాలల్లో అమలు చేయాలనుకుంటున్న పోషకాహార పథకాల అమలుకు 2031 నాటికి రూ.31600 కోట్లు అవసరం. నిజం చెప్పాలంటే విద్యావిధా నంలో ప్రస్తుతం తీసుకువస్తున్న మార్పుల వల్ల “కోచింగ్ కల్చర”నుంచి విద్యార్థులకు విముక్తి కలుగుతుంది. ఇదే సమయంలో టీచర్లు, అధ్యాపకుýను జవాబుదారులుగా చేయడంవల్ల ఇప్పటి మాదిరి ఉద్యోగ భద్రత వుండకపోవచ్చు. 

ఈఏపీసెట్ రద్దువల్ల ఇప్పుడు కోచింగ్ సెంటర్లకు కష్టాలు మొదలవుతాయి. ఇప్పటివరకు కార్పొ రేట్ కళాశాలలు, ఈ కోచింగ్‌ల పేరుతో లక్షల రూపాయలు ఆర్జిస్తున్నాయి. కోచింగ్‌ల్లో కూడా రకరకాలు ప్రవేశపెట్టి మరీ విద్యార్థుల తల్లిదండ్రులనుంచి ముక్కుపిండి చేసే వసూలు ప్రక్రియ లకు ఇక ఫుల్‌స్టాప్ పడుతుంది. అదీకాకుండా ప్రైవేటు విద్యాసంస్థలు బోధనలో ఆబ్జక్టివ్ మెథడ్, షార్ట్‌క్ మెథడ్‌లను అనుసరించే విధానానికి అడ్డుకట్ట పడుతుంది. అవి కూడా తప్పనిసరిగా సమగ్ర పాఠ్యప్రణాలికను అనుసరించే విధంగా పద్ధతులు మార్చుకోక తప్పదు. ఇప్పటివరకు ఈఏపీసెట్ కోచింగ్‌పై ఆధారపడి కొనసాగుతున్న చిన్నపాటి కోచింగ్ సెంటర్లు మూతపడటమో లేక ఏఐ లేదా జాతీయ స్థాయి జీఈఈ/నీట్ పరీక్షల కోచింగ్‌కు మరలక తప్పదు. తెలంగాణ పబ్లిక్ స్కూళ్లలో కార్పొరేట్ స్థాయి సదుపాయాల కల్పన వల్ల, ప్రస్తుతం డిజిటల్ సౌకర్యాలు లేకుండా నడుస్తున్న ప్రైవేటు పాఠశాలలనుంచి, మధ్యతరగతి విద్యార్థులు పెద్దఎత్తున టీపీఎస్‌లకు మారే అవకాశాలు పుష్కలం! ఈ కమిషన్ పనితీరు ఆధారిత మూల్యాంకనానికి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల, ఒక టీచర్ బోధించే విద్యార్థుల సగటు గ్రేడు వద్ధిని బట్టి, మెరుగుదల అంచనాలు వేస్తారు. ప్రభుత్వం నియమించిన కె.కేశవరావు కమిటీ ఈ మూల్యాంకనాలకు పాటించాల్సిన నిబంధనల పై అధ్యయనం చేస్తోంది. ముఖ్యంగా ఇవి రాజకీయాలకు అతీతంగా, పారదర్శకంగా, నిస్సాక్షి కంగా వుండే విధంగా చూస్తున్నారు. 

ఇక టీచర్లకు తమ పనితీరు ఆధారంగా ఇన్సెంటివ్‌లు లభించనున్నాయి. ఐదేళ్ల కాలంలో విద్యార్థి అభ్యసన ఫలితాల (ఎసఎలఓ) లక్ష్యాలను అధిగమించిన టీచర్లు మాత్రమే “స్పెషల్ మెరిట్ ఇం క్రిమెంట్స”కు అర్హులవుతారు. ఇక హెడ్‌మాస్టర్, స్కూల్ అసిస్టెంట్ల ప్రమోషన్ 70శాతం వారి పనితీరు, 30% వారి సీనియారటీలపై ఆధారపడనున్నది. మారుమూల ప్రాంతాల్లోని టీపీఎస్ ల్లో పనిచేసే టీచర్లకు 10% “హార్డ్‌షిప్ అలవెన్స”ను ప్రభుత్వం చెల్లిస్తుంది. ప్రైవేటు పాఠశాల లు డొనేషన్ల పేరుతో వసూళ్లను ప్రభుత్వం రద్దుచేయనుంది. ఇక వన్‌టైమ్ అడ్మిషన్ ఫీజుపై కూడా పరిమితి విధించనుంది. ప్రైవేటు స్కూళ్లు కూడా తమ ఫీజు వివరాలను ప్రభుత్వ పోర్టల్‌లో వుంచాలి. ఫీజు నిబంధనలు ఉల్లంఘించిన పాఠశాలలకు వాటి స్థాయిని బట్టి రూ.1లక్ష నుంచి రూ.10లక్షల వరకు పెనాల్టీ విధిస్తారు. అధిక ఫీజులు వసూలు చేసిన సంస్థలు, 30 రోజుల్లోగా వడ్డీతో సహా అదనపు మొత్తాన్ని తల్లిదండ్రులకు చెల్లించాల్సి వుంటుంది. ప్రతి జిల్లా కేంద్రంలో డీఈఓ నేతత్వంలో “గ్రీవెన్స్ సెల్స్‌ను” ఏర్పాటు చేస్తారు. ఇందులో తలిదండ్రుల అసోసియేషన్ కు చెందిన ఒకరు సభ్యులుగా వుంటారు. ఇందులో తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదుకు సదరు స్కూల్ వారం రోజుల్లోగా తప్పనిసరిగా స్పందించాలి. దీనికి సంబంధించిన విధివిధానాలకు కె.కేశవ రావు కమిటీ తుదిరూపం ఇస్తోంది. ఒకవేళ డీఈఓ చర్యలు తీసుకోవడంలో విఫలమైతే, ఆటో మేటిక్‌గా ఈ ఫిర్యాదు రాష్ట్రస్థాయికి వెళ్లే విధంగా నిబంధనలు రూపొందిచనున్నారు.

“కవిత” కు క్లీన్ చిట్!

`కడిగిన ముత్యంలా “కవిత”.

`ఆనాడే చెప్పిన “నేటిధాత్రి”.

`ఎంతో దైర్యంగా అందరికంటే ముందే రాసిన “నేటిధాత్రి”.

`కక్ష సాధింపులో భాగంగానే “కవిత” అరెస్ట్ అని కూడా దైర్యంగా రాసిన పత్రిక “నేటిధాత్రి”.

`ఎప్పటికైనా కేసు నిలవదని రాసిన “నేటిధాత్రి”.

`అక్రమంగా 5 నెలల పాటు కవిత” ను జైలు పాలు చేశారు.

`మూడేళ్ల పాటు”కవిత”ను రాజకీయంగా అణచివేసే కుట్రలు చేసారు.

`వ్యక్తిగతంగా “కవిత”కు అప్రతిష్ట మూటగట్టారు!

`“కవిత” రాజకీయ జీవితాన్ని చిదిమేసే కుట్రకు తెరలేపారు.

`“బీఆరఎస” పార్టీ ఓటమికి కారకులయ్యారు.

`“కవిత” ను అవినీతి పరురాలుగా చిత్రీకరించారు.

`“కవిత” కు అనుకూలంగా నిజ నిజాలు రాస్తే “నేటిధాత్రి” ని దుమ్మెత్తి పోశారు.

`“నేటిధాత్రి”ని కూడా నిందల పాలు చేశారు.

`“కవిత” కు మద్దతుగా వార్తలు రాస్తే అమ్ముడు పోయిన “నేటిధాత్రి” అని కూశారు.

`సోషల్ మీడియాలో “నేటిధాత్రి” ని విపరీతంగా ట్రోల్ చేశారు.

“కేసీఆర” కుటుంబాన్ని నమస్తే తెలంగాణా ను మించి జోకుతున్నారని ఏద్దేవా చేశారు.

`“కవిత”పై పెట్టిన అక్రమ కేసులపై నోరు తెరవడానికి “బిఆరఎస” నాయకులు కూడా ముందుకు రాలేదు.

”నమస్తే తెలంగాణా” కూడా “నేటిధాత్రి” అంత దైర్యంగా రాయలేదు.

`మొదటినుంచి న్యాయపరమైన అనేక అంశాలతో కూడిన విశ్లేషణలు చేసింది ఒక్క “నేటిధాత్రి” మాత్రమే..

`“కవిత” మీద కేసు అన్యాయమని అక్షర పోరాటం చేసింది కూడా ఒక్క “నేటిధాత్రి” మాత్రమే.

నిజాన్ని ఆనాడు దైర్యంగా రాసింది నేటిధాత్రి.. ఇప్పుడు గర్వంగా చెప్పగలుగుతోంది నేటిధాత్రి.

”బీఆరఎస” నాయకులే నిలబడకపోయిన.. “నేటిధాత్రి” అక్షరంలికవిత”కు అండగా నిలబడింది.

`కవిత తరుపున న్యాయం కోసం అక్షర పోరాటం చేసింది.

`అన్యాయాన్ని నేటిధాత్రి అక్షరాలు నిప్పు కణాలై కొట్లాడింది.

 

హైదరాబాద్, నేటిధాత్రి:                                       

 కాలం చాý విచిత్రమైనది. కొన్ని సార్లు క్రూరమైంది. సాఫీగా సాగుతున్న జీవితాలను సుడిగుండాలలోకి తోసేస్తుంది. మాజీ ఎంపి, ఎమ్మెల్సీ దేవనపల్లి కవిత జీవితంలో కల్లోలలం నింపింది. మూడు నాలుగేళ్లపాటు తన రాజకీయ జీవితంలో ఎదుర్కొరాన్నన్ని కష్టాలు తెచ్చిపెట్టింది. జరిగేవన్నీ మంచికని అనిపించేలా ఆఖరుకు తీర్పునిచ్చింది. ఇదంతా ఖర్మ అనుకునేలా చేసింది. సంబందం లేని నిందలను గుడి బండలు చేసి నెత్తిన వేస్తుంది. జీవితం అల్లకల్లోలం చేస్తుంది. ఏం జరుగుతుందో అర్దమయ్యే లోపే జీవితం ఆగమౌతుంది. విమర్శల జడివాన కురుస్తుంది. ఆరోపణల పిడుగులు కురిపిస్తుంది. గుండె దైర్యం చెదిరిపోయేలా చేస్తుంది. సమజాన్ని కాలమే తప్ప్పుదోవ పట్టిస్తుంది. మళ్లీ అదే కాలమే కొత్త లోకాన్ని చూపిస్తుంది. మేలిమి బంగారం మెరవాలంటే నిప్ప్పుల వానలో తడవాలన్నట్లు, గొప్ప గొప్పవారి జీవితాలకు ఇలాంటి అగ్ని గుండాలు ఎదురొస్తాయంటే ఇదేనేమో… ఏది ఏమైనా దేవనపల్లి కవిత జీవితంలో మళ్లీ ఆనందం నింపింది. ఆమె ఇరుకున్న కేసునుంచి కడిగిన ముత్యంలా కవిత బైటపడింది. ఇది ఆమెనే కాదు, ఆమెను అభిమానించే కోట్లాది మంది అభిమానులకు సంతోషం కలిగించింది. కవిత ఒక సామాన్యురాలు కాదు. ఆమె శక్తివంతమైన మహిళ. మహిళా లోకానికి దిక్సూచిగా నిలిచిన నాయకురాలు. నేటి పురుషాదిక్య సమాజంలో చైతన్యకాంతి కవిత. అలాంటి కవిత రాజకీయ ఎదుగుదల కొంత మందికి నచ్చలేదు. కొన్ని పార్టీలకు ఆమె రాజకీయ ప్రస్తానం అడ్డుగా మారింది. అంతే ఆమెపై లేనిపోని కుట్రలు చేశారు. కుతంత్రాలు చేశారు. ఆమె రాజకీయ జీవితాన్ని చిదిమేయాలని చూశారు. రాజకీయాల్లో వ్యక్తిగత కక్షలకు తావులేదు. ప్రజాస్వామ్య దేశంలో రాజకీయ వ్యవస్ధలో విలువలు లేని వారు అందలం ఎక్కాలనుకున్నప్ప్పుడు కవిత లాంటి నాయకులు అడ్డు అనుకున్నప్ప్పుడు ఇలాంటి అడ్డకుంటు సష్టిస్తుంటారు. అలాంటి కుట్రలకు బలైంది కవిత. ఎంతో ఉన్నత రాజకీయ భవిష్యత్తు వున్న ఆమెను రాజకీయాలకే మొత్తంగా దూరం చేయాలనుకున్నారు. అందుకు వ్యక్తులే కాదు, వ్యవస్దలు కూడా పనిచేశాయి. దాంతో ఆమె రాజకీయ జీవితం మరసబారుతుందనుకున్నారు. కాలం కొన్ని సార్లు వక్ర చూపు చూసినా, మళ్లీ తేరుకునే సమయం కూడా ఇస్తుంది. ఇప్ప్పుడు కూడా అదే జరిగింది. అయితే ఆమె అనుభవించిన ఆ కాలాన్ని ఎవరు తిరిగి తెచ్చి ఇవ్వగలరు? ఆమె వ్యక్తిగత స్వేచ్చను హరించి, ఆమెను జైలుకు పంపిక వారికి కూడా ఆనాడే తెలుసు. కాని కవిత రాజకీయం ఏకంగా ఒక పార్టీకే అడ్డంకిగా మాతుందని భయపడిందంటే కవిత నాయకత్వ పటిమ ఎంత బలమైందో అర్ధం చేసుకోవచ్చు. కుట్రలు, కుతంత్రాలు చేసి ఆమెను రాజకీయంగా పాతాలానికి తొక్కేయాలనుకున్నా, ఆమె ప్రతిష్ట ఇప్ప్పుడు ఎవరెస్టు శిఖరమంతా ఎదిగింది. ఆమె ఎదుర్కొన్న కేసులో పస లేదని సాక్ష్యాత్తు న్యాయ స్ధానం తీర్పునిచ్చింది. ఆమెకు స్వేచ్చను న్యాయ స్దానం ప్రసాదించింది. కవిత ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఎదిగిన నాయకురాలు కాదు. స్వయం ప్రతిపత్తితో ఆమె నాయకురాలిగా ఎదిగింది. ఆమె నాయకురాలు కాకముందు ప్రజా సేవకురాలు. సామాజిక సేవకురాలు. తెలంగాణ ఉద్యమ కారురాలు. మలి దశ ఉద్యమానికి బతుకమ్మతో ఊపిరి పోసిన నాయకురాలు. అలాంటి నాయకురాలు మీద నిందలు వేశారు. ఆమె రాజకీయ జీవితంలో నిప్ప్పులు పోశారు. కాని ఆ నిప్ప్పులు, ఆ నిందలు ఆమెను ఏమీ చేయలేకపోయాయి. అమాస్య వచ్చినంత మాత్రాన చంద్రుడు పూర్తిగా కనపండాపోరు. ఈ మూడు నాలుగు సంవత్సరాలు ఆమె అమావాస్య చీకట్లను అనుభించినా, రేపటి పౌర్ణమి జీవితమంతా వెలుగుతుందని చెప్పడంలో సందేహం లేదు. ఇక ఆమె రాజకీయ జీవితాన్ని ఆపే శక్తి ఆ బ్రహ్మ దేవుడికి కూడా వుండకపోవచ్చు. ఒక శివంగిలాగా ఆమె ముందుకు దూకేందుకు మార్గం సుగమమైంది. ఇంత కాలం ఆమె ఏది చెప్పినా ఆ కేసు మరకలను చూపిస్తూ ఎద్దేవా చేసేవారు. ఇప్ప్పుడు ఆమె మాటకు ఎదురులేని రోజులు వచ్చాయి. ఆమె రాజకీయానికి తిరుగులేని రోజులు రానున్నాయి. అయితే ఇక్కడ ఒక విషయం చెప్ప్పుకోవాలి. కవితపై కేసు నమోదు చేసిన సమయంలోనే నేటిధాత్రి చూపిన దైర్యం ఆనాడు బిఆరఎస్ పార్టీ కూడా చూపలేదు. ఆ పార్టీకి చెందిన మీడియా కూడా చెప్పలేదు. కవితను ఆరెస్టు చేయడానికి వచ్చిన రోజునే ఆమె కవిత కడిగిన ముత్యమని రాసిని ఏకైక దిన పత్రిక నేటిధాత్రి. ఆ రోజు అన్ని పేపర్లు ఆమెపై నిందలు వేస్తూ వార్తలు రాశాయి. కాని దేశంలోనే కవిత కడిగిన ముత్యంలా వస్తుందని రాసింది నేటిధాత్రి అంటే ఏమిటో నిరూపించుకున్నది. ఇప్ప్పుడు అదే నిజమైంది. సమాజంలో కవిత కేసును తప్ప్పు పడుతూ, ఎప్పటికైనా ఆ కేసు నిలవదని చెప్పిన మొదటి పత్రిక నేటిధాత్రి. అంతే కాదు ఆనాడు డిల్లీ ప్రభుత్వం తీసుకున్నది కేవలం పాలసీ మాత్రమే అని, దానితో కవితకు ఎలా సంబంధం వుంటుందని కూడా ప్రశ్నించింది నేటిధాత్రి. ప్రభుత్వ స్కీమ్ మాత్రమే అని స్కామ్‌కు ఆస్కారమే లేదని వివరాలతో పాటు చెప్పిన ఏకైక పత్రిక నేటిధాత్రి. అప్పటి వరకు పెద్ద పెద్ద మీడియా సంస్దలు కూడా కవిత అరెస్టు అని రాశాయి. ప్రచారంలో వున్న అబద్దాలను రాసి కవితను బద్నాం చేశాయి. అసలు ఆ కేసు పూర్వాపరాలు కూడా తెలుసుకోకుండా కవిత మీద పుంఖాను పుంఖాలుగా వార్తలు రాసి వడ్డించాయి. అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లు అసలు ఆ కేసును ఎక్కడికో తీసుకెళ్లేందుకు తెలుగు మీడియా తహతహలాడింది. కాని అసలు కేసే కాదు, ఆ కేసు కోర్టులో నిలబడదు. అని అనేక న్యాయపరమైన అంశాలను ప్రస్తావిస్తూ కథనాలు రాసిన ఏకైక పత్రిక నేటిధాత్రి. అయితే ఆ సమయంలో తెలుగు మీడియా అంత ఒక వైపు, నేటిదాత్రి ఒక్కటే నిజం వైపు నిలబడి అక్షరాలు రాసింది. ఇప్ప్పుడు అదే నూరుపైసల నిజమైంది. కవితకు కోర్టు ఊరట కల్పించింది. అసలు కేసే లేదని నేటిదాత్రి ఊహించినట్లే తీర్పు కూడా వచ్చింది. అయితే ఆ సమయంలో నమస్తే తెలంగాణ పత్రిక కూడా నిజాలు రాసే ధైర్యం చేయలేదు. కవిత మీద అక్రమ కేసు అని రాసేందుకు కూడా ధైర్యం చేయలేదు. కవిత మీద కక్షతోపెట్టిన కేసులపై నేటిధాత్రి వరసగా కేసులో నిజా నిజా నిజాల పేరుతో అనేక కథనాలు రాసింది. ఆ కధనాలపై స్పందనలు తెలియజేసేందుకు కూడా బిఆరఎస్ పార్టీ నాయకులు ముందుకు రాలేదు. నేటిధాత్రి కేసు విషయాలు వివరంగా తెలిపి స్పందించమంటే కూడా మహిళా నాయకులు కూడా ముఖం చాటేశారు. ఆ సమయంలో ఆమెకు అండగా నిలవాల్సిన బిఆరఎస్ మహిళా నాయకులు కూడా ముందుకు రాలేదు. అదే సమయంలో నేటిధాత్రిని నిందించేందుకు కూడా కొంత మంది పనిగట్టుకు ప్రయత్నం చేశారు. నేటిధాత్రిని కూడా నిందల పాటు చేయాలని చాల మంది చూశారు. కవితకు మద్దతుగా వార్తలు రాస్తే నేటిధాత్రిని అమ్ముడుపోయిందని కూడా ఆ సమయంలో ఆరోపణలు గుప్పించారు. ఆ రోజుల్లో నేటిధాత్రిని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు. నేటిదాత్రి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశారు. నమస్తే తెలంగాణ కన్నా ఎక్కువగా కవితను జోకుతున్నారని ఎద్దేవా చేశారు. కవిత మీద కేసుపై వ్యవస్ధలోపాలను ఎత్తిచూపి అక్షర పోరాటం చేసింది కూడా ఒక్క నేటిధాత్రి మాత్రమే. ఆ నిజాలను ఆనాడు ధైర్యంగా రాసింది. నేడు గర్వంగా నేటిదాత్రి ఆ నిజాలను మళ్లీ చెప్పగలుగుతోంది. నేటిధాత్రి నిబద్దత ఎంత గొప్పదో సమాజానికి కూడా అర్దమైంది. ఏది ఏమైనా జీవితంలో చీకటి వెలుగులు వున్నట్లే రాజకీయాలలో కూడా వుంటాయి. కాకపోతే కొంత మంది నాయకులపై కాలం పట్టే పగ కూడా తోడౌతుంది. అది తేలిపోయింది. మళ్లీ కవిత రాజకీయం జీవితం నిండు పౌర్ణమి వెలుగులు నిరంతరం వుండే రోజులు వచ్చాయి. అందుకు కవితకు నేటిధాత్రి అభినందనలు. కొత్త రాజకీయ పార్టీ ద్వారా కవిత రూపంలో గొప్ప నాయకత్వం తెలంగాణ ప్రజలకు అందాలని కోరుకుందాం.

ఉచిత కంటి వైద్య శిబిరం, ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రారంభం..

ఉచిత కంటి వైద్య శిబిరం, ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రారంభం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ పర్యటన సందర్భంగా, శుక్రవారం ఉదయం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పట్టణ ఎస్ఐ వినయ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఆదర్శ్ నగర్, పస్తుపూర్ జంక్షన్లలో ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రారంభించారు. అలాగే, ఎస్వీ ఫంక్షన్ హాల్లో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసి, దృష్టి లోపం ఉన్నవారికి ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా కవర్ చేయాలని పోలీస్ శాఖ విజ్ఞప్తి చేసింది.

హిందూ ధర్మంపై అవగాహన పెంచాలి: బ్రహ్మనందా మాయి…

హిందూ ధర్మంపై అవగాహన పెంచాలి: బ్రహ్మనందా మాయి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

న్యాల్కల్: మాత బ్రహ్మనందా మాయి ట్రస్ట్ అధినేత శ్రీ శ్రీ శ్రీ బ్రహ్మనందా మాయి, ప్రతి ఇంట్లో భగవద్గీత ఉండాలని, నిత్యం పూజలు చేయడం ద్వారా ఆధ్యాత్మిక చైతన్యం పెరుగుతుందని అన్నారు. హిందూ ధర్మం మన సంస్కృతి, సంప్రదాయాలకు మూలస్తంభమని, యువత ధర్మం పట్ల ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. ధర్మాచరణతో సమాజంలో సానుకూల మార్పులు వస్తాయని ఆమె పేర్కొన్నారు. హైదరాబాద్లోని ఆమె నివాసంలో న్యాల్కల్ మండలం బీజేపీ మాజీ మండల అధ్యక్షుడు ఓంకార్ యాదవ్ ఆమెను కలిసి సత్కరించారు. కార్యక్రమంలో డా. జనార్దన్ రెడ్డి, నర్సప్ప, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

నాగర్ కర్నూల్ ఘటనపై కోహిర్ లో కొవ్వొత్తి ర్యాలీ…

నాగర్ కర్నూల్ ఘటనపై కోహిర్ లో కొవ్వొత్తి ర్యాలీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

నాగర్ కర్నూల్ కొమ్మెర గ్రామంలో 2 నెలల పసికందును చంపిన ఘటనపై కోహిర్ గ్రామ యువకులు కొవ్వొత్తుల నిరసన ర్యాలీ నిర్వహించారు. ‘We Want Justice’ అంటూ నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో కౌన్సిలర్ నాగరిగారి సంపత్ కుమార్ పాల్గొన్నారు. మానవత్వం మంట కలిసిపోయిందని, దేవుడిని పూజించుకోవడానికి స్వేచ్ఛ లేని రాష్ట్రంలో బ్రతుకుతున్నామని, కన్న కూతుర్ని చంపిన దుండగులను శిక్షించాలని ఒక బాలింత తల్లి పోరాటానికి అండగా ఈ నిరసన ర్యాలీ నిర్వహించినట్లు యువకులు తెలిపారు.

వివాహ వేడుకల్లో పాల్గొన్న టిజిఐడిసి మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్…

వివాహ వేడుకల్లో పాల్గొన్న టిజిఐడిసి మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ
ఝరాసంగం గ్రామ వాసవి కళ్యాణ మండపంలో రాచన్న స్వామి అన్న కూతురి వివాహ వేడుకలు పాల్గొని నూతన వధూవరులకు అక్షంతలు వేసి వివాహ శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మహమ్మద్ తన్వీర్ శాలువాతో సన్మానించారు ఈ కార్యక్రమంలో బీడెక్నే సర్పంచ్ రవి ఆజ్ బాబా బిజీ సందీప్ మొహమ్మద్ మోహిన్ పాండు సంగమేష్ సద్దాం తదితరులు ఉన్నారు,

మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ ప్రవేశాలను సద్వినియోగం చేసుకోవాలి…

మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ ప్రవేశాలను సద్వినియోగం చేసుకోవాలి

కాంగ్రెస్ మైనార్టీ నాయకులు జాఫర్ రిజ్వి

పరకాల నేటిధాత్రి

ఉచిత విద్య వసతి సౌకర్యాలతో తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీలో 2026-2027 సంవత్సరానికి గాను ప్రవేశాలు ప్రారంభమైన సందర్భంగా శుక్రవారం రోజున విద్యార్థులను నమోదు చేసుకోవడానికి ముస్లిం మైనార్టీల గృహాలకు వెళ్లి ఐదవ తరగతి ప్రవేశాలు అన్నీ వర్గాలకు 6,7,8తరగతిలో మైనారిటీ వర్గాలకు మాత్రమే ఖాళీలు ఉన్నచోట ప్రవేశాలు కల్పించడానికి కాంగ్రెస్ నాయకులు జాఫర్ రిజ్వి ఇంటింటికి తిరిగి ప్రచారము నిర్వహించారు.అయన ఈ సందర్బంగా మాట్లాడుతూ అర్హులైన విద్యార్థుల తల్లిదండ్రులను కళాశాల మైనారిటీ రెసిడెన్షియల్ గురించి చెప్పి విద్యార్థులను పరకాల మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ ఓగులాపురంలో గల స్కూల్లో ప్రవేశములు చేయించాలని విద్యార్థుల పేర్లు నమోదు చేయించి తమ పిల్లలను పాఠశాలలో చేర్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఇంగ్లీష్ టీచర్ ఎకు సంపత్ కుమార్,మైమున బేగం ఉర్దూ టీచర్,మైనారిటీ నాయకులు జాఫర్ రిజ్వి పాల్గొన్నారు.

అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాలి: ఎంపీ సురేష్ కుమార్…

అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాలి: ఎంపీ సురేష్ కుమార్

◆-: ఎంఐఎం కౌన్సిలర్ మహమ్మద్ రఫీ

జహీరాబాద్ నతి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మునిసిపాలిటీలో జరిగిన అత్యవసర కౌన్సిల్ సమావేశంలో స్థానిక ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్, ఎంఐఎం కౌన్సిలర్ మహ్మద్ రఫీలను శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా జహీరాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధికి అందరూ కలిసి పనిచేయాలని ఎంపీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో కమిషనర్ జైత్ రామ్, ఎంఆర్ దశరథ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

సమీకృత మార్కెట్ బిల్డింగ్ బిల్లులు ప్రభుత్వం వెంటనే చెల్లించాలి..

సమీకృత మార్కెట్ బిల్డింగ్ బిల్లులు ప్రభుత్వం వెంటనే చెల్లించాలి..

◆-: 5 కోట్ల 50 లక్షల బిల్లులు బకాయిలు రావాలి : కాంట్రాక్టర్ మీర్ జవీద్ అలీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్. 11 కోట్ల నిధులతో మంజూరైన సమీకృత ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ ను అప్పటి ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు తన్నీరు హరీష్ రావు మంజూరు చేశారు. మార్కెట్ బిల్డింగ్ మంజూరు అనంతరం టెండర్ ప్రాతిపదికన జేజే కన్స్ ట్రాక్షన్ గ్రూప్ కి దక్కిందని, టెండరు దక్కించుకున్న కొద్దిరోజులకె పనులను మొదలుపెట్టి ఉన్నత అధికారుల ఆదేశాలు, ఇంజినీరింగ్ విభాగానికి చెందిన అధికారుల సూచనల మేరకు పనులను వేగవంతంగా పూర్తి చేస్తూ ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మేరకు పనులను పూర్తి చేయడం జరిగిందని సంబంధిత కాంట్రాక్టర్ మీర్ జవీద్ అలీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 11 కోట్ల నిధులతో అనగా 5 కోట్ల 50 లక్షలు టీయూఎఫ్ఐడిసి నిధులు మాత్రమే ప్రభుత్వం చెల్లించిందని, 4 కోట్ల 50 లక్షలు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ (ఎస్డీఎఫ్) నిధులు, 1 కోటి రూపాయలు పట్టణ ప్రగతి కింద కేటాయించారు. ఎస్డీఎఫ్, పట్టణ ప్రగతి కింద ఉన్న నిధులు 5 కోట్ల 50 లక్షల రూపాయలు ఇప్పటివరకు చెల్లించలేదు. ఇదే విషయమై ఎన్నోసార్లు జిల్లా ఉన్నత అధికారులు మార్కెట్ బిల్డింగ్ కి వచ్చి చెల్లింపులు చేస్తాము మీరు బిల్డింగ్ తళలను సంభందిత విభాగానికి అప్పగించాలని అప్పటి కలెక్టర్ వల్లూరి క్రాంతి, అదనపు కలెక్టర్ రాజర్షి షా ఎన్నోసార్లు వచ్చి ప్రకటించిన కార్యరూపం దాల్చలేదు. ఇదే విషయమై కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన కొద్దిరోజుల వ్యవధిలోనే పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో 23 ఫిబ్రవరి 2024 నాడు న జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వారం రోజుల్లో 5 కోట్ల 50 లక్షల బిల్లులు చెల్లింపులు చేస్తామని సంబంధిత అధికారులు, బిల్డింగ్ కాంట్రాక్టర్ అయిన తన సమక్షంలో ప్రకటించాడం జరిగిందని, వారి ప్రకటన అనంతరం కొన్ని షరతులతో బిల్డింగ్ కింది భాగమైన మొదటి అంతస్తు తాళాలను సంబంధిత అధికారులకు అప్పగించడం జరిగిందని, వారు ప్రకటన చేసి రెండేళ్లు గడిచిన ఇప్పటివరకు బిల్లులు జమకాలేదని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం బకాయిలను చెల్లించలని కోరారు. ఇప్పటికే మార్కెట్ బిల్డింగ్ పనులను పూర్తి చేసి దాదాపు నాలుగేళ్లు గడుస్తున్న మిగిలిన 5 కోట్ల 50 లక్షల రూపాయలు రాక సంబంధిత కాంట్రాక్టర్, కన్స్ ట్రాక్షన్ గ్రూపు ఇబ్బందులు ఎదుర్కొంటుంది. చూడాలి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి బిల్లులు చెల్లించి మార్కెట్ బిల్డింగ్ ను టెండర్ లో దక్కించుకున్న వారికి ఎప్పుడు కేటాయిస్తుందో వేచిచూడాలి.

లక్కీ డ్రా పేరుతో కార్ల అమ్మకాలు..

లక్కీ డ్రా పేరుతో కార్ల అమ్మకాలు

అధిక వసూళ్లపై ఆరోపణలు

చట్ట బద్ధమా? ప్రజలు జాగ్రత్త..!

వరంగల్, నేటిధాత్రి.

లక్కీ డ్రా పేరుతో 200రూపాయలు చెల్లిస్తే కారు సొంతమవుతుందని ప్రచారం చేస్తూ వరంగల్ నగరంలో లక్కీ డ్రా స్కీములు మళ్లీ వివాదాస్పదంగా మారాయి. ముఖ్యంగా ఉర్సు గుట్ట శివారులో ఓ వ్యక్తి పాత కార్లను లక్కీ డ్రా ద్వారా ఇస్తామని సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రచారం చేస్తూ పలువురి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం.

ప్రచారం ప్రకారం, ప్రతి వ్యక్తి నుంచి నిర్దిష్ట మొత్తం 200 నుండి 2వేల వరకు వసూలు చేసి కూపన్లు ఇస్తున్నారు. అనంతరం లక్కీ డ్రా నిర్వహించి ఒకరికి కారు అందజేస్తామని చెబుతున్నారు. అయితే ఎంతమంది నుంచి డబ్బులు సేకరించారు, ఎన్ని కూపన్లు ముద్రించారు, మొత్తం వసూళ్లు ఎంత అన్న వివరాలపై ఎలాంటి స్పష్టత లేకపోవడం గమనార్హం.

కార్ల స్థితిగతులపై సందేహాలు

లక్కీ డ్రా ద్వారా ఇస్తున్న కారు ఏ కండిషన్‌లో ఉందో స్పష్టత లేదని పలువురు పేర్కొంటున్నారు. కారు పాతదా, కొత్తదా అన్నది కూడా వెల్లడించడం లేదని ఆరోపిస్తున్నారు. వాహనం విలువ, రిజిస్ట్రేషన్ వివరాలు, యాజమాన్య పత్రాలు వంటి అంశాలు ప్రజలకు తెలియజేయకుండా కేవలం కూపన్ల విక్రయంపైనే దృష్టి పెట్టుతున్నట్లు సమాచారం.

కారు ధర కంటే అధిక వసూళ్లు?

లక్కీ డ్రా కూపన్ల ద్వారా సేకరించే మొత్తం కారు అసలు ధర కంటే రెండింతలు ఎక్కువగా ఉంటోందని స్థానికులు చెబుతున్నారు. కొందరు నిర్వాహకులు ఏకంగా కొత్త కారు కొనుగోలు చేసి లక్కీ డ్రా పేరుతో విక్రయాలు చేపడుతున్నారని సమాచారం. ఈ విధంగా భారీ లాభాలు పొందుతూ అధికారులను సైతం ప్రభావితం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

చట్టపరమైన అంశం

న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం, డబ్బులు వసూలు చేసి బహుమతులు ఇవ్వడం “లాటరీ” లేదా “ప్రైజ్ చిట్” పరిధిలోకి రావచ్చు. ఇది ప్రైజ్ చిట్స్ మరియు సర్కులేషన్ స్కీమ్స్ (బ్యానింగ్) యాక్ట్ 1978 మరియు ఇతర సంబంధిత చట్టాల కింద నియంత్రణలో ఉంటుంది. సరైన అనుమతులు లేకుండా ఇలాంటి లక్కీ డ్రాలు నిర్వహించడం చట్టవ్యతిరేకం అయ్యే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

గతంలో కూడా ఇదే తరహాలో లక్కీ డ్రా నిర్వహించగా స్థానిక పోలీసులు పిలిపించి హెచ్చరించినట్లు తెలిసింది. అయినప్పటికీ కార్యకలాపాలు కొనసాగుతున్నట్లు సమాచారం.

చర్యలు తీసుకోవాలి

లక్కీ డ్రా పేరుతో ప్రజలను మోసం చేస్తున్న వారిపై వెంటనే విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, బాధితులు కోరుతున్నారు. సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి ప్రకటనలను నమ్మే ముందు పూర్తి వివరాలు తెలుసుకోవాలని, అనుమానం ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు.

కేంద్ర మంత్రి కలిసిన ఎంపీ సురేష్ కుమార్ శెట్కార్, చైర్మన్ నాగేష్ శెట్కార్…

కేంద్ర మంత్రి కలిసిన ఎంపీ సురేష్ కుమార్ శెట్కార్, చైర్మన్ నాగేష్ శెట్కార్

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఢిల్లీలోని కేంద్ర రహదారి మరియు రవాణా శాఖ మంత్రి నితిన్ గాడ్కరి గారి కార్యాలయంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ శెట్కార్ , నారాయణాఖేడ్ మున్సిపల్ చైర్మన్ నాగేష్ శెట్కార్ గారు మర్యాదపూర్వకంగా కలిసి పలు అభివృద్ధి అంశాలపై చర్చించారు.ఈ సందర్భంగా నేషనల్ హైవే 161(B) నిజాంపేట్ – నారాయణాఖేడ్ మీదుగా కర్ణాటక సరిహద్దు వరకు ₹520 కోట్ల నిధులు మంజూరు చేసి పనులు కొనసాగుతున్న విషయంపై మంత్రి గారికి కృతజ్ఞతలు తెలిపారు.అదేవిధంగా, కర్ణాటక బోర్డర్ నుండి బీదర్ వరకు మిగిలిన 8 కిలోమీటర్ల రహదారికి కూడా నిధులు మంజూరు చేసి, 161(B) హైవేతో అనుసంధానం చేయాలని విజ్ఞప్తి చేశారు.జహీరాబాద్ చెక్ పోస్ట్ నుండి బీదర్ వరకు న్యాల్కల్ నుండి గంగ్వార్ వరకు ట్రాఫిక్ పెరగడం తో 6 లైన్ రోడ్డు కు ప్రతిపదన కోరడం జరిగింది ఇక నూతన నారాయణాఖేడ్ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం కేంద్రం నుండి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు.
ఈ అంశాలపై కేంద్ర మంత్రి నితిన్ గాడ్కరి గారు సానుకూలంగా స్పందించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ప్రజా వ్యతిరేకత ఏది.. బీఆరఎస్ గెలుపేది?

`ప్రతి సారి ఎన్నికలు ఎన్నికలు అంటారు ఏం సాధిస్తున్నారు?

`అధికార పార్టీని రెచ్చగొట్టి బోల్తా పడుతున్నారు?

`పంచాయతీ ఎన్నికలు పెట్టడానికే ప్రభుత్వం ముందు వెనుక ఆలోచించింది?

`జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అదే చేశారు?

`గెలిచేది మేమే అంటూ పగటి కలలు కన్నారు?

`అరునెలల పాటు హడావుడి చేశారు?

`ఏం జరిగింది.. ఎన్నికకు పదిహేను రోజుల్లో వాతావరణం మారిపోయింది?

`సీఎం. రేవంత్ రెడ్డి వేసిన స్కీచ్ ఆరు నెలల బీఆరఎస్ కష్టం గంగలో కలిసింది?

`అయినా సమీక్ష చేసుకోలేదు.. తప్పులు సరిదిద్దుకోలేదు?

`పంచాయతీ ఎన్నికలు మాకే విజయం అని సంకలు గుద్దుకున్నారు?

`మళ్ళీ బొక్క బోర్లా పడ్డారు.. మున్సిపల్ ఎన్నికల్లో నిండా మునిగిపోయారు?

`ఇప్పటికైనా మేలుకోండి… వ్యూహత్మాకంగా అడుగులేయండి?

`ఎన్నికలను కాదు.. ప్రజలను నమ్ముకోండి?

`ఎన్నికలతో బలపడేందుకు ఇది ఉద్యమ కాలం కాదు?

`రాజకీయ కాలం.. రాజకీయమే చేయాలి?

`ఇంకా ఉద్యమం కాలం గురించే చెప్పుకుంటే చాలదు?

`ప్రభుత్వం మీద యుద్ధం చేయకుంటే బీఆరఎస్ ను నమ్మరు?

`మున్సిపల్ ఎన్నికలతోనైనా కళ్ళు తెరవండి?

`కాంగ్రెస్ ను ఒంటి చేత్తో గెలిపిస్తున్న సిఎం రేవంత్ రాజకీయం గమనించండి?

`సమిష్టి రాజకీయ విజయం ఎలా వుంటుందో నేర్చకోండి?

`అందరికీ సమాన అవకాశాలు కల్పించండి?

`ప్రతి దగ్గర మేమే ఉండాలనుకోవద్దు?

`జిల్లా రాజకీయాలలో నేతలకు స్వేచ్ఛ నివ్వండి?

`నాయకుల మధ్య సమన్వయం జరిగేలా చూడండి?

`ఆరు గ్యారెంటీ ల మీద పోరాటం చేయండి?

`ప్రజలు సీఎం. రేవంత్ పాలనలో అసంతృప్తి గా లేరు?

`జనం లో వ్యతిరేకత ఉంటే కాంగ్రెస్ కు ఇన్ని విజయాలు దక్కవు?

 

హైదరాబాద్, నేటిధాత్రి:                                                      

మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. రాజకీయ పార్టీలు ఏం నేర్చుకున్నాయి. మున్సిపల్ ఎన్నికలు ఏం పాఠాలు నేర్పాయి. పాలకపక్షం ఏం నేర్చుకున్నది. ప్రతిపక్షం ఏం తెలుసుకున్నది. ఒక్క మాటలో చెప్పాలంటే మున్సిపల్ ఎన్నికల్లో ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేకత ప్రతిపక్ష బిఆరఎస్ ఊహించిన లేదన్నది మాత్రం తేలిపోయింది. పైగా ప్రతిపక్షం మాట ప్రజా క్షేత్రంలో చెల్లలేదన్నది రుజువైంది. బిఆరఎస్ ఒప్ప్పుకున్నా, ఒప్ప్పుకోకపోయినా కాంగ్రెస్ పార్టీ మీదనే జనంలో నమ్మకం కనిపించింది. ప్రతిపక్షాల మీద నమ్మకం సన్నగిల్లింది అని చెప్పడంలో సందేహం లేదు. ఈ గెలుపు ఏం చూచిస్తోంది అనేది బిఆరఎస్ తెలుసుకోవాలి. ప్రజా ప్రభుత్వం మీద మరింత నమ్మకం ఎందుకు మరింత పెరిగింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అదికారంలో వుండడం వల్లనే కాంగ్రెస్ గెలిచిందనే సొల్లు మాటలు బిఆరఎస్ మర్చిపోవాలి. బిఆరఎస్ ఇంత ప్రచారం చేసినా సిఎం. రేవంత్‌రెడ్డి నాయకత్వం మీద ఎందుకంత విశ్వాసం పెరిగిందనేది కూడా అధ్యయనం చేయాలి. సిఎం. రేవంత్ రెడ్డి వేస్తున్న వ్యూహాల ముందు బిఆరఎస్ తేలిపోతోందా? అందుకే ప్రజా తీర్పులు కాంగ్రెస్‌కు అనుకూలంగా మారుతున్నాయా? లాటరీలు కూడా జనగాం, తొర్రూర్‌లలో కాంగ్రెస్‌ను విజయం వరించడం బిఆరఎస్‌కు దెబ్బ మీద దెబ్బ పడడమే అయ్యింది. గాయిగాయి చేసిన బిఆరఎస్ ఆశలపై కాలం నీళ్లు చల్లినట్లైంది. బిఆరఎస్ నాయకులు మీడియా పులులే అని మరోసారి రుజువైంది. ఎవరు నమ్మినా, నమ్మకపోయినా సిఎం. రేవంత్‌రెడ్డి రాజకీయ వ్యూహాలు సక్సెస్ అయ్యాయి. బిఆరఎస్ ఊహించుకున్నంతగా పభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత మాత్రం లేదని రుజువైంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు మరిsం నమ్మకం బలపడింది. ప్రతిపక్షాల మీద ప్రజలకు నమ్మకం సన్నగిల్లింది. ప్రజా ప్రభుత్వం మీద మరింత నమ్మకం పెరిగింది చెప్పడానికి ఈ ఎన్నికలు నిదర్శనయ్యాయి. మరో రకంగా సిఎం. రేవంత్‌రెడ్డి నాయకత్వం మీద విశ్వాసం మున్సిపల్ ఎన్నికల తీర్పులో కనబడింది. సాదారణ సమయాల్లో ఎలా వున్నా, ఎన్నికల వేళ కాంగ్రెస్‌లో వున్న ఐక్యత బాగానే పనిచేసిందనేది కూడా తేలిపోయింది. కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో ప్రతిష్టాత్మకంగా మారిన వ్యూహం బాగానే నెరవేరింది. పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజాతీర్పులే కాదు, కాలం కూడా కాంగ్రెస్‌కు కలిసొచ్చిందనేది రుజువైంది. జనగాం, తొర్రూర్‌లలో కాంగ్రెస్‌ను లాటరీ విజయం వరించింది. సమానమైన ఓట్లు వచ్చినా లాటరీ గాయిగాయి చేసిన బిఆరఎస్ ఆశలపై కాలం నీళ్లు చల్లింది. బిఆరఎస్, బిజేపి ప్రజా పోరాటాలు లేకుండా చెబుతున్న ఫాల్త్ ముచ్చట్లు జనం నమ్మరని తేలిపోయింది. బిఆరఎస్, బిజేపిలు కేవలం రాజకీయాలు మాత్రమే చేస్తూ, జనాన్ని నమ్మించి మోసం చేస్తున్నారని మరోసారి తేలింది. ప్రతిపక్ష బిఆరఎస్, బిజేపిలు మీడియా పులులు కాగితాలకు పరిమితమని మరోసారి రుజువైంది. సిఎం. రేవంత్‌రెడ్డి రాజకీయ వ్యూహాలు అధ్భుతమైన విజయాలు సాదించాయి. పభుత్వం మీద ఎక్కడా తీవ్ర వ్యతిరేకత మాత్రం లేదని రుజువైంది. రెండేళ్లపాలనైన ఎంతో కొంత అసంతప్తి వున్నా, అది వ్యతిరేకత దాకా దారి తీయలేదు. నిజంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత వుంటే ఖమ్మం జిల్లాలో కూడా అది కనిపించాలి. అక్కడ ఎక్కడా వ్యతిరేకత కనిపించిన దాఖలాలు లేవు. అలాగే నల్లగొండ జిల్లా, మహాబూబ్ నగర్ జిల్లాలోనూ ప్రభుత్వానికి ప్రజల మద్దతు స్పష్టంగా కనిపించింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఒక రకంగా కాంగ్రెస్ స్వీప్ చేసినట్టే అని చెప్ప్పుకోవాలి. ఇలా మూడు ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ ప్రభంజనం కనిపించింది. ఈ మూడు జిల్లాల్లో జనం ఎందుకు ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ వైపు నిలిచారన్నదానిపై కూడా అద్యయనం చేయాల్సి వుంటుంది. మిగతా జిల్లాల కన్నా, ఈ మూడు జిల్లాలకు ప్రభుత్వ నిదుల వరద పారిస్తోందా? అభివద్ది మీద ఎక్కువ దష్టిపెడుతుందా? అనేది కూడా తెలియాలి. ఎందుకంటే గతంలో సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వెల్ నియోజకవర్గాలకేనా నిదులు అంటూ కాంగ్రెస్ పదే పదే ఆరోపణలు చేస్తూ వచ్చేది. అలాగే ఇక్కడ కూడా బలమైన మంత్రులున్నారు. ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులున్నారు. అందులో ఒÅ£రు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వున్నారు. తెలంగాణలో పవర్ ఫుల్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వున్నారు. రాజకీయంగా, పాలనా పరంగా అనుభవం వున్న మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వున్నారు. ఈ ముగ్గురి రాజకీయం ముందు బిఆరఎస్ మరోసారి చతికిలపడింది. కోలుకోలేని దెబ్బ తిన్నది. ఇక నల్లగొండ విషయానికి వస్తే ఇక్కడ బలమైన నాయÅ£త్వం పనిచేసిందనే చెప్పాలి. రాజకీయంగా, పాలనాపరంగా అపరామైన అనుభవం వున్న సీనియర్ నాయకుడు జానారెడ్డితోపాటు, ఆయన వారసులు, ఇద్దరూ ప్రజా ప్రతినిదులుగా వున్నారు. వారికి తోడు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వున్నారు. సీనియర్ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి వున్నారు. ఆయన సోదరుడు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి వున్నారు. గత ఎన్నికల్లో ఒక్క సీటు అన్ని నియోజకవర్గాలలోనూ కాంగ్రెస్‌పార్టీ జెండా ఎగిరింది. సర్పంచ్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఎక్కువ సర్పంచ్‌లు గెలిచింది. ఆ పరంపర మున్సిపల్ ఎన్నికల్లోనూ కనిపించింది. ఇక్కడ వార్ వన్ సైడ్ జరిగింది. ఇక సిఎం. రేవంత్ రెడ్డి సొంత జిల్లా ఉమ్మడి పాలమూరు మరో సారి కాంగ్రెస్ జయకేతనం ఎగురువేసింది. పాలమూరు గడ్డ కాంగ్రెస్ అడ్డా అని నిరూపించినట్లైంది. సిఎం. రేవంత్‌రెడ్డి సొంత ఇలాఖా కొడంగల్‌లో బిఆరఎస్‌కు చోటు లేకుండాపోయింది. మొత్తం సీట్లు కాంగ్రెస్ కైవసం చేసుకున్నది. పాలమూరు ఉమ్మడి జిల్లా నుంచి సిఎం.తో పాటు మరో ఇద్దరు మంత్రులున్నారు. వారు కూడా తమ సత్తాను చాటుకున్నారు. సీనియర్ మంత్రి జూపల్లి కష్ణారావు, మరో మంత్రి వాకిటి శ్రీహరిలు కూడా బాగా కష్టపడ్డారనేది విషయం తేట తెల్లమైంది. మహాబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ జెండా రెపరెపలాడింది. అయితే ఈ విజయాన్ని సిఎం. రేవంత్‌రెడ్డి పాలనకు అంకితమివ్వొచ్చని చెప్పొచ్చు. ఆయన అన్ని ఎన్నికలను ప్రతిష్టాత్మకంగానే తీసుకుంటున్నారు. సర్పంచ్ ఎన్నికలే కదా? అని ఊరుకోలేదు. ఏది ఏమైనా గెలుపు ముఖ్యం. గెలిచి తీరుడు చాలా ముఖ్యం. అందుకే మున్సిపల్ ఎన్నికల్లోనూ సిఎం. రేవంత్ రెడ్డి సభలు నిర్వహించారు. ప్రజలను ఒప్పించారు. తనపై నమ్మకం వుంచాలని కోరారు. ప్రజలు కూడా అలాగే తీర్పునిచ్చారు. ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం సన్నగిల్లలేదని కాంగ్రెస్‌ను గెలిపించారు. ఈ గెలుపు కాంగ్రెస్‌కు మరింత ఊపునిచ్చిందని చెప్పడంలో సందేహం లేదు. తెలంగాణలో కాంగ్రెస్‌పై వ్యతిరేకత లేదని చెప్పడానికి ఈ మున్సిపల్ ఎన్నికలే నిదర్శనం. అదే సమయంలో కాంగ్రెస్‌ను బిఆరఎస్ కూడా బలంగానే డీ కొట్టిందనే చెప్పాలి. బిఆరఎస్‌కు ఊహించని సీట్లే వచ్చాయి. నిజానికి ఓ ఐదారు మున్సిపల్ చైర్మన్లు వస్తాయని మాత్రమే అనుకున్నారు. కాంగ్రెస్‌కు 80శాతానికి పైగా కౌన్సిలర్లు , కార్పోరేటర్లు గెలుస్తారని అంచానా వేశారు. కాని బిఆరఎస్ బలంగానే కాంగ్రెస్‌తో కొట్లాడిందనే చెప్పాలి. అయినా ఇంకా ఎక్కడో బిఆరఎస్ వెనుకబడింది. ముఖ్యంగా నల్లగొండ, ఖమ్మం, ఉమ్మడి పాలమూరు జిల్లాలో పెద్దగా ప్రచారం కూడా సాగించినట్లు లేదు. ఎంత సేపు హరీష్‌రావు సిద్దిపేట, మెదక్ జిల్లాల మీదనే దష్టిపెట్టారు. మిగతా జిల్లాల్లో ఇంత విరివిగా ప్రచారం సాగించలేదు. బిఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంటు కూడా అన్ని జిల్లాలను చుట్టి వచ్చినా, ఆయన ప్రభావం పూర్తిగా కనిపించలేదు. బిఆరఎస్ బలంగా వుండే ఉత్తర తెలంగాణలో బిఆరఎస్‌కు కొంత ఎదురుదెబ్బ తగిలింది. కరీంనగర్ జిల్లాలో బిఆరఎస్‌కు మంచి పట్టు వుంది. కరీంనగర్ కార్పోరేష్‌న్‌ను నిలబెట్టుకోవాల్సిన చోట చతికిలపడింది. గతంలో వార్ వన్ సైడ్ అనేలా విజయాలు అందుకున్న బిఆరఎస్‌కు వరస ఓటములు వెంటాడుతున్నా, పార్లమెంటు ఎన్నికల తర్వాత కొంత కోలుకున్నట్లే కనిపిస్తోంది. పార్లమెంటు ఎన్నికల్లో మూడో స్దానానికి పడిపోయిన, బిఆరఎస్ గత సర్పంచ్ ఎన్నికలు, ఈ మున్సిపల్ ఎన్నికల్లో రెండో స్ధానానికి చేరుకోవడం ఒక రకంగా ఊరటనిచ్చే అంశమే. అయినా ఈ బలం చాలదు. వచ్చే ఎన్నికలకు ఈ మాత్రం బలం అసలే సరిపోదు. కాకపోతే బిఆరఎస్ నాయకులకు, కార్యకర్తలకు మున్సిపల్ ఎన్నికలు కొంత మనో ధైర్యాన్నే కల్పించాయని చెప్పాలి.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version