ముఖ్యమంత్రి, ఐటీ మంత్రి చిత్రపటానికి పాలభిషేకం.

ముఖ్యమంత్రి, ఐటీ మంత్రి చిత్రపటానికి పాలాభిషేకం.

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీని నెరవేర్చింది. తిరుపతి.

మహాదేవపూర్- నేటి ధాత్రి:

బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదించడంతో బిసి ఐక్యవేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐటి మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది. గురువారం రోజున మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద బీసీ సంఘం అధ్యక్షుడు తిరుపతి ఆధ్వర్యంలో, పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అక్బర్ ఖాన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు తిరుపతి మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడం రాష్ట్రంలోని బీసీల కు రిజర్వేషన్ కల్పించడం హర్షణీయమని, ప్రభుత్వం బిల్లు ఆమోదించడం రాష్ట్రవ్యాప్తంగా బీసీలు మర్చిపోలేని రోజని అన్నారు. అలాగే రాష్ట్ర మంత్రులకు శాసనమండలి సభ్యులకు, బీసీ సంఘాల ప్రతినిధులకు, అధ్యక్షుడు తిరుపతి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు, ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు మురళి, దేవరావు, స్వామి, తిరుపతి, డాక్టర్ హబీబ్ ,సతీష్ జగదీష్ రామస్వామి, ప్రవీణ్, చంద్రయ్య, లక్ష్మణ్, మహబూబ్ ఖాన్, మహేష్ లు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version