నాకు మద్దతుగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు..

నాకు మద్దతుగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు.. ప్రాణాంతక వ్యాధి నుంచి కోలుకున్న ఆసీస్ స్టార్ ప్లేయర్

 

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డామియన్ మార్టిన్.. మెనింజైటిస్ అనే ప్రాణాంతక వ్యాధి బారినపడిన విషయం తెలిసిందే. చికిత్స అనంతరం మార్టిన్ కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందికి అతడు కృతజ్ఞతలు తెలిపాడు.

ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డామియన్ మార్టిన్(Damian Martin).. మెనింజైటిస్ అనే ప్రాణాంతక వ్యాధి బారినపడిన విషయం తెలిసిందే. చికిత్స కోసం అతడిని కొద్ది రోజులు వైద్యులు కోమా స్థితిలో ఉంచారు. గతేడాది డిసెంబర్ చివరిలో మార్టిన్ పరిస్థితి విషమించడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం మార్టిన్ కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందికి అతడు కృతజ్ఞతలు తెలిపాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టాడు.
‘నన్ను(డామియన్ మార్టిన్) ఆసుపత్రికి తరలించే సమయానికి నేను బతికే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయని వైద్యులు తెలిపారు. మెనింజైటిస్ నా మెదడును ఆక్రమించినప్పుడు నేను పూర్తిగా ప్రాణాపాయ స్థితిలోకి జారుకున్నాను. ఈ వ్యాధితో పోరాడటానికి వైద్యులు నాకు చాలా సాయం చేశారు. వారు నన్ను 8 రోజులపాటు కోమాలో ఉంచారు. నేను కోమాలోంచి బయటకు వచ్చిన తర్వాత దాదాపు నాలుగు రోజుల వరకు మాట్లాడలేకపోయాను, నడవలేకపోయాను. తర్వాత డాక్టర్ల ప్రోత్సాహంతో అవన్నీ చేయగలిగాను. రికవరీ ప్రారంభమైన తర్వాత వైద్యులు నన్ను డిశ్చార్జి చేశారు. నేను తిరిగి ఇంటికి రావడం నాకు చాలా సంతోషాన్నిచ్చింది. బీచ్‌లోని ఇసుకలో నా పాదాన్ని మళ్లీ మోపగలిగాను. వైద్యులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు.. నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’ అని మార్టిన్ పేర్కొన్నాడు.డామియన్ మార్టిన్ ఆసీస్ తరఫున 67 టెస్టులు, 208 వన్డేలు, 4 టీ20లు ఆడాడు. ఆస్ట్రేలియా 1999, 2003 ప్రపంచకప్ సాధించిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. భారత్‌తో జరిగిన 2003 వరల్డ్ కప్ ఫైనల్‌లో 88 పరుగులు చేశాడు. 2006 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జట్టులోనూ సభ్యుడిగా ఉన్నాడు. ఆ టోర్నీలో అతడు ఐదు ఇన్నింగ్స్‌ల్లో 80.33 యావరేజ్‌తో 241 పరుగులు చేశాడు.

లియోనల్ మెస్సీ గోట్ టూర్.. మూడు రోజుల షెడ్యూల్ ఇదే..

లియోనల్ మెస్సీ గోట్ టూర్.. మూడు రోజుల షెడ్యూల్ ఇదే..

ఫుట్‌బాల్‌ సూపర్‌ స్టార్‌ లియోనెల్‌ మెస్సీ భారత్‌ రానున్నారు. హైదరాబాద్ నగరంలో పర్యటించనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడనున్నారు. ఇండియా టూర్ ముగించే ముందు దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని మెస్సీ కలుస్తారు.ప్రపంచ ఫుట్‌బాల్‌ సూపర్‌ స్టార్‌ లియోనెల్‌ మెస్సీ మూడు రోజుల పాటు భారత్‌లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 13, 14, 15 తేదీల్లో దేశ వ్యాప్తంగా ఉన్న నాలుగు ప్రముఖ నగరాల్లో పర్యటిస్తారు. గోట్ ఇండియా టూర్‌ 2025లో భాగంగా ఆయన కోల్‌కతా, హైదరాబాద్, ముంబై, న్యూఢిల్లీలలో జరగబోయే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇండియా టూర్ ముగించే ముందు దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని మెస్సీ కలుస్తారు. మెస్సీతో పాటు లూయిస్ సూరెజ్, అర్జెంటినా మిడ్ ఫీల్డర్ రోడ్రిగో డే పాల్‌లు కూడా భారత్‌లో పర్యటించనున్నారు. మెస్సీ మూడు రోజుల భారత్ టూర్ షెడ్యూల్ ఇలా ఉంది..

సాఫ్ట్ బాల్ పోటీలకు కేజీవీపీ విద్యార్థులు ఎంపిక..

సాఫ్ట్ బాల్ పోటీలకు కేజీవీపీ విద్యార్థులు ఎంపిక

భూపాలపల్లి నేటిధాత్రి

 

ఈనెల 2న హన్మకొండ జిల్లా ఎస్ డిఎల్ సి క్రీడా ప్రాంగణంలో సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ఆఫ్ హన్మకొండ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి సీనియర్ సాఫ్ట్ బాల్ సెలెక్షన్ పోటీలలో, జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల కేజీవీపీ ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఎన్. శరణ్య అద్భుత ప్రతిభ ప్రదర్శించి, హన్మకొండ జిల్లా తరఫున రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించింది.
రాష్ట్ర స్థాయి సీనియర్ సాఫ్ట్ బాల్ పోటీలు జగిత్యాల జిల్లాలో నవంబర్ 7 నుంచి 9 వరకు జరగనున్నాయి.
ఈ విజయంపై కేజీవీపీ స్పెషల్ ఆఫీసర్ నాగపురి స్వప్న వ్యాయామ ఉపాధ్యాయురాలు అనిత ఉపాధ్యాయ బృందం విద్యార్థినీ తల్లిదండ్రులు శరణ్యను హృదయపూర్వకంగా అభినందించారు.

మా నానమ్మకి ఏం కాలేదు: అమన్‌జోత్…

మా నానమ్మకి ఏం కాలేదు: అమన్‌జోత్

 

మహిళల ప్రపంచ కప్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించిన అమన్‌జోత్ తన నానమ్మ ఆరోగ్యంపై వస్తున్న వార్తలను ఖండించింది. ఆమె బాగానే ఉన్నారని, అవాస్తవ ప్రచారాలను నమ్మొద్దని స్పష్టం చేసింది.

ఇంటర్నెట్ డెస్క్: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్‌ను టీమిండియా కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. దీంట్లో అమన్‌జోత్ పట్టిన క్యాచ్ ఆట గతిని మార్చేసింది. అద్భుత ఫామ్‌లో ఉన్న సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్ట్ ఇచ్చిన క్యాచ్ బౌండరీ లైన్ దగ్గర అమన్ అద్భుతంగా అందుకుంది. చరిత్రలో నిలిచిపోయే ఈ క్యాచ్‌తో 47 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడేలా భారత్‌ను తొలిసారి ఛాంపియన్‌గా నిలిపింది. మ్యాచ్ అనంతరం ఆమె తండ్రి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిపై అమన్‌జోత్ క్లారిటీ ఇచ్చ

‘అమన్‌జోత్(Amanjot Kaur) కెరీర్ వెనక మా అమ్మ భగవంతి మూలస్తంభంలా నిలబడింది. మొహాలీలో అమన్ వీధుల్లో క్రికెట్ ఆడటం ప్రారంభించినప్పుడు ఆమెనే తీసుకెళ్లేది. బలోంగిలో నాకు కార్పెంటరీ షాప్ ఉంది. అమన్‌తో వెళ్లేందుకు నాకు వీలయ్యేది కాదు. కానీ ఇంటి ముందు, పార్క్ వద్ద అమన్ మగపిల్లలతో ఆడేటప్పుడు బయట కూర్చొని చూస్తూ ఉండేది. చాలామంది అమ్మాయిలూ ధైర్యంగా వారితో ఆడేవారు. ప్రపంచ కప్ సమయంలో మా అమ్మకు గుండెపోటు వచ్చింది. అయితే ఆ విషయాన్ని అమన్‌కు చెప్పలేదు. ఆమె దృష్టి మారకుండా ఉండాలనే అలా చేశాం’ అని అమన్ తండ్రి భూపిందర్ సింగ్ తెలిపారు.

తన నానమ్మ విషయంలో తండ్రి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో భిన్నంగా ప్రచారం అవ్వడంపై అమన్ స్పందించింది. ‘మా నానమ్మ విషయంలో ఓ క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నా. ఆమె ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నారు. బయట ప్రచారం అవుతున్నట్లు ఎలాంటి సమస్యా లేదు. ఇలాంటి వాస్తవాలు నమ్మొద్దు. ప్రచారం చేయొద్దు. మా కుటుంబంపై ప్రేమాభిమానాలు చూపించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని అమన్ వెల్లడించింది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version